యజమాని గర్వం, పొరుగువాని అసూయ -కార్టూన్

– ‘Owner’s pride, neighbor’s envy.’ ఒనిడా టి.వి ప్రవేశపెట్టిన ఈ నినాదం దాదాపు సామెతగా మారిపోయింది. రాజకీయ, సామాజిక పరిస్ధితుల గురించి మాట్లాడుకునే సందర్భాల్లో కూడా ఇది సామెతగా చొరబడిందంటే అతిశయోక్తి కాదేమో! యు.పి.ఎ-2 ప్రభుత్వ పాలనలో వెల్లివిరుస్తున్న కుంభకోణాల జాతరను ప్రతిపక్ష పాలక వర్గాలు అసూయతో ఎలా వీక్షిస్తున్నదీ ‘ది హిందు’ కార్టూనిస్టు సురేంద్ర ఈ ‘సామెత కానీ సామెత’ ద్వారా ఈ కార్టూన్ లో చక్కగా వివరించారు. బోఫోర్స్ కుంభకోణం దేశ రాజకీయాలను…

ఇండియాకి ఒలింపిక్స్ మెడళ్ళు ఎందుకు రావు? -కార్టూన్

ఒలింపిక్స్ సంరంభం ప్రారంభమై ఐదు రోజులు గడిచిపోయాయి పొరుగు దేశం చైనా 13 బంగారు పతకాలతో అగ్ర స్ధానంలో ఉండగా ఇండియా ఇంకా బంగారు ఖాతా తెరవనే లేదు. బాడ్మింటన్ క్రీడాకారిణి సైనా, షూటర్ గగన్ నారంగ్, బాక్సర్ విజేందర్ సింగ్ ల పై బంగారు ఆశలు ఉన్నా అవి మినుకు మినుకు మంటున్నవే. గగన్ ఇప్పటికైతే ఒక తామ్ర పతకాన్ని మాత్రం అందించాడు. గతంలో హాకీ లో బంగారు పతాకం గ్యారంటీ అన్నట్లు ఉండేది. ఇప్పుడలాంటి…

కర్ణాటక వద్ద అరిగిపోయిన బి.జె.పి రికార్డు -కార్టూన్

బి.జె.పి కర్ణాటక ‘నాటకం’ ముగిసేటట్లు కనిపించడం లేదు. యెడ్యూరప్ప ఒత్తిడితో ముఖ్యమంత్రి పీఠం నుండి ‘సదానంద గౌడ’ ను తొలగించిన బి.జె.పి అధిష్టానం ఇప్పుడు సదానంద గౌడ నుండి తాజా డిమాండ్లు ఎదుర్కొంటోంది. శాసన సభా పక్ష సమావేశం ఏర్పాటు చేయవలసిన సదానంద ఆ పని వదిలేసి అధిష్టానం ముందు సొంత డిమాండ్లు ఉంచాడు. సదానందకు రాష్ట్ర పార్టీ అధ్యక్ష పదవి, ఆయన శిబిరంలోని ఈశ్వరప్పకు ఉప ముఖ్యమంత్రి పదవి, ఇంకా మంత్రివర్గంలో సగం పదవులు కావాలని…

కర్ణాటకలో తెగిపడిన మరో తల -కార్టూన్

తమది భిన్నమైన పార్టీ (party with a difference) గా బి.జె.పి చెప్పుకుంటుంది. ఆచరణలో మాత్రం అంతేలేని విభేదాల పార్టీగా (party with unending differences) అనేకసార్లు రుజువు చేసుకుంది. బి.ఎస్.యెడ్యూరప్ప ఆశీస్సులతో సదానంద గౌడ కర్ణాటక ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించిన పదకొండు నెలలకే అదే యెడ్యూరప్ప ఆగ్రహానికి గురై పదవి కోల్పోవడం అందుకు నిదర్శనం. సదానంద గౌడ పదవీ ప్రమాణ స్వీకారోత్సవాన్ని 45 మంది ఎం.ఎల్.ఎ లతో సహా ఎగ్గొట్టిన జగదీష్ షెట్టర్,  యెడ్యూరప్ప అనుగ్రహం…

ఇంటర్నెట్ రేట్లు: కంపెనీలను వదిలి వినియోగదారులపై బాదుడు -కార్టూన్

కంపెనీలను ఏమీ చేయలేక సాధారణ వినియోగదారులకు ఇంటర్నెట్ ఛార్జీలు పెంచిన వైనం ఇది. బడా ఐ.ఎస్.పి (ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్) కంపెనీలకు అనేక లైసెన్సులు ఉంటాయి. ప్రభుత్వం, ఐ.ఎస్.పి ల ఒప్పందం ప్రకారం రెవిన్యూను పరస్పరం పంచుకోవాలి. డిఫరెన్షియల్ రెవిన్యూ షేరింగ్ గా పిలిచే ఈ పద్ధతి ప్రకారం పిండి కొద్దీ రొట్టె ముక్కను ప్రభుత్వానికి కంపెనీలు ఇవ్వాలి. ప్రభుత్వ వాటా వివిధ స్ధాయిల లైసెన్సులను బట్టి ఉంటుంది. కొన్ని లైసెన్సుల కింద వచ్చే ఆదాయంలో 6…

రాజకీయులను విమర్శించనిది ఇక ఎన్.సి.ఇ.ఆర్.టి పుస్తకాలే -కార్టూన్

అంబేద్కర్ కార్టూన్ పై రేగిన ‘అప్రజాస్వామిక రగడ’ చివరికి ఎన్.సి.ఇ.ఆర్.టి పాఠ్య పుస్తకాలనుండి కార్టూన్ లనూ, వివిధ పాఠ్య భాగాలనూ పూర్తిగా తొలగించాలనే దగ్గర తేలింది. ప్రభుత్వం నియమించిన ‘ఎస్.కె.ధోరట్’ ప్యానెల్ చర్చలు చేసి రాజకీయ శాస్త్ర పాఠ్య పుస్తకాల నుంది అనేక కార్టూన్ లను, పాఠ్య భాగాలనూ తొలగించాలని మెజారిటీ నిర్ణయం చేసింది. ఈ నిర్ణయాన్ని పలువురు స్కాలర్లు నిరసిస్తున్నారు. ప్రఖ్యాత చరిత్రకారుడు, జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ అయిన కె.ఎన్.ఫణిక్కర్ ప్యానెల్…

బి.జె.పి ఆట ఎవరితో? -కార్టూన్

కర్ణాటకలో సంక్షోభం ముదిరి పాకాన పడుతోందని పత్రికలు, ఛానెళ్ళు ఘోషిస్తున్నాయి. అవినీతి ఆరోపణలతో రాజీనామా చేయవలసి వచ్చిన మాజీ ముఖ్యమంత్రి యెడ్యూరప్ప రెట్టించిన బలంతో పార్టీ అధిష్టానాన్ని ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. ఇతర పార్టీలకంటే ‘విభిన్నమైనది’ గా చెప్పుకున్న ఆ పార్టీ క్రమంగా ‘విభేధాలకు నిలయం’ గా మారిపోయింది. అవినీతి ఆరోపణలకు గురయిన నాయకుడు నలుగురికీ ముఖం చూపించడానికి సిగ్గుపడడానికి బదులు ప్రజల ముందు ధీమాగా తిరుగుతూ వార్తల్లో వ్యక్తిగా నిలిచాడు. ఫలితంగా బి.జె.పి ప్రత్యర్ధి పార్టీలతో తలపడడానికి…

స్వేచ్ఛా పతనంలో ‘రూపాయి’ -కార్టూన్

రూపాయి జారుడుకి అంతులేకుండా పోతోంది. అమెరికన్ డాలర్ కి రు. 57.01/02 పై (రాయిటర్స్) వద్దకు రూపాయి విలువ చేరింది. 2011 మధ్య నుండి ప్రారంభం అయిన పతనం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. పతనాన్ని అడ్డుకోవడానికి మధ్య మధ్యలో ఆర్ధిక మంత్రిత్వ శాఖ, రిజర్వ్ బ్యాంకు లు పలు చర్యలు చేపట్టినా అవేవీ పని చేయలేదు. 2012 లోనే దాదాపు 7 శాతం వరకూ రూపాయి పతనం అయిందని బిజినెస్ పత్రికలు లెక్క కట్టాయి. ఆసియాలో భారత…

జి20, రియో సభలో మన్మోహన్ బడాయి -కార్టూన్

జి 20, రియో సభల కోసం ప్రధాని మన్మోహన్ వారం రోజుల పాటు ఉత్తర, దక్షిణ అమెరికాలు వెళ్లివచ్చాడు. మెక్సికో లో జి 20 సమావేశాలు జరగ్గా బ్రెజిల్ రాజధాని ‘రియో డి జనేరియో’ లో ‘రియో + 20’ పేరుతో ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో పర్యావరణ మార్పులపై సమావేశాలు జరిగాయి. గ్లోబల్ వార్మింగ్ పై 1992 లో మొదటి సారి ‘ఎర్త్ సమ్మిట్’ పేరుతో రియోలోనే ప్రపంచ దేశాల సమావేశాలు జరిగాయి. మళ్ళీ 20 సంవత్సరాల…

సైన్యం కనుసన్నల్లో పాకిస్ధాన్ ప్రజాస్వామ్యం -కార్టూన్

శైశవ దశలో ఉన్న పాకిస్ధాన్ ప్రజాస్వామ్యం మరోసారి మిలట్రీ అధికారం ముందు తలవంచింది. నిజానికి మిలట్రీ పాలన అయినా, సో కాల్డ్ పార్లమెంటరీ ప్రజాస్వామ్య పాలన అయినా ప్రజలకు ప్రజాస్వామ్యం దక్కే అవకాశాలు పెద్దగా మారవు. పాలక వర్గాల లోని వివిధ సెక్షన్ల మధ్య అధికారం కోసం జరిగే కుమ్ములాటలే ‘పార్లమెంటరీ ప్రజాస్వామ్యం’ గానూ, ‘మిలట్రీ పాలన’ గానూ వేషం వేసుకుని పాక్ ప్రజల ముందుకు వస్తున్నాయి. ఇరు పక్షాల పాలనలోనూ పాకిస్ధాన్ ప్రజలకు పెద్దగా ఒరిగిందేమీ…

కట్టెలమ్మిన చోట పూలమ్మనున్న ప్రణబ్ -కార్టూన్

పాలక కూటమి తరపున రాష్ట్రపతి పదవికి పోటీదారుడుగా ప్రణబ్ ముఖర్జీ ఖరారయ్యాడు. ఆర్ధికంగా సమస్యలు తీవ్రం అవుతున్న దశలోనే అనుభవజ్ఞుడయిన ప్రణబ్ ముఖర్జీని ఆర్ధిక మంత్రిగా వదులుకోవడానికి కాంగ్రెస్ పార్టీ సిద్దపడడం ఒకింత ఆశ్చర్యకరమే. అయితే మమత బెనర్జీ సహాయ నిరాకరణ, ఆంధ్ర ప్రదేశ్ లాంటి చోట్ల పార్టీ బాగా బలహీనపడుతుండడం లాంటి పలు కారణాల నేపధ్యంలో రానున్న రోజుల్లో కేంద్రంలో రాజకీయంగా గడ్డు పరిస్ధితులు ఎదురుకావచ్చని కాంగ్రెస్ భావిస్తున్నట్లు కనిపిస్తొంది. ప్రతిపక్ష ఎన్.డి.ఎ కూటమి అంతర్గత కుమ్ములాటలతో…

యు.పి.ఎ రాష్ట్రపతి అభ్యర్ధి ఎవరు? -కార్టూన్

కేంద్ర ప్రభుత్వంలో అధికారం నెరుపుతున్న యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయెన్స్ తమ రాష్ట్రపతి అభ్యర్ధిని ప్రకటించలేక మల్లగుల్లాలు పడుతోంది. కూటమి నాయకురాలు కాంగ్రెస్ కి, రెండవ అతి పెద్ద పార్టీ త్రిణమూల్ కాంగ్రెస్ నుండే షాక్ ట్రీట్ మెంట్ ఎదురయింది. కాంగ్రెస్ తన అభ్యర్ధిగా ప్రణబ్ ముఖర్జీని ప్రమోట్ చేస్తుండగానే, త్రిణమూల్, మాజీ రాష్ట్రపత్రి అబ్దుల్ కలాం ను తన ఫేఫరెట్ గా ప్రకటించింది. పనిలో పనిగా ప్రధాని మన్మోహన్ సింగ్ ను కూడా రాష్ట్రపతి పదవికి ఒక…

భారత దేశ సార్వభౌమాధికారంలోకి చొరబడుతున్న ఎస్&పి -కార్టూన్

ఎస్ & పి రేటింగ్ సంస్ధ పరిమితులను దాటుతోంది. ఎకనమిక్ ఫండమెంటల్స్ ను పరిశీలిస్తూ పెట్టుబడులు పెట్టడానికి మదుపుదారులకు మార్గదర్శకత్వం వహించే పాత్ర పరిమితులను దాటిపోయింది. ఇండియా క్రెడిట్ రేటింగ్ ని ‘ఇన్వెస్ట్ మెంట్ గ్రేడ్’ కంటే తగ్గిస్తామని హెచ్చరిస్తూ ఈ కంపెనీ, భారత ప్రభుత్వ నాయకత్వ సామర్ధ్యం పై కూడా తీర్పు ఇవ్వడానికి సిద్ధపడింది. జిడిపి వృద్ధి రేటు తగ్గిపోవడానికి కారణాలను మన్మోహన్ నాయకత్వంలోనూ, సోనియా గాంధి చొరబాటులోనూ వెతకడానికి ప్రయత్నించింది. రేటింగ్ ఇచ్చే పేరుతో…

మన్మోహన్ ప్రభుత్వానికి బరువవుతున్న చిదంబరం -కార్టూన్

కేంద్ర ప్రభుత్వంలో ముఖ్యమైన పదవిలో ఉన్న పి.చిదంబరం పై ‘అక్రమ ఎన్నిక’ కేసు కొనసాగించడానికి మద్రాసు హై కోర్టు నిర్ణయం తీసుకుంది. తన ఎన్నికపై పిటిషన్ ని కొట్టివేయాలంటూ చిదంబరం దాఖలు చేసుకున్న అభ్యర్ధనను కోర్టు తిరస్కరించింది. దానితో కేంద్ర మంత్రిగా చిదంబరాన్ని కొనసాగించాలా లేదా అన్నది మన్మోహన్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఆ అవసరాన్ని ప్రధాని గుర్తించాడో లేదో గానీ, గుర్తించకపోతే పుటుక్కున తెగి నెత్తిపైనే పడడం ఖాయంగా కనిపిస్తోంది.లేదంటే, రాజీనామా చేయాలన్న బి.జె.పి డిమాండ్…

‘అన్నా బృందం’ పయనం ఎటు? -కార్టూన్

భారత దేశ ‘రాజకీయ వ్యవస్ధ’, ‘బ్యూరోక్రసీ’ ల అవినీతి పై ‘ఉద్యమాస్త్రం’ ఎక్కు పెట్టిన అన్నా బృందాన్ని విడదీసి తేలిక చేయడంలో ఇరు వ్యవస్ధలూ సఫలం అయినట్లే కనిపిస్తోంది. ప్రధాని మన్మోహన్ సింగ్ బొగ్గు కుంభకోణంలో నిందితుడిగా అన్నా బృందం తాజాగా ఆరోపణలు చేయగా, సదరు ఆరోపణలను అన్నాయే ఆమోదించడం లేదని ఆయన ప్రకటనలు చెబుతున్నాయి. కర్ణాటక మాజీ లోకాయుక్త సంతోష్ హెగ్డే మన్మోహన్ పై ఆరోపణలను నమ్మలేకున్నాడు. స్వామి అగ్నివేశ్ తో సహా అనేకమంది బృందం సభ్యులు…