వోడాఫోన్ పన్ను వివాదం: ప్రణబ్ నిర్ణయాన్ని అపహాస్యం చేస్తున్న చిదంబరం?

భారత ప్రభుత్వానికి వోడాఫోన్ కంపెనీ పన్ను ఎగవేసిన వివాదానికి సంబంధించి ఆర్ధిక మంత్రిగా ప్రణబ్ ముఖర్జీ తీసుకున్న నిర్ణయాలు అపహాస్యం పాలవుతున్నాయి. ప్రభుత్వ ఖజానా కోసం ప్రణబ్ ముఖర్జీ తీసుకున్న నిర్ణయాలను అపఖ్యాతిపాలు చెయ్యడంలో కొత్త ఆర్ధిక మంత్రి చిదంబరం బిజీ అయినట్లు కనిపిస్తోంది. వోడా ఫోన్ పన్ను విషయమై దుడుకు (rash) నిర్ణయాలు తీసుకోబోమని చిదంబరం సోమవారం ప్రకటించాడు. తద్వారా ప్రణబ్ ముఖర్జీ నిర్ణయం అనాలోచితమైనదని పరోక్షంగా సూచించాడు. కేమన్ ఐలాండ్ లో రిజిస్టరై భారత్…

ప్రణబ్ సవరణలను వెనక్కి తిప్పడానికి మన్మోహన్ ప్రయత్నాలు?

ప్రణబ్ ముఖర్జీ రాష్ట్రపతి పదవికి పోటీ చేస్తున్నందున ఆర్ధిక మంత్రిత్వ శాఖను చేపట్టిన ప్రధాని మన్మోహన్ సింగ్, ప్రణబ్ ప్రతిపాదించిన ఆదాయ పన్ను చట్టం సవరణలను వెనక్కి తిప్పడానికి ప్రయత్నిస్తున్నట్లు పత్రికల వార్తలను బట్టి అర్ధం అవుతోంది. వోడా ఫోన్ లాంటి కంపెనీలు యాభై వేల కోట్లకు పైగా పన్నులు ఎగవేయడానికి ఆస్కారం కలిగించిన లూప్ హోల్ ను పూడ్చడానికి ప్రణబ్ ప్రయత్నించిన సంగతి తెలిసిందే. గత యాభై యేళ్లకు వర్తించేలా సవరణలను ప్రణబ్ ప్రతిపాదించడంతో జాతీయ,…