గుజరాత్ లో మత కొట్లాటలు, 140 మంది అరెస్టు -ఫోటోలు

గుజరాత్ లో మరోసారి మత పరమైన అల్లర్లు చెలరేగడంతో ఆందోళన వ్యక్తం అవుతోంది. భారత ప్రధాని నరేంద్ర మోడి పోటీ చేసి, అత్యధిక మెజారిటీతో గెలిచి, అనంతరం వదులుకున్న వదోదర నగరంలో ఈ అల్లర్లు చెలరేగాయి. ‘వసుధైక కుటుంబం’ భారత దేశ సిద్ధాంతం అని న్యూయార్క్, వాషింగ్టన్ డి.సిలలో ప్రధాని చెప్పుకుంటున్న సమయంలోనే ఆయన పోటీ చేసిన వదోదరలో మత కొట్లాటలు చెలరేగడం గమనార్హమైన విషయం. గత గురువారం నుండి వదోదరలో అల్లర్లు జరుగుతున్నాయని తెలుస్తోంది. ఫేస్…

వారి భావజాలంపై పోరాటం కోసమే పోలీసు కేసు –మహిళా నేత సంధ్య

తాడేపల్లి, కృష్ణ మోహన్ తదితరులు వ్యక్తం చేసిన మహిళా వ్యతిరేక భావజాలంపై తాము పోరాటం ఎక్కుపెట్టామని అందుకే పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయించడానికే తాము నిర్ణయం తీసుకున్నామని ప్రగతిశీల మహిళా సంఘం (POW) రాష్ట్ర అధ్యక్షురాలు వి. సంధ్య తెలిపారు. క్షమాపణలతో వదిలెయ్యడమా లేక కేసు పెట్టాలా అన్న విషయాన్ని తాము చర్చించామని, అంతిమంగా కేసు పెట్టడానికే తాము నిర్ణయించుకున్నామని సంధ్య తెలిపారు. కొద్దిసేపటి క్రితం సంధ్య గారిని ఈ బ్లాగర్ సంప్రదించగా ఆమె…

ఫేస్ బుక్ లో ధాకరే బంద్ వ్యతిరేకించిన మహిళల అరెస్టు, ఉగ్రుడయిన జస్టిస్ కట్జు

ధాకరే అంతిమ యాత్ర కూడా ముంబై ప్రజలకు విద్వేషంలోని మరో కోణాన్ని చవి చూపింది. ధాకరే అంతిమయాత్ర కోసం ముంబై బంద్ పాటించడం వ్యతిరేకిస్తూ ఫేస్ బుక్ లో సందేశం ఉంచిన అమ్మాయితో పాటు ఆ సందేశాన్ని లైక్ చేసిన మరో అమ్మాయిని కూడా పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల చర్యపై ప్రెస్ కౌన్సిల్ ఛైర్మన్ జస్టిస్ మార్కండేయ కట్జు ఆగ్రహోదగ్రుడయ్యాడు. అమ్మాయిల అరెస్టుకు పాల్పడిన పోలీసు అధికారులపై క్రిమినల్ కేసు నమోదు చేయాలనీ కోరుతూ ఆయన…