నేపాల్ భూకంపం: ఇండియావైపు కదిలిన ఎవరెస్ట్
ఏప్రిల్ 25, 2015 తేదీన నేపాల్ ప్రజల్ని కొద్ది సెకన్ల కాలంలోనే భారీ వినాశనంలోకి నెట్టివేసిన భూకంపం అత్యంత ఎత్తయిన ఎవరెస్ట్ పర్వతాన్ని కూడా ప్రభావితం చేయకుండా వదల్లేదు. భూకంప లేఖిని (రిక్టర్ స్కేల్) పై 7.9 పరిమాణాన్ని నమోదు చేసిన నేపాల్ భూకంపం వల్ల ప్రపంచంలో అత్యంత ఎత్తయిన ఎవరెస్ట్ పర్వతాన్ని నైరుతి దిశగా, అనగా ఇండియా వైపుకి 3 సెంటీ మీటర్ల మేరకు కదిలిందని చైనా శాస్త్రవేత్తలు వెల్లడి చేశారు. నేపాల్ భూకంపం వల్ల…