మోడీ పైనే బాబు ఎన్నికల హామీల భారం! -కార్టూన్

ఎన్నికల గెలుపు తాలూకు మత్తు నాయకులను ఇప్పుడిప్పుడే వదులుతున్నట్లుంది! కేంద్రంలో బి.జె.పి/మోడి, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో తెలుగు దేశం సాధించిన విజయాలు మోడి, చంద్రబాబు నాయుడుల చలవే అని పత్రికలు ఘోషిస్తున్నాయి. మోడీయే లేకపోతే బి.జె.పికి ఈ గెలుపు దక్కి ఉండేది కాదని మామూలుగా మోడిని విమర్శించే పత్రికలు కూడా ఇప్పుడు అంగీకరిస్తున్నాయి. మోడి గాలి తుఫానులా తాకి కాంగ్రెస్ ని ఊడలతో సహా పెరిగివేసిందని, చంద్రబాబు పడిన పాదయాత్ర కష్టం టి.డి.పి ని తిరిగి అధికారంలోకి…

ఎఎపిలో లుకలుకలు, ఎ.కె అరెస్టుతో గట్టెక్కే ప్రయత్నం!

సాధారణ ఎన్నికలు ముగియడంతో ఓటమి చెందిన పార్టీలు కాసింత సంక్షోభానికి లోను కావడం మామూలే. అయితే అది సాధారణ, సాంప్రదాయ పార్టీలకు సంబంధించిన వ్యవహారం. అక్కడ స్వార్ధ ప్రయోజనాల కోసమే చేరికలు, దూకుళ్ళు ఉంటాయి. కానీ ఆం ఆద్మీ పార్టీ అలాంటి పార్టీ కాదు లేదా కనీసం ఆ పార్టీ నాయకులు అలా చెబుతారు. అద్భుతాలేమీ సృష్టించకపోయినా కనీసం గణనీయ మొత్తంలోనయినా లోక్ సభ సీట్లు సాధిస్తుందని అంచనా వేసిన ఎఎపి కేవలం 4 సీట్లు మాత్రమే…

మోడికి బహిరంగ లేఖ -గోపాలకృష్ణ గాంధీ 2

పశ్చిమ పంజాబ్ నుండి తరిమివేయబడ్డ సిక్కులు, హిందువులకు మల్లే, కాశ్మీరీ పండిట్లకు మల్లే భారత దేశంలోని మైనారిటీలు అందరూ, ఒక్క ముస్లింలు మాత్రమే కాదు సుమా, తమ మనో ఫలకాలపై గాయపడ్డ చారికలు కలిగి ఉన్నారు. నిజంగానే జరుగుతాయో లేక ఉద్దేశ్యపూర్వకంగా రెచ్చగొట్టినందువల్ల జరుగుతాయో… అకస్మాత్తుగా అల్లర్లు జరగొచ్చన్న భయం, అవి మళ్ళీ మరిన్ని రెట్లు పగ సాధింపు పేరుతో తిరిగి తలుపు తడతాయన్న భయం, వారిని పట్టి పీడిస్తోంది. అవి మహిళలను అత్యంత ప్రత్యేకంగా లక్ష్యం…

నరేంద్ర మోడీకి బహిరంగ లేఖ -గోపాలకృష్ణ గాంధీ -1

(గోపాల కృష్ణ గాంధీ మాజీ ఐ.ఏ.ఎస్ అధికారి మరియు రాయబారి. 2004-2009 మధ్య పశ్చిమ బెంగాల్ గవర్నర్ గానూ, 2005-2006 మధ్య బీహార్ అఫీషియేటింగ్ గవర్నర్ గానూ పని చేశారు. ఆయన మహాత్మా గాంధీ మనుమడు కూడా. ది హిందూ పత్రికకు ఆయన రాసిన వ్యాసానికి ఇది యధాతధ అనువాదం. -విశేఖర్)  ప్రియమైన ప్రైమ్ మినిస్టర్-డిసిగ్నేట్, నా హృదయపూర్వక అభినందనలతో ఈ లేఖ రాస్తున్నాను. నిజాయితీగానే నేనిలా భావిస్తూ మీకు చెబుతున్నాను. ఇలా (అభినందనలు) చెప్పడం నాకు…

ఎన్నికలయిపోయిన తర్వాత దేశమంతా ఎలాగుంటుంది? -పతంజలి

దీనిని పతంజలి, ఉదయం దినపత్రికలో, 29.12.1984 తేదీన రాశారంట. ఈ నాటి పరిస్ధితులకు కూడా ఇంకా ఎంత చక్కగా సరిపోయిందో చూడండి.: https://www.facebook.com/loknath.kovuru/posts/4175978093833 -తిరుపాలు ***          ***           ***          *** ఎన్నికలై పోయిన తర్వాత దేశమంతా ఎలాగుంటుంది? దగాపడిన ఒక ఆడకూతురిలా వుంటుంది! దొంగ నవ్వుల బ్రోకర్ని నమ్మేసి అమాయకంగా రైలేక్కిపోయిన పల్లెటూరి పిల్లలాగ ఉంటుంది దేశం. ఎన్నికలు పూర్తయిపోయిన తర్వాత దేశం ఎలాగుంటుంది తీరని కోరికలతో లక్ష బ్యాలెట్ పత్రాల నోము నోస్తున్న బాల వితంతువులాగా వుంటుంది…

బీహార్ ని ఇంకా వదలని మోడి సుడి -కార్టూన్

ఎన్నికల ఫలితాల ప్రభావం బీహార్ ని ఇంకా వదలడం లేదు. మోడి సృష్టించారని చెబుతున్న సుడిగాలికి లాలూ, కాంగ్రెస్ కూటమితో పాటు అధికార పార్టీ కూడా కుదేలు కావడం ఒక విషయం కాగా ప్రభుత్వంలో పుట్టిన ముసలం మరో సంగతి. ఘోరమైన ఎన్నికల ఓటమికి బాధ్యత వహిస్తూ బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ రాజీనామా చేయడంతో రాజకీయ సంక్షోభం కాస్తా పాలనా సంక్షోభంగా మారిపోయింది. నితీష్ కుమార్ రాజీనామాను బి.జె.పి మిత్రుడు, లోక్ జన శక్తి పార్టీ…

హిందూత్వ డిమాండ్లకు రాజ్యాంగ మద్దతు ఉంది -ఆర్.ఎస్.ఎస్

బి.జె.పి మొదటిసారి సొంతగా మెజారిటీ సాధించిన నేపధ్యంలో ఆ పార్టీ మాతృ సంస్ధ ఆర్.ఎస్.ఎస్ ఆశలు మోసులెత్తుతున్నాయి. హిందూత్వ డిమాండ్లను మోడి నెరవేర్చాల్సిందేనని ఆర్.ఎస్.ఎస్ అగ్రనేతలు స్పష్టం చేస్తున్నారు. బి.జె.పి మేనిఫెస్టోలో సాంస్కృతిక విభాగంలోకి నెట్టివేశామని ఎన్నికలకు ముందు చెప్పిన హిందూత్వ డిమాండ్లు ఇప్పుడు కేంద్ర స్ధానానికి తెచ్చే ప్రయత్నంలో ఆర్.ఎస్.ఎస్ ఉన్నదని సంస్ధ సిద్ధాంత కర్త ఎం.జి.వైద్య మాటల ద్వారా అర్ధం అవుతోంది. “అయోధ్యలో రామ మందిరం, ఉమ్మడి పౌర స్మృతి, ఆర్టికల్ 370 రద్దు……

పునఃప్రచురణ: కొత్త ప్రభుత్వానికి పశ్చిమ దేశాల డిమాండ్లివి

(ఈ ఆర్టికల్ గత ఏప్రిల్ 24 తేదీన రెండు భాగాలుగా ప్రచురించబడింది. ఎన్నికల ఫలితాలు వెలువడిన నేపధ్యంలో రెండింటినీ కలిపి ఒకే ఆర్టికల్ గా పునఃప్రచురిస్తున్నాను -విశేఖర్) భారత దేశంలో ఏర్పడబోయే కొత్త ప్రభుత్వం కోసం ఆత్రం ఎదురు చూస్తున్నది ఎవరు? భారత ప్రజలైతే కాదు. ఎందుకంటే వారిలాంటి ఎన్నికల్ని అనేకం చూశారు. ఎన్నికల వల్ల, ఎన్నికల తర్వాత వచ్చే కొత్త ప్రభుత్వాల వల్లా తమకు కొత్తగా ఒరిగేది ఏమీ లేదని వారికి ఎప్పుడో అర్ధమైపోయింది. కొత్త…

కాంగ్రెస్: ఓటమి సంపూర్ణం – బి.జె.పి: కరువు తీరింది

కాంగ్రెస్ పార్టీ తన రాజకీయ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా మట్టి కరిచింది. సంపూర్ణంగా ఓటమి పాలయింది. మరోవైపు బి.జె.పికి కరువుతీరా విజయం లభించింది. ఎన్.డి.ఏ కూటమి భాగస్వామ్య పార్టీలతో సంబంధం లేకుండానే సొంతంగా ప్రభుత్వ ఏర్పాటు చేయగల సీట్లను సంపాదించేవైపుగా బి.జె.పికి సీట్లు వస్తాయని ఫలితాల సరళి చెబుతోంది. కాంగ్రెస్ వ్యతిరేక ఓటుతో పాటు బి.జె.పి అనుసరించిన ప్రచార ఎత్తుగడలు ఆ పార్టీకి అమితంగా ఉపయోగపడ్డాయని స్పష్టం అవుతోంది. ఎగ్జిట్ పోల్స్ మాత్రం ఈసారి కూడా…

EXIT: బయటకు దారి -కార్టూన్

ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు దేన్ని సూచిస్తున్నాయో ఈ కార్టూన్ చెబుతోంది. కానీ బయటకు వెళ్ళే పెద్దాయనా, లోపలికి వస్తున్న మరో పెద్దాయనా ఇద్దరూ ఇంకా గడప దాటకుండా కార్టూనిస్టు జాగ్రత్త పడ్డారు, ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు అధికారిక ఎన్నికల ఫలితాలు కాదు గనక! ప్రధాని మన్మోహన్ ఇప్పుడు సంచి సర్దుకుంటున్నట్లు చూపారు గానీ నిజానికి ఆయన ఎప్పుడో మకాం మార్చేశారు. ఒకవేళ యు.పి.ఏ III ప్రభుత్వం ఏర్పడ్డా ఆయన మాత్రం ప్రధాని నివాసం ఖాళీ చేయక తప్పదు.…

రోడ్ షోలు సాధించింది ఇదీ -కార్టూన్

“ఆ రోడ్ షోల వల్ల కంటికి బాగా కనిపిస్తున్న ప్రభావం ఇదే…” *** గతంలో ఎన్నికల ప్రచారాలు జనానికి కాస్త అర్ధం అయ్యేలా ఉండేవి. కరపత్రాలు వేసి పంచేవాళ్లు. తాము ఏమి చేస్తామో అందులో చెప్పేవాళ్లు. మీటింగులు పెట్టినా, కనీసం ఇందిరా గాంధీ కాలం వరకైనా, జనాలు స్వచ్ఛందంగా వెళ్ళేవాళ్లు. ఇందిరా వ్యతిరేక నాయకులు వచ్చి మీటింగు పెడితే ఇందిరా అనుకూలురు కూడా వెళ్ళి వినేవాళ్ళు. అలాగే ఇతర నాయకుల విషయంలోనూ జరిగేది. నాయకుల సభలకు పార్టీల…

ఎగ్జిట్ పోల్స్: ఎగిరెగిరి పడుతున్న స్టాక్ మార్కెట్లు

ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఎన్.డి.ఏ/బి.జె.పి/నరేంద్ర మోడి ప్రభుత్వం రాకను సూచించడంతో స్టాక్ మార్కెట్లు ఆనందంతో ఉరకలు వేస్తున్నాయి. ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఎన్.డి.ఏ కి అనుకూలంగా ఉండవచ్చన్న అంచనాతో సోమవారం భారీ లాభాలను నమోదు చేసిన జాతీయ స్టాక్ మార్కెట్లు తమ అంచనా నిజం కావడంతో మంగళవారం కూడా అదే ఊపు కొనసాగించాయి. దానితో స్టాక్ మార్కెట్లు సరికొత్త రికార్డులు నమోదు చేశాయి. కాగా ఎన్.డి.ఏ ప్రభుత్వం ధనిక వర్గాలకు, కార్పొరేట్ కంపెనీలకు లాభకరం అని స్టాక్…

ట్విట్టర్ లో విజేతలు మోడి, ఎఎపి -ది హిందు

గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి ఎన్నికల్లో ఇంటర్నెట్ లోని ఐ.టి కంపెనీలు భారత సాధారణ ఎన్నికల్లో ఒక ముఖ్య పాత్ర పోషించాయి. బి.జె.పి ప్రధాని అభ్యర్ధి నరేంద్ర మోడి ఇంటర్నెట్ ను కూడా ఇమేజ్ బిల్డప్ కోసం ప్రతిభావంతంగా వినియోగించు కోవడం మొదలు పెట్టిన ఈ ధోరణిని ఇతర పార్టీల నేతలు కూడా అనుసరించడంతో ఫేస్ బుక్, ట్విట్టర్, గూగుల్ ప్లస్ లాంటి సోషల్ నెట్ వర్క్ వెబ్ సైట్లు ఎన్నికల పోరాటానికి వర్చువల్ వేదికలుగా…

ఇక పునర్దర్శనం టి.విలోనే -కార్టూన్

ఓ.కె, బై-బై. మళ్ళీ టీ.వి తెరపైన కలుద్దాం! ఈ రోజుతో చివరి విడత ఎన్నికలు ముగిశాయి. ఎన్నికల కమిషన్ విధించిన గడువు ముగిసిన వెంటనే ఎగ్జిట్ పోల్ ఫలితాలు కూడా వెల్లడయ్యాయి. నరేంద్ర మోడి నేతృత్వంలో బి.జె.పి కూటమి మెజారిటీ సాధిస్తుందని ఈ ఎగ్జిట్ పోల్స్ లో వెల్లడి అయినట్లు పత్రికలు నివేదించాయి కూడాను. మళ్ళీ నాయకులు ప్రజలకు కనిపించేది ఎప్పటికి? విజయం సాధించినందుకు స్వీట్లు ఒకరి నోట్లో మరొకరు పెట్టుకుంటూనో లేదా ఓటమిని అంగీకరిస్తున్నట్లు గంభీర…

ధర్డ్ ఫ్రంట్: మద్దతిస్తాం… అబ్బే, ఇవ్వం… -ఎఎపి

ఆం ఆద్మీ పార్టీ విధాన పరమైన లోపభూయిష్టత, అయోమయం కొనసాగుతున్నట్లు కనిపిస్తోంది. బి.జె.పి కూటమి అధికారంలోకి రాకుండా నిరోధించడానికి అవసరమైతే ధర్ట్ ఫ్రంట్ ప్రభుత్వం ఏర్పాటుకు అంశాల వారీ మద్దతు ఇస్తామని ఆ పార్టీ సీనియర్ నేత గోపాల్ రాయ్ ఆదివారం (మే 11) వారణాసిలో ప్రకటించారు. కానీ అంతలోనే పార్టీ నేత అరవింద్ కేజ్రీవాల్ అదేం లేదని స్పష్టం చేశారు. అవినీతి నాయకులతో నిండిన నాయకులకు తమ పార్టీ ఎలాంటి మద్దతూ ఇవ్వదని ఆయన స్పష్టం…