జైట్లీపై విచారణ చట్ట విరుద్ధం -కేంద్రం

ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ పాల్పడ్డారని ఆరోపించబడుతున్న డి‌డి‌సి‌ఏ కుంభకోణంపై విచారణ చట్ట విరుద్ధం అని కేంద్ర ప్రభుత్వం తేల్చేసింది. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ ద్వారా ‘సలహా ఇవ్వండి’ అంటూ లేఖ రాయించుకుని ఆనక ‘ఆ విచారణ చట్టబద్ధం కాదు’ అని బి.జె.పి ప్రభుత్వం ప్రకటించేసింది. ‘అవినీతిపై రాష్ట్ర ప్రభుత్వ విచారణ చట్ట విరుద్ధం’ అని నిర్ధారించిన మొట్ట మొదటి కేంద్ర ప్రభుత్వంగా నరేంద్ర మోడి నేతృత్వంలోని ప్రభుత్వం ఘనతను మూటగట్టుకుంది. ‘అవినీతిని అంతం…

డి‌డి‌సి‌ఏ స్కాం: అబ్బే పిచ్ లో స్వల్ప మార్పులు!

Keshav strikes again! డి‌డి‌సి‌ఏ స్కాంలో తన అవినీతిని అరుణ్ జైట్లీ ఎలా సమర్ధించుకుంటున్నారో ఈ కార్టూన్ విశ్లేషిస్తున్నది. ఫిరోజ్ షా కోట్ల స్టేడియంలో కొన్ని భాగాల్ని ఆధునికరించడానికి 24 కోట్ల అంచనాతో కాంట్రాక్టు అప్పగించగా పనులు ముగిసే నాటికి 114 కోట్లు చెల్లించడం ప్రధాన కుంభకోణం. ఆధునీకరణ పనుల్లో భాగంగా ఢిల్లీ మునిసిపాలిటీ అనుమతి లేకుండానే కొన్ని బాక్స్ లను నిర్మించారు. స్టేడియం స్ధలంలో అక్రమ నిర్మాణాలు చేసి వాటిని అక్రమంగా లీజులకి ఇచ్చేశారు. అదనంగా…

జైట్లీ విచారణకు హాకీ ఫెడ్ మాజీ అధికారి డిమాండ్

అరుణ్ జైట్లీ బీరువాలో దాచిపెట్టిన అవినీతి కంకాళాలు ఒక్కొక్కటిగా బైటికి వస్తున్నాయి. ఢిల్లీ & డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడుగా జైట్లీ సాగించిన అవినీతిపై విచారణ చేయాలని డిమాండ్లు ఓ పక్క మిన్నంటుతుండగా మరో పక్క హాకీ ఇండియా ఫెడరేషన్ బోర్డు సభ్యుడుగా ఆయన పాల్పడిన అవినీతిaపై కూడా విచారణ చేయాలంటూ డిమాండ్లు చేసే గొంతులు పెరుగుతున్నాయి. ఈసారి ఏకంగా హాకీ ఫెడరేషన్ మాజీ అధికారి స్వయంగా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు లేఖ రాస్తూ…

డి‌డి‌సి‌ఏ-జైట్లీ అవినీతి ఇదే!

కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ డి‌డి‌సి‌ఏ అధ్యక్షులుగా ఉన్న కాలంలో జరిగిన అవినీతి వివరాలను ఏఏపి ప్రభుత్వం వెల్లడి చేసింది. ఏఏపి కి చెందిన వివిధ నేతలు, మంత్రులు ఈ రోజు (డిసెంబర్ 17, 2015) విలేఖరుల సమావేశం ఏర్పాటు చేసి జైట్లీ అవినీతి వివరాలను వెల్లడి చేశారు. ఢిల్లీ హైకోర్టు నియమించిన విచారణ కమిటీ, కేంద్ర ప్రభుత్వానికి చెందిన తీవ్ర అవినీతి నేరాల పరిశోధనా సంస్థ (సీరియ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ – ఎస్‌ఎఫ్‌ఐ‌ఓ)…