గోపీనాధ్ ముండేకి ఎన్నికల సంస్కరణలు కావాలిప్పుడు -కార్టూన్

గోపీనాధ్ ముండే! ఈయన 2009లో మహారాష్ట్ర లోని బీడ్ నియోజకవర్గం నుండి లోక్ సభకు ఎన్నికయిన బి.జె.పి నాయకుడు. లోక్ సభలో బి.జె.పి పార్లమెంటరీ పార్టీకి ఈయన ఉపనాయకుడు కూడా. 2009 ఎన్నికల్లో 19 లక్షల రూపాయలు మాత్రమే ఖర్చు చేశానని ఎన్నికల కమిషన్ కు అఫిడవిట్ ఇచ్చిన ముండే ఇటీవల ఒక సభలో మాట్లాడుతూ తాను లోక్ సభ ఎన్నికలకు 8 కోట్లు ఖర్చు చేశానని అసలు నిజం వెళ్ళగక్కారు. ఈయన మర్చిపోయి నిజం మాట్లాడలేదు.…