హ్యాపీ పాకిస్తాన్ నేషనల్ డే! -మోడి గ్రీటింగ్స్

“భారత్ మాతా కీ జై’ అనని వారు పాకిస్తాన్ వెళ్లిపోవచ్చు” బి‌జే‌పితో పాటు ఇతర హిందూత్వ సంస్ధల నేతలకు ఈ చాలా ఇష్టమైన డైలాగ్. ఈ డైలాగ్ చెబితే చాలు వారు అరివీర దేశభక్తులుగా రిజిస్టర్ అయిపోయినట్లే అని వారి ప్రగాఢ నమ్మకం. పాకిస్తాన్ మన పొరుగు దేశం అనీ, అనేక వేల సంవత్సరాలుగా ఇరు దేశాల ప్రజలు కలిసి మెలిసి నివసించారని వాళ్ళు ఇట్టే మర్చిపోతుంటారు. ప్రాచీన భారత నాగరికతగా చెప్పుకుని మురిసిపోయే హరప్పా, మొహంజొదారో…

పిల్లలు ‘మానవ స్వరూపులు!’ -ఫోటోలు

“పిల్లలు దైవ స్వరూపులు” అని పెద్దరికం నెత్తిన వేసుకున్న పెద్దలు అంటుంటే మనం వింటుంటాం. దైవానికి లక్షోప లక్షల రూపాలు ఇచ్చుకున్న మనుషులు అందులో ఏ రూపాన్ని తమ తమ పిల్లలకు ఇచ్చుకుంటారో ఊహించడం కష్టం. ‘అసలు దైవానికి రూపం ఏమిటి? అదొక భావన’ అనేవాళ్లూ ఉన్నారు. వారు కూడా ‘పిల్లలు-దేవుళ్ళ’ సామెతను వల్లించడం కద్దు. వారి ఉద్దేశ్యంలోనేమో పిల్లలు రూపరహితులు అన్న పెడార్ధం వచ్చే ప్రమాదం ఉన్నది. ఇలా ఏ విధంగా చూసినా ‘పిల్లలు దైవ…

భగత్ సింగ్ వీర మరణాన్ని అవమానించిన రైల్వే మంత్రి

తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన దినేష్ త్రివేది గురువారం రైల్వే బడ్జెట్ ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఛార్జీలు పెంచి రు. 36,200 కోట్లు అదనంగా ఈ సంవత్సరం ఆదాయం పెంచబోతున్నట్లు ఆయన ప్రకటించాడు. అంత పెద్ద మొత్తం లో ఛార్జీలు వడ్డించి కూడా తాను చాలా తక్కువ పెంచానని ప్రకటించాడు. పైగా సామాన్య మానవుడిని దృష్టిలో పెట్టుకుని ఛార్జీలు పెంచానని చెప్పడానికి కూడా సాహసించాడు. ఛార్జీలు పెంచి ఐ.సి.యు లో ఉన్న రైల్వేలను బైటికి తెచ్చానని గొప్పలు…