దళిత పెళ్ళి కొడుకు గుర్రం ఎక్కితే రాళ్ళు పడతాయ్!

రిజర్వేషన్లు ఇంకానా? అని ప్రశ్నించే అమాయకోత్తములకు తామున్న బావి నుండి బైటికి వచ్చి లోకం చూడాలని పిలుపు ఇచ్చే ఘటన ఇది! దళిత కులానికి చెందిన ఓ పెళ్లి కొడుకు గుర్రం ఎక్కి ఊరేగేందుకు వీలు లేదని శాసించిన ఉన్నత కులాలు తమ శాసనాన్ని మీరినందుకు రాళ్ళతో దాడి చేశారు. గుర్రాన్ని లాక్కెళ్ళారు. మరో గుర్రం తెచ్చుకున్న పెళ్లి కొడుకు రక్షణ కోసం పోలీసులు అతని తలకి హెల్మెట్ తొడగడం బట్టి దేశంలో కుల రక్కసి ఇంకా…

అరవింద్, మోడిల సమావేశం -కార్టూన్

  ఢిల్లీ అవడానికి రాష్ట్రమే అయినా పాలన రీత్యా అది పూర్తి స్ధాయి రాష్ట్రం కాదు. పాలన కోసం రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ఆధారపడాలి. ముఖ్యంగా శాంతి భద్రతలు! మామూలుగా అయితే శాంతి భద్రతలు రాష్ట్రాల హక్కు. రాష్ట్రాల్లోని పోలీసులే శాంతి భద్రతలను చూస్తుంటారు. అలాంటి పోలీసు విభాగం ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ద్వారా కేంద్రం అదుపులో ఉంటుంది. ఈ కారణం వలన పోలీసులు ఢిల్లీ సి.ఎంకు సమాధానం చెప్పరు. దరిమిలా రాష్ట్రంలో ఎలాంటి నేరం జరిగినా…

కేజ్రీవాల్ ఇంకో పెద్ద మెట్టు ఎక్కాలి -కార్టూన్

  ఢిల్లీ ఎన్నికల్లో భారీ మెజారిటీ సాధించడం ద్వారా అరవింద్ కేజ్రీవాల్/ఎఎపి ఒక పెద్ద మెట్టు ఎక్కి వచ్చారు. ఇప్పుడిక పూర్తి స్ధాయి పాలన అనే మరో పెద్ద మెట్టు ఎక్కాలి. ఆయన, ఆయన పార్టీ అన్నీ రకాలుగా విఫలం కావాలని సంపన్న వర్గాలు, వారి పార్టీలు తీవ్రంగా కోరుకుంటున్నందున ఢిల్లీ రాష్ట్ర పాలన ఎఎపికి నల్లేరుపై నడక ఏమీ కాదు. పార్టీ వయసు, అనుభవం… ఇత్యాది అంశాల రీత్యా ఎఎపి సైజు చాలా చిన్నదని కార్టూనిస్టు…

ఢిల్లీ: ఎఎపి నేతకు సి.ఎం పదవి ఎరవేసిన బి.జె.పి

“The Party with a difference” అని బి.జె.పి నేతలు తమ పార్టీ గురించి గొప్పగా చెప్పుకుంటారు. “The party with differences” అని కాంగ్రెస్ పరాచికాలాడుతుంది. కాంగీ పరాచికాలు ఎలా ఉన్నా కాంగ్రెస్ కంటే తాము భిన్నం ఏమీ కాదని వివిధ సందర్భాల్లో బి.జె.పి నిరూపించుకుంది. తాజాగా ఎ.ఎ.పి ని చీల్చి ఢిల్లీలో అధికారం చేపట్టేందుకు బి.జె.పి ప్రయత్నించిన సంగతి వెల్లడి అయింది. గత లోక్ సభ ఎన్నికల్లో అమేధిలో రాహుల్ గాంధీ పై పోటీ…

ఎఎపి పాలన: షీలాపై ఎఫ్.ఐ.ఆర్

మొదటి వేటు ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి పైనే పడింది. సి.ఎం అరవింద్ ఆదేశం అందుకున్న రోజే ఢిల్లీ ఎ.సి.బి రంగంలోకి దిగింది. వీధి దీపాల కుంభకోణంలో మాజీ సి.ఎం షీలా దీక్షిత్ పై ఎ.సి.బి, ఎఫ్.ఐ.ఆర్ దాఖలు చేసింది. 2010లో కామన్వెల్త్ ఆటల పోటీలు ఢిల్లీలో జరిగిన సందర్భంగా చేపట్టిన వీధి దీపాల నిర్మాణం ప్రాజెక్టులో అవకతవకలు జరిగాయని షుంగ్లు కమిటీ తేల్చింది. కమిటీ పరిశీలనలను షీలా ప్రభుత్వం తిరస్కరించింది. ఈ లోపు ఎన్నికలు ముగిసి కొత్త…

స్త్రీలు కొన్ని పరిమితుల్లో ఉండాలి -ఢిల్లీ పోలీసు కమిషనర్

ఆడవాళ్ళకు సుద్దులు చెప్పేవారి క్లబ్బులో మరో ఉన్నతాధికారి సభ్యత్వం తీసుకున్నాడు. ఢిల్లీ పోలీస్ కమిషనర్ బి.కె.గుప్తా శనివారం ఆడవాళ్ళు ఏ సమయాల్లో బైటికి రావాలో, ఏ సమయాల్లో బైటికి రాకూడదో, బైటికి వచ్చేటప్పుడు ఎవరిని వెంటబెట్టుకుని రావాలో కూడా ఆయన తెలిపాడు. తద్వారా సమాజం స్త్రీలు స్వేచ్ఛగా బైటికి రావడానికి అంగీకరించే పరిస్ధితిలో లేదని మరొక సారి రుజువు చేశాడు. “ఆడవాళ్ళు ఏ సమయంలోనైనా బైటికి రావచ్చు. అది వారి ప్రాధమిక హక్కు. వారి హక్కును కాపాడ్డం…