దక్షిణ చైనా సముద్రానికి అవసరమైతే బలగాలు పంపుతాం -ఇండియా
దక్షిణచైనా సముద్ర గొడవల్లో తానూ ఉన్నానని భారత ప్రభుత్వం మరోసారి చాటింది. భారత ప్రభుత్వ కంపెనీ ‘ఒ.ఎన్.జి.సి విదేశ్’ దక్షిణచైనా సముద్రంలో ఆయిల్ పరిశోధనలో పాల్గొంటున్నందున భారత వాణిజ్య ప్రయోజనాల పరిరక్షణకు అవసరమైతే ఇండియా కూడా తన బలగాలను పంపిస్తుందని భారత నేవీ చీఫ్ అడ్మిరల్ డి.కె.జోషి స్పష్టం చేశాడు. సరిహద్దు తగాదాపై చర్చించడానికి భారత జాతీయ భద్రతాధికారి శివశంకర్ మీనన్ చైనా పర్యటనలో ఉండగానే నేవీ చీఫ్ ప్రకటన ఒకింత ఆసక్తిని రేపింది. ప్రపంచ సముద్ర…