అబ్రహాం ఎకార్డ్స్: పశ్చిమాసియాలో నూతన భాగస్వామ్యాలకు తెరతీసిన అమెరికా -2

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆతిధ్యంలో సెప్టెంబర్ 15, 2020 తేదీన నూతన అరబ్-యూదు శాంతి ఒప్పందానికి వైట్ హౌస్ వేదిక అయింది. అరబ్బు దేశాలు యూ‌ఏ‌ఈ, బహ్రయిన్ లు యూదు దేశం ఇజ్రాయెల్ తో శాంతి ఒప్పందం చేసుకున్నాయి. ఈ ఒప్పందం ‘అబ్రహాం ఎకార్డ్స్’ పేరుతో పిలవబడుతోంది. ఇది దాదాపు 26 సంవత్సరాల తర్వాత కుదిరిన మొట్టమొదటి అరబ్-యూదు శాంతి ఒప్పందం. ఇది ఎకార్డ్ (అంగీకారం), అగ్రిమెంట్ (ఒప్పందం) కాదు. దీని ప్రకారం యూ‌ఏ‌ఈ,…

ఈజిప్టులో అధికార కుమ్ములాటలు తీవ్రం, అధ్యక్షుడి డిక్రీ రద్దు చేసిన కోర్టు

ఈజిప్టులో పాత, కొత్త అధికార వర్గాల మధ్య ఘర్షణలు మరో అంకానికి చేరాయి. కోర్టు రద్దు చేసిన పార్లమెంటును పునరుద్ధరిస్తూ అధ్యక్షుడు ముర్సి జారీ చేసిన డిక్రీ ని కోర్టు కొట్టివేసిందని బి.బి.సి తెలిపింది. ముప్ఫై యేళ్ళుగా ఈజిప్టును తన కబంధ హస్తాల్లో బంధించిన మిలట్రీ నియంతృత్వ పాలకుల ప్రయోజనాలకు ప్రతినిధిగా భావిస్తున్న ‘సుప్రీం కాన్సిటిట్యూషనల్ కోర్టు’ పార్లమెంటును రద్దు చేసిన విషయం తెలిసిందే. ప్రజా తిరుగుబాటు ఫలితంగా జరిగిన ఎన్నికల్లో నెగ్గిన పార్లమెంటుకు మిలట్రీ పాలకుల…

సిరియా విషయంలో అమెరికా హెచ్చరికను తిరస్కరించిన చైనా

సిరియా విషయంలో రష్యా, చైనా లు తగిన మూల్యం చెల్లించక తప్పదన్న అమెరికా హెచ్చరికను చైనా తిరస్కరించింది. అమెరికా విదేశాంగ మంత్రి హిల్లరీ క్లింటన్ విమర్శ తమకు ఆమోదయోగ్యం కాదని చైనా విదేశీ మంత్రిత్వ శాఖ ప్రతినిధి లియు వీమిన్ శనివారం ప్రకటించాడు. “సిరియా సమస్యల పరిష్కారాన్ని తాము అడ్డుకోవడం లేదని” లియు విలేఖరుల సమావేశంలో అన్నాడని ప్రెస్ టి.వి తెలిపింది. జులై 6 తేదీన పారిస్ లో జరిగిన ‘ఫ్రెండ్స్ ఆఫ్ రష్యా’ దేశాల సమావేశాల…

పశ్చిమ ఆంక్షలకు ఇరాన్ ప్రతిఘటన, ‘హోర్ముజ్’ లో ఆయిల్ రవాణా నిలిపివేతకు చర్యలు

అమెరికా, యూరోపియన్ యూనియన్ లు ఇరాన్ పై విధించిన ఆయిల్ ఆంక్షలు జులై 3 నుండి అమలులోకి రావడంతో ఇరాన్ ప్రతిఘటన చర్యలను ప్రారంభించింది. ప్రపంచంలోని ఆయిల్ రవాణాలో 20 శాతం రవాణా అయ్యే ‘హోర్ముజ్ ద్వీపకల్పం’ వద్ద పశ్చిమ దేశాల అంతర్జాతీయ ఆయిల్ రవాణా ట్యాంకర్లు వెళ్లకుండా నిరోధించడానికి చర్యలు చేపట్టింది. ఆయిల్ ట్యాంకర్లను అడ్డుకోవడానికి వీలుగా ఇరాన్ పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టారు. దీనితో ప్రపంచవ్యాపితంగా క్రూడాయిల్ ధరలు మళ్ళీ కొండెక్కనున్నాయని విశ్లేషణలు ఊపందుకున్నాయి. ఇరాన్…

టర్కీ విమానం కూల్చింది సిరియాలోనే, అందుకు రుజువులున్నాయ్ -రష్యా

టర్కీ గూఢచార విమానాన్ని కూల్చింది సిరియా గగనతలంలోనేననీ అందుకు తమ వద్ద ‘తటస్ధ రుజువు’ (ఆబ్జెక్టివ్ ప్రూఫ్) ఉందనీ రష్యా మిలిటరీ వర్గాలు ప్రకటించాయి. అంతర్జాతీయ గగన తలంలో ఉండగా తమ విమానాన్ని సిరియా కూల్చివేసిందని టర్కీ ఆరోపిస్తోంది. టర్కీకి యుద్ధ విమానం ఎఫ్-4 పయనించిన మార్గానికి సంబంధించిన వస్తుగత సమాచారం (ఆబ్జెక్టివ్ డేటా) రష్యా ఆధీనంలో ఉన్నట్లు ‘ఇంటర్ ఫాక్స్ న్యూస్ ఏజన్సీ’ ని ఉటంకిస్తూ ‘ది హిందూ’ తెలిపింది. టర్కీ విమానం కూల్చివేతను అడ్డు…

ఆయిల్ రాజకీయాల ఫలితం, ముంబై దాడుల అనుమానితుడి అరెస్టు

26/11 ముంబై టెర్రరిస్టు దాడులకు బాధ్యులుగా భావిస్తున్నవారిలో ముఖ్యమైన అనుమానితుడు జబీయుద్దీన్ అన్సారీ ని భారత ప్రభుత్వం అరెస్టు చేసింది. అన్సారీ మహారాష్ట్ర వాసి అయినప్పటికీ టెర్రరిస్టు దాడులు జరుగుతుండగా పాకిస్ధాన్ లో ఉన్న కంట్రోల్ రూమ్ నుండి ఆదేశాలిచ్చిన వారిలో ఉన్నాడని భారత ప్రభుత్వం భావిస్తోంది. సౌదీ అరేబియా నుండి విమానంలో దిగిన అన్సారీని ఢిల్లీ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. సౌదీ అరేబియాతో నెలల తరబడి సాగించిన దౌత్యం ఫలితంగా అన్సారీ అరెస్టు సాధ్యం…

టర్కీ విమానం కూల్చివేత పై నాటో సమావేశం

సిరియా గగనతలంలోకి చొరబడిన టర్కీ విమానాన్ని సిరియా కూల్చివేయడం పై నాటో దేశాలు సమావేశం కానున్నాయి. టర్కీ, నాటో (నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్) సభ్య దేశం. నాటో సంస్ధ ఆర్టికల్ 4 ప్రకారం సంస్ధ సభ్య దేశం తమ ప్రాదేశిక సమగ్రత, రాజకీయ స్వతంత్రత ప్రమాదంలో పడిందని భావించినపుడు నాటో దేశాల సమావేశం కోసం విజ్ఞప్తి చేయవచ్చు. దాని ప్రకారమే నాటో సమావేశం ఏర్పాటు చేయాలని టర్కీ కోరిందని నాటో ప్రతినిధి ఒనా లుంగెస్క్యూ ని…

సిరియా గగనతలంలో చొరబడిన టర్కిష్ విమానం కూల్చివేత

తమ దేశ గగనతలంలోకి చొచ్చుకు వచ్చిన టర్కీ యుద్ధ విమానాన్ని కూల్చివేశామని సిరియా శుక్రవారం పొద్దు పోయాక ప్రకటించింది. ప్రతిగా ‘అవసరమైన చర్యలను నిశ్చయాత్మకంగా తీసుకుంటాం” అని టర్కీ ప్రకటించింది. ఇరు దేశాల ప్రకటనలతో మధ్య ప్రాచ్యంలో ఉద్రిక్త పరిస్ధితులు తలెత్తాయి. ఉద్రిక్తతను ఇంకా పొడిగించడానికి సిరియా మరింత ప్రయత్నం చేయబోదని విశ్లేషకులు భావిస్తున్నప్పటికీ సిరియాలో ‘కిరాయి తిరుగుబాటు’ కు సాయం చేయడానికి టర్కీ లో గూఢచార బలగాలతో తిష్ట వేసిన అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్ లు…

ఫ్లేమ్: సైబర్ హై వే పై బట్టలిప్పి గెంతుతున్న అమెరికా -3

ఇరానియన్ అణు శుద్ధి కేంద్రం ‘నటాంజ్’ లో స్టక్స్ నెట్ వైరస్ సృష్టించిన విధ్వంసం వెల్లడయిన రెండేళ్ల తర్వాత ‘ఫ్లేమ్’ అనే మరో వైరస్ గురించి కంప్యూటర్ నిపుణులు బయటపెట్టారు. ప్రధానంగా ఇరాన్ పై ప్రయోగించబడిన ఫ్లేమ్ ఫైరస్ ఇజ్రాయెల్ తో పాటు, మధ్య ప్రాచ్యంలోని ఇరాక్, సౌదీ అరేబియా, ఇంకా మరికొన్ని చోట్ల కూడా కనుగొన్నామని నెల క్రితం వారు తెలిపారు. ఫ్లేమ్ ఫైరస్ కూ స్టక్స్ నెట్ వైరస్ కూ అనేక పోలికలు ఉన్నాయనీ…

ప్రజా తిరుగుబాటును అపహాస్యం చేస్తూ మళ్ళీ అధికారాలు లాక్కున్న ఈజిప్టు మిలట్రీ

ఈజిప్టు ప్రజలు ఎన్నుకున్న పార్లమెంటు రద్దు, అధ్యక్షుడి అధికారాలకు కత్తెర, సర్వాధికారాలను తిరిగి చేజిక్కించుకోవడం మొదలయిన చర్యల ద్వారా ఈజిప్టు మిలట్రీ దేశ ప్రజల రక్తతర్పణకు విలువ లేకుండా చేసింది. మధ్య ప్రాచ్యంలో అంతర్జాతీయ బలా బలాలపై గణనీయమైన ప్రభావం పడనున్న అధ్యక్ష ఎన్నికల ఫలితాలు వెల్లడి కాకముందే ఈజిప్టు ప్రభుత్వంలోని సర్వాధికారాలనూ మిలట్రీ తిరిగి చేజిక్కించుకుని ఎన్నికలు నామమాత్రమేనని నిరూపించింది. మాజీ నియంత హోస్నీ ముబారక్ ను గద్దె దించి ప్రజాస్వామిక గాలులను రుచి చూద్దామని…

తమ సిరియా దుష్ప్రచారానికి తామే బలైన బ్రిటన్ విలేఖరులు

సిరియా ‘కిరాయి తిరుగుబాటు’ పై వివాదాస్పద రీతిలో ఏకపక్షంగా వార్తలు ప్రచురిస్తున్న పశ్చిమ దేశాల విలేఖరులకు కాస్తలో చావు తప్పింది. దుష్ట బుద్ధితో తాము రాస్తున్న అవాస్తవ వార్తలకు సరిగ్గా వ్యతిరేక అనుభవం ఎదురై ‘చావు తప్పి కన్ను లొట్టబోయినట్లు’ బైటపడ్డారు. తమ చావు ద్వారా అంతర్జాతీయంగా జరుగుతున్న దుష్ప్రచారంలో అదనపు పాయింట్లు కొట్టేద్దామనుకున్న కిరాయి తిరుగుబాటుదారుల అసలు స్వరూపం వెల్లడి చేయక తప్పని పరిస్ధితి చానెల్ 4 చీఫ్ కరెస్పాండెంట్ ‘అలెక్స్ ధాంసన్ ఎదుర్కొన్నాడు. కిరాయి…

సిరియాలో జరుగుతున్నదీ, పత్రికల్లో వస్తున్నదీ ఒకటి కాదు -అన్హర్ కొచ్నెవా

సిరియా లో బషర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు పెద్ద ఎత్తున తిరుగుబాటు చేస్తున్నారనీ, ప్రభుత్వం వారినీ అత్యంత క్రూరంగా చంపుతోందనీ, అణచివేస్తోందనీ పశ్చిమ దేశాల పత్రికలు ప్రచారం చేస్తున్నాయి. నిత్యం అక్కడ హత్యాకాండలు జరుగుతున్నాయనీ ప్రభుత్వ సైనికులు, ప్రభుత్వ మద్దతుదారులయిన మిలిషియా లు అత్యంత క్రూరంగా ప్రజలను చంపుతున్నాయనీ వార్తలు ప్రచురిస్తున్నాయి. ఈ మధ్యనే ‘హౌలా హత్యాకాండ’ అంటూ అమెరికా, ఫ్రాన్సు, బ్రిటన్ లతో పాటు ఇతర పశ్చిమ దేశాలు కాకి గోల చేస్తూ సిరియా పై…

ఆఫ్-పాక్ యుద్ధ కల్లోలం -ఫొటోలు

యుద్ధాలు జన జీవనంలో మిగిల్చే భీభత్సం అంతా ఇంతా కాదు. లక్షల మందిని విగత జీవుల్ని చేసే యుద్ధాలు మరిన్ని లక్షల మందిని అవయవాలు లేని జీవచ్చవాలుగా మారుస్తాయి. ఇంకా అనేక రెట్ల మంది జీవితాల్లో తీరని విషాధాలు మిగిల్చి తరాల తరబడి ప్రభావాన్ని కలుగు జేస్తాయి. యుద్ధాల వల్ల బాగు పడేది పెట్టుబడిదారీ కంపెనీలు, ఆ కంపెనీల దగ్గర కమీషన్లు మెక్కే రాజకీయ నాయకులు, అధికారులే. ప్రజలు మాత్రం ధన, మాన, ప్రాణాలను కోల్పోయి చెట్టుకొకరు,…

భారత ప్రజల ఆయిల్ ప్రయోజనాలు దెబ్బ తీయనున్న క్లింటన్ పర్యటన

ఆది, సోమ వారాల్లో ఇండియా పర్యటించనున్న అమెరికా విదేశీ మంత్రి హిల్లరీ క్లింటన్ భారత ప్రజల ఇంధన ప్రయోజనాలను గట్టి దెబ్బ తీయనుంది. తన పర్యటన సందర్భంగా ఇరాన్ నుండి ఆయిల్ దిగుమతులు మరింత తగ్గించుకోవాలని హిల్లరీ భారత ప్రభుత్వంపై ఒత్తిడి చేయనుందని క్లింటన్ సహాయకులు చెప్పారు. అమెరికా ఒత్తిడితో ఇరాన్ గ్యాస్ పైప్ లైన్ ఒప్పందాన్ని రద్దు చేస్తుకున్న భారత ప్రభుత్వం అమెరికా మంత్రి ఒత్తిడికి లోగిపోదన్న గ్యారంటీ లేదు. ప్రపంచ ఆయిల్ ధరలతో పోలిస్తే…

టెర్రరిస్టులకు ఐక్యరాజ్యసమితి మద్దతు? -సిరియా ప్రభుత్వం

ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ‘బాన్-కి-మూన్’ సిరియాలో విధ్వంసం సృష్టిస్తున్న టెర్రరిస్టులకు మద్దతు ఇచ్చేలా ప్రకటనలు జారీ చేయడం పట్ల సిరియా పత్రికలు ఆయనపై దుమ్మెత్తి పోస్తున్నాయని ‘అసోసియేటెడ్ ప్రెస్’ ని ఉటంకిస్తూ ‘ది హిందూ’ తెలిపింది. సమితి అధిపతి తన విమర్శలను పూర్తిగా సిరియా ప్రభుత్వంపైనే కేంద్రీకరించడం ద్వారా టెరరిస్టుల హింసను ప్రోత్సహిస్తున్నాడని సిరియా పత్రికలు విమర్శలు ఎక్కుపెట్టాయి. మానవ బాంబులను ప్రయోగిస్తూ వేలమంది ప్రజలను బలి గొంటున్న టెర్రరిస్టు చర్యలను ఖండిస్తూ అంతర్జాతీయ సంస్ధలు…