ఇండియాలో అసమానతలు: సంపదలన్నీ ఆ ఒక్కరివే -వీడియో

– – ఈ వీడియోను తిరుపాలు గారు వ్యాఖ్య రూపంలో అందజేశారు. కాస్త ఓపిక చేసుకుని పూర్తి వీడియోను కనీసం ఒక్కసారన్నా చూడండి. కళ్ళు బైర్లు కమ్మే వాస్తవాలు తెలుస్తాయి. భారత దేశంలోని పాలకవర్గాల పూర్తి ఆమోదంతో, సామ్రాజ్యవాద విదేశీ యాజమానుల ఒత్తిడితో పి.వి.నరసింహారావు – డా. మన్మోహన్ సింగ్ ల ద్వయం ప్రారంభించిన నూతన ఆర్ధిక విధానాల వల్ల ఉన్నత స్ధాయి సంపన్నులు భారీ లాభం పొందగా కింద ఉన్నవారు బాగా నష్టపోయారని వీడియో ద్వారా…

ఉపఖండంలో ఆల్-ఖైదా, పశ్చిమ జోక్యానికి సూచిక

భారత ఉపఖండంలో ఆల్-ఖైదా విభాగాన్ని స్ధాపించినట్లు ఆల్-ఖైదా నేతగా చెప్పుకునే అయిమన్ ఆల్-జవహరి ప్రకటించాడు. ఈ విభాగం ద్వారా భారత ఉపఖండం అంతటా జీహాద్ విస్తరణకు పాటుపడనున్నట్లు తెలిపాడు. ఆన్-లైన్ లో పోస్ట్ చేసిన ఒక వీడియో ద్వారా ఆల్-జవహరి ‘ఖైదత్ ఆల్-జిహాద్ ఇన్ ద ఇండియన్ సబ్ కాంటినెంట్’ ఏర్పాటు చేసినట్లు తెలిపాడు. ఆఫ్ఘనిస్తాన్, ఇరాక్, సిరియా, సోమాలియా, యెమెన్, మాలి, లిబియా తదితర దేశాల్లో మొదట ఆల్-ఖైదా లేదా మరో పేరుతో టెర్రరిస్టులను ప్రవేశపెట్టడం,…

కఠిన నిర్ణయాలు తప్పవు -మోడి

అనేశారు! ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడి ఆ కాస్త మాటా అనేశారు. ఆర్ధిక వ్యవస్ధను గాడిన పెట్టాలంటే కఠిన చర్యలు తప్పవని ప్రధాని మోడి స్పష్టం చేశారు. మోడీని, బి.జె.పినీ అదే పనిగా పొగుడుకుంటే ఏమీ ఒరగదనీ అసలు పనిలోకి దిగితే కొన్ని సెక్షన్ల ప్రజలకు కష్టం తప్పదని ఆయన ఉన్న మాట చెప్పేశారు. అధికార పీఠాన్ని అధిష్టించి నెల కూడా కాలేదు, అప్పుడే కఠిన చర్యలు అంటున్నారు మోడి. “ఆర్ధిక క్రమశిక్షణ తెచ్చుకోవాలంటే రాబోయే ఒకటి…

యు.పి స్టింగ్: ఎఎపి టికెట్ కి డబ్బు డిమాండ్

ఆమ్ ఆద్మీ పార్టీ తరపున లోక్ సభకు పోటీ చేయడానికి ముందుకు వచ్చిన అభ్యర్ధులనుండి ఆ పార్టీ నాయకులు డబ్బు డిమాండ్ చేసిన సంగతి వెలుగులోకి వచ్చింది. ఒక టి.వి ఛానెల్ స్టింగ్ ఆపరేషన్ ద్వారా ఈ సంగతి వెల్లడి అయిన వెంటనే సదరు నాయకులను పార్టీ నుండి తొలగిస్తున్నట్లు ఎఎపి నేత అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. న్యూ ఢిల్లీ, తిలక్ లేన్ లో ఉన్న తన నివాసం వద్ద విలేఖరుల సమావేశం ఏర్పాటు చేసిన ఎ.కె…

లైసె ఫెయిర్, నూతన ఆర్ధిక విధానాలు, ఆర్ధిక సంక్షోభం -వివరణ

(ఈ పోస్టుతో కొత్త వర్గం -కేటగిరీ- ‘ప్రశ్న-జవాబు’ ప్రారంభిస్తున్నాను. కొన్ని వారాల క్రితం చందుతులసి గారు ఇచ్చిన సలహాను ఈ విధంగా అమలు చేస్తున్నాను. మొట్టమొదటి ప్రశ్న మాత్రం తిరుపాలు గారిది. ఒక టపా కింద వ్యాఖ్యగా ఆయన అడిగిన ప్రశ్న ఇది. నేనిచ్చిన సమాధానాన్ని కొన్ని మార్పులు, చేర్పులు చేసి ప్రచురిస్తున్నాను. ఈ కేటగిరీ కింద సమాధానం నేనే ఇవ్వాలన్న రూలు లేదు. సమాధానం తెలిసిన సందర్శకులు ఎవరైనా ఇవ్వవచ్చు. కానీ ప్రశ్న ఎక్కడ వేయాలి…

ఎక్కడున్నావే గొంగళీ అంటే… -కార్టూన్

అద్భుతమైన కార్టూన్ ఇది! మన్మోహన్ సింగ్ అనుసరించిన నూతన ఆర్ధిక విధానాల డొల్లతనాన్ని ఈ కార్టూన్ శక్తివంతంగా వివరిస్తోంది. డంకేల్ ఒప్పందాన్ని అంగీకరించడం తప్ప మరో దారి లేదని చెప్పి డబ్ల్యూ.టి.ఓ ఉరుగ్వే రౌండ్ చర్చలను భారత దేశ ప్రజల నెత్తిన ‘నూతన ఆర్ధిక విధానాలు’గా రుద్దిన మన్మోహన్ తిరిగి బయలుదేరిన చోటికే చేరడం యాదృచ్ఛికం ఎంతమాత్రం కాదు. ఆ విధానాల తీరే అంత. ఏ విధానాలైనా ప్రజల కొనుగోలు శక్తిని స్ధిరంగా పెంచగలిగితేనే కంపెనీలకి లాభాలూ,…

కంపెనీలకు బ్యాంకులు, జనానికి చిల్ల పెంకులు

ప్రజల కష్టార్జితాన్ని కార్పొరేట్ కంపెనీల స్పెక్యులేటివ్ ఆటలకు అప్పజెప్పడానికి ఆర్.బి.ఐ గేట్లు బార్లా తెరిచింది. ప్రైవేటు రంగంలో కొత్త బ్యాంకులు నెలకొల్పడానికి బడా కార్పొరేట్ కంపెనీలకు అవకాశం ఇవ్వడానికి నిర్ణయించినట్లు శుక్రవారం అంతిమ మార్గదర్శక సూత్రాలను జారీ చేసింది. ఈ సూత్రాల ప్రకారం కార్పొరేట్ కంపెనీలు, ఎన్.బి.ఎఫ్.సి లు (నాన్-బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు), NOHFCలు (Non-Operative Financial Holding Company) ఇకనుండి యథేచ్ఛగా బ్యాంకులు పెట్టుకోవచ్చు. నూతన మార్గదర్శక సూత్రాల ప్రకారం కొత్త బ్యాంకులకు లైసెన్సుల కోసం…

ఈశాన్య వలసలతో మండుతున్న దేశం, పట్టని ప్రభుత్వాలు -విశ్లేషణ

దాదాపు దేశంలోని అన్నీ ప్రాంతాల నుండీ ఈశాన్యీయులు పెద్ద సంఖ్యలో ఇళ్లకు తిరిగి వెళుతున్నా కేంద్ర, రాష్ట్రాల ప్రభుత్వాల నుండి చర్యలు కరువయ్యాయి. ‘మీకేం భయం లేదు, ఉన్న చోటనే ఉండండి’ అంటూ ప్రభుత్వాలు ఇస్తున్న నోటి మాటల వాగ్దానాలు వారిలో ధైర్య, స్ధైర్యాలను నింపలేకపోతున్నాయి. అక్కడక్కడా పారామిలిటరీ బలగాల చేత ఒకటి రెండు సార్లు కవాతు చేయించినా, రాష్ట్రాల  హోమ్ మంత్రులు పత్రికల్లో, చానెళ్లలో కనబడి హామీలు గుప్పిస్తున్నా ఈశాన్య రాష్ట్రాల ప్రజలు తమ తమ…

విధాన నిర్ణయాలు మా సార్వభౌమ హక్కు, ఒబామాకు ఇండియా సమాధానం

రిటైల్ అమ్మకాలు లాంటి రంగాల్లో విదేశీ పెట్టుబడులకు భారత దేశం అడ్డుపడుతోందన్న ఒబామా ఆరోపణను భారత ప్రభుత్వం తిరస్కరించింది. ఆరోపణలు చేసే బదులు ‘ప్రొటెక్షనిజం’ ను అరికట్టడంలో ఒబామా తన నాయకత్వ ప్రతిభ కనబరచాలని కోరింది. భారత దేశంలో విదేశీ రిటైల్ పెట్టుబడులు వాస్తవంగా పెరుగుతున్నాయనీ రిటైల్ పెట్టుబడులకు ఇండియాలో ఆటంకాలు లేవనడానికి అదే సాక్ష్యమని భారత వాణిజ్య మంత్రి ఆనంద్ శర్మ వివరించాడు. సంస్కరణలు అమలు చేయడంలో, సరళీకరణ విధానాలు చేపట్టడంలో ఇండియా వాస్తవానికి వేగంగా…

నూతన ఆర్ధిక విధానాలపై పోరాడని అవినీతి వ్యతిరేక పోరాటాలు వృధా

(గతంలో రెండు భాగాలుగా ఈ వ్యాసం రాయబడింది. ఆ వ్యాసంలో అనవసరమైన భాగాలు తొలగించి, మరిన్ని వివరాలు జోడించి, మరింత పరిపూర్ణత కావించి తిరిగి ప్రచురించడం జరుగుతోంది) అన్నా హజారే భారత దేశంలో రాజకీయ నాయకులు, బ్యూరోక్రసీ అధికారులఅవినీతికి వ్యతిరేకంగా గత సంవత్సర కాలంగా పోరాడుతున్నాడని పత్రికలు కోడై కూస్తునాయి. ఈ మధ్య కాలంలో ఈ కూతల సంఖ్య తగ్గినా అన్నా హజారే కి అవినీతి వ్యతిరేక పోరాట యోధుడు బిరుదు ఇవ్వడం మానలేదు. పఠిష్టమైన లోక్…

ఎస్ & పి, అమెరికా క్రెడిట్ రేటింగ్‌ తగ్గింపు, తెలుసుకోదగిన కొన్ని అంశాలు -2

స్పెక్యులేటివ్ షేర్లను ఆధారం చేసుకుని అనేక షేర్ల కుంభకోణాలు జరిగాయి. భారత దేశంలో హర్షద్ మెహతా కుంభకోణం అతి పెద్దది. తర్వాత కేతన్ పరేఖ్ కుంభకోణం, ఆ తర్వాతా, ముందూ కూడా చిన్నా పెద్దా కుంభకోణాలు జరిగాయి. కొన్ని పత్రికలకెక్కితే, మరి కొన్నింటిని తొక్కిపెట్టారు. అమెరికా, యూరప్ లలో 2007-2009 కాలంలో మొదలైన ప్రపంచ ఆర్ధిక సంక్షోభమే ఒక పెద్ద కుంభకోణం. అనేక వందల స్పెక్యులేటివ్ కుంభకోణాల ఫలితమే “ప్రపంచ ఆర్ధిక సంక్షోభం” అనే బడా బడా…

ఎస్ & పి, అమెరికా క్రెడిట్ రేటింగ్‌ తగ్గింపు, తెలుసుకోదగిన కొన్ని అంశాలు -1

ఎస్ & పి రేటింగ్ సంస్ధ అమెరికా క్రెడిట్ రేటింగ్‌ను ఒక మెట్టు తగ్గించింది. అమెరికా మార్కెట్లనుండి ట్రేజరీ బాండ్ల వేలం ద్వారా అప్పు సేకరించే విషయం తెలిసిందే. ఆ విధంగా అప్పు సేకరించడానికి జారీ చేసే బాండ్ల రేటింగ్‌ను ఎస్ & పి తగ్గించింది. ఇలా అప్పులకి రేటింగ్ ఉండడం ఏంటో చాలా మందికి అర్ధం కాని విషయం. ప్రపంచ ఆర్ధిక సంక్షోభం సంభవించేవరకూ ఈ రేటింగ్‌ల విషయం పెద్దగా ప్రాచుర్యంలోకి రాలేదు. భారత ప్రభుత్వం…

అమెరికా రుణ సంక్షోభం ప్రభావం ఇండియాపై ఎలా ఉంటుంది? -2

(ఒకటవ భాగం తరువాయి) ఇండియాలాగే చైనా కూడా. చైనా, పైకి తన కంపెనీలను ప్రవేటీకరణ చేసినట్లు చూపుతుంది. ప్రభుత్వ రంగ సంస్ధలన్నింటినీ ఈక్విటీ కంపెనీలుగా మారడానికి ఆ దేశం అనుమతించింది. కొన్ని ఈక్విటీలను స్వదేశీ, విదేశీ ప్రవేటు మదుపుదారుల చేతుల్లో పెట్టింది. ఇది పైకి పూర్తిగా ప్రవేటీకరణ జరిగినట్లుగా కనిపించింది. వాస్తవానికి చైనాలొని అన్ని రంగాల కంపెనీల్లో చైనా ప్రభుత్వం కొన్ని వ్యూహాత్మకమైన చర్యలు తీసుకుని ప్రవేటీకరణ కావించిన కంపెనీలపై కూడా తన పట్టు పోకుండా జాగ్రత్త…

అమెరికా రుణ సంక్షోభం ప్రభావం ఇండియాపై ఎలా ఉంటుంది? -1

అమెరికా రుణ పరిమితి పెంపుదల, బడ్జెట్ లోటు తగ్గింపు లపై ఒప్పందం కుదిరి, ఆ మేరకు బిల్లును ప్రతినిధుల సభ, సెనేట్‌లు ఆమోదించాయి. అమెరికా అధ్యక్షుడు ఒబామా కూడా బిల్లుపై సంతకం చేసి చట్టంగా అమెరికా మీదికి, ఇంకా చెప్పాలంటే ప్రపంచం మీదికి వదిలాడు. రుణ పరిమితిని మరో 2.4 ట్రిలియన్ డాలర్లు పెంచడం ద్వారా అమెరికా అప్పులు చెల్లించలేక డిఫాల్ట్ అవుతుందన్న భయం తప్పింది. కొత్త అప్పులు చేసి పాత అప్పుల చెల్లింపులు చేయడానికి అవకాశం…

గ్లోబల్ ఆయిల్ ధరల తగ్గుదల ప్రజలకు అందకుండా అడ్డుపడుతున్న భారత ప్రభుత్వం

భారత ప్రభుత్వం సంవత్సరం క్రితం పెట్రోల్ ధరలను డీకంట్రోల్ చేసింది. అంటే పెట్రోల్ ధరలపై ప్రభుత్వ నియంత్రణను ఎత్తివేసింది. ఫలితంగా గ్లోబల్ మార్కెట్‌లో ఆయిల్ ధరలు పెరిగినప్పుడల్లా పెట్రోల్ ధరలు పెరుగుతున్నాయి. డీకంట్రోల్ చేశాక ఇప్పటివరకు పెట్రోల్ ధర 23 శాతం పెరిగింది. ప్రభుత్వం ఇంతకుముందు సబ్సిడీ రూపంలో ఆయిల్ ధరలో కొంత భారం భరించడం వలన ప్రజలకు ప్రభుత్వం భరించినంతమేరకు తక్కువ ధరకు ప్రజలకు ఆయిల్ లభించేది. నిజానికి పెట్రోల్‌ను దిగుమతి ధరలకే ప్రజలకు ఇచ్చినట్లయితే…