రాజన్: గిల్లి జోల పాడుతున్న పాలకులు -విశ్లేషణ

“పొమ్మనలేక పొగబెట్టారు” అని మర్యాదగా చెప్పుకోవటానికి కూడా వీలు లేకుండా బి‌జే‌పి పాలకులు రఘురాం రాజన్ పట్ల వ్యవహరించారు. హద్దు పద్దు ఎరగని నోటికి ఓనర్ అయిన సుబ్రమణ్య స్వామి తనపైన అలుపు లేకుండా మొరగటానికి కారణం ఏమిటో, ఆయన వెనుక ఉన్నది ఎవరో తెలియని అమాయకుడా రాజన్? రెండో విడత నియామకం ద్వారా ఆర్‌బి‌ఐ గవర్నర్ పదవిలో కొనసాగేందుకు తాను సిద్ధంగా లేనని, అకడమిక్ కెరీర్ పైన దృష్టి పెట్టదలుచుకున్నానని ప్రకటించడం ద్వారా ‘అంత అమాయకుడిని…

వ్యూహాత్మక నిష్క్రమణ -ద హిందూ ఎడిట్..

[ఈ రోజు -జూన్ 20- ది హిందు ప్రచురించిన ఎడిటోరియల్ “A strategic exit” కు యధాతధ అనువాదం. -విశేఖర్] ********* సెప్టెంబర్ లో తన పదవీకాలం ముగిసిన తర్వాత రెండో సారి పదవికి రేసులో ఉండబోవటం లేదని ప్రకటించటం ద్వారా ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్, అంతకంతకు గుణ విహీనం గా మారుతున్న పరిస్థితుల నుండి మెరుగైన రీతిలో, గౌరవప్రదంగా బైటపడే మార్గాన్ని ఎంచుకున్నారు. కొన్ని నెలలుగా ఆయన కొనసాగింపు పట్ల మోడి ప్రభుత్వంలో కొన్ని…

క్లుప్తంగా …8/6/2016

తిండి కోసం ఇసిస్ లొ చేరాము ! పోరాటం కొనసాగుతుంది -శాండర్స్ సౌదీలకు టార్చర్ టెక్నిక్ లు నేర్పుతున్న బ్రిటిషర్లు కేరళను తాకిన నైరుతి ఋతుపవనం రాజన్ భారతీయుడే -ఆర్‌బి‌ఐ తిండి కోసం ఇసిస్ లొ చేరాము ! మే 2014 నుండి ఇసిస్ ఆక్రమణ లో ఉన్న ఫలూజా నగరాన్ని ఇరాకీ బలగాలు విముక్తి చేస్తున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. ఇరాక్ ప్రభుత్వ బలగాలు పురోగమించే కొద్దీ స్ధానిక ప్రజలపై ఇసిస్ మూకలు సాగించిన దౌర్జ్యన్య కాండ…

ఆర్.బి.ఐ ఆశ్చర్యకర వడ్డీ కోత! -ది హిందు

మార్కెట్లను ఆశ్చర్యంలో ముంచెత్తగల సామర్ధ్యం సెంట్రల్ బ్యాంకింగ్ యొక్క ముఖ్యమైన లక్షణాలలో ఒకటి. ఆర్.బి.ఐ గవర్నర్ రఘురాం రాజన్, గురువారం నాడు వడ్డీ రేట్లను 0.25 శాతం మేర తగ్గించడం ద్వారా దానిని కనబరిచారు. గత వారం రోజుల్లో ద్రవ్యోల్బణము, పారిశ్రామిక ఉత్పత్తిలకు సంబంధించి సానుకూల ఆర్ధిక ఫలితాలు వెలువడడంతో వడ్డీ తగ్గింపు ఉంటుందని అంచనా వేశారు. అలాంటి తగ్గింపు ఏదన్నా ఉన్నట్లయితే అది ఫిబ్రవరి 3 వ తేదీ నాటి ద్వైమాస విత్త విధాన సమీక్షలో…

ధనికులకు ఆర్.బి.ఐ పండగ కానుక, వడ్డీ రేటు తగ్గింపు

ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ శత పోరును ఆర్.బి.ఐ గవర్నర్ రఘురాం రాజన్ మన్నించారు. ధనికులు, కంపెనీలకు మరిన్ని రుణాలను అందుబాటులోకి తెస్తూ రెపో రేటును 8 శాతం నుండి 7.75 శాతానికి తగ్గించారు. ద్రవ్య విధానం సమీక్షతో సంబంధం లేకుండానే ఆర్.బి.ఐ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. “లిక్విడిటీ అడ్జస్ట్ మెంట్ ఫెసిలిటీ కింద పాలసీ రేపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించాలని నిర్ణయించాము. తద్వారా వడ్డీ రేటు 8 నుండి 7.75 శాతానికి…

మరో ప్రపంచ ఆర్ధిక సంక్షోభం రావచ్చు -ఆర్.బి.ఐ గవర్నర్

భారత రిజర్వ్ బ్యాంకు గవర్నర్ బాంబు పేల్చారు. మరోసారి ప్రపంచ ఆర్ధిక సంక్షోభం సంభవించవచ్చని హెచ్చరించారు. ఆయన చెబుతున్నది 2008 నాటి సంక్షోభం తరహాది కూడా కాదు. ఏకంగా 1930ల నాటి మహా మాంద్యం తరహాలోనే సంక్షోభం రావచ్చని హెచ్చరించారు. 2008 నాటి సంక్షోభాన్ని ‘ద గ్రేట్ రిసెషన్’ అని పిలవగా, 1930ల నాటి సంక్షోభాన్ని ‘ద గ్రేట్ డిప్రెషన్’ గా పిలిచారు. రిసెషన్ కంటే డిప్రెషన్ మరింత లోతైన, విస్తారమైన సంక్షోభం. ఆనాటి డిప్రెషన్ నుండి…

మోడి వస్తే ఆర్.బి.ఐ గవర్నర్ కి పదవీ గండమా?

నరేంద్ర మోడి ప్రధాని అయితే (బి.జె.పి కూటమి అధికారంలోకి వస్తే) ఆర్.బి.ఐ గవర్నర్ రఘురాం రాజన్ కి పదవీ గండం తప్పకపోవచ్చని రాయిటర్స్ వార్తా సంస్ధ నిన్న ఒక కధనం ప్రచురించింది. పదవి నుండి తప్పుకోమని అడగకపోతే కనీసం రఘురాం రాజన్ పై కంపెనీల కోసం తీవ్ర స్ధాయిలో రాజకీయ ఒత్తిడులయినా ఉంటాయని ఆ పత్రిక వివరించింది. ఆ మేరకు వివిధ కార్పొరేట్ కంపెనీల లాబీయింగ్ సంస్ధలు ఆశిస్తున్నాయనీ, కొన్నయితే ఏర్పాట్లే చేసుకుంటున్నాయని రాయిటర్స్ వివరించింది. రాయిటర్స్…

ద్రవ్య సమీక్ష: ధనిక వర్గాలకు కొత్త ఆర్.బి.ఐ గవర్నర్ షాక్

కొత్త ఆర్.బి.ఐ గవర్నర్ గా రఘురాం రాజన్ నియమితుడయినప్పుడు ఆయన చెప్పిన మాటల్ని బట్టి పరిశ్రమల వర్గాలు తెగ ఉబ్బిపోయాయి. ఆర్.బి.ఐ పరపతి విధానం ద్వారా తమ పరపతి ఇక ఆకాశంలో విహరించడమే తరువాయి అన్నట్లుగా ఆనందోత్సాహాలు వ్యక్తం చేశారు. తీరా చర్యల విషయానికి వచ్చేసరికి బ్యాంకు వడ్డీ రేటు తగ్గించడానికి బదులు పెంచేసరికి వాళ్ళకు గట్టి షాకే తగిలింది. ఆ షాక్ ఎంత తీవ్రంగా ఉందంటే ద్రవ్య విధాన సమీక్ష ప్రకటించాక భారత స్టాక్ మార్కెట్లు…