బతుకులు చిదిమిన ఈ సౌధం, మానవ నిర్మిత విషాదం -ఫోటోలు
బంగ్లాదేశ్ లో అత్యంత శక్తివంతమైన బట్టల తయారీదారులు తమ లాభ దాహంతో 324 మందికి మరణ శాసనం లిఖించారు. గంటల తరబడి నీరు, ఆహారం అందక వేడి వాతావరణంలో డీ హైడ్రేషన్ వల్ల చనిపోయినవారు కొందరైతే, భవనాల గోడల మధ్య, కాంక్రీటు నేలల మధ్య చిక్కుకుని చితికిపోయినవారు మరికొందరు. శిధిలాల చుట్టూ వేలాది జనం తమవారి కోసం విలపిస్తూ అధికారులు గోడలపైన అంటిస్తున్న జాబితాల్లో తమవారి పేర్లు వెతుక్కుంటూ విషాదం అంతా కళ్ళల్లో నింపుకుని కనిపిస్తున్నారు. ఢాకా…