కాశ్మీర్: మిగిలిన వారినీ చంపాలని చూశారా?

కాశ్మీరులో కారుపై సైన్యం కాల్పులు జరిపిన ఘటనలో ఇద్దరు బులెట్ గాయాలతో తప్పించుకున్న సంగతి తెలిసిందే. గాయాలు కాకుండా తప్పించుకున్న బాసిం పరుగెత్తి పారిపోవడం వల్ల బతికిపోయాడే తప్ప సైన్యం కాల్పులు జరపడం ఆపడం వల్లనో లేదా కారు ఆపడం వల్లనో కాదని తెలుస్తోంది. దుర్ఘటన నుండి గాయాలు కాకుండా తప్పించుకున్న బాసిం అహ్మద్ చెప్పిన వివరాలను బట్టి కారు విద్యుత్ స్తంబానికి గుద్దుకుని ఆగిపోయిన తర్వాత కూడా సైనికులు కాల్పులు కొనసాగించారు. కారు తలుపు తీసుకుని…

కాశ్మీర్: కారు ఆపలేదని పిల్లల్ని చంపేశారు

దేశసేవలో మునిగి తేలుతున్నారని, వారు లేనిదే దేశం లేదనీ పొగడ్తలు పొందే మన సైనికులు కాశ్మీర్ లో అమాయక పౌరులపై ఏ విధంగా రెచ్చిపోతారో తెలిపే దుర్ఘటన సోమవారం జరిగింది. సైన్యం నెలకొల్పిన చెక్ పోస్ట్ దగ్గర రెడ్ సిగ్నల్ చూపించినా ఆగకుండా వెళ్లిపోయారని కారుపై కాల్పులు జరిపి ఇద్దరు పిల్లల్ని పొట్టనబెట్టుకున్నారు. కారు ఆగకుండా వెళ్తే టైర్లను కాల్చవచ్చు. టైర్లకు బదులు కారు విండ్ స్క్రీన్స్ కి గురిపెట్టి కాల్చడంతోనే సైనికుల ఉద్దేశం స్పష్టం అవుతోంది.…

జనరల్ వి.కె.సింగ్ విశ్రాంత కాలం తీరే వేరు -కార్టూన్

పదవీ విరమణ చేశాక ఒక్కొక్కరు ఒక్కో విధంగా తమ విశ్రాంత కాలాన్ని ఎంజాయ్ చేస్తారు. కానీ జనరల్ వి.కె.సింగ్ పదవీ విరమణ చేశాక తన కాలాన్ని ఎంజాయ్ చేస్తున్న తీరు మాత్రం ప్రత్యేకం అనే చెప్పుకోవాలి. ఒకసారి అవినీతి వ్యతిరేక ఉద్యమంలో అన్నా హజారే పక్కన కనిపిస్తారు. మరోసారి ఆర్మీ కుంభకోణాలపై గొంతెత్తుతారు. మరోసారేమో ఏకంగా బి.జె.పి ప్రధాని అభ్యర్ధి నరేంద్ర మోడి తోనే వేదిక పంచుకుంటారు. జనరల్ వి.కె.సింగ్ ఎంజాయ్ మెంటు ఎలా ఉన్న దానివల్ల…

సరిహద్దులో పాక్ దాగుడుమూతలు! -కార్టూన్

సరిహద్దులో పాకిస్ధాన్ ‘కాల్పుల విరమణ’ ఒప్పందాన్ని పదే పదే ఉల్లంఘిస్తోందని పత్రికలు, ఛానెళ్లు కొద్ది రోజులుగా చెబుతున్నాయి. దేశంలో పరిస్ధితి తమకు అనుకూలంగా లేనప్పుడు, పార్లమెంటులో ప్రజల ప్రయోజనాలకు విరుద్ధమైన బిల్లులు ప్రవేశపెట్టి, ప్రతిపక్షాలు నిరసనల రూపంలో ఇచ్చే పరోక్ష మద్దతుతో మూజువాణి ఓటుతో ఆమోదించాలనుకున్నపుడు సరిహద్దుల వద్ద ఉద్రిక్తతలు తలెత్తడం మామూలు విషయమే. ఈ ఎత్తుగడల్లో సైనికుల ప్రాణాలు ఉట్టిపుణ్యానికి హరీమన్నా పాలక పెద్దలకు లెక్కా, జమా ఉండవు. ప్రస్తుతం తలెత్తిన ఉద్రిక్తతలు కూడా ఆదేకోవలోనివే…

కాశ్మీర్ లో 130 మంది పాక్ సైనికులు ‘మంచులో సమాధి’

కాశ్మీర్ మంచు పర్వతాలలో 130 మంది పాక్ సైనికులు మంచులో సమాధి అయ్యారు. మంచు తుఫానులో వేగంగా కిందికి జారుతున్న భారీ మంచు గడ్డ కింద చిక్కుకుపోయి చనిపోయారు. 130 మంది కంటే ఎక్కువ సంఖ్యలోనే సైనికులు చనిపోయి ఉండవచ్చని భావిస్తున్నారు. అతి పెద్ద హిమాలయ పర్వతాలపైన గల సియాచిన్ గ్లేసియర్ పైన భారత సరిహద్దుకి సమీపంలో ఉన్న పాకిస్ధానీ ఆర్మీ శిబిరంపైకి మంచు గడ్డ దూసుకు రావడంతో తప్పించుకునే అవకాశం లభించలేదని తెలుస్తోంది. సియాచిన్ గ్లేసియర్…

పాకిస్ధాన్‌తో అమెరికా రాజీ, భారత్ ప్రయోజనాలకు ఎసరు?

బహిరంగంగా పాకిస్ధాన్ పై నిప్పులు చెరుగుతున్న అమెరికా రహస్యంగా రాజీ చేసుకోవడానికి సిద్ధపడుతున్నదన్న అనుమానాలు బలపడుతున్నాయి. కొద్ది రోజుల క్రితమే అమెరికా విదేశాంగ మంత్రి హిల్లరీ క్లింటన్ పాకిస్ధాన్ కు హెచ్చరికలు జారీ చేసింది. ఇటీవలి కాలంలో అమెరికా సైనికులపైనా, ఆఫ్ఘన్ లోని అమెరికా ఎంబసీపైనా జరిగిన వరుస దాడులకు హక్కానీ గ్రూపుదే బాధ్యత అని అమెరికా అధికారులు భావిస్తున్నారు. పాక్ గూఢచార సంస్ధ ఐ.ఎస్.ఐ మద్దతుతోనే హక్కానీ గ్రూపు దాడులు చేయగలుగుతున్నదని కూడా వారు భావిస్తున్నారు.…

మా బృందంలో ప్రశాంత్ భూషణ్ కొనసాగేదీ లేనిదీ తర్వాత నిర్ణయిస్తాం -అన్నా హజారే

అన్నా హజారే బృందంలో ప్రముఖ సభ్యుడు లాయర్ ప్రశాంత్ భూషణ్ పై శ్రీరాం సేన, భగత్ సింగ్ క్రాంతి సేన సభ్యులుగా చెప్పుకుంటున్న ముగ్గురు వ్యక్తులు దాడి చేసి కొట్టాక అన్నా హజారే బృందం కేంద్రంగా కొన్ని మార్పులు వేగంగా జరిగిపోతున్నాయి. ‘కాశ్మీరు ప్రజలలో ప్రజాభిప్రాయ సేకరణ జరిపి వచ్చే ఫలితాల్లో వేరు పడాలని వారు కోరితే వారికా అవకాశం ఇవ్వాలి” అని ప్రశాంత్ భూషణ్, వారణాసిలో జరిగిన ఒక సమావేశంలో చెప్పడమే తమ దాడికి కారణమని…

టీం అన్నా సభ్యుడిపై ‘శ్రీరాం సేన’ దాడి, కాశ్మీరు సమస్యపై వ్యాఖ్యే కారణం

మత మూఢులకి పరమత సహనం ఎలాగూ ఉండదు. వారికి ప్రజాస్వామ్య భావాల పట్ల కూడా గౌరవం ఉండదు. తమ నమ్మకాలకు భిన్నమైన భావాలను సహించడాం వారి వల్ల కాదు. అది ముస్లిం మతం కావచ్చు, హిందూ మతం కావొచ్చు, లేదా క్రిస్టియన్ మతం కావొచ్చు. అందుకు తార్కాణంగా సాక్ష్యాత్తూ సుప్రీం కోర్టు ప్రాంగణంలోనే బుధవారం ఒక సంఘటన చోటు చేసుకుంది. అన్నా హజారే బృందంలో ప్రముఖ సభ్యుడు, సుప్రీం కోర్టులో ప్రముఖ న్యాయవాది అయిన ప్రశాంత్ భూషణ్…

ఇండియా, అమెరికాల అణు ఒప్పందంపై బిజేపి వ్యతిరేకత ఉత్తుత్తిదే -అద్వానీ (వికీలీక్స్)

యు.పి.ఏ ప్రభుత్వం హయాంలో అమెరికా ఇండియా లమధ్య కుదిరిన అణు ఒప్పందం పై బిజేపి తెలిపిన వ్యతిరేకత నిజానికి ఉత్తుత్తిదే అని ఆ పార్టీ ముఖ్య నాయకుడు ఎల్.కె.అద్వానీ అమెరికా రాయబారికి చెప్పిన విషయం వికీలీక్స్ లీక్ చేసిన డిప్లొమాటికి కేబుల్స్ ద్వారా స్పష్టమయ్యింది. 2009 పార్లమెంటు ఎన్నికలు ముగిశాక ఫలితాలు ప్రకటించడానికి కొద్ది రోజుల ముందు అమెరికా రాయబారి కార్యాలయం చార్జి డి’ ఎఫైర్స్ పీటర్ బర్లే (రాయబార కార్యాలయంలో ముగ్గురు ముఖ్య రాయబారులు ఉంటారు…