కూలోడి కడుపుకి రు.28, ప్లానింగ్ ఆఫీసర్ టాయిలెట్ కి రు.35 లక్షలు
భారత దేశ పల్లెల్లో బతికే కూలోడికి రోజుకి రు. 28 చాలని చెప్పిన ప్లానింగ్ కమిషన్ ఉపాధ్యక్షుడు మాంటెక్ సింగ్ అహ్లూవాలియా తన కార్యాలయంలో ఆఫీసర్లు వాడే రెండు టాయిలెట్ల ఆధునీకరణ కోసం రు. 35 లక్షలు ఖర్చు పెట్టాడు. అంతటితో ఆగకుండా ఆ టాయిలేట్ లో దొంగలు పడతారేమోనని సి.సి.టి.వి కెమెరాలు ఏర్పాటు చేయబోతున్నాడు. ఇది కేవలం పైలట్ ప్రాజెక్టేనట. ఇది సక్సెస్ అయితే ప్లానింగ్ కమిషన్ కార్యాలయం ‘యోజన భవన్’ లో టాయిలెట్లన్నీ అలాగే…