కన్హయ్యతో మమతను పెళ్లగించగలరా? -కార్టూన్

“కన్హైయా కుమార్ ఎన్నికల ప్రచారంలో సి‌పి‌ఐ, సి‌పి‌ఎం పార్టీల తరపున పాల్గొంటారు” అని ఇరు పార్టీలు పుత్రోత్సాహంతో ప్రకటించేశాయి. తద్వారా జే‌ఎన్‌యూ విద్యార్ధుల పోరాటాన్ని తీసుకెళ్లి పార్లమెంటు/అసెంబ్లీ ఎన్నికల రొంపిలోకి దింపి స్వప్రయోజనాలకు వినియోగించడానికి ఆ పార్టీలు తలపెట్టాయి. సి‌పి‌ఎం నేత సీతారాం యేచూరి, సి‌పి‌ఐ నేత డి రాజాలు ఇద్దరూ ఈ మేరకు టి‌వి ఛానెళ్లలో కనపడి ప్రకటన చేశారు. కన్హైయా బెయిల్ పై విధించబడ్డ షరతుల రీత్యా ఆయన కేరళ, బెంగాల్ కు ప్రయాణించబోరని…

పశ్చిమ బెంగాల్‌లో వామపక్షాల భారీ ఓటమి

1977 నుండి పశ్చిమ బెంగాల్ రాష్ట్రాన్ని అప్రతిహతంగా ఏలుతూ వచ్చిన వామపక్ష కూటమి ఎల్.డి.ఎఫ్ 2011 ఎన్నికల్లో ఘోరంగా పరాజయం పాలయ్యింది. కేరళలో మాత్రం కొద్దిలో అధికారానికి దూరమయ్యింది. ముఠా తగాదాలను అధిగమించినట్లయితే కేరళలో అధికారం నిలిచేదని పత్రికలు వ్యాఖ్యానిస్తున్నాయి. సి.పి.ఐ, సి.పి.ఎం పార్టీలు పార్లమెంటరీ రాజకీయాలు చేపట్టడంతోటే కమ్యూనిస్టు సిద్ధాంతాలనుండి వైదొలిగాయని భారత దేశంలోని మార్క్సిస్టు, లెనినిస్టు పార్టీలు ఎప్పటినుండో వాదిస్తూ వచ్చాయి. 1968 లో సి.పి.ఎం పార్టీ నయా రివిజనిజాన్ని చేపట్టిందని నిర్ణయించుకున్న అనేక…

సెజ్ లపై త్రిణమూల్ కాంగ్రెస్ అతి తెలివితేటలు

సెజ్ (ఎస్.ఇ.జెడ్ – స్పెషల్ ఎకనమిక్ జోన్) ల ఏర్పాటుపై రైల్వే మంత్రి మమత నాయకత్వంలోని త్రిణమూల్ కాంగ్రెస్ అతి తెలివితేటలు ప్రదర్శిస్తోంది. పశ్చిమ బెంగాల్ లో అసెంబ్లీ ఎన్నికలు ఏప్రిల్ 18 నుండి మే 10 వరకు ఐదు విడతల్లో జరగనున్న సంగతి విదితమే. ఎన్నికల కోసం మమత పార్టీ బెంగాలీ, ఇంగ్లీషు భాషల్లొ మేనిఫెస్టో (ఎన్నికల ప్రణాళిక) విడుదల చేసింది. రెండూ ఒకే విధంగా ఉంటాయని అందరూ భావిస్తారు. కానీ వాస్తవం అందుకు విరుద్ధంగా…