పశ్చిమ అమెరికా కరువు విభ్రాంత దృశ్యం -ఫోటోలు

అమెరికన్ వాల్ స్ట్రీట్ కంపెనీలు ఎప్పటిలాగానే లాభాలు నమోదు చేస్తున్నాయి. స్టాక్ మార్కెట్లు పైపైకి చూస్తున్నాయి. ఆర్ధిక సంక్షోభం ముగిసిందని ప్రభుత్వాలు తీర్మానిస్తున్నాయి. వడ్డీ రేట్లు పెరుగుతున్నాయి. వృద్ధి రేటు కూడా పెరుగుద్దంటున్నారు. జనం మాత్రం కరువు బారిన పడి విలాపిస్తున్నారు. పశ్చిమ అమెరికా తీర రాష్ట్రాలను ఎన్నడూ ఎరగని కరువు పట్టి పీడిస్తోంది. ఒక్క కాలిఫోర్నియా రాష్ట్రమే కాదు, నెవాడా, ఆరిజోనా, ఉటా తదితర రాష్ట్రాలన్నీ నీటి కోసం అలమటిస్తున్నాయి. ప్రతి యెడూ సాధారణంగా ఈ…

బ్రిటన్ ను మళ్ళీ ఊపేసిన తుఫాను, మరొకటి తయారు -ఫోటోలు

రెండు నెలలుగా ఎడతెరిపి లేని మంచు తుఫానులతో, వర్షాలతో, వరదలతో తడిసి ముద్దయిన ఇంగ్లండ్ ను బుధవారం నుండి శుక్రవారం వరకు మరో తుఫాను ఊపేసింది. 108 కి.మీ వేగంతో వీచిన గాలులకి పశ్చిమ, నైరుతి ఇంగ్లండ్ ప్రాంతాలన్నీ నీట మునిగాయి. కురుస్తున్న వర్షాన్ని ఇముడ్చుకోవడానికి భూగర్భంలో ఇక ఖాళీ లేదనీ వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఫలితంగా అనేక కాలనీలు, నగరాలు, పల్లెలు, రోడ్లు జలమయమై విశాలమైన తటాకాలను తలపిస్తున్నాయి. గత రెండు దశాబ్దాలలోనే అత్యధిక వరదలు…

కేబినెట్ నిర్ణయం దేశానికి, ప్రధాని సంతకం అమెరికాకి

భారత ప్రభుత్వ కేబినెట్ నిర్ణయాన్ని పక్కకు నెట్టి విదేశాలకు మేలు చేసే నిర్ణయాలను అంతర్జాతీయ వేదికలపై ఒప్పుకుని వచ్చే దేశాధినేతలు ఎక్కడయినా ఉంటారా? మనం ఆ అదృష్టం చేసుకున్నాం. గ్లోబల్ వార్మింగ్ కు దారి తీస్తున్న వాయువుల విడుదలను అరికట్టే విషయంలో ‘అంతర్జాతీయ ధరిత్రి వేదిక’లపై అమెరికా, ఐరోపాల పెత్తనాన్ని ఎదుర్కొంటున్నట్లు కనిపించే ప్రధాని మన్మోహన్ తీరా ఆచరణలోకి వచ్చేసరికి అమెరికా ఒత్తిడికి లొంగి దేశ ప్రయోజనాలను గంగలో కలిపే ఒప్పందంపైన సంతకం చేసిన దారుణానికి ఒడిగట్టారు.…

ఉత్తరఖండ్ వరదలు: స్వయంకృత మహా విధ్వంసం -ఫోటోలు

ఉత్తర ఖండ్ రాష్ట్రంలో వారం రోజుల క్రితం ఉన్న పళంగా ఊడిపడిన వరదల్లో మృతుల సంఖ్య రోజు రోజుకీ పెరుగుతోంది. ఇప్పటిదాకా 556 మృత దేశాలను లెక్కించిన అధికారులు వీరి సంఖ్య ఇంకా పెరుగుతుందని చెబుతున్నారు. సైన్యం రంగంలోకి దిగి ఇప్పటివరకు 73,000 మందిని రక్షించినప్పటికీ వివిధ చోట్ల నీటి తటాకాల మధ్య, రోడ్లు కూలిపోయినందు వల్లా ఇంకా 40,000 మంది ఎటువంటి సాయమూ అందక ఇరుక్కొనిపోయి ఉండవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. పర్యావరణ పరంగా అత్యంత…

కూడంకుళం: ప్రజల భద్రతే అంతిమం -సుప్రీం కోర్టు

కూడంకుళం అణు కర్మాగారం (ఫొటో: ది హిందూ) తమిళనాడు కూడంకుళం అణు విద్యుత్ కర్మాగారానికి వ్యతిరేకంగా స్ధానిక ప్రజలు సాగిస్తున్న పోరాటానికి సుప్రీం కోర్టు నుండి ఒకింత మద్దతు లభించీంది. ఇంధనం నింపడంపై స్టే విధించడానికి నిరాకరించినప్పటికీ ప్రాజెక్టు వల్ల ప్రజలకు ఎదురుకానున్న ప్రమాదాన్ని పరిశీలించడానికి అంగీకరించింది. కర్మాగారం చుట్టూ ఉన్న ప్రజల భద్రతే అంతిమమని వ్యాఖ్యానించింది. ఇంధనం నింపినప్పటికీ రెండు నెలల వరకూ కర్మాగారాన్ని ప్రారంభించబోమన్న కేంద్రం హామీపై నమ్మకం ఉంచింది. మద్రాస్ హై కోర్టు…

సిక్కింలో ఋతుపవనాల సొబగులు చూసి తీరాలి -ఫొటోలు

రుతుపవనాలు సిక్కింలోని ప్రకృతికి అద్దిన అందాలను ఈ ఫొటోలు అద్భుతంగా ప్రతిబింబిస్తున్నాయి. అర్జెంటుగా ఈ ఫొటోలు తీసిన గ్యాంగ్ టక్ కి పరిగెత్తుకెళ్ళి అక్కడే ఉండిపోవాలనిపిస్తోంది. ఫొటోగ్రఫీని మనమూ హాబీగా ఎందుకు చేసుకోకూడదు? అని కూడా అనిపిస్తోంది. ఫొటోల్లోని మూడ్ చూస్తే మత్తుగా, మంగుగా, బద్ధకంగా కనిపిస్తున్నప్పటికీ వర్షం కురిసి వెలిసినప్పటి చురుకుదనం ఆ మత్తుని తరిమికొడతానని సవాలు చేస్తున్నట్లుగా ఉంది. విద్యుత్ దీపాల కృత్రిమ వెలుగులకి సహజత్వాన్ని ఇస్తూ, రాత్రి దుప్పటిలోకి కూడా చొరబడి తానున్నానని…

అమెరికా వేడి గాలులకి 42 మంది దుర్మరణం

అమెరికాలో వేడి గాలుల తీవ్రత కొనసాగుతోంది. పర్యావరణంలో మార్పుల ప్రభావంగా నిపుణులు చెబుతున్న ఈ వేడి గాలులు గత కొద్ది రోజులుగా అమెరికా లోని కనీసం డజను రాష్ట్రాలను చుట్టుముట్టాయి. ముఖ్యంగా మిడ్ వెస్ట్ నుండి తూర్పు తీరం వరకూ ఈ వేడి గాలులు వ్యాపించి ఉన్నాయని బి.బి.సి వార్తా సంస్ధ తెలిపింది. పంటలు శుష్కించుకుపోగా, రోడ్లు, రైల్వే లైన్ల రూపు రేఖలు మారిపోయాయని ఆ సంస్ధ తెలిపింది. వందల కొద్దీ ఉష్ణోగ్రతా రికార్డులు బద్దలయ్యాయని తెలిపింది.…

అణు కర్మాగారం తెరవడాన్ని వ్యతిరేకిస్తూ జపనీయుల ప్రదర్శనలు -ఫొటోలు

జపాన్ ప్రభుత్వం అణు కంపెనీల లాబీ తెచ్చిన తీవ్ర ఒత్తిడికి లొంగిపోయింది. రెండు నెలల పాటు అణు విద్యుత్ అనేదే లేకుండా గడిపగలిగినప్పటికీ ప్రజల ప్రయోజనాల కంటె అణు కంపెనీల ప్రయోజనానే ముఖ్యమని భావించింది. ఫుకుయి లో ‘కాన్సాయ్ ఎలక్ట్రిక్ పవర్ కంపెనీ’ కి చెందిన ‘ఒయి న్యూక్లియర్ పవర్ ప్లాంటు’ ను ఆదివారం తిరిగి తెరిచింది. తద్వారా ఫుకుషిమా ప్రమాదం తర్వాత కూడా పాఠాలు నేర్చుకోవడానికి తిరస్కరించింది. సంవత్సర కాలంగా జపాన్ ప్రజల నిరసనలను బేఖాతరు…

ఫుకుషిమా విపత్తు మానవ తప్పిదమే -జపాన్ పార్లమెంటరీ కమిటీ

జపాన్ ప్రభుత్వం, న్యూక్లియర్ కంపెనీ ‘టెప్కో’ లే ఫుకుషిమా అణు ప్రమాదానికి కారకులని జపాన్ పార్లమెంటరీ కమిటీ తేల్చి చెప్పింది. ఫుకుషిమా అణు కర్మాగారం ప్రమాదానికి గురికావదానికి సునామీ ఒక్కటే కారణం కాదనీ అది వాస్తవానికి మానవ నిర్మిత వినాశనమని కమిటీ స్పష్టం చేసింది. జపాన్ పార్లమెంటు ‘డైట్’ (Diet) నియమించిన ‘ఫుకుషిమా న్యూక్లియర్ యాక్సిడెంట్ ఇండిపెండెంట్ ఇన్వెస్టిగేషన్ కమిషన్’, తన అంతిమ నివేదికలో ఈ వాస్తవాన్ని వెల్లడించింది. ఏ ఒక్క వ్యక్తీ దీనికి కారణం కాదనీ,…

తుఫానొస్తే అమెరికాలోనూ రోజులపాటు కరెంటు కష్టాలు తప్పవు

భారత దేశంలో తుఫానొచ్చి గట్టిగా గాలి వీస్తే విద్యుత్ స్తంభాలు, చెట్లు కూలిపోయి రోజుల తరబడి చీకట్లో మగ్గవలసి రావడం పరిపాటి. మనిషి అభివృద్ధి చేసుకున్న ఆధునిక సాధనాలు ప్రకృతిపై మనిషి పై చేయి సాధించేందుకు దోహదం చేశాయి. అయితే ప్రకృతి విలయతాండవానికి తెగిస్తే అమలాపురం అయినా అమెరికా అయినా ఒకటేననీ సాక్షాత్తూ అమెరికా రాజధాని వాషింగ్టన్ తో పాటు ఇంకా అనేక నగరాల కష్టాలే చెబుతున్నాయి. పెను తుఫాను ధాటికి 18 మంది మరణించడమే కాక…

దేశంలో కరువు పరిస్ధితులు, పట్టని ప్రభుత్వాలు

వాతావరణ మార్పులు వ్యవసాయరంగంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని ప్రఖ్యాత వ్యవసాయ శాస్త్రవేత్త, హరిత విప్లవ పితామహుడు స్వామినాధన్ హెచ్చరించాడు. ఈ సంవత్సరం వర్షాభావ పరిస్ధితులు ఏర్పడనున్నట్లు ఇప్పటికే సూచనలు అందుతున్నాయనీ, కానీ ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదనీ విమర్శించారు.  కొద్ది ప్రాంతాల్లో అధిక వర్షాలు, మరి కొన్ని చోట్ల ఎన్నడూ లేనంతగా కరువు ఏర్పడుతుందనీ తెలిపాడు. ముందు జాగ్రత్త చర్యలు తీసుకోకుండా ‘పోస్ట్ మార్టం’ చర్యలకే అలవాటుపడ్డ ప్రభుత్వాలు ధోరణి మార్చుకోవాలని కోరారు. “వ్యవసాయం పై వాతావరణ మార్పుల…

అచంగ గారూ… శాస్త్రీయ ఆధారాలిచ్చాగా, బదులివ్వండి!

– అచంగ గారి సవాలు ‘ఫుకుషిమా రేడియేషన్ అమెరికా, యూరప్ ల వరకూ వ్యాపించలేద’ని. ఆయన తన ఆర్టికల్ లో ఇలా రాశారు. “ఎక్కడా ఫుకుషిమా అణుధార్మికత ఇతరదేశాలకు విస్తరించినట్టు శాస్త్రీయ ఆధారాలు ఇంతవరకూ లేవు” నా ఆర్టికల్ కింద వ్యాఖ్యలో ఇంకా ఇలా అన్నారు. “మీరిచ్చిన ఆధారాల్లో కనీసం ఒక్కటంటే ఒక్క ఆధారం ఇప్పటివరకూ శాస్త్రీయంగా నిరూపించబడలేదని ఢంకా బజాయించి చెప్పగలను.” నిజానికి శాస్త్రీయ ఆధారాలు ఉన్నాయి. కాకపోతే శాస్త్రీయ ఆధారాలను ఉన్నది ఉన్నట్లు చూడకుండా…

పాఠకులను తప్పుదారి పట్టించడం ఎకాలజిస్టు ‘అచంగ’ కు తగని పని

ఏప్రిల్ మొదటివారంలో నేనొక వార్తలో ఫుకుషిమా అణు ప్రమాదం వల్ల వెలువడిన రేడియేషన్ అమెరికా, యూరప్ లకి కూడా వ్యాపించిందని ఒక వాక్యం రాశాను. దానికి అచంగ గారు అభ్యంతరం చెప్పారు. ఫుకుషిమా రేడియేషన్ అమెరికా, యూరప్ లవరకూ వచ్చిందనడానికి ఆధారాలు లేవనీ, ఆధారాలు చూపిస్తే తన అభ్యంతరాన్ని వెనక్కి తీసుకుంటానని రాశారు. తాను వృత్తిరీత్యా ఎకాలజిస్టు కావడమే తన సవాలుకు అర్హత అన్నారు. ఆయన సవాలును పక్కనబెట్టి ఆధారాలు మాత్రం ఇస్తానని చెప్పాను. చెప్పినట్లే ఏప్రిల్…

మంచు ఖండంలో నిత్యాగ్నిహోత్రం ‘మౌంట్ ఎరేబస్’ -ఫొటోలు

క్షణమాత్రంలో ఎర్రని మంటను సైతం శ్వేతశిల గా మార్చగలిగే అంటార్కిటికా వాతావరణంలో నిత్యాగ్నిహోత్రంలా జ్వలించే అగ్నిపర్వతం ‘మౌంట్ ఎరేబస్.’ అంటార్కిటికా లో ‘మౌంట్ సిడ్లే’ తర్వాత ఇదే ఎత్తయినది. శాశ్వత లావా సముద్రం కలిగిన పర్వతంగా ‘మౌంట్ ఎరేబస్’ ప్రాముఖ్యత పొందింది. ‘పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్’ లో భాగమే మౌంట్ ఎరేబస్ అని శాస్త్రవేత్తలు తేల్చారు. ఈ రింగ్ లో ఇంకా 160 చురుకైన అగ్ని పర్వతాలు ఉన్నాయని ‘నేషనల్ జాగ్రఫిక్’ వెబ్ సైట్ తెలిపింది.…

అణు విద్యుత్తుని పక్కకు నెట్టి, సోలార్ విద్యుత్ తో రికార్డులు సృష్టిస్తున్న జర్మనీ

ఆధునిక శాస్త్ర సాంకేతిక ఉత్పత్తులలో పేరెన్నిక గన్న జర్మనీ, దేశానికి అవసరమైన విద్యుత్తులో మూడు వంతులు సూర్య శక్తి నుండే ఉత్పత్తి చేసి రికార్డు సృష్టించింది. మరో పదేళ్ళలో అణు విద్యుత్ ను పూర్తిగా త్యజించడానికి సాహసోపేతమయిన నిర్ణయం తీసుకున్న జర్మనీ, అణు విద్యుత్తు కంటే శుభ్రమైన ఇంధనం లేదన్న కంపెనీల ప్రచారాన్ని తిప్పికొడుతూ సూర్య శక్తి వినియోగంలో ఆదర్శప్రాయమైన కృషి చేస్తోంది. 20 న్యూక్లియర్ పవర్ స్టేషన్ల సామర్ధ్యానికి సమానంగా గంటకు 22 గిగావాట్ల విద్యుత్…