గడ్దాఫీని చంపడానికి మళ్ళీ నాటో దాడి, కొడుకు ముగ్గురు మనవళ్ళు మృతి

గడ్డాఫీని చంపడానికే కంకణం కట్టుకున్న నాటో దేశాలు మరోసారి లిబియా అధ్యక్షుడు గడ్డాఫీ నివాస సముదాయంపై మిసైళ్ళతో దాడి చేశాయి. దాడినుండి గడ్డాఫీ తప్పించుకున్నప్పటికీ చిన్న కొడుకు సైఫ్ ఆల్-అరబ్ తో పాటు ముగ్గురు మనవళ్ళు చనిపోయినట్టు లిబియా ప్రభుత్వం తెలిపింది. భవనంపై కనీసం మూడు మిసైళ్ళు ప్రయోగించారనీ, దాడిలో భవనం పూర్తిగా దెబ్బతిన్నదనీ లిబియా ప్రభుత్వ ప్రతినిధి మౌసా ఇబ్రహీం తెలిపాడు. దాడి జరిగిన కొద్ది గంటల్లోనే నాటో ప్రతినిధి ఛార్లెస్ బౌచర్డ్ వివరణ ఇవ్వడానికి…

గడ్డాఫీని టార్గెట్ చేయాలంటున్న బ్రిటన్, చట్టవిరుద్ధమని లాయర్ల హెచ్చరిక

“లిబియా ప్రభుత్వ కమాండ్ అండ్ కంట్రోల్ (గడ్డాఫీ) ను టార్గెట్ చెయ్యడం చట్టబద్ధమే” అని బ్రిటన్ డిఫెన్స్ సెక్రటరీ లియామ్ ఫాక్స్ ప్రకటించాడు. అయితే “గడ్డాఫిపైన గానీ, లిబియా ప్రభుత్వ సైన్యంపైన గానీ దాడుల చేయడానికీ, లిబియా తిరుగుబాటుదారులకు ట్రైనింగ్ ఇవ్వడానికీ ఐక్యరాజ్య సమితి తీర్మానం అనుమతి ఇవ్వలేదు. అలా చేస్తే చట్ట విరుద్ధం” అని బ్రిటన్ ప్రభుత్వ లాయర్లు హెచ్చరిస్తున్నారు. బ్రిటన్ ప్రధాని కామెరూన్ కూడా లిబియా తిరుగుబాటుదారులకు ఆయుధాలిచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నామని తమ ఎం.పిలకు…

గడ్డాఫీని చంపడానికి పశ్చిమ దేశాల బాంబు దాడులు

లిబియా పౌరుల్ని రక్షించే పేరుతో లిబియా ప్రభుత్వ సైనిక సంపత్తిని నాశనం చేసే పనిలో ఉన్న పశ్చిమ దేశాలు మళ్ళీ గడ్డాఫీని చంపే ప్రయత్నాలను తీవ్రం చేశాయి. గడ్డాఫీ నివాస భవనాలపై సోమవారం నాటో సేనలు శక్తివంతమైన బాంబులను ప్రయోగించాయి. లిబియాలో అంతర్యుద్ధానికి “కాల్పుల విరమణ ఒప్పందాన్ని” ప్రతిపాదిస్తూ వచ్చిన “ఆఫ్రికన్ యూనియన్” ప్రతినిధులతో చర్చించడానికి వినియోగించిన భవనం సోమవారం నాటి బాంబుదాడుల్లో బాగా ధ్వంసం ఐనట్లు వార్తా సంస్ధలు తెలిపాయి. రీగన్ అమెరికా అధ్యక్షుడుగా ఉన్న…

లిబియాలో స్పెయిన్ విలేఖరి అరెస్ట్, అరెస్టైనవారంతా క్షేమం

ఏప్రిల్ 5 తేదీన కనపడకుండా పోయిన స్పెయిన్‌కి చెందిన ఫోటో జర్నలిస్టు ఆదివారం స్పెయిన్‌లో తన తల్లిదండ్రులకు ఫోన్ ద్వారా తన క్షేమ సమాచారాన్ని తెలియజేశాడు. బ్రెగా పట్టణం శివార్లలో ఉన్న మను బ్రాబో ఇతర విలేఖరులతో పాటు అరెస్టు అయ్యాడు. సరైన అనుమతి లేకుండా లిబియాలోకి ప్రవేశించడంతో వారిని లిబియా ప్రభుత్వం అరెస్టు చేసింది. మను తండ్రి మాన్యువల్ వరెలా, తన కొడుకు బ్రాబోను మిలట్రీ జైలులో ఉంచారనీ, జైలులో తనను బాగా చూసుకుంటున్నట్లు చెప్పాడని…

మిస్రాటాను కాపాడండి, లేదా మేమే కాపాడుకుంటాం! లిబియా ఆర్మీకి గిరిజన తెగల అల్టిమేటం

లిబియాలో తిరుగుబాటుదారులకూ, ప్రభుత్వ సైనికులకూ జరుగుతున్న తీవ్రమైన పోరు కొత్త మలుపు తిరిగింది. “మిస్రాటా పట్టణం నుండి తిరుగుబాటుదారుల్ని ప్రభుత్వ సైన్యం వెళ్ళగొట్టలేకపోతే చెప్పండి. మేమే అందుకు పూనుకుంటాం” అని స్ధానిక గిరిజన తెగలు అల్టిమేటం ఇచ్చాయని ఉప విదేశాంగ మంత్రి ఖలేద్ కైమ్ ను ఉటంకిస్తూ బిబిసి తెలిపింది. “ఇకనుండి మిస్రాటాలో పరిస్ధితిని అక్కడ నివాసం ఉంటున్నవారు, చుట్టుపక్కల గిరిజన తెగల ప్రజలు ఎదుర్కొంటారు. ప్రభుత్వ సైన్యం ఆ భాధ్యతనుండి విరమించుకుంటుంది. వారు తిరుగుబాటుదారులతో చర్చలు…

మిస్రాటా శరణార్ధి నౌకలు, పశ్చిమ దేశాల అబద్ధపు ప్రచారానికి సాక్ష్యం

లిబియా యుద్ధం ఎందుకు వచ్చిందంటే చాలామంది చెప్పే సమాధానం “గడ్డాఫీ సైన్యాలు లిబియా పౌరులపై దాడులు చేస్తూ చంపడం వలన” అని. అరబ్ దేశాల్లో ప్రజాస్వామిక హక్కుల కోసం ఉద్యమాలు చెలరేగుతున్నాయనీ, దానిలో భాగంగానే లిబియాలొ కూడా ప్రజాస్వామిక ఉద్యమం మొదలైందనీ, కానీ ఉద్యమాన్ని లిబియా నియంత గడ్డాఫీ సైనిక బలంతో అణచివేయడానికి లిబియా పౌరులను చంపుతుండడం వలన అమెరికా, ఫ్రాన్సు, బ్రిటన్ ల నాయకత్వంలో కొన్ని దేశాలు లిబియా పై “నిషిద్ధ గగనతలం” అమలు చేయడానికి…

లిబియాపై యుద్ధానికి హంతక డ్రోన్ విమానాలను పంపిన అమెరికా

వందలకొద్దీ పాకిస్తాన్ పౌరులను చంపిన డ్రోన్ విమానాలను లిబియా పౌరులను రక్షించడానికి(!) పంపేందుకు ఒబామా ఆమోదముద్ర వేశాడు. ఇప్పటికే ఒక సారి దాడికి వెళ్ళిన డ్రోన్ విమానం వాతావరణం అనుకూలించక వెనుదిరిగినట్లు అమెరికా సైనిక దళాలా జాయింట్ ఛీఫ్ తెలిపాడు. తక్కువ ఎత్తులో ప్రయాణించే మానవరహిత డ్రోన్ విమానాలను అమెరికా, ఆఫ్ఘనిస్ధాన్, పాకిస్తాన్ సరిహద్దుల్లో పాకిస్తాన్ భూభాగంలో ఉన్న తాలిబాన్ నాయకులను, మిలిటెంట్లను చంపడానికి విస్తృతంగా వినియోగిస్తోంది. వాటిబారిన పడి పాకిస్ధాన్ పౌరులు అనేకమంది చనిపోయారు. డ్రోన్…

లిబియా తిరుగుబాటుదారులకు పశ్చిమ దేశాల మిలట్రీ ట్రైనింగ్

ఐక్యరాజ్య సమితి 1973 వ తీర్మానం ప్రకారం గడ్దాఫీ బలగాల దాడుల్లో చనిపోతున్న లిబియా పౌరులను రక్షించడానికి సమితి సభ్య దేశాలు “అవసరమైన అన్ని చర్యలూ” తీసుకోవచ్చు. దీన్ని అడ్డం పెట్టుకుని తమ సైన్యాలను బహిరంగంగా లిబియాలో దింపడానికి అమెరికా, ఫ్రాన్సు, బ్రిటన్, కెనడా తదితర దేశాలకు ధైర్యం చాలడం లేదు. వారు భయపడుతున్నది గడ్దాఫీని గానీ, వారి సైనికులను చూసిగానీ కాదు. తమ సొంత ప్రజలకు అవి భయపడుతున్నాయి. ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్ యుద్ధాల్లో అనేకమంది సైనికులు…

ఇరాక్ తరహాలో లిబియా దురాక్రమణకు ఏర్పాట్లు చేసుకుంటున్న అమెరికా, బ్రిటన్, ఫ్రాన్సు

అమెరికా, బ్రిటన్, ఫ్రాన్సు ల త్రయం తమ ఉద్దేశాలను మెల్ల మెల్లగా బైట పెట్టుకుంటున్నాయి. లిబియా తిరుగుబాటుదారులకు మిలట్రి సలదారులను పంపించడానికి బ్రిటన్ నిర్ణయించింది. గడ్డాఫీకి ఆయుధాలు అందకుండా చేయడానికి మొదట ‘అయుధ సరఫరా’ పై నిషేధం విధించారు. ఆర్ధిక వనరులు అందకుండా లిబియా ప్రభుత్వానికి అంతర్జాతీయ బ్యాంకుల్లో ఉన్న ఖాతాలను స్తంభింప జేశారు. గడ్డాఫీ విమానదాడులనుండి లిబియా ప్రజలను రక్షించచే పేరుతో “నో-ఫ్లై జోన్” అన్నారు. ఆ పేరుతో లిబియా తీర ప్రాంతాన్ని విమానవాహక నౌకలతో…

గడ్డాఫీ అమ్ములపొదిలో క్లస్టర్ బాంబులు, హక్కుల సంస్ధ ఆందోళన

లిబియాలో గడ్డాఫీ బలగాలు పౌరులపై క్లస్టర్ బాంబులు ప్రయోగిస్తున్నాయని మానవహక్కుల సంస్ధ హ్యూమన్ రైట్స్ వాచ్ సంస్ధ ఆరోపించింది. ఈ ఆరోపణలను లిబియా ప్రభుత్వం తిరస్కరించింది. క్లస్టర్ బాంబులుగా పెర్కొంటూ న్యూయార్క్ టైమ్స్ పత్రిక కొన్ని ఫోటోలను ప్రచురించింది. పౌరుల నివాస ప్రాంతాల్లో క్లస్టర్ బాంబుల్ని పేల్చడం వలన మానవ నష్టం అపారంగా ఉంటుందనీ, గడ్డాఫీ ఈ బాంబుల వాడకాన్ని వెంటనే నిలిపివేయాలనీ హక్కుల సంస్ధ డిమాండ్ చేసింది. అయితే న్యూయార్క్ టైమ్స్ విలేఖరికి కనిపించిన బాంబు…

లిబియా దాడులపై అమెరికా, ఫ్రాన్సులకు దొరకని మద్దతు

లిబియా పౌరుల రక్షణ పేరుతో ఆ దేశంపై వైమానిక దాడులను తీవ్రతరం చేయడానికి అమెరికా, ఫ్రాన్సు, బ్రిటన్ దేశాలు మరిన్ని నాటో దేశాల మద్దతు కోరినప్పటికీ ఎవరూ ముందుకు రాలేదు. గురువారం బెర్లిన్ లో నాటో దేశాల విదేశాంగ మంత్రుల సమావేశం జరిగింది. లిబియాపై వైమానిక దాడులు చేస్తున్న ఆరు నాటో దేశాలతో పాటు మిగిలిన దేశాలు కూడా బాంబు దాడులు ప్రారంభించాలని ఈ సమావేశంలో అమెరికా, ఫ్రాన్సు, ఇంగ్లంద్ దేశాలు కోరాయి. ముఖ్యంగా యూరోపియన్ యూనియన్…

లిబియా తిరుగుబాటుదారులకు ఆయుధాలిస్తాం -పశ్చిమ దేశాలు

లిబియా ఆయిల్ వనరులను పూర్తిగా తమకు అప్పగించడానికి నిరాకరిస్తున్న గడ్డాఫీని గద్దె దించడానికి పశ్చిమ దేశాలైన అమెరికా, బ్రిటన్ లు లిబియా తిరుగుబాటుదారులకు ఆధునిక ఆయుధాలు అందించడానికి రెడీ అయ్యారు. లిబియా పై ఐక్యరాజ్యసమితి ఆయుధ రవాణా నిషేధం విధించినప్పటికీ పశ్చిమ దేశాలు దాన్ని పట్టించుకోదలచుకోలేదు. ఐక్యరాజ్యసమితి 1970 వ తీర్మానం ద్వారా లిబియాలోని ఇరు పక్షాలకు ఆయుధాలు సహాయం చేయకుండా, అమ్మకుండా నిషేధం విధించింది. 1973 వ తీర్మానం ద్వారా లిబియాలో పౌరల రక్షణకు అవసరమైన…

సామ్రాజ్యవాదుల ఆధ్వర్యంలో లిబియా విప్లవం

విక్టర్ నీటో వెనిజులాకి చెందిన కార్టూనిస్టు. ఈ కార్టూను మొదట ఆయన బ్లాగులోనూ, తర్వాత మంత్లీ రివ్యూ పత్రిక ఇండియా ఎడిషన్ లోనూ ప్రచురితమయ్యింది. సాధారణంగా ఏదైనా దేశంలో విప్లవాలు సంభవిస్తే వాటికి ప్రజల చొరవ ప్రధానంగా ఉంటుంది. అలా ప్రజల చొరవ ఉంటేనే ఏ విప్లవమైనా విప్లవం అనిపించుకుంటుంది. కానీ లిబియాలో గడ్డాఫీకి వ్యతిరేకంగా చెలరేగిందని చెబుతున్న విప్లవానికి సామ్రాజ్యవాద దేశాలయిన అమెరికా, ఫ్రాన్సు, బ్రిటన్ లు నాయకత్వం వహిస్తున్నాయి. లిబియా అధ్యక్షుడు గడ్డాఫీ సేనలు…

లిబియాపై దాడులు మరింత తీవ్రం చేయాలి -ఫ్రాన్సు, ఇంగ్లండ్

లిబియాపై నాటో ప్రస్తుతం చేస్తున్న దాడులు సరిపోలేదనీ, దాడుల తీవ్రత పెంచాలనీ ఫ్రాన్సు, బ్రిటన్ ప్రభుత్వాలు డిమాండ్ చేశాయి. ఫ్రాన్సు, ఇంగ్లండ్ లు కూడా నాటో (నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్) లో సభ్యులే. లిబియాపై నో-ఫ్లై జోన్ అమలు చేయడానికి నాయకత్వం వహించడానికి అమెరికా తిరస్కరించడంతో నాటో నాయకత్వ పాత్ర నిర్వహిస్తోంది. గడ్డాఫీ విమానదాడులనుండి లిబియా పౌరులను రక్షించడానికి నో-వ్లై జోన్ అమలు చేయాలనీ, లిబియా పౌరులను రక్షించడానికి అవసరమైన అన్ని చర్యలనూ తీసుకోవాలని ఐక్యరాజ్యసమితి…

లిబియా తిరుగుబాటు సైనికుల్ని చంపినందుకు క్షమాపణ నిరాకరించిన నాటో

లిబియా ప్రభుత్వ సైనికులుగా పొరబడి తిరుగుబాటు సైనికులను చంపినందుకు క్షమాపణ చెప్పడానికి నాటొ దళాల రియర్ ఆడ్మిరల్ రస్ హార్డింగ్ నిరాకరించాడు. గురువారం అజ్దాబియా, బ్రెగా పట్టణాల మధ్య జరుగుతున్న యుద్దంలో పాల్గొనటానికి తిరుగుబాటు బలగాలు తీసుకెళ్తున్న ట్యాంకుల కాన్వాయ్ పై నాటో వైమానిక దాడులు జరపడంతో పదమూడు మంది మరణించిన సంగతి విదితమే. “గడ్డాఫీ బలగాలకు చెందిన ట్యాంకులు మిస్రాటా పట్టణంలొ పౌరులపై నేరుగా కాల్పులు జరుపుతున్నాయి. పౌరులను రక్షించడానికే మేం ప్రయత్నిస్తున్నాము. గురువారం నాటి…