తానింకా సోషలిస్టునే అంటున్న గ్రీకు ప్రధాని -కార్టూన్
చెయ్యాల్సిందంతా చేసిన గ్రీకు ప్రధాని జార్జి పపాండ్రూ తానింకా సోషలిస్టునే నని చెప్పుకోవడానికి తంటాలు పడుతున్నాడు. ఇప్పటికి ఐదు విడతలుగా అత్యంత కఠినమైన ప్రజా వ్యతిరేక పొదుపు ఆర్ధిక విధానాలను అమలు చేసిన పపాండ్రూ ఆరో విడత కోతలకు ప్రజల అనుమతి కావాలంటూ బయలుదేరాడు. గ్రీసు కోసం ఇ.యు దేశాలు కుదుర్చుకున్న ఒప్పందంపైన గ్రీసు ప్రజల అనుమతి కోసం ‘రిఫరెండం’ నిర్వహిస్తున్నట్లు ప్రకటించాడు. మొదటి ఐదు విడత కోతలకు ప్రజల అనుమతి తీసుకోవాలని పపాండ్రూకి గుర్తు రాలేదు.…