న్యూట్రల్ ఓటుతో భారత జాలర్లను విడుదల చేసిన శ్రీలంక
ఐరాస మానవ హక్కుల సంస్ధలో ఇండియా శ్రీలంకకు అనుకూలంగా వ్యవహరించడంతో శ్రీలంక కృతజ్ఞత చూపింది. భారత్ చర్యకు కృతజ్ఞతగా శ్రీలంక జైళ్ళలో మగ్గుతున్న 98 మంది జాలర్లను విడుదల చేసింది. ఐరాసలో భారత దేశం అనుసరించిన వైఖరికి ప్రతి సుహృద్భావ చర్యగానే భారత జాలర్లను విడుదల చేస్తున్నామని చెప్పి మరీ విడుదల చేసింది. ఉపఖండంలో మారుతున్న ధోరణులకు భారత్-శ్రీలంక చర్యలు అద్దం పడుతున్నాయి. ఐరాస మానవ హక్కుల సంస్ధ (United Nations Human Rights Commission) లో…