నోట్ల రద్దు: అధమ స్ధాయిలో ఫ్యాక్టరీ, సేవల జీడీపీ

  ప్రధాని నరేంద్ర మోడీ చేపట్టిన డీమానిటైజేషన్ వల్ల ప్రజలు నానా కష్టాలు పడుతుండగా భారత జీడీపీ కూడా అదే పరిస్ధితి ఎదుర్కొంటున్నది. ఆర్ధిక నిపుణులు అంచనా వేసిన దానికంటే ఘోరంగా జీడీపీ వృద్ధి రేటు నమోదయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.  నవంబరు నెలలో భారత సేవల రంగం వృద్ధి చెందటానికి బదులు కుచించుకుపోనున్నదని హఫింగ్టన్ పోస్ట్ నిర్వహించిన సర్వేలో తేలింది. భారత జీడీపీలో అత్యధిక వాటా -60 శాతం వరకు- సేవల రంగానిదే. కనుక మొత్తం జీడీపీ…

RBI వడ్డీ తగ్గింపు -విశ్లేషణ

Originally posted on ద్రవ్య రాజకీయాలు:
రిజర్వ్ బ్యాంకు పాలసీ వడ్డీ రేటు 25 బేసిస్ పాయింట్లు తగ్గించింది. దీనర్ధం వడ్డీ రేటు 0.25% తగ్గుతుంది అని. 6.5% గా ఉన్న రేటు ఇప్పుడు 6.25% అయింది. ఈ కోతతో పారిశ్రామిక వర్గాలు సంతోషం ప్రకటించాయి.  అసలు కోతకు ముందే, కోత కోస్తారని ముందే ఊహిస్తూ  సెన్సెక్స్ సూచి 377 పాయింట్లు పెరిగింది. దానితో అసలు కోత జరిగాక సూచి పెద్దగా పెరగలేదు.  తాజా వడ్డీ కోత వెనుక గమనించవలసిన…

వృద్ధికి, బహుశా ద్రవ్యోల్బణానికీ ప్రేరణ -ద హిందూ ఎడిట్..

[“A fillip to growth, and maybe inflation” శీర్షికన ఈ రోజు ది హిందు ప్రచురించిన సంపాదకీయానికి యధాతధ అనువాదం.] ********* 7వ వేతన కమిషన్ సిఫారసులను అమలు చేయడం ద్వారా కోటికి పైగా ఉద్యోగులు, పింఛనుదారుల వేతనాలు మరియు పింఛన్లు పెంచాలని కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయం వినియోగ డిమాండ్, ఆర్థిక వృద్ధి లకు ఆదరువు కాగలదు. బలిష్టమైన ప్రైవేటు వినియోగమే ప్రస్తుత ఆర్థిక కదలికకు కీలకమైన శక్తిగా పని చేస్తున్నదని ఇటీవల కేంద్ర…

వ్యూహాత్మక నిష్క్రమణ -ద హిందూ ఎడిట్..

[ఈ రోజు -జూన్ 20- ది హిందు ప్రచురించిన ఎడిటోరియల్ “A strategic exit” కు యధాతధ అనువాదం. -విశేఖర్] ********* సెప్టెంబర్ లో తన పదవీకాలం ముగిసిన తర్వాత రెండో సారి పదవికి రేసులో ఉండబోవటం లేదని ప్రకటించటం ద్వారా ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్, అంతకంతకు గుణ విహీనం గా మారుతున్న పరిస్థితుల నుండి మెరుగైన రీతిలో, గౌరవప్రదంగా బైటపడే మార్గాన్ని ఎంచుకున్నారు. కొన్ని నెలలుగా ఆయన కొనసాగింపు పట్ల మోడి ప్రభుత్వంలో కొన్ని…

ద్రవ్యోల్బణం మళ్ళీ పెరగక తప్పదా?

కారణం ఏదైతేనేం గత కొద్ది నెలలుగా ద్రవ్యోల్బణం తగ్గు ముఖం పడుతూ వచ్చింది. కృత్రిమంగా తగ్గించారా లేక అదే తగ్గిందా అన్నది బ్రహ్మ రహస్యం. ఆర్ధిక మంత్రి మాటలను బట్టి చూస్తే ద్రవ్యోల్బణం మళ్ళీ పెరగక తప్పదని ఆయన చెబుతున్నట్లుగా ఉంది. ఆర్.బి.ఐ రెండేళ్లకు పైగా వడ్డీ రేట్లు తగ్గించకుండా కొనసాగించింది. అందుకు కారణం మొండిగా తగ్గుదల లేకుండా కొనసాగిన ద్రవ్యోల్బణం దాదాపు సంవత్సరం క్రితం ఇండియా ద్రవ్యోల్బణం 8.5 శాతం పైనే ఉంది. ఆరు నెలల…

సామ్రాజ్యవాదుల కోసం తయారు చేసిన శ్వేతపత్రం, బడ్జెట్ 2015-16 -(1)

స్వదేశీ, విదేశీ ప్రభువర్గాలు ఏరి కోరి తెచ్చుకున్న మోడి ప్రభుత్వం తమపై ఉంచిన విశ్వాసాన్ని కాపడుకుంటూ మొట్ట మొదటి పూర్తి స్ధాయి సాధారణ బడ్జెట్ 2015-16 ను ప్రవేశపెట్టింది. బి.జె.పి/ఎన్.డి.ఏ ప్రభుత్వం మెజారిటీ సాధించినట్లు వార్తలు వెలువడుతుండగానే పశ్చిమ బహుళజాతి కార్పొరేట్ కంపెనీలు కొత్త ప్రభుత్వం నెరవేర్చవలసిన తమ డిమాండ్లు ఏమిటో విస్పష్టంగా తమ కార్పొరేట్ మీడియా ద్వారా ప్రకటించాయి. ఆ డిమాండ్లను త్రికరణశుద్ధిగా నెరవేర్చుతూ మోడి ప్రభుత్వం నిర్ణయాత్మకంగా వేసిన అడుగు ‘బడ్జెట్ 2015-16’. ఒకవైపు…

ధనికులకు ఆర్.బి.ఐ పండగ కానుక, వడ్డీ రేటు తగ్గింపు

ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ శత పోరును ఆర్.బి.ఐ గవర్నర్ రఘురాం రాజన్ మన్నించారు. ధనికులు, కంపెనీలకు మరిన్ని రుణాలను అందుబాటులోకి తెస్తూ రెపో రేటును 8 శాతం నుండి 7.75 శాతానికి తగ్గించారు. ద్రవ్య విధానం సమీక్షతో సంబంధం లేకుండానే ఆర్.బి.ఐ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. “లిక్విడిటీ అడ్జస్ట్ మెంట్ ఫెసిలిటీ కింద పాలసీ రేపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించాలని నిర్ణయించాము. తద్వారా వడ్డీ రేటు 8 నుండి 7.75 శాతానికి…

ఇన్ ఫ్లేషన్, డిఫ్లేషన్, రిఫ్లేషన్… -ఈనాడు

ఒక దేశ ఆర్ధిక వ్యవస్ధ యొక్క ఆర్ధిక మౌలికాంశాల్లో (ఎకనమిక్ ఫండమెంటల్స్) ద్రవ్యోల్బణం ఒకటి. ద్రవ్యోల్బణం గురించి ఆర్ధికవేత్తలు అనేక సిద్ధాంతాలు చెబుతారు. ఆ సిద్ధాంతాలన్నీ మనిషి సృష్టించిన కృత్రిమ మారక సాధనం అయిన డబ్బు చుట్టూనే తిరుగుతాయి. ఎన్ని సిద్ధాంతాలు వల్లించినా డబ్బును నియంత్రించే ధనికవర్గాల జోలికి ఆర్ధికవేత్తలు వెళ్లరు. ఫలితంగా ఆ సిద్ధాంతాలన్నీ వాస్తవ పరిస్ధితులకు దరిదాపుల్లోకి వెళ్లడంలో విఫలం అవుతాయి. దాంతో మళ్ళీ మళ్ళీ సరికొత్త సిద్ధాంతాలతో ఆర్ధికవేత్తలు ముందుకు రావడానికి పరిస్ధితులు…

సామాన్యుడి ఎద్దు పరుగు -కార్టూన్

ధూ, దీనెమ్మ, జీవితం! అని జీవితంలో ఒక్కసారన్నా విసుక్కోని సామాన్యుడు ఈ భూమి మీద ఉంటాడా? నరేంద్ర మోడి నేతృత్వంలో బి.జె.పి/ఎన్.డి.ఏ ప్రభుత్వానికి మెజారిటీ సీట్లు వచ్చింది లగాయితు భారత స్టాక్ మార్కెట్లు ఉరుకులు పరుగులు పెడుతూ దూసుకుపోతున్న వార్తాలే రోజూ. స్టాక్ మార్కెట్ సూచీ పెరుగుతూ పోతుంటే బుల్ మార్కెట్ అనీ, తగ్గుతూ పోతుంటే బేర్ (ఎలుగుబంటి) మార్కెట్ అనీ సంకేతాలు పెట్టుకున్నారు. షేర్ మార్కెట్లలో మధ్యతరగతి బడుగు జీవులు కూడా మదుపు చేస్తున్నప్పటికీ వారి…

సంక్షోభం వీడని ఐరోపా, మరింత ఉద్దీపన అమలు

2008 నాటి ప్రపంచ ద్రవ్య-ఆర్ధిక సంక్షోభం దరిమిలా ఐరోపా దేశాలను చుట్టుముట్టిన తీవ్ర ఆర్ధిక సంక్షోభం ఇంకా ఆ దేశాల్ని పీడిస్తోంది. యూరోపియన్ సెంట్రల్ బ్యాంకు (ఇ.సి.బి) ప్రకటించిన తాజా ఉద్దీపన చర్యలు ఈ సంగతిని స్పష్టం చేస్తున్నాయి. ఇప్పటికే దాదాపు సున్న శాతానికి దగ్గరగా ఉన్న వడ్డీ రేటును మరింతగా తగ్గించడం ద్వారా మరిన్ని నిధులను మార్కెట్ లో కుమ్మరించడానికి ఇ.సి.బి నిర్ణయం తీసుకుంది. బహుశా మరే దేశమూ ఇంతవరకు చరిత్రలో ఎరగని చర్యలను కూడా…

మోడి గెలుపు: ఇక ఎఫ్.డి.ఐల వరదే -ఆసోఛామ్

నరేంద్ర మోడి ప్రచార సారధ్యంలో బి.జె.పి/ఎన్.డి.ఏ సాధించిన విజయం ధనిక వర్గాలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. మోడి అభివర్ణించిన ‘మంచి రోజులు’ తమకే అని వారికి బాగానే అర్ధం అయింది మరి! గుజరాత్ నమూనాను దేశం అంతా అమలు చేయడం అంటే స్వదేశీ-విదేశీ  కంపెనీలకు, పరిశ్రమలకు, దళారులకు మేలు చేస్తూ ప్రజల వనరులను వారికి కట్టబెట్టడమే అని కాంగ్రెస్ సైతం చెప్పే మాట! ఈ నేపధ్యంలో మోడి అనుసరించే విధానాల వల్ల దేశంలోకి ఈ యేడు రికార్డు స్ధాయిలో…

ద్రవ్య సమీక్ష: వడ్డీ రేట్లు మళ్ళీ పెంచిన ఆర్.బి.ఐ

ఆర్.బి.ఐ గవర్నర్ రఘురాం రాజన్ మరోసారి మార్కెట్ పరిశీలకులను ఆశ్చర్యపరిచారు. పరిశ్రమ వర్గాలను నిరాశపరిచారు. తాను మాత్రం ‘వినాశకర ద్రవ్యోల్బణం’ పగ్గాలు బిగించే పనిలో ఉన్నానని చెప్పారు. ద్రవ్య సమీక్షలో భాగంగా ఆయన స్వల్పకాలిక వడ్డీ రేటు ‘రెపో రేటు’ ను మరో 25 బేసిస్ పాయింట్లు పెంచి 7.75 శాతం నుండి 8 శాతానికి చేర్చారు. 2013-14 సంవత్సరంలో భారత వృద్ధి రేటు 5 శాతం కంటే తక్కువే ఉంటుందని చెప్పి ఆర్.బి.ఐ గవర్నర్ మరో…

వడ్డీ రేటు పెంచిన ఆర్.బి.ఐ, ప్రభుత్వం కినుక

ఆర్.బి.ఐ అధినేత మారినా కూడా రిజర్వ్ బ్యాంక్, ప్రభుత్వాల మధ్య విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయి. నూతన గవర్నర్ గా రఘురాం రాజన్ నియామకాన్ని చప్పట్లతో ఆహ్వానించిన కార్పొరేట్, పరిశ్రమల వర్గాలు ఆయన వరుస పెట్టి తీసుకుంటున్న చర్యలతో మింగలేక, కక్కలేక గొణుగుడుతో సరిపెట్టుకుంటున్నారు. తాజా ద్రవ్య పరపతి విధాన సమీక్షలో రిజర్వ్ బ్యాంక్ స్వల్పకాలిక వడ్డీ రేటు (రెపో రేటు) ను మరో 25 బేసిస్ పాయింట్లు పెంచడంతో ఏమి అనలేక నిశ్శబ్దమే స్పందనగా మిగిలిపోయారు. ప్రధాన…

ద్రవ్యోల్బణం తగ్గెను, వడ్డీ రేటు తగ్గును… (ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్ల వివరణ)

రిజర్వ్ బ్యాంకు నిధుల కోసం కాచుకు కూచున్న కంపెనీల కలలు తీరే రోజు వస్తోంది. ఆర్.బి.ఐ వడ్డీ రేటు మరింత తగ్గడానికి, తద్వారా రిజర్వ్ బ్యాంకు నుండి మరిన్ని నిధులు పొందడానికి కంపెనీలు ‘వర్షపు నీటి చుక్క కోసం ఎదురు చూసే చాతక పక్షుల్లా’ చూస్తున్న ఎదురు చూపులు ఫలించే రోజు రానున్నది. కంపెనీల తరపున వడ్డీ రేట్లు తెగ్గోయాలని ఆర్.బి.ఐ వద్ద చెవినిల్లు కట్టి పోరుతున్న ఆర్ధిక మంత్రి పి.చిదంబరం కూడా కాలర్ ఎగరేయబోతున్నారు. కారణం…

బంగారం దిగుమతులు పైకి, వాణిజ్య లోటు ఇంకా పైకి

భారతీయుల బంగారం దాహం దేశ ఆర్ధిక వ్యవస్ధకు ముప్పుగా పరిణమిస్తోంది. గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం ఏప్రిల్ నెలలో ఇండియా బంగారం దిగుమతులు 138 శాతం పెరిగాయి. దీనితో వాణిజ్య లోటు పెరిగి, విదేశీ మారక ద్రవ్య నిల్వలలో తరుగు ఏర్పడి, కరెంటు ఖాతా లోటు (Current Account Deficit) పై మరింత ఒత్తిడి పెరుగుతోంది. బంగారం దిగుమతులు పెరిగిన ఫలితంగా ఏప్రిల్ నెలలో వాణిజ్య లోటు అమాంతం 17.8 బిలియన్ డాలర్లకు పెరిగింది. ప్రపంచ…