ఆహార బిల్లును తప్పు పట్టొద్దు -ది హిందు సంపాదకీయం

(రూపాయి పతనానికి కారణంగా ఆహార భద్రతా బిల్లును కొంతమంది మార్కెట్ పరిశీలకులు చెప్పడాన్ని తప్పు పడుతూ ది హిందూ పత్రిక గురువారం, ఆగస్టు 29, 2013 తేదీన ప్రచురించిన సంపాదకీయానికి ఇది యధాతధ అనువాదం. పత్రిక వెలువరించిన అత్యద్భుతమైన సంపాదకీయాల్లో ఇది ఒకటి అనడంలో నాకు ఎట్టి సందేహం లేదు. రూపాయి పతనంకు సంబంధించి మరికొన్ని అంశాలు తెలుసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. -విశేఖర్) గత కొన్ని నెలల్లో ఇండియా, ఇండోనేషియా, బ్రెజిల్, సౌత్ ఆఫ్రికా, టర్కీ దేశాల…

మబ్బుల్లో నీళ్ళు చూసి…. -కార్టూన్

మబ్బుల్లో నీళ్ళు చూపించి ఓటు అడగబోతున్నారా కాంగ్రెస్ వాళ్ళు? ఆహార భద్రతా బిల్లును చారిత్రాత్మకంగా అభివర్ణించిన కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీ, ఈ బిల్లును ప్రవేశ పెట్టడం తన అదృష్టంగా చెప్పుకున్నారు. ఈ పధకం ద్వారా దేశంలో 70 కోట్ల మందికి ఆహార భద్రత లభించనున్నదని ఆమె లోక్ సభలో బిల్లు ప్రవేశపెడుతూ ప్రకటించారు. 67 యేళ్ళ స్వతంత్ర భారతంలో ఇప్పటివరకూ 70 కోట్ల మందికి ఆహార భద్రత లేదని కాంగ్రెస్ నాయకురాలు పరోక్షంగా అంగీకరించారు. బిల్లు…

తెలంగాణ: కాంగ్రెస్ ఫుడ్ సెక్యూరిటీ? -కార్టూన్

రాజకీయ పార్టీలకు ఏది ఆహారం? ఇంకేది, ఓట్లు, సీట్లు. ఎన్ని ఓట్లు వస్తే అన్ని సీట్లు వస్తాయి. సీట్లు పెరిగేకొందీ అధికారం దగ్గరవుతుంది. వర్షాకాలం సమావేశాల్లో ‘ఆహార భద్రతా బిల్లు’ ప్రవేశపెట్టి ఆమోదింపజేసుకోడానికి కాంగ్రెస్ తెగ తాపత్రయ పడుతోంది. ‘గ్రామీణ ఉపాధి హామీ పధకం’ 2009 ఎన్నికల్లో ఆ పార్టీకి ఓట్ల వరప్రదాయని అయినట్లుగా 2014 ఎన్నికల్లో ‘ఆహార భద్రతా చట్టం’ ఆ తరహా పాత్ర పోషిస్తుందని కాంగ్రెస్ ఆశ. అందుకే బి.జె.పి, తృణమూల్ కాంగ్రెస్ తదితరులు…

ఆహార భద్రతా బిల్లు: ఖోలో సెసేమ్! -కార్టూన్

ఎన్నికలలోపు ‘ఆహార భద్రతా బిల్లు’ (Food Security Bill) ను చట్టం రూపంలో తేవాలని యు.పి.ఏ ప్రభుత్వం సకల ప్రయత్నాలు చేస్తోంది. బి.జె.పి సహాయ నిరాకరణ వలన బడ్జెట్ సమావేశాల్లో ఈ బిల్లు ప్రవేశపెట్టడానికి అవకాశం దొరకలేదు. మైనారిటీలో ఉన్న యు.పి.ఏ-2 ప్రభుత్వం బి.జె.పి సహకారం లేకుండా చట్టం తేవడం అసంభవం. ఈ నేపధ్యంలో కేబినెట్ ద్వారా ఆర్డినెన్స్ తెచ్చే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు పత్రికలు చెబుతున్నాయి. ఇంతకీ కాంగ్రెస్ కి ఎందుకింత తొందర? ఆహార భద్రతా…

ధాన్యం ఎగుమతికి పచ్చ జెండా ఊపిన కేంద్రం?

ధాన్యం ఎగుమతికి కేంద్ర ప్రభుత్వం పచ్చ జెండా ఊపిందని వాల్‌స్ట్రీట్ జర్నల్పత్రిక రాసింది. గోదాముల్లో ఖాళీ లేక ఆరుబైట నిలవ చేయవలసి వస్తున్నదనీ, ఆరుబైట ఉంచడంతో ఎండా వానలకు చెడిపోతున్నాయనీ చెబుతూ కేంద్ర వ్యవసాయ శాఖా మంత్రి శరద్ పవార్ దాదాపు సంవత్సరం నుండీ ఎగుమతి చేద్దాం అని పోరుతూ వచ్చాడు. మిల్లర్లతో ఉన్న గాఢమైన అనుబంధం ఆయన్ను దేశంలో జనాలకి ధాన్యం అవసరం ఉందన్న స్పృహ కంటే విదేశాల్లో ధరలు ఎక్కువగా ఉన్నాయి, ఎగుమతులకు ఇదే…

ప్రపంచ ఆహార పంపిణీ వ్యవస్ధే రైతులకు నష్టాల్నీ పేదలకు ఆకలి చావుల్నీ సృష్టిస్తోంది -ఆక్స్‌ఫాం

ప్రపంచ దేశాల్లొ ప్రస్తుతం కొనసాగుతున్న ఆహార పంపిణీ వ్యవస్ధలే పేదల్ని ఆకలి చావులకు గురి చేస్తున్నదని చారిటీ సంస్ధ ఆక్స్‌ఫాం కుండ బద్దలు కొట్టింది. ప్రపంచ ఆహార వ్యవస్ధ కేవల కొద్దిమంది కోసమే పని చేస్తున్నదని, మిగిలిన వారందరికీ అది విఫల వ్యవస్ధగా మారిందనీ తాజాగా విడుదల చేసిన నివేదికలో ఆక్స్‌ఫాం పేర్కొంది. ప్రపంచ ఆహార పంపిణీ వ్యవస్ధ, ఆహారాన్ని వినియోగించే బిలియన్ల మంది ప్రజలకు తాము ఏమి కొంటున్నదీ, ఏమి తింటున్నదీ అన్న అంశాలపై సరిపోయినంత…

వరి, గోధుమ ఎగుమతులపై ఆశ చావని శరద్ పవార్

కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శరద్ పవార్ కి వరి, గోధుమ ఎగుమతులపై ఆశ చావక మరోసారి నోరు విప్పారు. వరి, గోధమల ధరలు ప్రపంచ మార్కెట్ లో ఆశాజనకంగా ఉన్నాయని, నిల్వలు కూడా అధికంగా ఉన్నాయి కనుక ఎగుమతి చేయడానికి ఇదే సరైన సమయమని, ప్రభుత్వం వరి, గోధుమ ధాన్యాల ఎగుమతులకు అనుమతించాలని ఆయన పత్రికా ముఖంగా ప్రభుత్వాన్ని కోరారు. ప్రభుత్వంలో ఓ మంత్రిగా ఉంటూ, అందునా వ్యవసాయ మంత్రిగా ఉంటూ పత్రికాముఖంగా డిమాండ్ చేయడం…

రానున్నది జన రంజక బడ్జెట్టేనట!

  మరో నాలుగు రోజుల్లో ఫిబ్రవరి 28 తేదీన 2011-12 ఆర్ధిక సంవత్సరం నిమిత్తం ఆర్ధిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ ప్రవేశ పెట్టనున్న బడ్జెట్ జన రంజకంగా ఉండనున్నదని విశ్లేషకులు, వార్తా సంస్ధలు, ఉత్సాహ పరులు అంచనా వేస్తున్నారు. ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ కూడా ఆ మేరకు సూచనలు ఇస్తున్నాడని గురువారం నాటి ఆయన ప్రకటన ద్వారా అంచనా వేస్తున్నారు. జన రంజక బడ్జెట్ వలన కొత్త ఆర్ధిక సంవత్సరాంతానికి కోశాగార లోటు ప్రకటిత లక్ష్యం…