రిలయన్స్ పై మరో 3.5 వేల కోట్ల జరిమానా

ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ పై కేంద్రం మరో 579 మిలియన్ డాలర్ల (సుమారు రు. 3.5 వేల కోట్లకు సమానం) జరిమానా విధిస్తున్నామని కేంద్రం ప్రకటించింది. లోక్ సభలో ఒక ప్రశ్నకు సమాధానం ఇస్తూ చమురు సహజవాయువు మంత్రి ధరేంద్ర ప్రధాన్ ఈ సంగతి తెలిపారు. 2013-14 సంవత్సరంలో కాంట్రాక్టు మేరకు సహజవాయువు ఉత్పత్తి చేయనందుకు గాను ఈ జరిమానా విధించామని చెప్పారు. దీనితో రిలయన్స్ కంపెనీపై విధించామని కేంద్రం చెప్పిన జరిమానా మొత్తం…

“రిలయన్స్ ఇండస్ట్రీస్”లో 30 శాతం షేర్లు “బ్రిటిష్ పెట్రోలియం” కు అమ్మడానికి కేంద్రం ఆమోదం

మొదట దేశంలోని విలువైన సహజ వనరులను స్వదేశీ ప్రవేటు పెట్టుబడిదారులకు అప్పగించడం, ఆ అర్వాత స్వదేశీ పెట్టుబడుదారులను తమ కంపెనీలో గణనీయమొత్తంలో షేర్లను విదేశీ బహుళజాతి సంస్ధలకు అమ్ముకోవడానికి ఆమోద ముద్ర వేయడం, తద్వారా భారత దేశ ఆయిల్, గ్యాస్ తవ్వకాల రంగంలోని దేశీయ మార్కెట్లను విదేశీ మార్కెట్ల ప్రవేశానికి గేట్లు బార్లా తెరవాలన్న పశ్చిమ దేశాల డిమాండ్లను నెరవేర్చడం భారత ప్రభుత్వం ఒక ఎత్తుగడగా అభివృద్ధి చేసినట్లు కనిపిస్తోంది. కాకుంటే ప్రభుత్వ రంగ పరిశ్రమల వద్ద…