ఇజ్రాయెల్ సందర్శన: మోడి హయాంలో డీ-హైఫనేషన్ -2

ఇండియా-ఇజ్రాయెల్ సంబంధాల చరిత్ర, పరిణామం ఇండియా-ఇజ్రాయెల్ సంబంధాలు ప్రపంచ రాజకీయాలకు అతీతంగా ఎన్నడూ లేవు. ప్రపంచ భౌగోళిక ఆధిపత్య రాజకీయాలతో సంబంధం లేకుండా ఇరు దేశాల సంబంధాల గమనాన్ని అంచనా వేయడానికి పూనుకుంటే అది పాక్షిక పరిశీలనే కాదు; అవాస్తవ పరిశీలన కూడా. భారత పాలకులు స్వతంత్ర పాలకులు కాదు. వారు దళారీ పాలకులు. దళారీ వర్గం చేతుల్లో ఉన్న ఇండియా విదేశీ విధానం అనివార్యంగా అగ్రరాజ్యాల ప్రయోజనాలకు లొంగి ఉంటుంది తప్ప స్వతంత్రంగా ఉండలేదు. కనుక…

ఇజ్రాయెల్ సందర్శన: పి.వి నాటిన విత్తు మోడి చేతిలో పండైంది! -1

భారత ప్రధాని నరేంద్ర మోడి జులై 4, 5, 6 తేదీల్లో ఇజ్రాయెల్ సందర్శించాడు. మోడీ ఇజ్రాయెల్ సందర్శన లోని ప్రధానమైన అంశం ఆయన యూదు రాజ్యం తప్ప మరే ఇతర దేశానికీ వెళ్లకపోవడం. ముఖ్యంగా పాలస్తీనాకు వెళ్లకపోవడం. ప్రపంచంలో ఏ దేశ పాలకుడైనా ఇజ్రాయెల్ వెళితే పాలస్తీనా కూడా వెళ్ళడం ఆనవాయితీ. లేదా పాలస్తీనా సందర్శిస్తే ఇజ్రాయెల్ కూడా వెళ్ళి అక్కడి పాలకులను కూడా కలిసి వెళతారు. భారత దేశం నుండి రాష్ట్రపతి గానీ ప్రధాని…

సమాన దూరం అయింది, ఇజ్రాయెల్ కౌగిలి మిగిలింది

గాజాపై అత్యాధునిక క్షిపణులతో నరహంతక దాడులు చేసి 2016 మందిని ఇజ్రాయెల్ బలి గొన్న రోజుల్లో పాలస్తీనా-ఇజ్రాయెల్ మధ్య సమాన దూరం పాటించడం తమ విధానం అని ప్రకటించి మోడి ప్రభుత్వం తన అంతర్జాతీయ దివాళాకోరుతనం చాటుకుంది. ఇప్పుడు ఏకంగా ఇజ్రాయెల్ పక్షాన చేరిపోయి, అనాదిగా ఆక్రమిత పాలస్తీనాకు ఇస్తున్న మద్దతును ఏకపక్షంగా ఉపసంహరించుకునేందుకు మోడి ప్రభుత్వం ఉవ్విళ్లూరుతోందని పత్రికల వార్తల ద్వారా తెలుస్తోంది. అదే జరిగితే భారత విదేశాంగ విధానాన్ని అత్యంత హీనమైన, ప్రగతి విహీనమైన…

ప్రశ్న: పాలస్తీనా సమస్య గురించి….

పొన్నం శ్రీనివాస్: పాలస్తీనా సమస్య ఉగ్రవాద సమస్యే తప్పా… జాతుల అంతం లాంటి ఆలోచన లేదని ఇజ్రాయెల్‌ సహా పశ్చిమ దేశాలు వాదిస్తున్నాయి. ఇంతకీ ఇజ్రాయెల్‌ ఆవిర్భావం ఎలా జరిగింది. అక్కడున్న వాళ్లంత ఎక్కడికి వలస వెళ్లారు. మళ్లి వాళ్ల స్వస్థలాలకు రావడం సాధ్యమయ్యే పనేనా… సమాధానం: శ్రీనివాస్ గారూ, ఇదే తరహా ప్రశ్నను గతంలో మరో మిత్రుడు అడిగారు. సమాధానం ఇచ్చాను. సమాధానంతో పాటు పాలస్తీనా సమస్యపై రాసిన కొన్ని ఆర్టికల్స్ కు లింక్ లు…

ఇజ్రాయెల్-పాలస్తీనా సమస్య –వీడియో వివరణ

ఇజ్రాయెల్ సాగిస్తున్న అమానుష దాడిలో గాజా రక్తం ఓడడం కొనసాగుతోంది. అంతర్జాతీయ చీత్కరింపులను లెక్క చేయకుండా ఇజ్రాయెల్ ఫైటర్ జెట్లు, ట్యాంకులు, గన్ బోట్లు జనావాసాలపై బాంబులు కురిపిస్తూ పౌరుల ప్రాణాలను బలిగొంటోంది. ఇజ్రాయెల్ ఒక పక్క మానవ హననం సాగిస్తుంటే మరో పక్క అమెరికా, ఐరోపా, ఐరాసలు బూటకపు శాంతి ఉద్భోదలతో పొద్దు పుచ్చుతున్నారు. పాలస్తీనా (దురాక్రమణ) సమస్య ను క్లుప్తంగా వివరించడానికి ఈ వీడియోలో ప్రయత్నం జరిగింది. నా పి.సికి సౌండ్ డివైజ్ పని…

ఇజ్రాయెల్: యూదు రాజ్యంగా చస్తే గుర్తించం -అరబ్ లీగ్

  ఇజ్రాయెల్ దేశాన్ని యూదు రాజ్యంగా గుర్తించాలన్న ఇజ్రాయెల్ డిమాండ్ ని అరబ్ లీగ్ దేశాలు ఖరాఖండీగా నిరాకరించాయి. యూదు రాజ్యంగా గుర్తిస్తే పాలస్తీనా అరబ్ ల పరిస్ధితి ఏమిటని ప్రశ్నించాయి. పాలస్తీనాలో యూదు సెటిల్మెంట్ల నిర్మాణాన్ని ముందు నిలిపేయాలని డిమాండ్ చేశాయి. కువైట్ లో ముగిసిన అరబ్ లీగ్ సమావేశాల అనంతరం అరబ్ లీగ్ ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. పశ్చిమాసియా శాంతి చర్చలు ముందుకు సాగకపోవడానికి ఏకైక కారణం ఇజ్రాయెల్ మాత్రమే అని…

అంతర్జాతీయ చీదరింపులు తోసిరాజని కొనసాగుతున్న ఇజ్రాయెల్ జాత్యహంకారం

“దశాబ్దాల క్రితమే హద్దులు మీరిన ఇజ్రాయెల్ జాత్యహంకారం అంతర్జాతీయ సహనాన్ని పరీక్షించడంలో కొత్త రికార్డులు సృష్టిస్తోంది. తన సహన పరిమితులు పెంచుకుంటూ పోవడంలో అంతర్జాతీయ సమాజం కూడా తన రికార్డులు తానే అధిగమిస్తున్నదని చెప్పడంలోనూ ఎటువంటి సందేహం లేదు.” పాలస్తీనాకు ‘పరిశీలక సభ్యేతర దేశం’ హోదాను ఇస్తూ ఐరాస జనరల్ అసెంబ్లీ అత్యధిక మెజారిటీతో తీర్మానం ఆమోదించిన మరుసటి రోజే E-1 ఏరియాలో 3000 ఇళ్లతో కొత్త సెటిల్‌మెంట్ నిర్మిస్తున్నట్లు ఇజ్రాయెల్ ప్రభుత్వం ప్రకటించిన సంగతిని గానీ,…

అమెరికా, ఇజ్రాయెల్ బెదిరింపులను ఓడిస్తూ ఐరాసలో పాలస్తీనా -2

హమాస్ x ఫతా మహమ్మద్ అబ్బాస్ నేతృత్వంలోని ఫతా ‘పాలస్తీనా ఆధారిటీ’ పేరుతో వెస్ట్ బ్యాంక్ ప్రాంతాన్ని పాలిస్తుండగా, నిన్నటివరకూ డమాస్కస్ లోనూ, ఇపుడు దోహా లోనూ ఆశ్రయం పొందుతున్న ఖలేద్ మాషాల్ నేతృత్వంలోని హమాస్ గాజా ను పాలిస్తోంది. అరాఫత్ బతికి ఉన్నంతవరకూ పి.ఎల్.ఓ (పాలస్తీనా లిబరేషన్ ఆర్గనైజేషన్) కింద ఒకే నిర్మాణంలో ఉన్న ఫతా, హమాస్ లు ఆయన మరణానంతర పరిణామాల ఫలితంగా బద్ధ శత్రువులుగా మారిపోయాయి. గాజాలో ప్రజాస్వామ్యబద్ధ ఎన్నికల్లో హమాస్ గెలిచి…

అమెరికా, ఇజ్రాయెల్ బెదిరింపులను చీత్కరిస్తూ పాలస్తీనాకు ఐరాసలో స్ధానం -1

ప్రపంచ పోలీసు అమెరికా, జాత్యహంకార ఇజ్రాయెల్ ల బెదిరింపులను చీత్కరిస్తూ ప్రపంచ దేశాలు ఐక్యరాజ్యసమితిలో చారిత్రాత్మక తీర్పును ప్రకటించాయి. పాలస్తీనా దేశానికి ఐక్యరాజ్యసమితిలో సభ్యేతర పరిశీలక రాజ్యం (non-member observer state) గా గుర్తింపునిస్తూ ఐరాస సాధారణ సభ (General Assembly) భారీ మెజారిటీతో నిర్ణయించింది. ఐరాసకు ఇచ్చే నిధుల్లో భారీ కోత విధిస్తామనీ, పాలస్తీనాకు ఇస్తున్న సహాయాన్ని కూడా ఆపేస్తామనీ అమెరికా అత్యున్నత స్ధాయిలో తీవ్రంగా సాగించిన బెదిరింపులను ప్రపంచ దేశాలు పెడచెవిన పెట్టాయి. ప్రపంచ…

టర్కీ ప్రధాని ‘ఎర్డోగాన్’ ద్విపాత్రాభినయం

టర్కీ ప్రధాని రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ మూడో సారి ప్రధానిగా ఎన్నికయ్యాడు. ఈయన 2003 నుండి ప్రధానిగా అధికారంలో ఉన్నాడు. మూడోసారి కొంత మెజారిటీ తగ్గినా ప్రభుత్వం ఏర్పరచడానికి తగిన మెజారిటీ సంపాదించగలిగాడు. రెండో సారి అధికారానికి వచ్చినప్పటినుండి ఈయన పాలస్తీనా స్వతంత్రానికి మద్దతు తెలుపుతూ, ఇజ్రాయెల్ కి కోపం వచ్చే మాటలు మాట్లాడుతూ పశ్చిమాసియాలో ముస్లింల ప్రయోజనాలు కాపాడే ఛాంపియన్ గా టర్కీని నిలపడానికి బాగా ప్రయత్నిస్తూ వచ్చాడు. పశ్చిమాసియాలో ప్రాంతీయంగా ఇరాన్ తో పోటీపడి…

ఇజ్రాయెల్ దాష్టీకంపై నిరసనలో పాలస్తీనా బాలుడు! -ఎ.ఎఫ్.పి ఫోటో

పాలస్తీనా భూభాగం నుండి, వారి ఇండ్లనుండి పాలస్తీనా కుటుంబాలను తరిమివేసి 63 సంవత్సరాలు పూర్తయ్యాయి. అమెరికా, ఇంగ్లండుల ప్రత్యక్ష చర్యతో, ఇతర యూరప్ దేశాల పరోక్ష మద్దతుతో తమ తమ దేశాల్లో పదుల వందల ఏళ్ళ క్రితం తరలివచ్చి స్ధిరపడిన యూదు జాతి వారిని వదిలించుకోవడానికి పన్నిన చారిత్రక కుట్రే పాలస్తీనా భూభాగంపై ఇజ్రాయెల్ సృష్టి. ఆనాటి జాతి హననంలో లక్షల పాలస్తీనీయులను ఇజ్రాయెల్ సైన్యం వెంటాడి వేటాడింది. తమ ఇళ్ళను వదిలి పక్క దేశాలకు పారిపోయేదాక…

ఇజ్రాయెల్ ఉక్కుపాదాన్ని గేలి చేస్తూ పాలస్తీనీయుల స్వాతంత్ర్య పిపాస -వీడియోలు

అమెరికా, ఇంగ్లండుల అండతో పాలస్తీనా భూభాగాన్ని చెరబట్టిన ఇజ్రాయెల్ ఆక్రమణని నిరసిస్తూ, 63 ఏళ పాశవిక నిర్బంధాన్నీ, పశు ప్రవృత్తితో సమానమైన ‘యూదు జాత్యహంకారాన్ని’ ఎదిరిస్తూ వేల మంది పాలస్తీనీయులు మే 15 తేదీన ఇజ్రాయెల్ లోని జాఫా పట్టణంలో ఉద్రిక్తల నడుమ నక్బా (వినాశన దినం – పాలస్తీనీయుల భూభాగంపై ఇజ్రాయెల్‌ని సృష్టించిన రోజు) ని పాటించారు. రోమాంఛితమైన ఆ ఘటనను చిత్రించినప్పటి వీడియోలే ఇవి. ప్రదర్శనలో పాల్గొన్న ఓ కార్యకర్త ఒమర్ సిక్సిక్ ప్రకటన:…

“వినాశన దినం” (నక్బా) నాడు పాలస్తీనీయులు, ఇజ్రాయెల్ సైనికుల ఘర్షణ -రాయిటర్స్ ఫొటోలు

పాలస్తీనా భూభాగాన్ని అక్రమంగా ఆక్రమించి 1948 మే 15 తేదీన అమెరికా, బ్రిటన్ లు ఇజ్రాయెల్ దేశాన్ని స్దాపించాయి. లక్షలమంది పాలస్తీనీయులను వారి ఇళ్ళనుండి భూములనుండి బలవంతంగా తరిమేసి వివిధ దేశాల్లో ఉన్న ఇజ్రాయెలీయులను పాలస్తీనాకు రప్పించారు. వారికి పాలస్తీనీయుల ఆస్తులు, భూములను కట్టబెట్టారు. అలా తరిమివేయబడ్డ పాలస్తీనీయులు చుట్టుపక్కల ఉన్న సిరియా, లెబనాన్, జోర్డాన్ లలో శరణార్ధులుగా బతుకులు వెళ్ళదీస్తున్నారు. పాలస్తీనా భూభాగం వెస్ట్ బ్యాంక్ ను ఆక్రమించి అక్కడి పాలస్తీనియులను వెళ్ళగొట్టి సెటిల్‌మెంట్లను ఇప్పటికీ…

పాలస్తీనా పౌరులపై ఇజ్రాయెల్ సైన్యం కాల్పులు, పలువురు దుర్మరణం

ఆదివారం పాలస్తీనా పౌరులపై ఇజ్రాయెల్ సైన్యం కాల్పులు జరిపి పలువురిని పొట్టన బెట్టుకుంది. ఇజ్రాయెల్ ఆక్రమించుకున్న పాలస్తీనా భూభాగాలపైకి పాలస్తీనీయులు రావడంతో ఎటువంటి హెచ్చరికలు లేకుండా ఇజ్రాయెల్ సైన్యం, సిరియా, గాజాలతో ఉన్న సరిహద్దులోని గ్రామాల్లో కాల్పులు జరిపింది. కడపటి వార్తల ప్రకారం పన్నెండు మంది చనిపోయారని బిబిసి, రాయిటర్స్ వార్తా సంస్ధలు తెలిపాయి. ఇజ్రాయెల్ యధావిధిగా ఇరాన్‌ని ఆడిపోసుకుంది. ఇరాన్ రెచ్చగొడినందువల్లనే పాలస్తీనియులు తాము ఆక్రమించుకున్న పాలస్తీనా భూభాగాల్లోకి చొచ్చుకు వచ్చారని ఆరోపించింది. పనిలొ పనిగా…

అరబ్ ప్రజా ఉద్యమాలకు బోనస్, పాలస్తీనా వైరివర్గాల మధ్య శాంతి ఒప్పందం

ఈజిప్టు, ట్యునీషియాలలో నియంతలను తరిమికొట్టిన ప్రజా ఉద్యమాలు తమవరకు పూర్తి విజయం సాధించలేక పోయినా, తమ పొరుగు అరబ్బులు పాలస్తీనీయుల మధ్య శుభప్రదమైన శాంతి ఒప్పందం కుదరడానికి దోహదపడ్దాయి. ఇజ్రాయెల్ దురాక్రమణలో ఉన్న పాలస్తీనాకు స్వతంత్రం సాధించడానికి పోరాడుతున్న ఫతా, హమాస్ పార్టీల మధ్య తీవ్ర వైరం నెలకొన్న సంగతి తెలిసిందే. ఈజిప్టులో ఏర్పడిన మద్యంతర ప్రభుత్వం మధ్యవర్తిత్వంతో వైరి పక్షాల మధ్య సంబంధాలు మెరుగుపడే దిశలో ప్రయత్నాలు మొదలయ్యాయి. దానిలో మొదటి అడుగుగా ఇరుపక్షాలూ సహకరించుకోవడానికి…