ఢిల్లీ ఐ‌ఏ‌ఎస్ లను వేధిస్తున్న సి.బి.ఐ

బి.జె.పి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు సి.బి.ఐ తమ ప్రభుత్వంలోని ఐ‌ఏ‌ఎస్ అధికారులను ప్రతి రోజూ వేధిస్తోందని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వివరించారు. దానితో వారంతా భయకంపితులై లెఫ్టినెంట్ గవర్నర్ చెప్పినట్టల్లా వింటున్నారని వెల్లడించారు. నూతన సంవత్సరం రోజున ది హిందు పత్రికకు కేజ్రీవాల్ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో ఆయన పలు వివరాలు వెల్లడి చేశారు. కేంద్ర ప్రభుత్వం తమ ప్రభుత్వంపై ఏ విధంగా కక్ష సాధిస్తున్నదీ వివరించారు. DANICS అధికారులు, ఇతర…

సి.బి.ఐ విశ్వసనీయత ప్రశ్నార్ధకం! -ది హిందు (అమిత్ షా తీర్పు)

(1.1.2015 తేదీన ది హిందూలో ప్రచురితం అయిన ‘CBI’s credibility impugned’ సంపాదకీయానికి యధాతధ అనువాదం. -విశేఖర్) ********* సోహ్రాబుద్దీన్ షేక్ బూటకపు ఎన్ కౌంటర్ కేసులో భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు, గుజరాత్ మాజీ మంత్రి అమిత్ షా ను ముంబై లోని ప్రత్యేక కోర్టు విముక్తి చేయడం బి.జె.పికి ఉత్సాహం అందిస్తుంది. కానీ సి.బి.ఐ కి మాత్రం గట్టి ఎదురు దెబ్బ. తన రాజకీయ యాజమానులను సంతృప్తిపరిచేందుకు ఎప్పుడూ ఆతృతగా ఉండే సి.బి.ఐ తన…

కనీవినీ ఎరుగని దోషారోపణ -ది హిందు ఎడిట్

(మరి కొద్ది రోజుల్లో పదవీ విరమణ చేయనున్న సి.బి.ఐ డైరెక్టర్ రంజిత్ సిన్హాను 2జి కేసు విచారణ నుండి పక్కకు తప్పుకోవాలని సుప్రీం కోర్టు ధర్మాసనం ఆదేశించిన పరిణామంపై ది హిందు ప్రచురించిన సంపాదకీయానికి యధాతధ అనువాదం ఈ వ్యాసం. -విశేఖర్) ************** సి.బి.ఐ డైరెక్టర్ గా రంజిత్ సిన్హా హయాం గురించి సానుకూలాంశం ఏదన్నా ఉందంటే అది, మరి కొద్ది రోజులలో ఆయన హయాం ముగింపుకు రావడమే. సున్నితమైన కేసుల్లో అత్యంత సామర్ధ్యంతో పరిశోధన చేసిన…

2జి కేసుకు దూరంగా ఉండండి -సుప్రీం కోర్టు

భారత దేశంలో హై ప్రొఫైల్ కేసులను విచారించే హై ప్రొఫైల్ విచారణాధికారులు సైతం విచారణకు ఎలా తూట్లు పొడుస్తారో తెలిపే ఉదంతాలు ఇప్పటికే అనేకం వెలుగులోకి వచ్చాయి. ముఖ్యంగా 2జి కేసులోనే ఇలాంటి ఉదాంతాలు నాలుగైదు వెలుగులోకి రాగా సి.బి.ఐ అధిపతి రంజిత్ సిన్హా ఉదంతం మరొకటిగా వచ్చి చేరింది. 2జి కేసు విచారణ నుండి దూరంగా ఉండాలని సుప్రీం కోర్టు ధర్మాసనం ఈ రోజు (నవంబర్ 20) సి.బి.ఐ డైరెక్టర్ రంజిత్ సిన్హాను ఆదేశించింది. చీఫ్…

(విజిల్ బ్లోయర్) పేరు వెల్లడి వల్ల ప్రమాదాలు -ది హిందు ఎడిటోరియల్

(ఒకపక్క 2జి, బొగ్గు కుంభకోణాల కేసుల్లో సుప్రీం కోర్టు కేంద్రీకరించి పని చేస్తుంటే మరో పక్క ఆ కేసుల్లోని నిందితులు తరచుగా సి.బి.ఐ డైరెక్టర్ రంజిత్ సిన్హా ఇంటిని సందర్శిస్తున్న సంగతిని ‘సెంటర్ ఫర్ పబ్లిక్ ఇంటరెస్ట్ లిటిగేషన్’ సంస్ధ సుప్రీం కోర్టు దృష్టికి తెచ్చింది. భారీ కుంభకోణాల లోని నిందితులతో దేశంలోని అత్యున్నత విచారణ సంస్ధ అధిపతే చెట్టాపట్టాలు వేసుకుంటే విచారణలో పాల్గొంటున్న అధికారులపై ప్రతికూల ఒత్తిడి ఉంటుందని కనుక రంజిత్ సిన్హాను సి.బి.ఐ డైరెక్టర్…

సి.బి.ఐ విచారణలో గూగుల్ మ్యాప్స్

గూగుల్ ఇండియా కంపెనీపై పోలీసులు వేసిన కేసు సి.బి.ఐ చేతుల్లోకి వెళ్ళినట్లు తెలుస్తోంది. భారత పౌరులకు గూగుల్ నిర్వహించిన మేపధాన్-2013  పోటీ వల్ల దేశ భద్రతకు ప్రమాదం అని బి.జె.పి ఎం.పి లు గత సం. ఫిర్యాదు చేయడంతో గూగుల్ అతి తెలివి వెలుగులోకి వచ్చింది. ఈ ఫిర్యాదును సర్వేయర్ జనరల్ ఆఫ్ ఇండియా నిర్ధారించడంతో పోలీసులు విచారణ చేపట్టినట్లు గత సం. ఏప్రిల్ లో పత్రికలు తెలిపాయి. ఈ కేసును స్వీకరించిన సి.బి.ఐ ‘ప్రాధమిక విచారణ’…

హెలికాప్టర్ కుంభకోణం: గవర్నర్ల తొలగింపు బి.జె.పి మెడకు!

యు.పి.ఏ నియమించిన గవర్నర్లను తప్పించడానికి హెలికాప్టర్ల కుంభకోణాన్ని వేగవంతం చేసిన బి.జె.పి ప్రభుత్వం చివరికి సదరు కుంభకోణం ఎన్.డి.ఏ మెడకు చుట్టుకునే ప్రమాదాన్ని కొనితెచ్చుకున్నట్లు కనిపిస్తోంది. అటార్నీ జనరల్ ముకుల్ రోహ్తగి సలహా మేరకు పదవిలో కొనసాగుతున్న కాంగ్రెస్/యు.పి.ఏ గవర్నర్లు ఇద్దరినీ సి.బి.ఐ సాక్షుల హోదాలో ప్రశ్నించింది. తీరా విచారణ సందర్భంగా గవర్నర్లిద్దరూ ఎన్.డి.ఏ మొదటి పాలనలోనే హెలికాప్టర్ కుంభకోణానికి బీజం పడిన సంగతిని బైటికి తీయడంతో పరిస్ధితి తారుమారయింది. అగస్టా వెస్ట్ లాండ్ వి.వి.ఐ.పి హెలికాప్టర్ల…

సి.బి.ఐ రక్షతి రక్షితః -కార్టూన్

‘సి.బి.ఐ ని మనం కాపాడితే మనల్ని సి.బి.ఐ కాపాడుతుంది’ అన్నది రాజకీయ నాయకుల ప్రగాఢ విశ్వాసం. ముఖ్యంగా కాంగ్రెస్ నాయకులకు ఈ సూత్రం తెలిసినంతగా మరెవ్వరికీ తెలియదు. ఎన్.డి.ఏ హయాంలో కూడా సి.బి.ఐని స్వప్రయోజనాలకు, ప్రత్యర్ధులను దారిలో తెచ్చుకోడానికి వినియోగించారని ఆరోపణలు ఉన్నాయి. కానీ యు.పి.ఏ హయాంలో అది వికృతరూపం దాల్చింది. వరుస కుంభకోణాల్లో యు.పి.ఏ మునిగిపోవడం, కూటమి రాజకీయాల్లో చట్టసభల సీట్లు మునుపు ఎన్నడూ లేనంతగా లెక్కలోకి రావడంతో సి.బి.ఐ రాజకీయ పాత్ర నూతన స్ధాయికి…

అత్యాచారాలు: సి.బి.ఐ బాస్ కువ్యాఖ్యలు, ఆనక సారీ

శుభం పలకరా పెళ్లికొడుకా అంటే ఇంకేదో అన్నాట్ట వెనకటికొకరు. క్రికెట్ బెట్టింగ్ అరికట్టడం గురించి చర్చలో పాల్గొనమని పిలిస్తే మహిళలపై జరుగుతున్న లైంగిక అత్యాచారాల గురించి అసంబద్ధంగా మాట్లాడి విమర్శల పాలయ్యారు సి.బి.ఐ బాస్ రంజిత్ సిన్హా! లైంగిక అత్యాచారాలను ఆయన జూదంతో పోల్చారు. జూదం అరికట్టలేని పరిస్ధితుల్లో బెట్టింగ్ లాంటి జూదాలను చట్టబద్ధం చేయడమే మంచిదని సలహా ఇచ్చేశారు. ‘అరికట్టలేని బెట్టింగ్ లను చట్టబద్ధం చేయాలన్న సలహాలాగే అత్యాచారాన్ని నివారించలేకపోతే ఎంజాయ్ చేయడమే బెటర్ అని…

గానుగెద్దు సి.బి.ఐ -కార్టూన్

ఆ, అది చాలా సార్లు దగ్గరగా వచ్చింది లెండి! – బీహార్ గడ్డి కుంభకోణం అందరికీ తెలిసిందే. బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ ఇందులో ఒక నిందితుడు. ఈ కేసు అంతిమ తీర్పే తరువాయి అన్న దశలో ఉంది. ఈ దశలో గడ్డి కుంభకోణం కేసును సి.బి.ఐ కోర్టు నుండి మరో కోర్టుకు మార్చాలంటూ ఆయన బీహార్ హై కోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ ను కేసు కొట్టేసింది. కేసును మార్చాలన్న ఆయన…

ధర్మాన, సబిత రాజీనామా చేసేశారు

కాంగ్రెస్ అవినీతి వ్యతిరేక నాటకంలో ఒక అంకం పూర్తయింది. ధర్మాన రాజీనామా తిరస్కరణను గతంలో ఆమోదించిన అధిష్టానమే ఇప్పుడు ఆయన రాజీనామా చేయాల్సిందేనని పట్టుబట్టిందట! ధర్మానతో పాటు ‘కళంకిత మంత్రుల’ ఒకరయిన సబిత ఇంద్రారెడ్డి రాజీనామా కూడా తీసుకోవాలని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని అధిష్టానం ఆదేశించిందట. ఈ విషయం ముఖ్యమంత్రి ద్వారా తెలుసుకున్న మంత్రులు ఇరువురు ఆయనను కలుసుకుని తమ రాజీనామా పత్రాలు అందజేశారని ది హిందు తెలిపింది. అయితే మంత్రుల రాజీనామా విషయం ఇంకా…

సి.బి.ఐ దయనీయ స్ధితి -కార్టూన్

“రాజకీయ నాయకుల నుండి సి.బి.ఐ ని విముక్తం చేయడం మా తక్షణ కర్తవ్యం” అని సుప్రీం కోర్టు నిన్న సి.బి.ఐకి తలంటుతూ వ్యాఖ్యానించింది. “రాజకీయ నాయకుల ఆదేశాలు పాటించవలసిన అవసరం మీకు లేదు” అని సుప్రీం బెంచి చెప్పాక “ఇక నుండి బుద్ధిగా నడుచుకుంటాం. బొగ్గు కుంభకోణం విచారణ పురోగతి నివేదికలన్నీ నేరుగా మీకే చూపుతాం. ప్రభుత్వానికి చూపించం” అని తలూపి కోర్టు బైటికి వచ్చిన సి.బి.ఐ అధిపతి కోర్టు ఆవరణలోనే మాట మార్చేశారు. “సి.బి.ఐ స్వతంత్ర…

వాళ్ళకి చెప్పే రాశాం, సుప్రీం కోర్టులో సి.బి.ఐ సంచలన వెల్లడి

బొగ్గు కుంభకోణం విషయంలో సుప్రీం కోర్టు సాక్షిగా సి.బి.ఐ కాంగ్రెస్ ధరించిన మేకప్ ను కడిగేసింది. న్యాయ శాఖ మంత్రి కోరిక మేరకు ఆయనకు చూపించిన తర్వాతే బొగ్గు కుంభకోణం స్టేటస్ రిపోర్టును సుప్రీం కోర్టుకు సమర్పించామని కాంగ్రెస్ ముసుగు విప్పి చూపింది. న్యాయశాఖ మంత్రి అశ్వనీ కుమార్ తో పాటు ప్రధాన మంత్రి కార్యాలయం, బొగ్గు మంత్రిత్వ శాఖల అధికారులు కూడా తమ నివేదికను చూశారాని సి.బి.ఐ స్పష్టం చేసింది.  ప్రభుత్వానికి ఇబ్బందులు రాకుండా ఉండేందుకు…

నారాయణ స్వామి కత్తి దూశారు… తిరగేసి! -కార్టూన్

సిబిఐ పుణ్యమాని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి వి.నారాయణ స్వామి వార్తల్లో నానుతున్నారు. తమిళనాడు ప్రతిపక్ష పార్టీ డిఎంకె, యుపిఎ ను వదిలి వెళ్ళిన మరుసటి రోజే ఆ పార్టీ నేత కరుణానిధి తనయులు స్టాలిన్, అళగిరి ఇళ్లపైన సిబిఐ చేత దాడి చేయించడం ద్వారా అన్ని పక్షాల నుండి ఆయన విమర్శలను ఎదుర్కొంటున్నాడు. దురుద్దేశం ఏమీ లేదని సిబిఐ తన పని తాను చేసుకుందే తప్ప ప్రభుత్వానికి దానికి సంబంధం లేదనీ, అది స్వతంత్ర సంస్థ…

ఇంటికి 323 టెలిఫోన్ లైన్లు వేసుకున్న మాజీ టెలికం మంత్రి దయానిధి మారన్

డి.ఎం.కె మంత్రులు టెలికం మంత్రిత్వ శాఖను తమ సొంత సొమ్ము కింద జమకట్టి వాడుకున్న విషయాలు ఒక్కొక్కటే వెలుగులోకి వస్తున్నాయి. స్పెక్ట్రం కేటాయింపుల విషయాన్ని మంత్రుల బృందం పరిశీలనకు అప్పగించకుండా మొత్తం టెలికం శాఖకే వదిలిపెట్టాలని ప్రధాని మన్మోహన్ కు లేఖ రాసిన దయానిధి మారన్ గారి మరొక నిర్వాకాన్ని సి.బి.ఐ విచారణ చేయడానికి నిశ్చయించుకున్నట్లు తెలుస్తోంది. దయానిధి మారన్ టెలికం మంత్రిగా ఉన్న కాలంలో ఆయన తన చెన్నై నివాసానికి 323 టెలిఫోన్ లైన్లు వేయించుకున్న…