ఆఫ్ఘన్ పై పట్టు: రేసులో అమెరికా ముందంజ (ఇప్పటికి!)

తన భౌగోళిక రాజకీయ ప్రయోజనాల కోసం ఎలాంటి అడ్డదారి తొక్కడానికైనా అమెరికా ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. రొయ్యలు ఒంటికి మంచిది కాదని ఊరంతా నీతులు చెప్పి రొయ్యల బుట్ట తానే మాయం చేసేసి లొట్టలు వేస్తూ భుజిస్తుంది. ఈ సంగతి మరోసారి రుజువు చేసుకుంది అమెరికా. ఎవరికీ చెప్పా పెట్టకుండా, కనీసం సంకేతాలు కూడా ఇవ్వకుండా తాలిబాన్ కు నిధులు అందించే మార్గాన్ని అమెరికా తెరిచి పట్టుకుంది. తద్వారా ఆఫ్ఘనిస్తాన్ దేశం ఆర్ధిక మూలాలు తన చేతుల్లో…

మహిళలు ఒకరి సొంత ఆస్తి కాదు! -తాలిబాన్ డిక్రీ

ఆఫ్ఘనిస్తాన్ నేల నుండి ఒక శుభ వార్త! మహిళల హక్కులను, ఆకాంక్షలను అణచివేయడంలో పేరు పొందిన తాలిబాన్ ఆఫ్ఘన్ ఆడ పిల్లలకు అనుకూలంగా ఒక ముఖ్యమైన డిక్రీ జారీ చేయడం ద్వారా ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. “స్త్రీ ఏ ఒక్కరి ఆస్తీ కాదు. ఆమెను ఒక గౌరవప్రదమైన మరియు స్వేచ్ఛాయుత మానవునిగా పరిగణించాలి. శాంతికి బదులుగానో లేక శతృత్వానికి ముగింపు పలికే లక్ష్యంతోనో ఏ స్త్రీనీ మారకానికి ఇవ్వడం జరగరాదు” అని తాలిబాన్ ప్రభుత్వం డిక్రీ జారీ…

తాలిబాన్ సరే, డ్రోన్ దాడుల లెక్క తేల్చరా?

ఆఫ్ఘన్-పాక్ సరిహద్దు ప్రాంతాల్లో సంచరించే తెహ్రీక్-ఏ-తాలిబాన్ అనే తీవ్రవాద సంస్ధ పెషావర్ లోని ఆర్మీ పబ్లిక్ స్కూల్ పైకి ఆత్మాహుతి మిలిటెంట్లను పంపి 132 మంది పిల్లలను, టీచర్లను బలిగొన్న వార్త ఇప్పుడు అందరినీ కలచివేస్తోంది. తాలిబాన్ పైశాచికత్వం తలచుకుని ప్రతి ఒక్కరూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కుపితులై పిడికిళ్ళు బిగిస్తున్నారు. ‘వారు పిల్లల్ని ఎలా చంపారో వారినీ అలానే చంపాలి’ అప్పుడే తగిన శాస్తి’ అన్న నిర్ణయానికి రాకపోతే వారిలో ఏదో లోపం ఉందన్నంతగా భావోద్వేగాలు…

పైపైకి దూసుకు పోతున్న దాడులు, చొరబాట్లు -కార్టూన్

“అబ్బో!” “అబ్బే, అక్కడ సంతోషించడానికేమీ లేదులెండి. మన సరిహద్దులో పెరుగుతున్న దాడులు, చొరబాట్లను చూపించే గ్రాఫ్ అది!” – ఇటీవలి కాలంలో కాశ్మీరులో భద్రతా బలగాలపై దాడులు పెరిగాయి. చొరబాట్లు కూడా పెరిగాయని పత్రికలు చెబుతున్నాయి. ఆఫ్ఘనిస్ధాన్ నుండి అమెరికా సైనికుల ఉపసంహరణ గడువు (డిసెంబర్ 2014) దగ్గర పడేకొద్దీ కాశ్మీరు లోనూ, సరిహద్దు లోనూ దాడులు పెరగడం గమనార్హం. గడువు సమీపిస్తున్న దృష్ట్యా తాలిబాన్ తో చర్చలు జరిపి ఒప్పందం కుదుర్చుకోడానికి అమెరికా నానా తంటాలు…

అమెరికా-తాలిబాన్ చర్చలు, కర్జాయ్ అలక

సెప్టెంబర్ 11, 2001 తేదీన న్యూయార్క్ నగరంలో వరల్డ్ ట్రేడ్ సెంటర్ కి చెందిన జంట టవర్ల పైన దాడి చేసింది ఒసామా బిన్ లాడేన్ నేతృత్వం లోని ఆల్-ఖైదా యేనని దాడి జరిగిన కొద్ది గంటల్లోనే అమెరికా ప్రకటించింది. ఒసామా బిన్ లాడెన్, ఆఫ్ఘనిస్ధాన్ లో దాక్కున్నాడని, ఆయనను తాలిబాన్ ప్రభుత్వం కాపాడుతోందని ప్రపంచానికి చెప్పింది. ‘లాడెన్ ని అప్పగించారా సరే సరి, లేదా దాడి చేస్తాం’ అని అధ్యక్షుడు జార్జి బుష్ తాలిబాన్ ని…

అమెరికా దురాక్రమణపై పోరాటంలో తాలిబాన్ పరిమితులు గుర్తించాలి

(ఇది నాగరాజు అవ్వారిగారి వ్యాఖ్య.  తాలిబాన్ కి మద్దతు ఎందుకివ్వాలన్నదీ వివరిస్తూ నేను రాసిన ఆర్టికల్ కింద రాసిన వ్యాఖ్య. ‘తాలిబాన్ కి మద్దతు’ లాంటి పెద్ద పదాలను ఉపయోగించనవసరం లేదన్న ఆయన సూచనని నేను పరిగణనలోకి తీసుకుంటున్నాను. తాలిబాన్ కి ఉన్న పరిమితులను గుర్తించాలన్న నాగరాజు గారి పరిశీలన వాస్తవికమైనది. తాలిబాన్ గురించి ఆయన చేసిన విశ్లేషణ సమగ్రంగా ఉన్నందున, పాఠకులకు ఉపయోగం అన్న దృష్టితో ఆయన రాసిన రెండు వ్యాఖ్యలను కలిపి టపా గా…

కొత్త ఆయుధంతో అమెరికాకు దడ పుట్టిస్తున్న తాలిబాన్

ఇటీవలి కాలంలో తాలిబాన్ బలగాలు నాటోకి చెందిన హెలికాప్టర్లను కూల్చివేస్తున్న వార్తలు వరుసగా వెలువడ్డాయి. దానికి కారణం తాలిబాన్ కొత్త ఆయుధాన్ని సమకూర్చుకోవడమేనని తాలిబాన్ వర్గాలను ఉటంకిస్తూ ఏసియా టైమ్స్ పత్రిక తెలిపింది. భూమి మీది నుండి గాలిలోకి ప్రయోగించే మిసైల్ ద్వారా తాము గణనీయమైన సంఖ్యలో హెలికాప్టర్లను కూల్చివేశామని తాలిబాన్ ప్రతినిధి చెప్పాడు. అయితే నాటో, అమెరికా వర్గాలు మాత్రం తమ హెలికాప్టర్లు కూలినప్పుడల్లా సాంకేతిక లోపం వలన కూలిందని చెబుతున్నాయి. తాలిబాన్ ఇంతవరకూ ఒకటీ…

కాబూల్‌లో బ్రిటిష్ కౌన్సిల్ పై తాలిబాన్ దాడి, ఎనిమిది మంది మరణం

ఆఫ్ఘన్ రాజధాని కాబూల్ లో తాలిబాన్ మిలిటెంట్లు మరోసారి దాడికి పాల్పడ్డారు. 1919 లో బ్రిటన్ నుండి ఆఫ్ఘనిస్ధాన్ స్వాతంత్రం సంపాదించుకున్న రోజునే బ్రిటిష్ కౌన్సిల్ పై దాడి జరగడం విశేషం. దాడికి తామే బాధ్యులుగా తాలిబాన్ ప్రకటించింది. అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మద్య ఉండే కాబూల్ లో అడుగడుగునా చెకింగ్ ఉన్నప్పటికీ మిలిటెంట్లు విజయవంతంగా దాడులకు పాల్పడడం కొనసాగుతున్నది. నాటో బలగాలకు ఇది అవమానకరంగా పరిణమించినప్పటికీ అవి తాలిబాన్ దాడులను అరికట్టడంలో విఫలమవుతున్నాయి. పేరు…

ఆఫ్ఘనిస్ధాన్ నుండి అమెరికా సైనికుల ఉపసంహరణ ప్రారంభం -కార్టూన్

వచ్చే సంవత్సరం జరిగే ఎన్నికల్లో బారక్ ఒబామా పోటీ చేయనుండడం, ఆఫ్ఘన్ యుద్ధం పట్ల అమెరికన్లలో నానాటికీ వ్యతిరేకత పెరుగుతుండడంతో పాటు ఒసామా బిన్ లాడెన్ హత్య (?) కూడా కలిసి రావడంతో ఆఫ్ఘనిస్ధాన్ దురాక్రమణ నుండి ఈ సంవత్సరం 10,000 మంది అమెరికా సైనికుల్ని ఉపసంహరించుకుంటున్నట్లు ఒబామా ప్రకటించాడు. మొదటి విడత ఉపసంహరణ ప్రారంభం అయ్యిందని కూడా పత్రికలు రాస్తున్నాయి. ఆర్ధిక బలహీనత నేపధ్యంలో ఆఫ్ఘన్ యుద్ధం అమెరికాకి నానాటికీ భారంగా మారింది. వ్రతం చెడ్డా…

ఆఫ్ఘనిస్ధాన్ నుండి సైన్యం ఉపసంహరణ ప్రకటించిన ఒబామా, పొరాటం కొనసాగుతుందన్న తాలిబాన్

అమెరికా అధ్యక్షుడు బారక్ ఒబామా ఆఫ్ఘనిస్ధాన్ నుండి అమెరికా సైనికులను పాక్షికంగా ఉపసంహరిస్తున్నట్లుగా ప్రకటించాడు. మొదటి విడత ఉపసంహరణ నామమాత్రంగా ఉంటుందని విశ్లేషకులు భావించినప్పటికీ, వారి అంచనాల కంటే ఎక్కువగానే సైనిక ఉపసంహరణను ఒబామా ప్రకటించాడు. ఆయాన ప్రకటన ప్రకారం, ఈ సంవత్సరం మొత్తం 10,000 మంది సైనికుల్ని ఉపసంహరిస్తారు. మరో 23,000 మందిని 2012 సెప్టెంబరు లోపు ఉపసంహరిస్తారు. మిగిలిన 68,000 మంది ఆఫ్ఘనిస్ధాన్‌లో కొనసాగుతారు. వారి ఉపసంహరణగురించి ఒబామా ఏమీ చెప్పలేదు. ఆఫ్ఘనిస్ధాన్ జాతీయ…

టెర్రరిస్టు తాలిబాన్‌తో అమెరికా చర్చలు!!!

“టెర్రరిజంపై ప్రపంచ యుద్ధం” (Global war on terrorism) ప్రకటించింది అమెరికా దేశమే. టెర్రరిజం వలన అమెరికా జాతీయ భద్రతకూ, అమెరికా ప్రజలకు ప్రమాదం ఏర్పడిందని, దరిమిలా టెర్రరిజం ప్రపంచం మొత్తానికీ ప్రమాదకరమనీ అమెరికా ప్రభుత్వం. ప్రపంచ దేశాలన్నీ తనతో కలిసి టెర్రరిజంపై పోరాటం చేయవలసిందేనని పరోక్షంగా శాసించింది. నీవెటువైపు? అని ప్రశ్నిస్తూ, నాతో లేకుంటే టెర్రరిజం వైపు ఉన్నట్లే అని హుంకరించింది అమెరికా అధ్యక్షుడే. అమెరికా హుంకరింపులతో ఇండియా లాంటి దేశాలు కూడా “నేను సైతం”…

రెండో రోజూ కొనసాగుతున్న తాలిబాన్ల కాందహార్ దాడి

కాందహార్‌లో తాలిబాన్ల దాడి రెండో రోజూ కొనసాగుతోంది.14 మంది తాలిబాన్లను చంపినట్లు ప్రభుత్వ బలగాలు చెబుతున్నాయి. చనిపోయిన తాలిబాన్లలో కొద్దిమంది పాకిస్తానీయులు ఉన్నారని ప్రభుత్వం తెలిపింది.  దాడి ఒసామా హత్యకు ప్రతీకరంగా చెప్పడాన్ని తాలిబాన్లు తోసిపుచ్చారు. దాడీ ముందే వేసుకున్న పధకం ప్రకారం జరిగిందని తాలిబాన్ చెప్పినట్లుగా బిబిసి తెలిపీంది. ఇద్దరు భద్రతాధికారులు, ముగ్గురు పౌరులు, శనివారం తాలిబాన్లు ఆత్మాహుతి బాంబులు, రాకెట్ ప్రొపెల్డ్ గ్రెనేడ్లతో ప్రభుత్వ భవనాలపై దాడులు చేశారు. అప్పటినుండీ కాల్పులు కొనసాగుతున్నాయి. మే…

దురాక్రమణ సేనలపై వేసవి దాడులు మొదలుపెడతాం -తాలిబాన్

ఆఫ్ఘనిస్ధాన్‌ని ఆక్రమించిన అమెరికా, తదితర పశ్చిమ దేశాల దురాక్రమణ సేనలపై ఆదివారం నుండి తాజా దాడులు ప్రారంభిస్తున్నామని తాలిబాన్ ప్రకటించింది. దురాక్రమణ సేనలు, వారి గూఢచారులు, దురాక్రమణ దేశాల తొత్తు ప్రభుత్వ అధికారులు, వారి సైనికులపై దాడులు చేస్తామని తాలిబాన్ ప్రకటించింది. వరల్డ్ ట్రేడ్ సెంటర్ జోడు టవర్లను విమానాలతో కూల్చింది ఆల్-ఖైదా మిలిటెంట్లేనని నిశ్చయించుకున్న అమెరికా ఆల్-ఖైదాని అంతమొందించే పేరుతో ఆఫ్ఘనిస్ధాన్ పై దురాక్రమణదాడి చేసిన సంగతి విదితమే. ఆల్-ఖైదా నాయకుడు ఒసామా బిన్ లాడెన్…

బాంబుదాడిలో ఆఫ్ఘన్ ఆల్-ఖైదా నెం.2 మరణం -నాటో దురాక్రమణ సేనలు

అమెరికా నాయకత్వంలోని దురాక్రమణ సేనలు ఆఫ్ఘనిస్ధాన్ ఆల్-ఖైదా నెం.2 నాయకుడిని బాంబు దాడిలో చంపేశామని ప్రకటించాయి. ఆఫ్ఘనిస్ధాన్ లోని కూనార్ రాష్ట్రంలో రెండు వారాల క్రితం జరిపిన బాంబు దాడిలో ఆఫ్ఘనిస్ధాన్‌కి చెందిన ఆల్-ఖైదా సంస్ధకు నెం.2 నాయకుడిగా పేర్కొనదగ్గ “అబ్దుల్ ఘనీ” చనిపోయాడని అమెరికా నాయకత్వంలోని నాటో సేనలు తెలిపాయి. ఇతనిని అబు హాఫ్స్ ఆల్-నజ్ది అన్న పేరుతో కూడా సంబోధిస్తారు. సౌదీ అరేబియా దేశానికి చెందిన ఘనీ అనేక మంది అమెరికా సైనిక అధికారుల…

ది గ్రేట్ ఎస్కేప్: అమెరికా భద్రతా వ్యవస్ధను హేళన చేస్తూ 488 తాలిబాన్ ఖైదీల పరారీ

ఆఫ్ఘనిస్ధాన్‌లో అమెరికా సైన్యం, దాని తొత్తు ప్రభుత్వం ఖైదు చేసిన కాందహార్ జైలునుండి 488 మంది తాలిబన్ ఖైదీలు పరారయ్యారు. ఐదు నెలలపాటు తవ్వీన్ సొరంగం ద్వారా, డూప్లికేట్ తాళాలను ఉపయోగించి వీరు పరారయ్యారు. సర్పోజా జైలుగా పిలిచే ఈ జైలునుండి తాలిబాన్లు పరారు కావడం ఇది రెండో సారి. 2008 సంవత్సరంలో వెయ్యిమందికి పైగా ఖైదీలు ప్రధాన ద్వారం నుండే పరారయ్యారు. ఆ సంఘటన తర్వాత అమెరికా కాందహార్ జైలుకు గట్టి భద్రతా ఏర్పాట్లు చేసింది.…