ప్రధాని భద్రత: కేంద్రానికి సుప్రీం కోర్టు తలంటు

ప్రధాన మంత్రి  నరేంద్ర మోడి జనవరి 5 తేదీన పంజాబ్ పర్యటనకు వెళ్ళిన సందర్భంగా ఆయనకు భద్రత కల్పించడంలో పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా విఫలం అయిందని కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ఆరోపణలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. ప్రధాన మంత్రి సైతం నాటకీయమైన వ్యాఖ్యలతో రాజకీయ డ్రామాకు తెరలేపారు. డ్రామాను రక్తి కట్టించడం కోసం ఎస్‌పి‌జి భద్రతా ప్రోటోకాల్స్ అనీ, బ్లూ బుక్ ఉల్లంఘన అనీ చెబుతూ పంజాబ్ అధికారులకు కేంద్రం ఏకపక్షంగా దోషిత్వాన్ని నిర్ధారించి…

లఖింపూర్ ఖేరా హత్యాకాండ: హత్యకేసు ఇలాగే విచారిస్తారా?

ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వానికి సుప్రీం కోర్టు శుక్రవారం తలంటు పోసింది. పోలీసులు విచారణ సాగిస్తున్న తీరు పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం “మాటలు చెప్పడం వరకే పరిమితం అయింది. చేతల్లో చూపడం లేదు” అంటూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్ వి రమణ పరుషంగా వ్యాఖ్యానించారు. “రాష్ట్ర ప్రభుత్వం చర్యల పట్ల మేము సంతృప్తి చెందలేదు” అని ఆయన కుండ బద్దలు కొట్టారు. మోడి కేబినెట్ లోని సహాయ మంత్రి, బి‌జే‌పి…

న్యాయ వ్యవస్ధ లేకుండా చేస్తారా? -సుప్రీం కోర్టు

సాక్షాత్తు సుప్రీం కోర్టు కొరడా ఝళిపిస్తేనే దిక్కు లేకపోతే సామాన్య ప్రజల విన్నపాలకి దిక్కెవ్వరు? “కర్ణాటక హై కోర్టులో మొత్తం ఒక అంతస్ధు అంతా తాళాలు వేసేశారు. ఎందుకంటే అక్కడ జడ్జిలు లేరు మరి. ఒకప్పుడు జడ్జిలు ఉన్నా కోర్టు రూములు ఖాళీగా లేని పరిస్ధితి ఉండేది. ఇప్పుడు కోర్టు రూములు ఉన్నాయి గాని, జడ్జిలు లేకుండా పోయారు. ఇప్పుడు మీరు కోర్టు రూములు మూసేసి న్యాయానికి తలుపులు వేసేస్తున్నారు” అని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయ…

కేంద్రం రెండో చెంపా వాయించిన సుప్రీం కోర్టు

ఇప్పటికే ఉత్తరాఖండ్ ప్రభుత్వం రద్దు విషయంలో బి‌జే‌పి నేతృత్వం లోని కేంద్ర ప్రభుత్వాన్ని ఒక చెంప వాయించిన సుప్రీం కోర్టు, అరుణాచల్ ప్రదేశ్ ప్రభుత్వం మంత్రాంగం విషయంపై తీర్పు ద్వారా రెండో చెంప కూడా వాయించింది. అరుణాచల్ ప్రదేశ్ గవర్నర్ అమలు చేసిన విచక్షణాధికారాలను రద్దు చేసింది. జనవరి 14, 2016 తేదీన ప్రారంభం కావలసిన రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలను “తన విచక్షణాధికారాలను వినియోగించి” డిసెంబర్ 16, 2015 తేదీకి మార్చుతూ గవర్నర్ తీసుకున్న నిర్ణయం చెల్లదని…

కనీవినీ ఎరుగని దోషారోపణ -ది హిందు ఎడిట్

(మరి కొద్ది రోజుల్లో పదవీ విరమణ చేయనున్న సి.బి.ఐ డైరెక్టర్ రంజిత్ సిన్హాను 2జి కేసు విచారణ నుండి పక్కకు తప్పుకోవాలని సుప్రీం కోర్టు ధర్మాసనం ఆదేశించిన పరిణామంపై ది హిందు ప్రచురించిన సంపాదకీయానికి యధాతధ అనువాదం ఈ వ్యాసం. -విశేఖర్) ************** సి.బి.ఐ డైరెక్టర్ గా రంజిత్ సిన్హా హయాం గురించి సానుకూలాంశం ఏదన్నా ఉందంటే అది, మరి కొద్ది రోజులలో ఆయన హయాం ముగింపుకు రావడమే. సున్నితమైన కేసుల్లో అత్యంత సామర్ధ్యంతో పరిశోధన చేసిన…

2జి కేసుకు దూరంగా ఉండండి -సుప్రీం కోర్టు

భారత దేశంలో హై ప్రొఫైల్ కేసులను విచారించే హై ప్రొఫైల్ విచారణాధికారులు సైతం విచారణకు ఎలా తూట్లు పొడుస్తారో తెలిపే ఉదంతాలు ఇప్పటికే అనేకం వెలుగులోకి వచ్చాయి. ముఖ్యంగా 2జి కేసులోనే ఇలాంటి ఉదాంతాలు నాలుగైదు వెలుగులోకి రాగా సి.బి.ఐ అధిపతి రంజిత్ సిన్హా ఉదంతం మరొకటిగా వచ్చి చేరింది. 2జి కేసు విచారణ నుండి దూరంగా ఉండాలని సుప్రీం కోర్టు ధర్మాసనం ఈ రోజు (నవంబర్ 20) సి.బి.ఐ డైరెక్టర్ రంజిత్ సిన్హాను ఆదేశించింది. చీఫ్…

ఐ.పి.ఎల్ vis-a-vis సుప్రీం కోర్టు -కార్టూన్

బి.సి.సి.ఐ మాజీ అధ్యక్షుడు వి.శ్రీనివాసన్ పుణ్యమాని సుప్రీం కోర్టు కూడా ఐ.పి.ఎల్ పాలకవర్గంలో ఒక పాత్ర పోషిస్తోంది. ధర్డ్ అంపైర్ ధాటికి గ్రౌండ్ లో ఉన్న ఇద్దరు అంపైర్ల నిర్ణయ శక్తి దాదాపు నామమాత్రంగా మారిపోయినట్లే సుప్రీం కోర్టు ఇటీవల చూపుతున్న చొరవ వల్ల మొత్తం స్పోర్ట్స్ అడ్మినిస్ట్రేషన్ స్వతంత్రతకు ప్రమాదం వచ్చినపడినట్లు కార్టూనిస్టు సూచిస్తున్నట్లు కనిపిస్తోంది. కానీ ఆ గుర్రం ఎవరు? బహుశా క్రికెట్ ఆటగాళ్లకు, అంపైర్లకు, ఆటను చూసే ప్రేక్షక దేవుళ్ళకి ఎవరికీ కనపడకుండా…

మొఖంపై సిరా మరకలు, కెరీర్ పై కస్టడీ మరకలు

‘మరక మంచిదే’ తమ బట్టల సబ్బు ఉత్పత్తిని మార్కెట్ చేసుకోవడానికి ఓ కంపెనీ ప్రచారం చేసే నినాదం ఇది. ఒక సబ్బుల కంపెనీ తన లాభాలు పెంచుకోవడానికి ఎవరూ ఇష్టపడని మరకను కూడా మంచిదే అని చెప్పగలదని నిరూపించే నినాదం కూడా ఇది. ఈ రోజు సుబ్రతా రాయ్ ఎదుర్కొన్న చేదు అనుభవాలు బహుశా ఆయనకు ఈ నినాదాన్నే స్మరించుకునేలా చేసి ఉంటాయి. మొఖంపై పడ్డ సిరా మరక, కోర్టులో పడ్డ కస్టడీ మరక రెండూ మంచివే…

ఉచిత పధకాల ఖర్చు మోయలేం బాబోయ్! -కార్టూన్

– “మరేం ఫర్వాలేదు – మాకు సంతోషమే. ఎందుకంటే ఆ ఉచితాలన్నింటి ఖర్చు ఇక మేము భరించనక్కర్లేదు కదా!” – రెండు రోజుల క్రితం సుప్రీం కోర్టు ఒక విచిత్రమైన తీర్పు ప్రకటించింది. రాజకీయ పార్టీలు ప్రకటించే ఉచిత పధకాలు అవినీతి కాదని చెబుతూనే అవి ప్రజాస్వామ్యం మూలాలను కుదిపి వేస్తాయని అంగీకరించింది. ఎ.ఐ.ఎ.డి.ఎం.కె ప్రభుత్వం తన మ్యానిఫెస్టోలో ప్రకటించిన ఉచిత గ్రైండర్లు, మిక్సీలు, ల్యాప్ టాప్ పంపిణీ పధకాలను సుప్రీం కోర్టు సమర్ధించింది. అవి అవినీతి…

అత్యాచార నేరం: రెండు వేళ్ళ పరీక్ష ఆపండి -సుప్రీం

లైంగిక అత్యాచార నిర్ధారణకు రెండు వేళ్ళతో పరీక్ష జరపడం వెంటనే ఆపాలని సుప్రీం కోర్టు ఆదేశాలు ఇచ్చింది. ‘రెండు వేళ్ళ పరీక్ష,’ బాధితుల ‘ఏకాంత హక్కు’ (right to privacy) కు తీవ్ర భంగకరం అని సుప్రీం కోర్టు ధర్మాసనం ప్రకటించింది. లైంగిక అత్యాచార నేర నిర్ధారణ కోసం మరింత సానుకూలమైన, ఆధునిక పరీక్షలను బాధితులకు అందుబాటులో ఉంచాలని ధర్మాసనం కోరింది. పరీక్ష నివేదిక బాధితులకు అనుకూలంగా ఉన్నప్పటికీ అది మరోసారి బాధితురాలిని అత్యాచారం చేయడంతో సమానమని…

మణిపూర్ ఎన్ కౌంటర్లు బూటకం, సుప్రీం కోర్టు కమిటీ నిర్ధారణ

మణిపూర్ లో భారత సైనికులు పాల్పడిన ఆరు ఎన్ కౌంటర్లు బూటకం అని సుప్రీం కోర్టు కమిటీ ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ నిర్ధారించింది. 12 సంవత్సరాల బాలుడితో సహా ఎన్ కౌటర్ లో మరణించినవారందరికీ ఎటువంటి క్రిమినల్ రికార్డు లేదని కమిటీ తేల్చి చెప్పింది. జస్టిస్ అఫ్తాబ్ ఆలం, జస్టిస్ రంజన ప్రకాష్ దేశాయ్ లతో కూడిన డివిజన్ బెంచి కమిటీ నివేదికను పరిశీలించింది. కమిటీ ఆరు ఎన్ కౌంటర్ కేసులను విచారించగా, ఆరు కేసులూ…

ప్రజాస్వామ్యానికి నిఖార్సయిన రోజు (అరుంధతీ రాయ్ రచన)

అవును కదా? నా ఉద్దేశం నిన్నటి రోజు అని. వసంతం ఢిల్లీలో తనను తాను ప్రకటించుకుంది. సూర్యుడు ఉదయించాడు, చట్టం తన పని తాను చేసుకుని పోయింది. బ్రేక్ ఫాస్ట్ కి కొద్దిసేపటి ముందు, 2001 నాటి పార్లమెంటు దాడి కేసులో ప్రధాన నిందితుడు అఫ్జల్ గురు రహస్యంగా ఉరితీయబడ్డాడు. అతని విగత దేహాన్ని తీహార్ జైలులోనే పూడ్చిపెట్టారు. మక్బూల్ భట్ కి పక్కనే ఆయనను పూడ్చిపెట్టారా? (1984లో ఉరి తీయబడిన మరో కాశ్మీరీ ఆయన. ఆయన…

మిమ్మల్నీ, దేశాన్నీ దేవుడే కాపాడాలి, కేంద్రంతో సుప్రీం కోర్టు

కేంద్ర ప్రభుత్వంపై సుప్రీం కోర్టు మండిపడింది. జడ్జిలకు ఇంటి సౌకర్యం కల్పించాలన్న రూల్ ని ఉల్లంఘిస్తున్నారని ఆగ్రహించింది.  వాటర్ ట్రిబ్యునల్ లో సభ్యులైన జడ్జిలకు ఢిల్లీలో ఇంటి సౌకర్యం కల్పించడానికి ఇష్టపడని కేంద్ర ప్రభుత్వాన్ని దేవుడే కాపాడాలని ఆకాంక్షించింది. ఇలాంటి ప్రభుత్వ పాలనలో ఉన్నందుకు దేశాన్ని కూడా దేవుడే కాపాడాలని ప్రార్ధించింది. ఇళ్ళు ఇవ్వడం ఇష్టం లేకపోతే వాటర్ ట్రిబ్యూనళ్ళకు జడ్జిలను సభ్యులుగా నియమించే చట్టాన్ని రద్దు చేయాలని కోరింది. “రూల్స్ ప్రకారం ఇంటి సౌకర్యానికి వారు…

వేలం పద్ధతే గీటురాయి కాదు, సహజ వనరుల దోపిడీకి సుప్రీం కోర్టు బాసట!

2జి స్పెక్ట్రమ్ లైసెన్సుల రద్దు సందర్భంగా తానిచ్చిన తీర్పును సుప్రీం కోర్టు పునర్నిర్వచించింది. 2జి తీర్పు కేవలం స్పెక్ట్రమ్ కేటాయింపులకు మాత్రమే వర్తిస్తుందని వివరణ ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వం దాఖలు చేసిన ‘ప్రెసిడెన్షియల్ రిఫరెన్స్’ పై తీర్పు చెబుతూ సుప్రీం కోర్టు గురువారం ఈ వివరణ ఇచ్చింది. చీఫ్ జస్టిస్ ఎస్.హెచ్.కపాడియా నేతృత్వంలోని ఐదుగురు సభ్యులు రాజ్యాంగ ధర్మాసనం గురువారం తన తీర్పు ప్రకటిస్తూ ‘సహజ వనరులను వేలం వేయాలన్న’ తన 2జి తీర్పు ఇతర సహజ…

2జి స్పెక్ట్రం: జనవరి 11 లోపు వేలం వేయండి, లేదా… -సుప్రీం కోర్టు

2జి స్పెక్ట్రమ్ వేలం వేయడాన్ని పదే పదే వాయిదా వేయడం పట్ల సుప్రీం కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఆగస్టు 31 తో వేలం పూర్తి కావాలని సుప్రీం కోర్టు విధించిన గడువును వాయిదా వేయాలని కేంద్ర ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిని కోర్టు మన్నిస్తూ జనవరి 11, 2013 లోపు వేలం ప్రక్రియ పూర్తి కావాలని ఆదేశించింది. జనవరి 18 కల్లా వేలంలో విజయం సాధించిన కంపెనీల జాబితా తనకు సమర్పించాలని కోరింది. లేనట్లయితే సంబంధిత అధికారులపై…