తమిళనాడు వేర్పాటుకు అమెరికా సాయం కోరిన డి.ఎం.కె నాయకన్? -వికీలీక్స్
తమిళనాడు రాష్ట్రం భారత దేశం నుండి విడిపోయి ప్రత్యేక దేశంగా ఏర్పడడానికి అప్పటి డి.ఎం.కె రాష్ట్ర మంత్రి ఒకరు అమెరికా సాయం కోరినట్లు అమెరికా రాయబార పత్రాల ద్వారా తెలుస్తోంది. మాజీ ప్రధాని ఇందిరాగాంధి ఎమెర్జెన్సీ పాలన విధించిన వారం రోజులకు తమిళనాడులో రాష్ట్ర ప్రభుత్వానికి నాయకత్వం వహించిన ద్రవిడ మున్నేట్ర కజగం పార్టీ నేత, రాష్ట్ర కార్మిక మరియు గృహ శాఖ మంత్రి కె.రాజారాం అమెరికా రాయబారిని కలిసి తమిళనాడు ప్రత్యేక దేశంగా విడిపోదలుచుకుంటే అమెరికా…