(మత) ఆకర్షక రాజకీయాలు -ది హిందు ఎడిటోరియల్

ముంచుకొచ్చే ఎన్నికలు, ప్రభుత్వాల చర్యలకు అనివార్యంగా రంగు పులుముతాయి. ఉత్తర ప్రదేశ్ లో 11 అసెంబ్లీ స్ధానాలకు, ఒక పార్లమెంటరీ స్ధానానికి ఉప ఎన్నికలు జరగడానికి సరిగ్గా రెండు రోజుల ముందు భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్ షా పై విద్వేష ప్రసంగం చేసినందుకు అభియోగ పత్రం నమోదు చేయడానికి తీసుకున్న నిర్ణయం రాజకీయ లక్ష్యంతోనే జరిగిందా అన్నది చర్చనీయమైన ప్రశ్న. అమిత్ షా పై దాఖలు చేసిన ఛార్జీ షీటును కోర్టు పోలీసులకు వెనక్కి…

2 కోట్లు విదిల్చి రాంబో గొప్పలేల మోడి సారు?

134 మంది పట్టే విమానంలో రెండు రోజుల్లో 15,000 మంది గుజరాతీ యాత్రీకులను నరేంద్ర మోడి రక్షించారట! గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడి గారు స్వయంగా ఈ విషయం చెప్పుకుంటూ అప్పుడే ఎన్నికల ప్రచారం ప్రారంభించేశారు. ఎన్నికల ప్రచారానికి 5,000 మందికి పైగా హిందూ భక్తులు దుర్మరణం చెందినట్లు భయపడుతున్న కేదార్ నాధ్ వరద భీభత్సం కంటే మించిన సదవకాశం నరేంద్ర మోడి గారికి దొరక్కపోవడం అత్యంత అమానుషం కాగా, సాధ్యా సాధ్యాలు పరిశీలించకుండానే మోడీ భక్తాగ్రేసరులు…

యు.పి.ఎ కి మమత సెలవు, మైనారిటీలో కేంద్ర ప్రభుత్వం

మమత బెనర్జీ చెప్పినట్లే కేంద్ర ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంది. చిల్లర వర్తకంలో విదేశీ పెట్టుబడుల అనుమతి, డీజెల్ రేట్ల పెంపుదల, గ్యాస్ సిలిండర్ల సబ్సిడీలో భారీ కోత… నిర్ణయాలను ఉపసంహరించుకోవాలంటూ మమత విధించిన 72 గంటల గడువు ముగిశాక మద్దతు ఉపసంహరిస్తున్నట్లు తృణమూల్ కాంగ్రెస్ నేత ప్రకటించింది. కోల్ గేట్ కుంభకోణం నుండి ప్రజల దృష్టిని మళ్లించడానికే కాంగ్రెస్ ఒక్కుమ్మడిగా ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుందన్న అద్వానీ ఆరోపణలను మమత ఉద్ఘాటించింది. ఈ నిర్ణయాలు వెనక్కి తీసుకున్నట్లయితే…

పూనే పేలుళ్లు పధకం ప్రకారం జరిగినవే -కేంద్రం

బుధవారం పూనేలో జరిగిన పేలుళ్లు పధకం ప్రకారం జరిగినవేనని కేంద్ర ప్రభుత్వం అభిప్రాయపడుతోంది. 500 మీటర్ల పరిధిలో, 45 నిమిషాల సమయంలో జరిగిన ఈ పేలుళ్లు ఒక పధకం ప్రకారం సమన్వయంతో జరిగాయని హోమ్ సెక్రటరీ ఆర్.కె.సింగ్ విలేఖరులకు చెప్పాడు. కేంద్ర దర్యాప్తు సంస్ధలు ఎన్.ఐ.ఏ (నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజన్సీ), ఎన్.ఎస్.జి (నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్), సి.ఎఫ్.ఎస్.ఎల్ (సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీ) ల బృందాలు పూణే చేరుకుని పేలుడు పేలుడు జరిగిన ప్రాంతాలను పరిశీలిస్తున్నాయని ఆయన…

కర్ణాటక వద్ద అరిగిపోయిన బి.జె.పి రికార్డు -కార్టూన్

బి.జె.పి కర్ణాటక ‘నాటకం’ ముగిసేటట్లు కనిపించడం లేదు. యెడ్యూరప్ప ఒత్తిడితో ముఖ్యమంత్రి పీఠం నుండి ‘సదానంద గౌడ’ ను తొలగించిన బి.జె.పి అధిష్టానం ఇప్పుడు సదానంద గౌడ నుండి తాజా డిమాండ్లు ఎదుర్కొంటోంది. శాసన సభా పక్ష సమావేశం ఏర్పాటు చేయవలసిన సదానంద ఆ పని వదిలేసి అధిష్టానం ముందు సొంత డిమాండ్లు ఉంచాడు. సదానందకు రాష్ట్ర పార్టీ అధ్యక్ష పదవి, ఆయన శిబిరంలోని ఈశ్వరప్పకు ఉప ముఖ్యమంత్రి పదవి, ఇంకా మంత్రివర్గంలో సగం పదవులు కావాలని…

కర్ణాటకలో తెగిపడిన మరో తల -కార్టూన్

తమది భిన్నమైన పార్టీ (party with a difference) గా బి.జె.పి చెప్పుకుంటుంది. ఆచరణలో మాత్రం అంతేలేని విభేదాల పార్టీగా (party with unending differences) అనేకసార్లు రుజువు చేసుకుంది. బి.ఎస్.యెడ్యూరప్ప ఆశీస్సులతో సదానంద గౌడ కర్ణాటక ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించిన పదకొండు నెలలకే అదే యెడ్యూరప్ప ఆగ్రహానికి గురై పదవి కోల్పోవడం అందుకు నిదర్శనం. సదానంద గౌడ పదవీ ప్రమాణ స్వీకారోత్సవాన్ని 45 మంది ఎం.ఎల్.ఎ లతో సహా ఎగ్గొట్టిన జగదీష్ షెట్టర్,  యెడ్యూరప్ప అనుగ్రహం…

మోడి పచ్చి అబద్ధాల కోరు -గుజరాత్ బి.జె.పి నాయకుడు కేశూభాయ్

గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడి నిజ స్వరూపాన్ని ఆయన పార్టీ నాయకులే విప్పి చూపుతున్నారు. మోడి చెబుతున్న అభివృద్ధి పారిశ్రామికవేత్తలదే తప్ప ప్రజలది కాదన్న వాస్తవాన్ని వెల్లడిస్తున్నారు. అబద్ధాలు చెప్పడాన్ని మోడీ గుత్తకు తీసుకున్నాడని, ఆయన సద్భావన మిషన్ పెద్ద మోసమనీ గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి, బి.జె.పి నాయకుడు కేశూభాయ్ పటేల్ అసలు వాస్తవాన్ని వెల్లడించాడు. తద్వారా మోడీ కేంద్రంగా ఉబ్బిపోతున్న గాలి బుడగను ‘టప్పున’ బద్దలు కొట్టాడు.  “ప్రజలకు అబద్ధాలు చెప్పి తప్పుదారి పట్టించడాన్ని ఒక…

మాయావతి అవినీతి కేసు కొట్టివేత, సి.బి.ఐ అతి చేసిందని సుప్రీం వ్యాఖ్య

ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మాయావతి పై సి.బి.ఐ దాఖలు చేసిన అవినీతి కేసును సుప్రీం కోర్టు కొట్టివేసింది. కోర్టు నుండి నిర్దిష్ట ఆదేశాలు లేకుండానే సి.బి.ఐ తనంతట తాను మాయావతి కోసమే ప్రత్యేకంగా ఎఫ్.ఐ.ఆర్ రిజిస్టర్ చేయడాన్ని తప్పు పట్టింది. తాజ్ కారిడార్ అవినీతి కేసులో అధికారుల అవినీతిని విచారించాలని కోర్టు చెపితే దాన్ని వదిలి మాయావతి పై ప్రత్యేకంగా కేసు పెట్టడం ఏమిటని ప్రశ్నించింది. సి.బి.ఐ తన అధికార పరిధిని అతిక్రమించి మాయావతి పై…

రాజకీయులను విమర్శించనిది ఇక ఎన్.సి.ఇ.ఆర్.టి పుస్తకాలే -కార్టూన్

అంబేద్కర్ కార్టూన్ పై రేగిన ‘అప్రజాస్వామిక రగడ’ చివరికి ఎన్.సి.ఇ.ఆర్.టి పాఠ్య పుస్తకాలనుండి కార్టూన్ లనూ, వివిధ పాఠ్య భాగాలనూ పూర్తిగా తొలగించాలనే దగ్గర తేలింది. ప్రభుత్వం నియమించిన ‘ఎస్.కె.ధోరట్’ ప్యానెల్ చర్చలు చేసి రాజకీయ శాస్త్ర పాఠ్య పుస్తకాల నుంది అనేక కార్టూన్ లను, పాఠ్య భాగాలనూ తొలగించాలని మెజారిటీ నిర్ణయం చేసింది. ఈ నిర్ణయాన్ని పలువురు స్కాలర్లు నిరసిస్తున్నారు. ప్రఖ్యాత చరిత్రకారుడు, జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ అయిన కె.ఎన్.ఫణిక్కర్ ప్యానెల్…

బి.జె.పి ఆట ఎవరితో? -కార్టూన్

కర్ణాటకలో సంక్షోభం ముదిరి పాకాన పడుతోందని పత్రికలు, ఛానెళ్ళు ఘోషిస్తున్నాయి. అవినీతి ఆరోపణలతో రాజీనామా చేయవలసి వచ్చిన మాజీ ముఖ్యమంత్రి యెడ్యూరప్ప రెట్టించిన బలంతో పార్టీ అధిష్టానాన్ని ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. ఇతర పార్టీలకంటే ‘విభిన్నమైనది’ గా చెప్పుకున్న ఆ పార్టీ క్రమంగా ‘విభేధాలకు నిలయం’ గా మారిపోయింది. అవినీతి ఆరోపణలకు గురయిన నాయకుడు నలుగురికీ ముఖం చూపించడానికి సిగ్గుపడడానికి బదులు ప్రజల ముందు ధీమాగా తిరుగుతూ వార్తల్లో వ్యక్తిగా నిలిచాడు. ఫలితంగా బి.జె.పి ప్రత్యర్ధి పార్టీలతో తలపడడానికి…

పోలీసులు చంపిన 23 మందీ గిరిజనులే, నక్సలైట్లు కాదు -పత్రికలు

ఛత్తీస్ ఘడ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో బసగూడ వద్ద సి.ఆర్.పి.ఎఫ్ జరిపిన ఎన్ కౌంటర్ లో చనిపోయినవారంతా అమాయక గిరిజనులేనని వారిలో ఎవరూ నక్సలైట్లు లేరనీ పత్రికలు, చానెళ్ళు వెల్లడి చేశాయి. చనిపోయినవారిలో ఎవరూ మావోయిస్టులు లేరని మావోయిస్టు నాయకుడు ఉసెండి తమ కార్యాలాయానికి ప్రకటన పంపినట్లు ఎ.బి.ఎన్ టి.వి చానెల్ తెలియజేయగా, చనిపోయినవారిలో ఎక్కువమంది గిరిజనులే అయి ఉండవచ్చని పోలీసు వర్గాలను ఉటంకిస్తూ ‘ది హిందూ’ తెలిపింది. చనిపోయినవారిలో ఆరుగురు పిల్లలు కూడా ఉన్నారనీ బాలికలను…

కలాం నిజం చెప్పడం లేదు -సుబ్రమణ్య స్వామి

ప్రధాన మంత్రి గా సోనియా గాంధీ నియామకం విషయంలో మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం నిజాలు చెప్పడం లేదని జనతా పార్టీ నాయకుడు సుబ్రమణ్య స్వామి ఆరోపించాడు. ప్రధాని పదవికి సోనియా నియామకం జరగదని కలాం ఒక లేఖ కూడా సోనియాకి రాశాడనీ, తీరా ఇప్పుడు అందుకు విరుద్ధంగా చెప్పడం ఏమిటని ఆయన ప్రశ్నించాడు. ఇటలీ పౌరసత్వం రద్దు చేసుకోకుండా భారత పౌరసత్వం పొందినందున సోనియా గాంధీ ప్రధానమంత్రి కావడానికి నాయపరమైన సమస్యలున్నాయని తాను కలాంకి వివరించాననీ,…

టర్నింగ్ పాయింట్స్: సోనియా ప్రధాని పదవికి తగునని భావించిన కలాం

2004 లో విస్తృతంగా జరిగిన మీడియా ప్రచారానికి విరుద్ధంగా సోనియా కోరినట్లయితే ఆమెను ప్రధానిగా అవకాశం ఇవ్వడానికి తాను సిద్ధపడినట్లు అప్పటి రాష్ట్రపతి అబ్దుల్ కలాం తన ‘టర్నింగ్ పాయింట్స్’ పుస్తకంలో వెల్లడి చేశాడు. సోనియాను ప్రధానిని చేయడానికి వ్యతిరేకంగా అనేకమంది రాజకీయ నాయకులు, పార్టీలు తీవ్ర స్ధాయిలో ఒత్తిడి తెచ్చినప్పటికీ, ‘రాజ్యాంగబద్ధంగా సమర్ధనీయమైన’ ఏకైక అవకాశం అదే అయినందున ఆమెను ప్రధానిని చేయడం తప్ప తనకు మరొక మార్గం లేదని కలాం తన పుస్తకంలో వివరించాడు.…

ముంబై దాడుల్లో పాకిస్ధాన్ పాత్ర ధృవపడింది -ఇండియా

ముంబై టెర్రరిస్టు దాడుల్లో పాకిస్ధాన్ ప్రభుత్వ పాత్ర ఉన్నట్లు ధృవ పడిందని భారత హోమ్ మంత్రి పి.చిదంబరం తేల్చి చెప్పాడు. ‘అబు జిందాల్’ అలియాస్ ‘జబియుద్దీన్ అన్సారీ’ అరెస్టు తర్వాత అతను వెల్లడి చేసిన వివరాలు దాడుల్లో పాక్ పాత్ర ఉందన్న అనుమానాలు నిజమేనని తేలిందని చెప్పాడు. పాక్ ప్రభుత్వ మద్దతుతో ఒక క్రమ పద్ధతిలో టెర్రరిస్టు దాడులు జరిగాయని ఆయన తెలిపాడు. అయితే చిదంబరం వాదనను పాక్ హోమ్ మంత్రి రెహ్మాన్మ్ మాలిక్ తిరస్కరించాడు. ఇండియా…

ఆయిల్ రాజకీయాల ఫలితం, ముంబై దాడుల అనుమానితుడి అరెస్టు

26/11 ముంబై టెర్రరిస్టు దాడులకు బాధ్యులుగా భావిస్తున్నవారిలో ముఖ్యమైన అనుమానితుడు జబీయుద్దీన్ అన్సారీ ని భారత ప్రభుత్వం అరెస్టు చేసింది. అన్సారీ మహారాష్ట్ర వాసి అయినప్పటికీ టెర్రరిస్టు దాడులు జరుగుతుండగా పాకిస్ధాన్ లో ఉన్న కంట్రోల్ రూమ్ నుండి ఆదేశాలిచ్చిన వారిలో ఉన్నాడని భారత ప్రభుత్వం భావిస్తోంది. సౌదీ అరేబియా నుండి విమానంలో దిగిన అన్సారీని ఢిల్లీ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. సౌదీ అరేబియాతో నెలల తరబడి సాగించిన దౌత్యం ఫలితంగా అన్సారీ అరెస్టు సాధ్యం…