అసాంజే: బ్రిటన్ అప్పీలు తిరస్కరణ

వికీ లీక్స్ చీఫ్ ఎడిటర్ జులియన్ అసాంజే విడుదలకు మార్గం సుగమం అయినట్లే కనిపిస్తోంది. అసాంజేను వెంటనే విడుదల చేసి నష్టపరిహారం చెల్లించాలని కోరిన ఐరాస తీర్పుకు వ్యతిరేకంగా బ్రిటన్ చేసిన అప్పీలును ఐరాస రెండోసారి కూడా తిరస్కరించడంతో అయన విడుదల దాదాపు అనివార్యం అయింది. అయితే అసాంజేను విడుదల చేస్తారా లేదా మరో సాకు వెతికి పట్టుకుని నిర్బంధం కొనసాగిస్తారా అన్నది తెలియరాలేదు.  నాలుగు సంవత్సరాలుగా లండన్ లోని ఈక్వడార్ ఎంబసీలో అసాంజే బందీగా ఉన్న…

విభేదాల దేశాలకు నాయకత్వం -ద హిందూ..

[Leading the divided nations, ద ఎడిటోరియల్ – అక్టోబర్ 10,2016- కు యధాతధ అనువాదం.] ********* ఆంటోనియో గుతెయర్ ను సెక్రటరీ జనరల్ పదవికి నామినేట్ చేయడంలో ఐక్యరాజ్య సమితి భద్రతా సమితి కనబరచిన విశాల ఏకాభిప్రాయం, ప్రపంచం ఎదుర్కొంటున్న అనేక సంక్షోభాలతో తలపడటంలో మరింత పటిష్టమైన ఐరాస అవతరించే దిశలో శుభప్రదమైన ఆరంభం. గత వారం భద్రతా సమితిలోని 15 సభ్య దేశాలలో 13 -వీటో అధికారం ఉన్న ఐదు శాశ్వత సభ్య దేశాలతో…

ఐరాస కాన్వాయ్ పై దాడి అమెరికా పనేనా?

  సెప్టెంబర్ 19 తేదీన అలెప్పో ప్రాంతంలో ఐరాస హ్యుమానిటేరియన్ కాన్వాయ్ పై జరిగిన దాడి విషయమై సరికొత్త అంశాలు వెలుగులోకి వచ్చాయి. దాడి జరిగిన సమయంలో, ఆ సమయానికి ముందూ వెనకా, అలెప్పో ప్రాంతంలో రికార్డ్ అయిన ఫ్లయిట్ డేటా వివరాలను పరిశీలించిన రష్యన్ ప్రభుత్వం ఈ కొత్త వివరాలను వెల్లడి చేసింది.  అలెప్పో ప్రాంతం లోని ఉరుమ్ ఆల్-కుబ్రా ప్రాంతంలో ఐరాస కాన్వాయ్ ప్రయాణిస్తూ ఉండగా ఎయిర్ అటాక్ జరిగిందని ఐరాస తెలిపింది. ఆ…

ఆసాంజే నిర్బంధం నిరంకుశం -ఐరాస

వికీలీక్స్ వ్యవస్ధాపక ఎడిటర్ జులియన్ ఆసాంజే నిర్బంధం చట్ట విరుద్ధంగా ఐక్యరాజ్యసమితి నిర్ధారించింది. ఆసాంజే దాఖలు చేసిన పిటిషన్ ను విచారించిన ఐరాస కమిటీ ఈ మేరకు ఒక నిర్ధారణ వచ్చిందని రాయిటర్స్ వార్తా సంస్ధ తెలిపింది. అయితే కమిటీ నిర్ణయాన్ని అధికారికంగా శుక్రవారం ప్రకటిస్తారని పత్రిక తెలిపింది. స్వీడన్ లో దాఖలయిన ఒక తప్పుడు కేసు దరిమిలా లండన్ లోని ఈక్వడార్ ఎంబసీలో గత నాలుగు సంవత్సరాలుగా లండన్ పోలీసు నిర్బంధంలో ఆసాంజే గడుపుతున్నాడు. ఆసాంజేను…

గ్రెక్సిట్: బ్రిటన్ పెనం నుండి అమెరికా పొయ్యి లోకి -7

6వ భాగం తరువాత…………… ఇ.ఎల్.ఏ.ఎస్ బలగాలు ఏథెన్స్ పై అంతకంతకూ పట్టు బిగిస్తూ పోయాయి. దాదాపు ఏథెన్స్ లోని పోలీసు స్టేషన్లన్నింటినీ స్వాధీనంలోకి తెచ్చుకున్నాయి. చివరికి 3 చదరపు కి.మీ భాగమే బ్రిటిష్ తాబేదారు ప్రభుత్వానికి మిగిలింది. గ్రీసులోని ఇతర ప్రాంతాల్లో పోరాటం చేయాల్సిన అవసరం ఇ.ఎల్.ఏ.ఎస్ కు లేదు. ఒక్క ఎపిరస్ తప్ప గ్రీసు అంతా దాని ఆధీనంలోనే ఉంది. సరిగ్గా ఈ సమయంలో ఇ.ఎల్.ఏ.ఎస్ ఘోరమైన తప్పిడానికి పాల్పడింది. ఇక ఏథెన్స్ తమ వశం…

పోషక లోపం: ప్రపంచంలో 25% ఇండియాలోనే

ప్రపంచవ్యాపితంగా పోషకాహార లోపంతో బాధపడుతున్నవారు 100 మంది ఉంటే అందులో 25 మంది భారత దేశంలోనే ఉన్నారు. ఐక్యరాజ్యసమితి ఆహార మరియు వ్యవసాయ సంస్ధ (UNFAO) నివేదిక తెలిపింది. ఈ రోజు వెలువడిన నివేదిక ప్రకారం ప్రపంచంలో పోషకాహార లోపంతో బాధపడుతున్నవారి సంఖ్య అత్యధికంగా ఇండియాలోనే ఉన్నారు. ఇండియా తర్వాత స్ధానంలో జి.డి.పిలో అమెరికాతో పోటీ పడుతున్న చైనా నిలవడం గమనార్హం. 21వ దశాబ్దం ఆరంభంలో ఇండియా, చైనాలు సాధించిన వేగవంతమైన జి.డి.పి వృద్ధి ఆ దేశాల్లో…

కాశ్మీర్: ఇండియా అవగాహనకు దూరమౌతున్న అమెరికా!

జమ్ము&కాశ్మీర్ రాష్ట్రం విషయంలో ఇండియా అవలంబిస్తున్న అవగాహనకు అమెరికా అనుకూలమా, వ్యతిరేకమా? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడం అంత తేలికేమీ కాదు. పశ్చిమ రాజ్యాధినేతలు దక్షిణాసియా పర్యటనకు వచ్చినప్పుడల్లా ఇండియాలో ఇండియాకు కావలసిన మాటలు, పాకిస్ధాన్ లో పాకిస్ధాన్ కు కావలసిన మాటలు చెప్పి తమ పనులు చక్కబెట్టుకొని పోవడం పరిపాటి. మొదటిసారిగా అమెరికా సెనేటర్లు కొందరు ఇండియాలో ఇండియా వ్యతిరేక అవగాహన ప్రకటించిన ఘటన చోటు చేసుకుంది. సమస్యలు లేని చోట కూడా సమస్యలు పుట్టించి…

ప్రశ్న: UNSC శాశ్వత సభ్యత్వం వల్ల ఉపయోగం?

వి లక్ష్మి నారాయణ: ఐక్యరాజ్య సమితి బద్రతా మండలి లో శాశ్వత సభ్యత్వం వల్ల ఉపయోగాలు ఏంటి? ఇండియాకి ఎందుకు మెంబర్ షిప్ ఇవ్వలేదు, సభ్యత్వం కోసం వేరే సభ్య దేశాలు రికమెండ్ చేయాలా? ఈ టాపిక్ గురించి తెలియ చేయగలరు. ఇంతకుముందు చర్చించి ఉంటె ఆ లింక్ షేర్ చేయండి. సమాధానం: ఈ టాపిక్ ఇంతకు ముందు ప్రత్యేకంగా కవర్ చేయలేదు. అయితే, ఇతర ఆర్టికల్స్ లో భాగంగా కొంత రాశాను. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి…

పశ్చిమాసియాలో అంతులేని ఘర్షణ -ది హిందూ సంపాదకీయం

పాలస్టీనియన్ హమాస్ రాకెట్ దాడుల అనంతరం, ఇజ్రాయెల్ నిరవధిక వాయుదాడులు ప్రారంభించిన దరిమిలా గాజాలో మృత్యువు మళ్ళీ విలయతాండవం చేస్తోంది. హమాస్ దాడులకు ప్రతిస్పందనగా (ఇజ్రాయెల్) సాగిస్తున్న బలప్రయోగం పూర్తిగా విషమానుపాతం (disproportionate) ఉన్న సంగతి (మరణాల) సంఖ్యలోనే స్పష్టం అవుతోంది. హమాస్, 500 పైగా రాకెట్ దాడులు చేసినప్పటికీ ఇజ్రాయెల్ లో ఒక్క మరణమూ సంభవించలేదు. కానీ అందుకు పూర్తి విరుద్ధంగా ఇజ్రాయెల్ దాడుల్లో 165 మంది (తాజా సంఖ్య 200 పైనే) పాలస్తీనీయులు ప్రాణాలు…

న్యూట్రల్ ఓటుతో భారత జాలర్లను విడుదల చేసిన శ్రీలంక

ఐరాస మానవ హక్కుల సంస్ధలో ఇండియా శ్రీలంకకు అనుకూలంగా వ్యవహరించడంతో శ్రీలంక కృతజ్ఞత చూపింది. భారత్ చర్యకు కృతజ్ఞతగా శ్రీలంక జైళ్ళలో మగ్గుతున్న 98 మంది జాలర్లను విడుదల చేసింది. ఐరాసలో భారత దేశం అనుసరించిన వైఖరికి ప్రతి సుహృద్భావ చర్యగానే భారత జాలర్లను విడుదల చేస్తున్నామని చెప్పి మరీ విడుదల చేసింది. ఉపఖండంలో మారుతున్న ధోరణులకు భారత్-శ్రీలంక చర్యలు అద్దం పడుతున్నాయి. ఐరాస మానవ హక్కుల సంస్ధ (United Nations Human Rights Commission) లో…

మావాళ్లని విడిపించండి -ఐరాసకు ఇటలీ మొర

ఇండియాకు వ్యతిరేకంగా ఇటలీ తొక్కని గడప లేదు. ఇద్దరు భారతీయ జాలర్లను సముద్ర దొంగలుగా భావించి కాల్చి చంపిన ఇటలీ మెరైన్ల కేసులో ఇప్పటికే యూరోపియన్ యూనియన్ కు మొర పెట్టుకున్న ఇటలీ తాజాగా ఐక్యరాజ్యసమితి గడప తొక్కింది. భారత దేశం బందిఖానా నుండి తమ మెరైన్లను మీరయినా విడిపించాలని ఐరాసను కోరింది. “మెరైన్లను ఇటలీలో విచారించడానికి మేము సిద్ధంగా ఉన్నాము. కానీ ఈ లోగా వారికి (భారత దేశం నుండి) విముక్తి కావాలి” అని ఇటలీ…

పేలలేదు, కూలలేదు -ఐరాస

మలేషియా విమానం ‘ఫ్లైట్ MH370’ గాలిలో పేలిపోయిందనడానికి గానీ, సముద్రంలో కూలిపోయిందనడానికి గానీ సాక్ష్యాలు లేవని ఐరాసకు చెందిన సంస్ధ CTBTO ప్రకటించింది. ‘సమగ్ర (అణు) పరీక్షల నిషేధ ఒప్పంద సంస్ధ’ (Comprehensive Test Ban Treaty Organisation) ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో నెలకొల్పిన పరిశీలనా కేంద్రాలేవీ విమానం కూలిపోయిన జాడలు గానీ, పేలిపోయిన జాడలను గాని రికార్డు చేయలేదని ఐరాస సెక్రటరీ జనరల్ బాన్-కి-మూన్ ప్రతినిధి స్టెఫాన్ డుజరిక్ ప్రకటించారు. విమానం సముద్రంలో కూలినా, నేలపై…

జెనీవా 2: అమెరికా, యు.ఎన్ లను కడిగేసిన సిరియా

స్విట్జర్లాండ్ నగరం మాంట్రియక్స్ లో ‘జెనీవా 2’ ముందరి చర్చలు ప్రారంభం అయ్యాయి. సిరియా కిరాయి తిరుగుబాటుకు సంబంధించి అమెరికా, రష్యాలు దాదాపు సంవత్సరం క్రితం ఏర్పాటు చేయతలపెట్టిన చర్చలివి. జెనీవా 2 పేరుతో జనవరి 24 నుండి జరగనున్న చర్చలకు ప్రిపరేటరీ సమావేశాలుగా మాంట్రియక్స్ లో చర్చలు జరుగుతున్నాయి. ఈ సమావేశాలకు ఇరాన్ ను కూడా ఆహ్వానించిన ఐరాస నేత బాన్ కి-మూన్ సోకాల్డ్ సిరియా ప్రతిపక్షాలు, అమెరికా వ్యతిరేకించడంతో ఇరాన్ కి ఇచ్చిన ఆహ్వానాన్ని…

అమెరికా డ్రోన్ దాడుల్లో వందల పౌరులు బలి -ఐరాస

టెర్రరిస్టుల పేరు చెప్పి అమెరికా సాగిస్తున్న చట్ట విరుద్ధ డ్రోన్ దాడుల్లో వేలాది మంది పౌరులు మరణిస్తున్నారని ఐరాస ప్రత్యేక నివేదిక పేర్కొంది. అమెరికా పైకి చెబుతున్న సంఖ్య కంటే 10 రెట్లు అమాయక పౌరులు డ్రోన్ దాడుల్లో మరణిస్తున్నారని ఐరాస ప్రత్యేక ప్రతినిధి విడుదల చేసిన నివేదిక స్పష్టం చేసింది. ఐరాస నిర్వహిస్తున్న దర్యాప్తుకు కూడా అమెరికా సహకరించడం లేదని ఐరాస ప్రత్యేక ప్రతినిధి (special rapporteur) బెన్ ఎమర్శన్ విడుదల చేసిన 24 పేజీల…

ఆకలికి నకనకలాడుతున్నవారు 84 కోట్లు -ఐరాస

తీవ్ర ఆకలితో (chronic hunger) అలమటిస్తున్నవారు ప్రపంచంలో 84.2 కోట్లమందని ఐరాస ప్రకటించిన నివేదిక ఒకటి తెలిపింది. 2010-12 కాలంలో ఈ సంఖ్య 86.8 కోట్లని, 2011-13 కాలంలో అది 2.6 కోట్లు తగ్గిందని సదరు నివేదిక తెలిపింది. కాగా అభివృద్ధి చెందిన దేశాల్లో తీవ్రంగా ఆకలిగొన్నవారు 1.57 కోట్లమంది ఉండడం గమనార్హం. ‘ప్రపంచంలో ఆహార అబధ్రత పరిస్ధితి’ అన్న నివేదికలో ఐరాస ఈ అంశాలను తెలియజేసింది. ఐరాసలోని ఆహార విభాగం ఎఫ్.ఎ.ఓ (Food and Agricultural…