కాశ్మీర్ లో వింత ప్రభుత్వం -కార్టూన్

ఎన్నికలు జరిగిన 2 నెలలకు గాని జమ్ము & కాశ్మీర్ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడలేదు. రాష్ట్ర ప్రజలు ఏ పార్టీకి మెజారిటీ ఇవ్వకపోవడంతో, ముఖ్యంగా సెక్యులర్ ముద్ర కలిగిన కాంగ్రెస్ ప్రభ పడిపోవడంతో ప్రభుత్వ ఏర్పాటుకు విపత్కరమైన ఆటంకాలు ఎదురయ్యాయి. ఈ ఆటంకాలే కారణం అవునో కాదో ఇదమిద్ధంగా చెప్పలేం గానీ, ఓ వింత ప్రభుత్వం ఏర్పడిందన్న ఆలోచన మాత్రం పలువురికి కలుగుతోంది. వింత ప్రభుత్వం అనడం ఎందుకంటే ‘ఒక అంగీకారానికి వచ్చాం, కనీస ఉమ్మడి కార్యక్రమం…

జస్టిస్ వర్మ కమిటీ సిఫారసులు నీరు కార్చుతూ ప్రభుత్వ ఆర్డినెన్స్

అనుకున్నదే అయింది. ఢిల్లీ బస్సు సామూహిక అత్యాచారం తర్వాత మాటల్లో, హామీల్లో అగ్ని కణాలు రువ్విన ప్రభుత్వ పెద్దలు చేతల్లో తుస్సుమనిపించారు. మహిళల భద్రతకే తమ ప్రభుత్వం ప్రధమ ప్రాధాన్యం ఇస్తుందని డంబాలు పలికిన ప్రధాని మన్మోహన్, యుపిఎ చైర్ పర్సన్ సోనియా గాంధీలు జస్టిస్ వర్మ కమిటీలోని ప్రధాన సిఫారసులను గాలికి వదిలేశారు. ప్రధాన సిఫారసులను నిరాకరించిన అప్రతిష్టను కప్పిపుచ్చుకోవడానికో యేమో తెలియదు గానీ వర్మ కమిటీ నిరాకరించిన మరణ శిక్షను అరుదైన కేసుల్లో విధించడానికి…

పాలనా వైఫల్యమే మహిళలపై నేరాలకు మూల హేతువు –జస్టిస్ వర్మ కమిటీ

80,000కు పైగా సలహాలు, సూచనలు అందుకున్న జస్టిస్ వర్మ కమిటీ 29 రోజుల్లోనే వాటన్నిటినీ క్షుణ్ణంగా పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. మహిళలపై జరుగుతున్న లైంగిక నేరాలను నివారించడానికి వీలుగా చట్టాల మెరుగుదలకు తగిన సిఫారసులు చేయడానికి 30 రోజుల గడువు కోరిన జస్టిస్ వర్మ కమిటీ ఒక రోజు ముందుగానే నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి ఇచ్చింది. కాశ్మీరు, ఈశాన్య రాష్ట్రాలు లాంటి సంఘర్షణాత్మక ప్రాంతాల్లో ప్రభుత్వాలు అమలు చేస్తున్న నల్ల చట్టాలు అడ్డు పెట్టుకుని…

మణిపూర్ ఇండియా వలసలా ఉంది తప్ప రాష్ట్రంలా లేదు -అమెరికా రాయబారి (వికీలీక్స్)

ఇండియా ఈశాన్య ప్రాంతంలో ఉన్న మణిపూర్ రాష్ట్రం ఇండియాలో భాగమైన ఒక రాష్ట్రం కంటే ఇండియా ఆక్రమించుకున్న ఒక వలస ప్రాంతం వలె ఉందని మణిపూర్ సందర్శించిన తర్వాత అమెరికా రాయబారి తమ ప్రభుత్వానికి పంపిన కేబుల్ లో రాశాడు. మిలట్రీ, పారా మిలట్రీ, పోలీసులు అడుగుడునా ఉన్న మణిపూర్ ని చూసి అది ఇండియా ఆక్రమణలో ఉన్న భావన కలిగిందని రాయబారి రాశాడు. 2006 సంవత్సరంలో మణిపూర్ రాష్ట్రాన్ని సందర్శించాక కోల్ కతా లోని అమెరికా…