‘గెలాక్సీ నోట్’ తో ఆడుకునే ఏనుగు -వీడియో

తెలివైన జంతులు మనిషికి కొత్త కాదు. చింపాంజీ, కుక్క లాంటి జంతువులు తమ తెలివితేటల్ని అనేకసార్లు నిరూపించుకున్నాయి. కాని ఏనుగు తెలివితేటలు ప్రదర్శించడం ఇదే కొత్త కావచ్చు. ‘పీటర్’ అనే పేరుగల ఈ ఏనుగు ‘గెలాక్సి నోట్’ తో చలాగ్గా ఆడేస్తోంది. టచ్ స్క్రీన్ పై మనం వేలితో చేసే విన్యాసాల్ని తొండంతో చేసేస్తోంది. ఏనుగు తొండంతో గుండు సూదిని కూడా పట్టుకోగలదని చిన్నప్పుడు చదివాం. టచ్ స్కీన్ ఫోన్లతో చెడుగుడు ఆడుతుందని ఇప్పుడు రాసుకోవచ్చేమో. మీరే…

మల్టి ఎక్స్‌పోజర్: ఒకే ఫొటోలో బహుళ కదలికలు -ఫొటోలు

మల్టీ ఎక్స్‌పోజర్ టెక్నిక్ తో తీసిన ఫొటోలివి. వెనువెంటనే వివిధ సమయాల్లో తీసిన ఫొటోలను ఒకే ఫ్రేమ్ పై ఎక్స్‌పోజ్ చేసే టెక్నిక్ ఇది. ఒక ఘటనలో ఒకే వ్యక్తి కొద్ది సెకన్ల తేడాతో చేసే కదలికలను పట్టి ఒకే ఫ్రేమ్ పై ఎక్స్‌పోజ్ చేయడం ద్వారా స్పెషల్ ఎఫెక్ట్స్ తెచ్చే ఈ ప్రక్రియలో ఫొటోలు చూడడానికి ప్రత్యేకంగా ఉంటాయి. అంటే వివిధ సమయాలలో చేసిన కదలికలను ఒకే ఫొటోలో చూడడం అన్నమాట. ఇవి చూడడానికి కళాత్మకంగా…

ఇంటర్నెట్ సెన్సార్ షిప్ లో అమెరికా తర్వాత స్ధానం ఇండియాదే -గూగుల్

2011 రెండో అర్ధ భాగానికి గూగుల్ కంపెనీ ‘ట్రాన్స్ పరెన్సీ రిపోర్ట్’ వెలువరించింది. ఈ కాలంలో యూజర్ల కంటెంట్ ను తొలగించాల్సిందిగా ప్రభుత్వాల నుండి వచ్చిన ఆదేశాల సంఖ్యలో అమెరికా తర్వాత స్ధానాన్ని ఇండియా ఆక్రమించింది. అమెరికా, ఇండియా లు ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామిక దేశాలుగా వర్ధిల్లుతుండడం గమనార్హం. 2011 లో మొదటి అర్ధ భాగం కంటే రెండో అర్ధ భాగంలో ఇండియా నుండి 49 శాతం ఎక్కువగా సెన్సార్ షిప్ ఆదేశాలు అందాయని గూగుల్…

కన్న కూతురిపై అత్యాచారం, ఫ్రెంచి రాయబారి పై కేసు నమోదు

పతన విలువలకి పరాకాష్ట ఇది. బెంగుళూరు లో నియమితుడైన ఫ్రాన్సు రాయబారి మూడున్నరేళ్ల కూతురుపై అత్యాచారం జరిపినట్లు బెంగుళూరు పోలీసులు కేసు నమోదు చేశారు. రాయబారిని ఇంకా అరెస్టు చేయలేదని ఎన్.డి.టి.వి తెలిపింది. రాయబారి దేశం విడిచి వెళ్లకుండా గట్టి చర్యలు తీసుకోవాలని భారతీయురాలైన అతని భార్య హోమ్ మంత్రిత్వ శాఖ, విదేశాంగ శాఖలకు లేఖలు రాసింది. ఫ్రెంచి జాతీయులైన తమ ముగ్గురు పిల్లలను భర్త కస్టడీకి ఇవ్వరాదని ఆమె డిమాండ్ చేస్తోంది. ఫ్రెంచి రాయబారిపై కేసు…

ఉచ్ఛనీచాలు మరిచిన కొడుకుని చంపించిన తల్లిదండ్రులు

ఇదో హృదయ విదారకమైన కధ. తాగి అరాచకం సృష్టించడమే కాక తల్లితోనే అసభ్యంగా ప్రవర్తిస్తున్న కొడుకుని ఎలా బాగు చేయాలో ఆ వృద్ధ దంపతులకు అర్ధం కాలేదు. కొడుకు తన జీవితం నాశనం కేస్య్కోవడమే కాక, తాగి వచ్చి కోడలిని విపరీతంగా కొడుతున్నా బలహీనులైన వృద్ధులు అడ్డుకోలేకపోయారు. దెబ్బలు తట్టుకోలేక కోడలు పిల్లలతో సహా పుట్టింటికి వెళ్ళిపోతున్నా ధైర్యం చెప్పి అండ నిలవలేకపోయారు. పనికి పోకుండా తాగి తందనాలాడుతూ డబ్బుల కోసం తమనే వేధిస్తుంటే సహిస్తూ బతికారు.…

తిండిలేక చనిపోతున్న యెమెన్ పిల్లలు సం.కి 34,000 -ఫొటోలు

యెమెన్ దేశంలో అత్యధిక శాతం పిల్లలు పోషకాహారం లేక చనిపోతున్నారు. ఐదేళ్లలోపు పిల్లల్లో 58 శాతం మంది తీవ్రమైన పోషకాహార లోపంతో బాధపడుతుండగా, 46 శాతం మంది తక్కువ బరువుతో తీసుకుంటున్నారని యునిసెఫ్ ప్రకటించింది. ఐదేళ్లలోపే చనిపోతున్న పిల్లల్లో 60 శాతం మంది పోషకాహార లోపం వల్లనే చనిపోతున్నారని ఆ సంస్ధ తెలిపింది. ఫలితంగా యెమెన్ లో పోషకార లోపం వల్ల ప్రతి సంవత్సరం 34,000 మంది చనిపోతున్నారని ఆందోళన వ్యక్తం చేసింది. పోషకాహార లోపం వల్ల…

అత్యాచారం ఆరోపణలపై వుమెన్ అధ్లెట్ ‘పింకీ ప్రామాణిక్’ అరెస్ట్

తనతో సహజీవనం చేస్తున్న మరో మహిళపై అత్యాచారం చేసిన ఆరోపణలపై భారత మాజీ అధ్లెట్ పింకీ ప్రామాణిక్ ను పశ్చిమ బెంగాల్ పోలీసులు అరెస్ట్ చేశారు. పింకీ ప్రామాణిక్ వాస్తవానికి మహిళ కాదనీ, మగవాడేననీ బాధితురాలు ఆరోపించినట్లు బెంగాల్ పోలీసులు తెలిపారు. తనను పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చి ఇప్పుడు నిరాకరిస్తోందని బాధిత మహిళ ఫిర్యాదు చేసిందని వారు తెలిపారు. సౌత్ ఆసియా గేమ్స్, ఆసియాడ్, కామన్ వెల్త్ లాంటి పోటీల్లో భారత దేశానికి వివిధ గోల్డ్…

ఆసియన్ అమెరికన్ల ఎదుగుదలపై ‘బాంబూ సీలింగ్’ -ఎన్.డి.టి.వి

అమెరికా కంపెనీలలో ఆసియా-అమెరికన్లు ఉన్నత స్ధానాలకు ఎదగకుండా అనేక ఆటంకాలు విధిస్తున్నారని ఎన్.డి.టి.వి తెలిపింది. ఆసియా-అమెరికన్లు ఎంత ప్రతిభ ఉన్నప్పటికీ, తమ సామర్ధ్యం ఎంతగా రుజువు చేసుకున్నప్పటికీ కార్పొరేట్ అమెరికా వారిని గుర్తించడం లేదనీ తెలిపింది. కంపెనీలకి విధేయులుగా ఉంటున్నప్పటికీ తమను తాము కంపెనీలకు చెందినవారుగా భావించలేకపోతున్నార తెలిపింది. ఆసియా-అమెరికన్లు ఎదుర్కొంటున్న ఆటంకాలకు  అమెరికా సమాజంలో ఆసియన్లకు వ్యతిరేకంగా, అమెరికన్లకు అనుకూలంగా ‘పక్షపాతం’ పాతుకుపోయి ఉండడమే కారణమనీ ఇటీవలి సర్వేనూ, వివిధ నిపుణులనూ ఉటంకిస్తూ తెలియజేసింది. ఆసియా-అమెరికన్…

ప్లే స్టేషన్ కోసం మహిళను హత్య చేసిన బాలుడు

ప్లే స్టేషన్ కొనుక్కోవడం కోసం 14 సంవత్సరాల బాలుడు వృద్ధ మహిళను హత్య చేసి నగలు దొంగిలించాడు. పిన్నితో కలిసి పొరుగింటి మహిళను హత్య చేసిన బాలుడు తర్వాత శవాన్ని పాక్షికంగా తగలబెట్టి దూరంగా వదిలిపెట్టాడు. బాలుడు, అతని పిన్ని, శవాన్ని దూరంగా పారేయడానికి సహరించిన బాబాయి లు ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. తమిళనాడు లోని కాంచీపురం జిల్లా ఎస్.పి ఎస్.మనోహరన్ ప్రకారం తిరువుల్లూరు జిల్లా సరిహద్దులోని సెంగాడు గ్రామంలో రోడ్డు పక్కన ఉన్న గుర్తు…

జగన్ మరో రెండు వారాలు జైల్లోనే, నార్కోకి అనుమతి కోరిన సి.బి.ఐ

ప్రభుత్వాన్ని మోసగించి ప్రజాధనాన్ని అక్రమంగా సొంత ఖాతాలకు తరలించిన కేసులో వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి కి కోర్టు మరో రెండు వారాలు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. జూన్ 25 వరకూ రిమాండు పొదిగిస్తున్నట్లు సి.బి.ఐ ప్రత్యేక కోర్టు ఆదేశాలు జారీ చేసింది. జగన్ పైన దాఖలైన రెండవ, మూడవ ఛార్జీ షీట్లను పరిగణనలోకి తీసుకున్న కోర్టు, ఆయనపై పి.టి (ప్రిసనర్ ట్రాన్సఫర్) వారంట్ జారీ చేసి సోమవారం ఇతరులతో పాటు కోర్టుకి రప్పించుకుంది. మే 27 నుండి జగన్…

టైర్ ఊడిపోయినా విమానాన్ని భద్రంగా దింపిన కెప్టెన్ ఊర్మిళ

ఆందోళన చెందవలసిన సమయంలో సైతం ధైర్యం కోల్పోకుండా 48 మంది విమాన ప్రయాణీకులను భద్రంగా గమ్యం చేర్చిన మహిళా కెప్టెన్ ఉదంతం ఇది. ఎయిర్ ఇండియాకి చెందిన విమానం ఒకటి సిబ్బందితో సహా 52 మంది ప్రయాణికులతో సిల్చార్ నుండి గౌహతి వెళ్లడానికి టేక్ ఆఫ్ అవుతుండగానే ముందు చక్రాలలో ఒకటి ఊడి పడిపోయింది. అయినప్పటికీ విమానాన్ని భద్రంగానే గౌహతీ లో దింపి, కెప్టెన్ ఊర్మిళ పలువురు ప్రశంసలు అందుకుంది. ఎయిర్ ఇండియాకి చెందిన విమానం ఎటిఆర్…

దేశ రాజధాని సమీపంలో పరువు హత్య, హత్యా ప్రయత్నం

ప్రేమించిన పాపానికి తండ్రీ, సోదరులే హత్యలకు సిద్ధపడ్డారు. భారత దేశ రాజధాని న్యూఢిల్లీ కి సమీపంలోనే శనివారం రెండు దారుణాలు చోటు చేసుకున్నాయి. తమ ఊరిలోనే వేరొక వ్యక్తిని ప్రేమించినందుకు తన కూతురిని తండ్రే ఉరి బిగించి చంపగా, అక్కడికి సమీపంలోని మరో ఊరిలో ప్రేమించి పెళ్లి చేసుకున్న జంటపై యువతి సోదరుడు కాల్పులు జరిపాడు. భార్యా, భర్తలు ఇరువురూ ఆసుపత్రిలో తేరుకుంటున్నట్లు తెలుస్తోంది. న్యూఢిల్లీ శివార్లలోని సోనిపట్ లో నివసిస్తున్న బ్రజేష్ సింగ్ కి 12…

అవిశ్రాంత లేఖాయుధ పోరాట యోధుడు సుభాష్ అగర్వాల్

ప్రణాళికా సంఘం కార్యాలయంలో టాయిలెట్ల కోసం 35 లక్షలు ఖర్చు పెట్టిన సంగతిని వెలికి తీసి దేశాన్ని నివ్వెరపరిచిన 62 సంవత్సరాల సుభాష్ అగర్వాల్ గురించి తెలుసుకోవడం చాలా అవసరం. టీ చుక్క ముట్టని ఈ లేఖాయుధుడు పత్రికలకు లేఖలు రాసి ఆ లేఖలనే ఆయుధాలుగా ప్రభుత్వంలోని అనేక విభాగాలలో జరుగుతున్న అనేక తప్పులను సవరించుకునేలా ఒత్తిడి చేసిన ధీమంతుడు. రాజకీయ నాయకులకు, బ్యూరోక్రాట్ అధికారులకు ప్రజల పట్లా, వారి అవసరాల పట్లా ఉన్న ఉదాసీనతనూ, ఛీత్కార…

కూలోడి కడుపుకి రు.28, ప్లానింగ్ ఆఫీసర్ టాయిలెట్ కి రు.35 లక్షలు

భారత దేశ పల్లెల్లో బతికే కూలోడికి రోజుకి రు. 28 చాలని చెప్పిన ప్లానింగ్ కమిషన్ ఉపాధ్యక్షుడు మాంటెక్ సింగ్ అహ్లూవాలియా తన కార్యాలయంలో ఆఫీసర్లు వాడే రెండు టాయిలెట్ల ఆధునీకరణ కోసం రు. 35 లక్షలు ఖర్చు పెట్టాడు. అంతటితో ఆగకుండా ఆ టాయిలేట్ లో దొంగలు పడతారేమోనని సి.సి.టి.వి కెమెరాలు ఏర్పాటు చేయబోతున్నాడు. ఇది కేవలం పైలట్ ప్రాజెక్టేనట. ఇది సక్సెస్ అయితే ప్లానింగ్ కమిషన్ కార్యాలయం ‘యోజన భవన్’ లో టాయిలెట్లన్నీ అలాగే…

మన్మోహన్ సచ్ఛీలుడనే అనుకున్నా, కానీ… … -అన్నా హజారే

“నేను పత్రాలు చూశాను. నాకు అనుమానం ఉంది. నాకూ అనుమానాలు వచ్చాయి. ఆయన పరిశుభ్రమైన ప్రధాన మంత్రి నేను ఎల్లప్పుడూ భావించాను. కానీ ఫైళ్ళు చదివాక… అక్కడ ఏదో తప్పు జరిగింది.” ఇవీ అన్నా హాజరే మాటలు. “ఆయన సామాన్యమైన వ్యక్తి” అని రెండు రోజుల క్రితం ప్రధాని మన్మోహన్ కి సర్టిఫికేట్ ఇచ్చిన అన్నా హజారే సోమవారం అన్న మాటలు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాల సందర్భంగా, మన్మోహన్ ని సమర్ధిస్తూ అవినీతి వ్యతిరేక ఉద్యమాన్నీ,…