ఋతు పవన రాగాలు, భరత జీవన విరాగాలు

భారత దేశ ప్రజల బతుకు చిత్రంలో ఋతుపవనాల రంగులకు ఎంతటి ప్రాముఖ్యత ఉన్నదో చెప్పలేము. కేరళలో అడుగుపెట్టి అటు అండమాన్, ఇటు ఉత్తరాఖండ్ ల వరకూ భరత ఖండం అంతా విస్తరించే నైరుతి ఋతుపవనాలైనా, హిమాలయాల చల్లదనాన్ని కారు మబ్బుల ద్వారా దక్షిణాదికి మోసుకొచ్చే ఈశాన్య ఋతుపవనాలైనా భారత దేశంలోని సకల ఉత్పత్తి రంగాలకు జీవ గర్రలు. నీటి పారుదల సౌకర్యం కలిగిన పొలాలకు కూడా ఈ రెండు పవనాలు తెచ్చే వానలే నదులు, రిజర్వాయర్లను నింపి…

సిక్కింలో ఋతుపవనాల సొబగులు చూసి తీరాలి -ఫొటోలు

రుతుపవనాలు సిక్కింలోని ప్రకృతికి అద్దిన అందాలను ఈ ఫొటోలు అద్భుతంగా ప్రతిబింబిస్తున్నాయి. అర్జెంటుగా ఈ ఫొటోలు తీసిన గ్యాంగ్ టక్ కి పరిగెత్తుకెళ్ళి అక్కడే ఉండిపోవాలనిపిస్తోంది. ఫొటోగ్రఫీని మనమూ హాబీగా ఎందుకు చేసుకోకూడదు? అని కూడా అనిపిస్తోంది. ఫొటోల్లోని మూడ్ చూస్తే మత్తుగా, మంగుగా, బద్ధకంగా కనిపిస్తున్నప్పటికీ వర్షం కురిసి వెలిసినప్పటి చురుకుదనం ఆ మత్తుని తరిమికొడతానని సవాలు చేస్తున్నట్లుగా ఉంది. విద్యుత్ దీపాల కృత్రిమ వెలుగులకి సహజత్వాన్ని ఇస్తూ, రాత్రి దుప్పటిలోకి కూడా చొరబడి తానున్నానని…

దేశంలో కరువు పరిస్ధితులు, పట్టని ప్రభుత్వాలు

వాతావరణ మార్పులు వ్యవసాయరంగంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని ప్రఖ్యాత వ్యవసాయ శాస్త్రవేత్త, హరిత విప్లవ పితామహుడు స్వామినాధన్ హెచ్చరించాడు. ఈ సంవత్సరం వర్షాభావ పరిస్ధితులు ఏర్పడనున్నట్లు ఇప్పటికే సూచనలు అందుతున్నాయనీ, కానీ ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదనీ విమర్శించారు.  కొద్ది ప్రాంతాల్లో అధిక వర్షాలు, మరి కొన్ని చోట్ల ఎన్నడూ లేనంతగా కరువు ఏర్పడుతుందనీ తెలిపాడు. ముందు జాగ్రత్త చర్యలు తీసుకోకుండా ‘పోస్ట్ మార్టం’ చర్యలకే అలవాటుపడ్డ ప్రభుత్వాలు ధోరణి మార్చుకోవాలని కోరారు. “వ్యవసాయం పై వాతావరణ మార్పుల…

ఈసారీ సకాలంలోనే ఋతుపవనాలు -ఐ.ఎం.డి

ఈ సంవత్సరం కూడా సకాలంలోనే జూన్ 1, 2012 తేదీనే ఋతుపవనాలు దేశంలో ప్రవేశించనున్నాయని ‘ఇండియన్ మీటియోరోలాజికల్ డిపార్ట్ మెంట్’ మంగళవారం ప్రకటించింది. దక్షిణ అండమాన్ సముద్రంలో ఋతుపవనాలు ప్రవేశించడం దాదాపు ఖాయమయిందనీ తెలిపింది. ప్రతి యేటా మే 20 న దక్షిణ అండమాన్ సముద్రంలో ప్రవేశించే నైరుతి ఋతుపవనాలు అనంతరం జూన్ 1 తేదీన కేరళ తీరాన్ని తాకడం ద్వారా దేశంలోని ప్రధాన భూభాగంలోకి ప్రవేశిస్తాయి. రైతులు వ్యవసాయం కోసం ప్రధానంగా వర్షాలపై ఆధారపడే భారత…