అతను మనిషి, ఆస్తి కాదు -ఎంబసీ బాంబు కేసులో మేజిస్ట్రేట్

ఇజ్రాయెల్ ఎంబసీ కారుపై బాంబు దాడి జరిగిన కేసులో నిందితుడిని విచారించడానికి ఇజ్రాయెల్ గూఢచార సంస్ధ ‘మొస్సాద్’  అనుమతించారన్న ఆరోపణలపై కోర్టు తీవ్రంగా స్పందించింది. “అనుమానితుడు మనిషి, ఆస్తి కాదు” అని తీవ్రంగా వ్యాఖ్యానించింది. నిందితుడిని విచారించినవారి జాబితాను తన ముందుంచాలని ఢిల్లీ పోలీసులను ఆదేశించింది. నిందితుడిపై జరిపిన విచారణపై తక్షణం ‘డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్’ స్ధాయికి తగ్గని పోలీసు అధికారి అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది. “ప్రయోగశాలలో పరీక్షలు జరిపే పందిగా నిందితుడిని మార్చారన్న”…

ఢిల్లీ, జార్జియా, ధాయిలాండ్ పేలుళ్ల వెనక ఇరానియన్లు

సోమవారం ఢిల్లీలో ప్రధాని నివాసానికి సమీపంలో ఇజ్రాయెలీ దౌత్య సిబ్బందిని లక్ష్యం చేసుకుంటూ జరిగిన బాంబు పేలుడుకూ, దాదాపు అదే సమయంలో జార్జియా లోనూ మంగళవారం ధాయిలాండ్ లోనూ జరిగిన బాంబు పేలుళ్లకూ దగ్గరి సంభంధం ఉందని ఇజ్రాయెల్ ఆరోపించింది. మరోవైపు ఇజ్రాయెల్ ఆరోపణలను ఆమోదించడం గానీ, నిరాకరించడం గానీ చేయబోవడం లేదని ఇరాన్ ప్రభుత్వం ప్రకటించింది. ఇరాన్ కు చెందిన అణు శాస్త్రవేత్తలను అనేక మందిని ఇజ్రాయెల్ ప్రభుత్వం పొట్టన బెట్టుకున్నట్లుగా ఇరాన్ గతంలో ఆరోపించింది.…

“స్టక్స్ నెట్” వైరస్ సృష్టికర్తలు అమెరికా, ఇజ్రాయెల్ దేశాలే -పరిశోధకులు

ఇరాన్ అణు కార్యక్రమాన్ని ధ్వంసం చేయడానికి అమెరికా, దేశాలు “స్టక్స్ నెట్” కంప్యూటర్ వైరస్ సృష్టించారని సెక్యూరిటీ నిపుణుడు రాల్ఫ్ లాంగ్నర్ తేల్చాడు. కాలిఫోర్నియాలో జరిగిన ఒక కార్ఫెన్స్ లో మాట్లాడుతూ లాంగ్నెర్ ఈ విషయం వెల్లడించాడు. ఈ వైరస్ సృష్టించడంలో చోదక శక్తి మాత్రం అమెరికా అని ఆయన చెప్పాడు. ఇజ్రాయెల్ సహాయంతో అమెరికా ఈ వైరస్ ను ఇరాన్ లో అణు ఇంధనాన్ని శుద్ధి చేయడానికి వినియోగించిన కంప్యూటర్ వ్యవస్ధను నాశనం చేయడానికి సృష్టించిందని…