ఇజ్రాయెల్ సందర్శన: మోడి హయాంలో డీ-హైఫనేషన్ -2

ఇండియా-ఇజ్రాయెల్ సంబంధాల చరిత్ర, పరిణామం ఇండియా-ఇజ్రాయెల్ సంబంధాలు ప్రపంచ రాజకీయాలకు అతీతంగా ఎన్నడూ లేవు. ప్రపంచ భౌగోళిక ఆధిపత్య రాజకీయాలతో సంబంధం లేకుండా ఇరు దేశాల సంబంధాల గమనాన్ని అంచనా వేయడానికి పూనుకుంటే అది పాక్షిక పరిశీలనే కాదు; అవాస్తవ పరిశీలన కూడా. భారత పాలకులు స్వతంత్ర పాలకులు కాదు. వారు దళారీ పాలకులు. దళారీ వర్గం చేతుల్లో ఉన్న ఇండియా విదేశీ విధానం అనివార్యంగా అగ్రరాజ్యాల ప్రయోజనాలకు లొంగి ఉంటుంది తప్ప స్వతంత్రంగా ఉండలేదు. కనుక…

ఇజ్రాయెల్ సందర్శన: పి.వి నాటిన విత్తు మోడి చేతిలో పండైంది! -1

భారత ప్రధాని నరేంద్ర మోడి జులై 4, 5, 6 తేదీల్లో ఇజ్రాయెల్ సందర్శించాడు. మోడీ ఇజ్రాయెల్ సందర్శన లోని ప్రధానమైన అంశం ఆయన యూదు రాజ్యం తప్ప మరే ఇతర దేశానికీ వెళ్లకపోవడం. ముఖ్యంగా పాలస్తీనాకు వెళ్లకపోవడం. ప్రపంచంలో ఏ దేశ పాలకుడైనా ఇజ్రాయెల్ వెళితే పాలస్తీనా కూడా వెళ్ళడం ఆనవాయితీ. లేదా పాలస్తీనా సందర్శిస్తే ఇజ్రాయెల్ కూడా వెళ్ళి అక్కడి పాలకులను కూడా కలిసి వెళతారు. భారత దేశం నుండి రాష్ట్రపతి గానీ ప్రధాని…

ఉగ్ర సొరంగాలు కావవి జీవన తరంగాలు -ఫోటోలు

బంతిని గోడకేసి ఎంత బలంగా కొడితే అంతే బలంతో అది వెనక్కి తిరిగి వస్తుంది. బెలూన్ నిండా గాలి నింపి ఒత్తితే, బలహీన చోట్లు చూసుకుని బెలూన్ ను బద్దలు కొట్టుకుంటూ గాలి బైటపడుతుంది. ఇది ప్రకృతి సూత్రం. సామాజిక సూత్రం కూడా. సమకాలీన ప్రపంచంలో అందుకు ప్రబల సాక్ష్యం గాజా ప్రజల జీవ నాడులుగా మారిన సో కాల్డ్ ‘ఉగ్ర సొరంగాలు.’ సెక్యులర్ నేత యాసర్ అరాఫత్ బ్రతికి ఉన్నంత వరకూ పాలస్తీనా ప్రజల పోరాటం…

ఇజ్రాయెలీల హత్యలకు బాధ్యులు హమాస్ కాదు ఇసిస్!

గాజా మరోసారి ఇజ్రాయెల్ జాత్యహంకార ముట్టడికి గురవుతోంది. ముగ్గురు ఇజ్రాయెలీ యువకుల కిడ్నాప్ మరియు హత్యలను సాకుగా చూపుతూ గాజా పౌర నివాసాలపై ఇజ్రాయెల్ ఫైటర్ జెట్ లతో విరుచుకుపడుతోంది. ఫలితంగా 200కు పైగా గాజా పౌరులు దుర్మరణం చెందగా ఉనికిలో ఉన్న కాసిన్ని ఇళ్ళు కూడా నేలమట్టం అవుతున్నాయి. ఇజ్రాయెల్ ఏకపక్ష దాడిని హమాస్ రాకెట్ దాడికి ప్రతీకారంగా ముద్ర వేయడంలో పశ్చిమ పత్రికలు శ్రమిస్తున్నాయి. కాగా శాంతి ప్రవచనాలు వల్లించడం వరకే ఐరాస పరిమితం…

అరబ్ ప్రజా ఉద్యమాలకు బోనస్, పాలస్తీనా వైరివర్గాల మధ్య శాంతి ఒప్పందం

ఈజిప్టు, ట్యునీషియాలలో నియంతలను తరిమికొట్టిన ప్రజా ఉద్యమాలు తమవరకు పూర్తి విజయం సాధించలేక పోయినా, తమ పొరుగు అరబ్బులు పాలస్తీనీయుల మధ్య శుభప్రదమైన శాంతి ఒప్పందం కుదరడానికి దోహదపడ్దాయి. ఇజ్రాయెల్ దురాక్రమణలో ఉన్న పాలస్తీనాకు స్వతంత్రం సాధించడానికి పోరాడుతున్న ఫతా, హమాస్ పార్టీల మధ్య తీవ్ర వైరం నెలకొన్న సంగతి తెలిసిందే. ఈజిప్టులో ఏర్పడిన మద్యంతర ప్రభుత్వం మధ్యవర్తిత్వంతో వైరి పక్షాల మధ్య సంబంధాలు మెరుగుపడే దిశలో ప్రయత్నాలు మొదలయ్యాయి. దానిలో మొదటి అడుగుగా ఇరుపక్షాలూ సహకరించుకోవడానికి…

జెరూసలేంలో సూట్ కేసు బాంబు పేలుడు, ఒకరి మృతి

పాలస్తీనా, ఇజ్రాయెల్ మధ్య తాజాగా ఘర్షణలు రాజుకుంటున్నాయి. మంగళవారం ఇజ్రాయెల్ సైనిక విమానం జరిపిన దాడిలో  పాలస్తీనా మిలిటెంట్ల రాకేట్ దాడులకు ప్రతిగా ఇజ్రాయెల్ వైమానిక దాడులు జరిగిన తర్వాత పశ్చిమ జెరూసలేం లోని ఒక బస్ స్టేషన్ లో ఉంచిన సూట్ కేసు బాంబు పేలింది. ఇద్దరు పిల్లలతో సహా 8 మంది పాలస్తీనీయులు ఈ దాడిలో చనిపోయారు. ఇజ్రాయెల్ వైమానిక దాడికి ప్రతీకార చర్యగా గాజాలోని ఇస్లామిక్ జీహాద్ సంస్ధ రెండు రాకెట్లను ఇజ్రాయెల్…