ఎల్ నినో: ఈ జులై, చరిత్రలో అత్యధిక వేడిమి నెల

ఉష్ణోగ్రతలు నమోదు చేయడం మొదలు పెట్టిన దగ్గరి నుండి 2016 సంవత్సరం లోని జులై నెల అత్యంత వేడి నెలగా రికార్డు సృష్టించిందని అమెరికా ప్రభుత్వ శాస్త్రవేత్తలు ప్రకటించారు. ఉష్ణోగ్రతలు నమోదు చేయడం 137 సంవత్సరాల క్రితం ప్రారంభం అయిందని, ఇన్నేళ్లలో ఈ యేటి జులైలో ప్రపంచ వ్యాపితంగా అత్యధిక ఉష్ణోగ్రతలు రికార్డ్ అయ్యాయని వారు తెలిపారు. యే సంవత్సరం తీసుకున్నా, జులై నెలలో అధిక ఉష్ణోగ్రతలు రికార్డు కావడం రివాజు అని అమెరికా శాస్త్రవేత్తలు చెప్పడం…

కరువు.. మీకు పట్టదా కేంద్రం గారూ! -కత్తిరింపు

ఎల్ నినో కారణమో మరింకేం గాడిద కారణమో జనానికి అనవసరం. వారికి తెలిసింది వర్షాలు పడకపోవడమే. వర్షారాధార వ్యవసాయం సాగకపోవడమే. భారత దేశంలో వ్యవసాయం సాగకపోతే 75 శాతం జనం ప్రభావితులవుతారు. వాతావరణ శాస్త్రవేత్తలు అంచనా వేసినట్లుగా ఖరీఫ్ వానలు (నైరుతి ఋతుపవనాలు) శీతకన్ను వేయడంతో అనేక రాష్ట్రాలు దుర్భిక్షంతో సతమతం అవుతున్నాయి. అందులో తెలుగు రాష్ట్రాలు రెండూ ఉన్నాయి. గొప్పకు పోయి, హిందూత్వ స్ఫూర్తితో మన రాష్ట్రాల పాలకులు నదీ జలాలని పుష్కర మాతకు సమర్పించుకున్నారు.…

చెన్నైపై లంగరు వేసిన అల్ప పీడనం -కార్టూన్

నవంబర్ 8 తేదీ నుండి కురుస్తున్న వర్షాలు చెన్నై నగరాన్ని ముంచివేసి నగర జీవనాన్ని అస్తవ్యస్తం చేస్తున్నాయి. వరుస పెట్టి దాడి చేసిన రెండు అల్ప పీడనాలు ఈ వర్షాలకు కారణం. అల్ప పీడనాలు కొత్తేమీ కాదు. అల్ప పీడనాలు ఏర్పడితేనే వర్షాలు కురుస్తాయి. కానీ ఈ తరహాలో ఊహించని రీతిలో వర్షపాతం ఇచ్చే అల్ప పీడనాలే కొత్త. ఎల్-నినో పుణ్యమా అని ఈ యేడు నైరుతి ఋతుపవనాలు పెద్దగా వర్షాలను ఇవ్వలేదు. దేశం మొత్తం మీద…

ఎల్-నినో: ఋతుపవనాలు ఆలస్యం

పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడిన ఎల్-నినో వాతావరణ ప్రభావం ఫలితంగా ఈ యేడు భారత దేశానికి ఋతుపవనాలు ఆలస్యంగా వస్తున్నాయి. జూన్ 1 తేదీకల్లా నైరుతి ఋతుపవనాలు కేరళలో ప్రవేశించాల్సి ఉండగా ఇంతవరకు వాటి జాడలేదు. ఐదు రోజులు ఆలస్యంగా జూన్ 5,6 తేదీల్లో కేరళలోకి ఋతుపవనాలు ప్రవేశించవచ్చని వాతావరణ సంస్ధ అధికారులు ఈ రోజు (జూన్ 1) తెలిపారు. మూడింట రెండు వంతుల జనాభా వ్యవసాయ రంగంపై ఆధారపడి జీవిస్తున్న భారత దేశంలో నీటి పారుదల వసతులు…

వేడిగాలులకి 1100 మంది బలి -ఫోటోలు

భారత దేశాన్ని, అందునా దక్షిణ భారతాన్ని, అందులోనూ తెలుగు రాష్ట్రాలైన ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలను వేడి గాలులు పట్టి ఊపేస్తున్నాయి. గత వారం రోజుల్లోనే వెయ్యికి పైగా ప్రజలు వడగాలులకు బలైపోగా మొత్తం మీద ఈ వేసవి కాలంలో వడదెబ్బకు గురై మరణించినవారి సంఖ్య 1100 దాటి పోయిందని జాతీయ, అంతర్జాతీయ పత్రికలు తెలిపాయి. దాదాపు ప్రతి అంతర్జాతీయ వార్తా సంస్ధ భారత దేశంలో వేడి గాలుల గురించి గత కొద్ది రోజులుగా తప్పనిసరిగా వార్తలు…

ఎల్ నినో, లా నినా అంటే?

ప్రశ్న (నాగ మల్లేశ్వరరావు): ఎల్ నినో, లా నినా అంటే ఏమిటో తెలుగులో వివరించగలరు. సమాధానం: ఇవి రెండూ ప్రపంచ వాతావరణ పరిస్ధితులకు సంబంధించినవన్న సంగతి చాలా మందికి తెలుసు గానీ అవి నిర్దిష్టంగా ఎందుకు ఏర్పడుతాయో తెలియదు. నిజానికి శాస్త్రవేత్తలకు కూడా పూర్తిగా వీటి గురించి తెలియదు. 17వ శతాబ్దం ప్రారంభంలో దక్షిణ అమెరికా ఖండం పశ్చిమ తీరంలోని మత్స్యకారులు ఈ వాతావరణ పరిస్ధితిని మొదటిసారి కనుగొన్నారని రికార్డులు చెబుతున్నాయి. అప్పటి నుండీ శాస్త్రవేత్తలు వీటిపై…