తలతిక్కవాదంతో ఎఫ్.డి.ఐ బిల్లుని గెలిపించిన ఎస్.పి, బి.ఎస్.పి
చిల్లర వర్తకంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆహ్వానిస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లుకి వ్యతిరేకంగా బి.జె.పి ప్రవేశపెట్టిన తీర్మానం లోక్ సభలో ఓడిపోయింది. బిల్లుకి వ్యతిరేకం అని చెబుతూనే సమాజ్ వాదీ పార్టీ, బహుజన్ సమాజ్ వాదీ పార్టీలు సభనుండి వాకౌట్ చేయడంతో బిల్లు 253-218 ఓట్లతో నెగ్గింది. వాకౌట్ చెయ్యడం ద్వారా తాము కూడా ఆ తానులోని ముక్కలమేనని ఎస్.పి, బి.ఎస్.పిలు నిర్ద్వంద్వంగా చాటుకున్నాయి. బి.సిలను ఉద్దరించడానికి ఉద్భవించామని ఎస్.పి, దళితుల ఉద్ధరణే ఏకైక లక్ష్యమని…