నిర్భయ: నిందితులందరికీ ఉరి

నిర్భయ హంతకులు నలుగురుకి సత్వర న్యాయస్ధానం (fast-track court) ఉరిశిక్ష విధించింది. జరిగిన ఘోరం ఖచ్చితంగా అరుదయిన కేసుల్లోకెల్లా అరుదైనదేనని కనుక నిందితులకు మరణ శిక్షే సరైనదనీ న్యాయస్ధానం తీర్పు చెప్పింది. తీర్పు విన్న వెంటనే నిర్భయ తల్లిదండ్రులు, సోదరులు హర్షాతిరేకాలు ప్రకటించారు. తమ కూతురికి న్యాయం దక్కిందని చెబుతూ, తమ వెన్నంటి నిలిచిన దేశ ప్రజలకు, మీడియాకు కృతజ్ఞతలు తెలిపారు. తీర్పు ప్రకటించిన తర్వాత నిందితుల్లో ఒకరు ఏడుపు మొదలు పెట్టగా, ఇతరులు తమ పాపాన్ని…

ఢిల్లీ అత్యాచారం నిందితుడు రాంసింగ్ హత్య?

ఫిజియో ధెరపీ విద్యార్ధిని జ్యోతి సింగ్ పాండే పైన ఢిల్లీ బస్సులో జరిగిన సామూహిక అత్యాచారం కేసులో ప్రధాన నిందితుడు రామ్ సింగ్ ఆత్మహత్య చేసుకున్నాడని జైలు అధికారులు చెబుతుండగా అతన్ని హత్య చేశారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. జైలులోని ఇతర ఖైదీలు రామ్ సింగ్ ని హత్య చేశారని, హత్య చేశాక సెల్ గేటు ఊచలకు వేలాడగట్టారని వారు ఆరోపిస్తున్నారు. రామ్ సింగ్ ను చంపుతామని ఖైదీలలో కొందరు మొదటి నుండి చెబుతున్నారని, ఆ మేరకు…

మాది వైట్ వాష్ కమిటి అనే ప్రభుత్వం అనుకుంది –జస్టిస్ వర్మ కమిటీ సభ్యుడు

[ఢిల్లీ బస్సులో సామూహిక అత్యాచారం దుర్ఘటనపై వెల్లువెత్తిన ప్రజల డిమాండ్స్ కు స్పందించి మహిళా చట్టాలలో మార్పులు తేవడానికి నియమించబడిన జస్టిస్ వర్మ కమిటీ తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించిన సంగతి తెలిసిందే. 30 రోజుల గడువు కోరి 29 రోజుల్లోనే నివేదిక పూర్తి చేసి ఇచ్చిన కమిటీ దానికి కారణం కూడా చెప్పింది. అనేక సామాజిక కోణాలతో ముడి పడి ఉన్న బాధ్యతను కేవలం ముగ్గురు సభ్యులు తీవ్రంగా శ్రమించి ముప్పై రోజుల్లోనే అధ్యయనం చేసి…

జస్టిస్ వర్మ కమిటీ నివేదిక ప్రధాన అంశాలు

జస్టిస్ వర్మ కమిటీ నివేదిక ఎవరినీ వదల లేదు. ప్రభుత్వము, పోలీసులతో పాటు న్యాయ వ్యవస్థను, సామాజిక ధోరణులను అది ఎండగట్టింది. నివేదికలోని అంశాలను ఎన్.డి.టి.వి ఒకింత వివరంగా అందించింది. అవి ఇలా ఉన్నాయి. సామూహిక అత్యాచారం దోషులకు 20 సంవత్సరాల జైలు శిక్ష; అవసరం అనుకుంటే జీవిత కాలం (శేష జీవితం అంతా జైలులోనే) విధించవచ్చు. సామూహిక అత్యాచారం అనంతరం హత్య జరిగితే జీవిత కాలం శిక్ష విధించాలి. ఈవ్‌టీజింగ్, వెంట పడడం, అవాంఛనీయ పద్ధతిలో…

పాలనా వైఫల్యమే మహిళలపై నేరాలకు మూల హేతువు –జస్టిస్ వర్మ కమిటీ

80,000కు పైగా సలహాలు, సూచనలు అందుకున్న జస్టిస్ వర్మ కమిటీ 29 రోజుల్లోనే వాటన్నిటినీ క్షుణ్ణంగా పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. మహిళలపై జరుగుతున్న లైంగిక నేరాలను నివారించడానికి వీలుగా చట్టాల మెరుగుదలకు తగిన సిఫారసులు చేయడానికి 30 రోజుల గడువు కోరిన జస్టిస్ వర్మ కమిటీ ఒక రోజు ముందుగానే నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి ఇచ్చింది. కాశ్మీరు, ఈశాన్య రాష్ట్రాలు లాంటి సంఘర్షణాత్మక ప్రాంతాల్లో ప్రభుత్వాలు అమలు చేస్తున్న నల్ల చట్టాలు అడ్డు పెట్టుకుని…

దామిని స్మృతిలో…

దామిని, అమానత్, నిర్భయ పేరేదైతేనేం? ఆమె………………….. హింసోన్మత్త పశు వాంఛలు కాటువేసిన గాయం పెను నిద్దురలోని దేశ అంతరాత్మని తట్టి లేపిన స్పర్శ లాఠీలను గేలి చేసిన నినాదాలకు స్వరపేటిక నీటి ఫిరంగులకు ఎదురొడ్డిన కన్నీటి జలపాతం భారత మహిళ అదృశ్య కారాగార వాసానికి దేదీప్య కాంతుల వెలుగు నిచ్చిన సాహసి! పాలకుల ఉదాసీనత, పాలితుల కర్తవ్యాలు తర్కించి, నిగ్గు దేల్చిన బాధల పాటల పల్లవి! రెండు గంటల్లో వెయ్యి జీవితాల హింసాత్మక దాడిని ఎదుర్కొని, ప్రతిఘటించి,…

మాటల్లో చెప్పలేని దారుణం జరిగితేతప్ప మనలోని క్రోధం నిద్రలేవదా?

(సోమా చౌధురి జనవరి 9 తేదీన తెహెల్కా పత్రికకు రాసిన వ్యాసం ఇది. తెహెల్కా పత్రికకు ఆమె మేనేజింగ్ ఎడిటర్. ప్రగతిశీల మహిళా సంఘం నాయకురాలు రమ గారు తన వ్యాసంలో వెలిబుచ్చిన అభిప్రాయాలే దాదాపుగా ఇందులో వ్యక్తం అయ్యాయి. ప్రధాన స్రవంతి లోని పత్రికా రచయితలు దేశ సామాజిక వ్యవస్థ తీరుతెన్నులను ఈ మాత్రం ప్రశ్నించడం ఒకింత సంతృప్తి కలిగించినా, ఆంగ్ల పత్రిక కనుక లక్ష్యిత సెక్షన్లను చేరదన్న తెలివిడి నిరాశను కలిగిస్తుంది. తెలుగు బ్లాగర్లకు…

నా జీవితంకోసం పోరాడి గెలిచాను -30 సం. క్రితం సొహైలా

(ఇప్పటికి ముప్ఫైయేళ్ళ క్రితం, తనపై నలుగురు సంస్కృతీ కాపలాదారులు రెండు గంటలపాటు అత్యంత పాశవికంగా అత్యాచారం జరిపిన మూడు సంవత్సరాల తరవాత ‘సొహైలా అబ్దులాలి’ రాసిన వ్యాసం ఇది. దీనిని మహిళా పత్రిక ‘మానుషి’ ప్రచురించింది. అప్పటికీ ఇప్పటికీ భారత సమాజంలో పితృస్వామిక విలువలు మారని వైనాన్ని ఈ వ్యాసం స్పష్టం చేస్తోంది. భారత పాలకులు అదే బూజుపట్టిన, స్త్రీలను చెరబట్టిన బురదలోనే దొర్లుతున్నారని ఈ వ్యాసంలోని అంశాలనూ, ఢిల్లీ అత్యాచారం తర్వాత వారు వరదలా పారిస్తున్న…

ఢిల్లీ అత్యాచారంపై టపాలు, ఒక పరిశీలన

రచన: నాగరాజు ఢిల్లీ సంఘటన తర్వాత వరుసగా ప్రచురితమవుతున్న పోష్టులు అనేక కోణాలలో చర్చకు దోహదపడుతున్నాయి. ఒక (అత్యాచారాన్ని)స్త్రీపై జరిగిన భౌతిక దాడిని ఎలా చూడాలి, దానిపై సమాజం, సమాజం నెత్తిన పీడలా కూర్చున్న పెద్దలు ఎలా స్పందిస్తున్నారు, అసలు ఈ సంఘటన ఇంతగా జనానికి పట్టడానికి కారణమేమిటి, ఈ సంఘటన జరగడానికి నేపథ్యం ఏమిటి వంటి విషయాలు అనేక మంచిచెడ్డలతో కలగలిపి చర్చ జరిగింది. ఇక రమ గారు రాసిన పోష్టులో అయితే అనేక కీలకమైన…

వైద్యంకోసం కాదు, జనానికి భయపడే సింగపూర్ తరలించారు -రాయిటర్స్

ఉవ్వెత్తున ఎగసిన ప్రజల ఆగ్రహానికి భయపడే భారత ప్రభుత్వ పెద్దలు ఢిల్లీ అత్యాచారం బాధితురాలిని సింగపూర్ తరలించారని బ్రిటన్ వార్తా సంస్ధ రాయిటర్స్ నిర్ధారించింది. ప్రభుత్వ అత్యున్నత ఆసుపత్రులయిన ఎ.ఐ.ఐ.ఎం.ఎస్, సఫ్దర్ జంగ్ హాస్పిటల్ తో పాటు ఇతర వైద్య నిపుణులనూ,  పోలీసు అధికారులనూ ఇంటర్వూ చేసిన రాయిటర్స్ సంస్ధ ఈ నిర్ధారణకి వచ్చింది. బాధితురాలిని సింగపూర్ తరలించడానికి వ్యతిరేకంగా గొంతువిప్పిన కొంతమంది ఎ.ఐ.ఐ.ఎం.ఎస్ వైద్య నిపుణులకు ‘తీవ్ర పరిణామాలు తప్పవంటూ’ హెచ్చరికలు వచ్చాయని రాయిటర్స్ తెలిపింది.…

గాయపడింది నేను, నా గౌరవం కాదు -సొహైలా అబ్దులాలి

(న్యూయార్క్ టైమ్స్ పత్రికలో జనవరి 7, 2013 తేదీన ప్రచురించబడిన ఆర్టికల్ కి ఇది యధాతధ అనువాదం. సొహైలా అబ్దులాలి రచన ఇది. 17 సంవత్సరాల వయసులో అత్యాచారానికి గురై, పోలీసుల సహకార నిరాకరణవల్ల దోషులకు శిక్ష పడకపోయినా, తల్లిదండ్రుల మద్దతుతో పరిపూర్ణ రచయితగా, కార్యకర్తగా, వక్తగా అత్యున్నత శిఖరాలను అధిరోహించిన సొహైలా అబ్దులాలి మొత్తం సమాజానికి స్ఫూర్తిమంతురాలు. అత్యాచారం జరిగిన మూడేళ్ల తర్వాత అత్యాచారం గురించి వివరిస్తూ తానే ‘మానుషి’ పత్రికకు వ్యాసం రాసి శీలం…

బుద్ధి జీవులు ఆగ్రహోదగ్రులైన వేళ -ఫోటోలు

అనేకానేక ప్రభుత్వ, ప్రవేటు ఆఫీసులు, కాల్ సెంటర్లు, ఐ.టి కంపెనీలు తదితర ఆధునిక రంగాల్లో పనిచేస్తున్న మేధోవర్గ ప్రజలు రోడ్డు మీదికి రావడం అరుదు. వారు తమను తాము భద్రజీవులుగా భావించుకోవడం దానికి ఒక కారణం కావచ్చు. డిసెంబరు 16 తేదీన జరిగిన దారుణకృత్యం తర్వాత తమకు కూడా భద్రత లేదని వీరికి తెలిసివచ్చింది. ఆర్ధిక భద్రత అనేది జీవితంలో ఒక భాగమేననీ, సామాజిక భద్రత కావాలంటే రోడ్డు మీదికి రాక తప్పదని వారి అవగాహనలోకి వచ్చింది.…

కూతుళ్ళకి కాదు, కొడుకులకు కాపలా కాయండి!

(రచన: రమ) ఢిల్లీ బస్సులో జరిగిన సామూహిక అత్యాచార దుర్ఘటన ఎన్నడూ లేనివిధంగా ప్రజాగ్రహానికి గురయింది. మధ్య తరగతి యువతీ యువకులు వీధుల్లోకి వచ్చి రోజుల తరబడి తీవ్రస్ధాయిలో ఉద్యమించారు. వీరివెనుక ఎలాంటి రాజకీయ పార్టీలుగానీ, విద్యార్ధి సంఘాలుగానీ, ఇతరేతర సంఘాలుగానీ ఉన్న ధాఖలాలు కనపడలేదు. 1975లో హైదరాబాదులో జరిగిన రమీజాబీ అత్యాచార దుర్ఘటన తరువాత యింత ఉధృతమైన ప్రజాప్రతిఘటన అత్యాచారాల విషయంలో ఇదేనని చెప్పవచ్చు. రమీజాబీ విషయంలో విద్యార్ధి సంఘాలు, ఇతర ప్రజా సంఘాలు ఒక…

ఉరి వద్దు, సజీవ దహనం చెయ్యండి -అమానత్ కోరిక

అమానత్/దామిని/నిర్భయ మిత్రుడు మౌనం వీడి కొన్ని చేదు నిజాలు చెప్పాడు. సాయం కోసం అరిచినా 45 నిమిషాల సేపు ఒక్క వాహనంగానీ, ఒక్క వ్యక్తిగానీ ఆగకుండా వెళ్లిపోయారని అతను తెలిపాడు. తన స్నేహితురాలిని ఆసుపత్రికి తీసుకెళ్లడంలో పోలీసులు విపరీతమైన ఆలస్యం చేశారనీ, నగ్నంగా ఉన్న తనకుగానీ, తన స్నేహితురాలికిగానీ కనీసం కప్పుకోవడానికి ఒక గుడ్డ ఇచ్చిన పాపాన పోలేదనీ అతను ఆరోపించాడు. విపరీతంగా రక్తం కారుతున్న తన స్నేహితురాలిని తానొక్కడినే ఎత్తుకుని పి.సి.ఆర్ (పోలీస్ కంట్రోల్ రూమ్)…

ఢిల్లీ అత్యాచారం: కొనసాగుతున్న గోప్యత ఎవరి ప్రయోజనాలకు?

మరిన్ని రక్షణలతో రూపొందనున్న కొత్త అత్యాచార నిరోధ చట్టానికి ఢిల్లీ అత్యాచారం బాధితురాలి పేరు పెట్టడానికి సూచన వచ్చింది. కేంద్ర మంత్రి శశిధరూర్ ఈ సూచన చేశాడు. అమ్మాయి పేరుని ఇంతవరకూ బైటపెట్టకపోవడంపై ఆశ్చర్యం వ్యక్తం చేసిన శశిధరూర్ అమ్మాయి తల్లిదండ్రులు, సోదరులు అంగీకరిస్తే నూతన సవరణలతో కూడిన చట్టానికి అమ్మాయి పేరే పెట్టాలని ఆయన కోరాడు. బాధితురాలి తల్లిదండ్రులు, సోదరులు అందుకు తమకు అభ్యంతరం లేదని తెలియజేశారని ‘ది హిందూ’ తెలిపింది. ప్రభుత్వానికి ఈ ఆలోచన…