ఆరోసారి ముఖ్యమంత్రి పీఠంపై అవకాశవాద నితీష్

జనతాదళ్ (యునైటెడ్) పార్టీ నేత నితీష్ కుమార్ బీహార్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఆరవ సారి పదవీ స్వీకార ప్రమాణం చేశాడు. రాజకీయ నీతికి అసలు సిసలు చిరునామాగా చెప్పుకునే ఈ పెద్ద మనిషి తాను “ఛీ, ఫో” అని తిట్టిపోసిన మోడి నేతృత్వ బి‌జే‌పితోనే మళ్ళీ జట్టు కట్టి ముఖ్యమంత్రి పీఠాన్ని చేపట్టాడు. పక్కా పదవీ వ్యామోహాన్ని బాధ్యత నిర్వహణగా చెప్పుకుంటూ, పచ్చి రాజకీయ అవినీతికి నీతి రంగు పులుముతూ రాజకీయ భ్రష్టత్వంలో తాను ఎంత మాత్రం…

ఢిల్లీ ఆటో ఎక్స్ పో -కార్టూన్

ప్రస్తుతం జరుగుతున్న వివిధ అధికారిక, అనధికారిక కార్యక్రమాలను రాజకీయ పార్టీల కార్యకలాపాలతో, పార్టీల నాయకుల ధోరణులతోనూ, వారి ప్రకటనల తోనూ పోల్చి సున్నితమైన రాజకీయ వ్యంగ్యం పండించడం కార్టూనిస్టులకు ఇష్టమైన ప్రక్రియ.  ఈ ప్రక్రియ ద్వారా ఆయా నాయకుల, పార్టీల వ్యవహార శైలి గురించి తేలికగా అర్ధం చేసుకునే అవకాశం పాఠకులకు, లభిస్తుంది. ఒక్క చూపులో బోలెడు అర్ధాన్ని ఈ కార్టూన్ ల ద్వారా గ్రహించవచ్చు. ఢిల్లీలో నొయిడాలో ఆటో ఎక్స్ పో – 2016 ప్రదర్శన…

నితీష్ పునరాగమనం -ది హిందు ఎడిటోరియల్

బీహార్ ముఖ్యమంత్రిగా జనతా దళ్ (యునైటెడ్) నేత నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం చేయడంతో రాష్ట్రంలో రాజకీయ అనిశ్చితిలోని ఒక దశ ముగిసింది. అయితే, ఆయన పునరాగమనంతో అక్టోబర్ లోపు జరగనున్న రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపధ్యంలో మరో రాజకీయ పునరేకీకరణ దశ ఆరంభం అవుతుంది. ఇప్పటివరకు మనం చూసిన, జితన్ రామ్ మంఝి రాజీనామాకు దారి తీసిన… పరిణామాల కంటే మరింత తీవ్రమైన స్ధాయిలో రాజకీయ కవ్వం చిలకబడే అవకాశం కనిపిస్తోంది. 2010 ఎన్నికల్లో ప్రజల…

నితీష్ కొత్త విశ్వాసం ఎక్కడిది? -కార్టూన్

మోడి దెబ్బతో: “నేను ఓటర్ల విశ్వాసం కోల్పోయాను. రాజీనామా చేసేస్తున్నాను” లాలూ తోడు రాగా: “నాకు మళ్ళీ ఓటర్ల విశ్వాసం వచ్చేసింది” ********* లోక్ సభ ఎన్నికల్లో బీహార్ లో ఎలాంటి ప్రభావమూ చూపించలేకపోయిన ఆనాటి ముఖ్యమంత్రి నితీష్ కుమార్ “తాను ఓటరు విశ్వాసం కోల్పోయినందుకు రాజీనామా చేస్తున్నాను” అని ప్రకటించి గద్దె దిగిపోయారు. ఇప్పుడేమో తనకు 130 మంది ఎం.ఎల్.ఏ ల విశ్వాసం ఉన్నది గనుక తనకు మళ్ళీ సి.ఎం కుర్చీ ఇచ్చేయ్యాలని పాట్నా నుండి…

వెచ్చగా ఉంచమంటే మంటలు రగిలించాడు -కార్టూన్

బీహార్ ముఖ్యమంత్రి జితన్ రామ్ మంఝి సంప్రదాయానికి విరుద్ధంగా పోయి గొప్ప చిక్కుల్నే తెచ్చి పెట్టారు. చిక్కులు ఎవరికి అన్నది కొద్ది రోజుల్లో తేలవచ్చు, ఇప్పటివరకు చూస్తే మాజీ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఆ చిక్కులు ఎదుర్కొంటున్నారు. మంఝిని నమ్మి ముఖ్యమంత్రి పీఠం అప్పజెపితే ఆయన మోసం చేశారని నితీష్ ఫిర్యాదు చేయవచ్చు గానీ, నిజానికి సి.ఎం సీటులో కూర్చోబెట్టడానికి గానీ, దిగిపొమ్మనడానికి గానీ ఆయనెవరు? లోక్ సభ ఎన్నికల్లో ఓటమికి బాధ్యత తీసుకుని రాజీనామా చేసిన…

దిష్టి బొమ్మను నిలబెట్టి, దానిపైనే రెట్ట వేస్తూ… -కార్టూన్

‘జనతా పరివార్’ గా చెప్పుకుంటున్న నేతల భాగోతం ఇది! తమను తాము దళితోద్ధారకులుగా చెప్పుకోవడం ఈ నేతలకు ఉన్న అలవాటు. ముస్లిం ఓటు బ్యాంకు కోసం తాము సెక్యులరిస్టులం అని కూడా వీళ్ళు చెప్పుకుంటారు. వాస్తవంలో వీరి ఆచరణ అంతా అందుకు విరుద్ధం. ఎన్నికల్లో బి.జె.పి చేతుల్లో చావు దెబ్బ రుచి చూసిన నితీశ్ కుమార్ పోయిన ప్రతిష్టను తిరిగి పొందడానికి ఒక దిష్టి బొమ్మను వెతుక్కుని ముఖ్యమంత్రి పీఠంపై కూర్చుండ బెట్టారు. ఆయన పేరు జీతన్…

బీహార్: దిష్టి బొమ్మ సి.ఎం మంఝి

లోక్ సభ ఎన్నికల్లో బీహార్ లో దారుణమైన ఫలితాలు ఎదురైనందుకు బాధ్యత వహిస్తూ రాజీనామా చేసిన ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ పదవిలో లేకపోయినా ప్రభుత్వాన్ని నడుపుతూనే ఉన్నారని అప్పటి నుండి వార్తలు వస్తున్నాయి. తాజాగా ముఖ్యమంత్రి జీతన్ రామ్ మంఝి “నేను స్వల్పకాలిక ముఖ్యమంత్రినే” అని ప్రకటించడంతో ఈ వార్తలు నిజమే అని స్పష్టం అవుతోంది. ముఖ్యమంత్రి ఏర్పాటు చేసిన ఓ సమావేశానికి 6గురు కేబినెట్ మంత్రులు హాజరు కాకుండాపోయేంతవరకు బీహార్ పరిస్ధితి దిగజారిందని తెలుస్తోంది. మంఝీ,…

బీహార్ ని ఇంకా వదలని మోడి సుడి -కార్టూన్

ఎన్నికల ఫలితాల ప్రభావం బీహార్ ని ఇంకా వదలడం లేదు. మోడి సృష్టించారని చెబుతున్న సుడిగాలికి లాలూ, కాంగ్రెస్ కూటమితో పాటు అధికార పార్టీ కూడా కుదేలు కావడం ఒక విషయం కాగా ప్రభుత్వంలో పుట్టిన ముసలం మరో సంగతి. ఘోరమైన ఎన్నికల ఓటమికి బాధ్యత వహిస్తూ బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ రాజీనామా చేయడంతో రాజకీయ సంక్షోభం కాస్తా పాలనా సంక్షోభంగా మారిపోయింది. నితీష్ కుమార్ రాజీనామాను బి.జె.పి మిత్రుడు, లోక్ జన శక్తి పార్టీ…

లాలూ కాంగ్రెస్ సీట్ల తూకం -కార్టూన్

బీహార్ లో కొనసాగుతున్న రాజకీయాలు భారత దేశంలోని మురికి రాజకీయాలకు ప్రత్యక్ష సాక్ష్యం. బి.జె.పి మతతత్వ రాజకీయాలను వ్యతిరేకిస్తున్నట్లు చెప్పే రామ్ విలాస్ పాశ్వాన్ మరోసారి ఆ పార్టీతోనే సీట్ల సర్దుబాటుకు సిద్ధపడగా ఘన చరిత్ర కలిగిన జాతీయ పార్టీగా చెప్పుకునే కాంగ్రెస్ కాసిన్ని సీట్ల కోసం అవినీతికి శిక్ష పడిన లాలూతో బేరాలు సాగిస్తోంది. లాలూ-కాంగ్రెస్ కూటమితో జత కలుస్తాడని భావించిన పాశ్వాన్ తగినన్ని సీట్లు దక్కకపోవడంతో ‘మతతత్వ’ కార్డు పక్కకు విసిరేసి ఎక్కువ సీట్లు…

బీహార్: జె.డి(యు)కు కాంగ్రెస్ మొండి చెయ్యి -కార్టూన్

మతోన్మాదం పేరుతో బి.జె.పి తో సంబంధాలు తెంచుకున్న జనతాదళ్ (యునైటెడ్) పార్టీ రెంటికీ చెడ్డ రేవడిగా మిగిలినట్లు కనిపిస్తోంది. బీహార్ లో లాలూ ప్రసాద్ పార్టీ రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్.జె.డి) మరియు పాశ్వాన్ పార్టీ లోక్ జనతాంత్రిక్ పార్టీ (ఎల్.జె.పి) లతో పొత్తు కట్టడానికి కాంగ్రెస్ దాదాపు నిశ్చయం అయిందని పత్రికలు చెబుతున్నాయి. ఇక ప్రకటన చేయడమే మిగిలిందని తెలుస్తోంది. ఇదే నిజమయితే బీహార్ లో జె.డి(యు) ఒంటరిగా మిగిలిపోతుంది. ఏదో ఒక పార్టీతో పొత్తు…

బీహార్: మోడి ర్యాలీ స్ధలిలో బాంబు పేలుళ్లు

పాత మిత్రుడి రాష్ట్రాన్ని పలకరించడానికి వెళ్ళిన నరేంద్ర మోడిని బాంబు పేలుళ్లు ఆహ్వానించాయి. పాట్నాలో మోడి ప్రసంగించవలసిన వేదిక వద్దనే వరుసగా 6 బాంబు పేలడంతో ఐదుగురు చనిపోగా అరవై మందికి పైగా గాయపడ్డారని పత్రికలు చెబుతున్నాయి. పేలుళ్ళ పట్ల మోడి విచారం వ్యక్తం చేయగా ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ తన పర్యటనను రద్దు చేసుకున్నారు. ప్రధాన మంత్రి ఆయనకు ఫోన్ చేసి కేంద్రం అన్ని విధాలా సహకరిస్తుందని హామీ ఇచ్చారు. పాలక జనతా దళ్ (యు)…

విషతుల్యమైన పళ్ళెం -ది హిందు సంపాదకీయం

బీహార్, శరణ్ జిల్లాలో కనీసం 22 మంది బడి పిల్లలకు ప్రాణాంతక పరిణామాలను రుచి చూపించిన రోజువారీ మధ్యాహ్న భోజనం భారత దేశంలోని విస్తార భాగాల్లో పాఠశాల విద్య ఎంతటి తీవ్ర నిర్లక్ష్యానికి గురవుతున్నదో వెల్లడి చేస్తోంది. ప్రభుత్వాలు ఒక పాఠశాల నిర్మాణానికి కాసింత చోటు చూపించలేకపోవడం, ఆహార పదార్ధాలు కలుషితం అయ్యే ప్రమాదానికి లోనుకాకుండా నిలవ చేయలేకపోవడం… ఈ అంశాలు సార్వత్రిక ప్రాధమిక విద్య పట్ల ప్రభుత్వాల నిబద్ధత ఏపాటిదో పట్టిస్తున్నాయి. మౌలిక సౌకర్యాలకు సంబంధించి,…

బీహార్ ఘోరం: మధ్యాహ్న భోజనం తిని 22 విద్యార్ధులు మృతి

మంగళవారం బీహార్ లో ఘోరం జరిగింది. మధ్యాహ్న భోజనం తిని 22 మంది ప్రాధమిక తరగతుల విద్యార్ధులు చనిపోయారు. 50 మందికి పైగా ఆసుపత్రిలో తీవ్ర అశ్వస్ధతలో ఉన్నారు. ఆహారంలో పురుగుల మందు కలవడం వలన విద్యార్ధులు చనిపోయారని ప్రాధమిక పరిశీలన మేరకు అర్ధం అవుతోందని డాక్టర్లు చెబుతున్నారు. ఫోరెన్సిక్ నిపుణుల పరిశీలన అనంతరం పూర్తి వివరాలు తెలుస్తాయి. పాఠశాల ప్రధానోపాధ్యాయని ఇద్దరు పిల్లలు కూడా తీవ్రంగా అశ్వస్ధతకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వంట చేసినవారు…

మోడి వేవ్? అది కార్పొరేట్ సృష్టి! -నితీష్ కుమార్

దేశంలో మోడి వేవ్ అనేదేమీ లేదని అది కార్పొరేట్ కంపెనీలు సృష్టించింది మాత్రమేనని బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తేల్చేశారు. అనేకమంది బి.జె.పి కార్యకర్తలు దేశంలో మోడి వేవ్ ఉందని భావిస్తున్నారనీ, 2014 ఎన్నికల్లో అది ఒక ఊపు ఊపేస్తుందని నమ్ముతున్నారనీ కానీ అది వాస్తవంగా లేదని వారు గ్రహించాలని నితీష్ కోరారు. కార్పొరేట్ కంపెనీలు సృష్టించిన ఈ వేవ్ త్వరలోనే సమసిపోతుందని, అదేమీ మాజిక్కులు చేయబోవడం లేదని ఆయన వ్యాఖ్యానించారు. బీహార్ శాసన సభలో ప్రభుత్వం…

బీహార్ కాంగ్రెస్: కిం కర్వ్తవ్యం? -కార్టూన్

జనతా దళ్ (యునైటెడ్) బీహార్ కాంగ్రెస్ కి పెద్ద చిక్కే తెచ్చిపెట్టినట్లుంది! ఆ పార్టీ మీదా, పార్టీ నాయకుల మీదా కాంగ్రెస్ పార్టీ అధినాయకులు ప్రశంసల జల్లు కురిపిస్తున్నప్పటికీ బీహార్ వరకు చూసుకుంటే ఒక సమస్య కాంగ్రెస్ ముందు నిలబడి ఉంది. ఎన్.డి.ఏ నుండి చీలిన జనతాదళ్ (యు)తో సఖ్యత పెంచుకోవడమా లేక ఎప్పటి నుండో కేంద్ర కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇస్తున్న రాష్ట్రీయ జనతా దళ్ తోనే స్నేహం కొనసాగించడమా? పోనీ రెండింటితో సఖ్యత నెరుపుదామంటే ఒకే…