ఎఎపి పరిస్ధితి ఇక ఇదేనా? -కార్టూన్

సామాన్యుడిని నెత్తి మీద పెట్టుకుంటానని ఉనికిలోకి వచ్చిన ఆం ఆద్మీ పార్టీ ఢిల్లీ జనాన్ని బాగానే ఆకట్టుకుంది. కానీ అనతికాలం లోనే జనంలో పలుకుబడి కోల్పోయిందని లోక్ సభ ఎన్నికలు రుజువు చేసినట్లుగా విశ్లేషకులు భావిస్తున్నారు. ఢిల్లీ పీఠాన్ని కట్టబెట్టడం ద్వారా  ప్రజలు పెట్టుకున్న ఆశల్ని తగిన విధంగా ఆచరణలోకి తేవడంలో ఆ పార్టీ విఫలమైందని అందుకే ప్రజల్లో పలచన అయిందని వారి అవగాహన. అధికారంలోకి వచ్చీ రావడంతోనే సంచలన కార్యక్రమాలకు తెరతీసిందని సో కాల్డ్ మర్యాదస్తులు,…

అనూహ్యం: అంబానీ, మొయిలీలపై ఎఫ్.ఐ.ఆర్

సామాన్యుడు తలచుకుంటే అద్భుతాలకు ఏమిటి కొదవ? ఆ మాటకొస్తే సామాన్యులే కాదా చరిత్ర నిర్మాతలు! సామాన్యుడి పేరుతో పార్టీ స్ధాపించిన ఆమ్ ఆద్మీ పార్టీ, సంకేతాత్మకమే అయినా, అలాంటి అద్భుతాలనే దేశ ప్రజలకు రుచి చూపిస్తోంది. కాకుంటే, ఈ దేశంలో పాలు తాగే పసిపిల్లలకు సైతం ఆదర్శ పురుషులుగా పరిచయం అయ్యే కార్పొరేట్ దిగ్గజాలపై అవినీతి కేసులో ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేయడం మునుపు ఎన్నడన్నా ఎరుగుదుమా? అంబానీ అంటే భారత దేశంలో ఒక బ్రాండ్. ఒక ట్రేడ్…

ఎఎపి వెనుక ఫోర్డ్ ఫౌండేషన్?

ఆమ్ ఆద్మీ పార్టీకి విదేశీ సంస్ధలు అండదండలు అందిస్తున్నాయన్న అనుమానాలకు ఊతమిస్తూ కోర్టులో పిటిషన్ దాఖలయింది. అమెరికాకు చెందిన ఫోర్ట్ ఫౌండేషన్ ఎఎపి కి అన్ని విధాలా సహకారం ఇస్తోందని ఈ పిటిషన్ ఆరోపించింది. ఢిల్లీ ఎన్నికల సందర్భంగా ఎన్.ఆర్.ఐ ల పేరుతో అమెరికా నుండి ఢిల్లీ ఓటర్లకు పెద్ద ఎత్తున ఫోన్లు, ఎస్.ఎం.ఎస్ లు వచ్చాయని, ఈ కార్యక్రమం వెనుక ఫోర్డ్ ఫౌండేషన్ హస్తం ఉందని పిటిషనర్ ఆరోపించారు. ఫోర్డ్ ఫౌండేషన్ ఇండియాకు కొత్త కాదు.…

గొర్రెని చూసి పులి చారల్ని చెరిపేసుకున్నట్లు…

‘పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లు’ అని సామెత! కానీ పులులకు పాడుకాలం దాపురించింది. పులుల వైభోగం చూసి నక్కలు వాటిని అనుకరించడానికి బదులు గొర్రెల వైభోగానికి పులులే ఈర్ష్య పడాల్సిన చేటుకాలం దాపురించింది. కాకపోతే విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం నడుపుతున్న కాంగ్రెస్ ఎమ్మేల్యేలు, ఎం.పిలే రిలయన్స్ ఎనర్జీ కంపెనీకి వ్యతిరేకంగా ఆందోళనకు దిగడం మనం ఎరుగుదుమా? ఎఎపి అనే గొర్రె ఢిల్లీ పీఠాన్ని అధిష్టించి విద్యుత్ ఛార్జీల్ని సగానికి తగ్గించేయడంతో…

ఢిల్లీ శాసన సభ విశ్వాసం నెగ్గిన ఎఎపి

ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం ఢిల్లీ శాసన సభ విశ్వాసం గెలిచింది. బి.జె.పి కూటమి సభ్యులు విశ్వాస తీర్మానానికి వ్యతిరేకంగా ఓటు వేయగా కాంగ్రెస్ అనుకూలంగా ఓటు వేసింది. కాంగ్రెస్ కాకుండా మరో అదనపు ఓటు కూడా ఎఎపి ప్రభుత్వానికి అనుకూలంగా పడింది. మంత్రి మనిష్ సిసోడియా విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టగా ముఖ్యమంత్రి అరవింద్ భావోద్వేగ ప్రసంగంతో తమ ప్రభుత్వాన్ని సమర్ధించాలని సభ్యులను కోరారు. తీర్మానానికి అనుకూలంగా 37 ఓట్లు, వ్యతిరేకంగా 32 ఓట్లు పడ్డాయి. దీనితో…

ఆమ్ ఆద్మీ పార్టీ అడుగు జాడల్లో…. కార్టూన్

ఎఎపి నేతృత్వంలోని ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం వరుస చర్యలతో దూసుకెళ్తున్న నేపధ్యంలో కాంగ్రెస్, బి.జె.పి లు అప్పుడే ఆ పార్టీని అనుకరించడం ప్రారంభించాయి. ఢిల్లీ ప్రభుత్వం లాగానే మహారాష్ట్ర ప్రభుత్వం కూడా విద్యుత్ ధరలను తగ్గించాలని ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యే డిమాండ్ చేయగా బి.జె.పి నాయకులు సైతం ఎఎపి ప్రభుత్వ నిర్ణయాలను అనుకరించే యోచనలో ఉండడం విశేషం. మహారాష్ట్ర నుండి ఎం.పిగా ఉన్న సంజయ్ నిరుపమ్ గురువారం విద్యుత్ ఛార్జీల విషయంలో ఒక డిమాండ్ ముందుకు తెచ్చి…

మరుగుజ్జు ఎఎపి కి ఆమ్ ఆద్మీయే కవచం -కార్టూన్

ఆమ్ ఆద్మీ పార్టీగానీ, అరవింద్ కేజ్రీవాల్ గానీ ఏ విధంగా చూసినా రాజకీయాలకు కొత్త. కాంగ్రెస్, బి.జె.పి పార్టీలతోనూ, వారి నాయకులతోనూ పోల్చితే ఎఎపి, అరవింద్ లు మరుగుజ్జులు అన్నట్లే. అరవింద్ కేజ్రీవాల్ స్వతహాగా ఎన్.జి.ఓ నేతే గానీ రాజకీయ నేత కాదు. ఎఎపి లో ఉన్న ఇతర నేతలు కూడా ఎక్కువమంది ఎన్.జి.ఓ సంస్ధల నేతలే. ఈ ఎన్.జి.ఓ లను పోషించేది విదేశీ కంపెనీలు. ఎన్.జి.ఓలను ప్రెజర్ గ్రూపులుగా ఏర్పరచుకుని స్వకార్యం చక్కబెట్టుకునే విదేశీ కంపెనీలు…

అరవింద్ వాహనం నేటి వ్యవస్ధలో ఇమిడేనా? -కార్టూన్

అరవింద్ కేజ్రీవాల్/ఆమ్ ఆద్మీ పార్టీ తనకు తాను విధించుకున్న గీటురాళ్ళు సామాన్యమైనవి కావు. నిజానికి ఆబ్సల్యూట్ దృష్టికోణంలో చూసినపుడు అవి సామాన్యమైనవే. కానీ నేటి వ్యవస్ధ నిర్మాణం అయి ఉన్న తీరుతో పోలిస్తే అవి అసామాన్యమైనవి. ఎర్ర లైటు వాహనంలో తిరగను, మెట్రోల్లోనే ప్రయాణిస్తాను… లాంటివి చిన్న విషయాలు. ప్రజా పాలనలో అవేమీ పెద్ద విషయాలు కావు. అసలు విషయాలు వేరే ఉన్నాయి. అవినీతి నిర్మూలన గురించి ఆయన చేసిన వాగ్దానం భారీ వాగ్దానం. ఎందుకంటే అవినీతి…

ఢిల్లీ రాష్ట్ర పీఠంపై ఆమ్ ఆద్మీ

సామాన్య మానవుడి పేరుతోనే పార్టీ పెట్టిన అరవింద్ కేజ్రివాల్ బృందం దేశ రాజధానిలో అధికారం చేపట్టింది. సి.ఎం (కామన్ మేన్) స్వయంగా సి.ఎం (చీఫ్ మినిష్టర్) కుర్చీని అలంకరించిన దృశ్యం నేడు ఢిల్లీలో ఆవిష్కృతం అయింది. తాను నిజంగా కామన్ మేన్/ఆమ్ ఆద్మీ/సామాన్య మానవుడి నే అనీ, అధికారం మత్తు తాను ఎక్కించుకోనననీ, పదవీ దాహం తమ దరి చేరదని, ఢిల్లీ సామాన్య మానవుల సామాన్య కోర్కెలకు, సమస్యలకు, డిమాండ్లకు తాము కట్టుబడి ఉంటామని కేజ్రివాల్ బృందం…

రెండు వాగ్దానాలు నెరవేర్చిన అరవింద్?

ఢిల్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయకుండానే తాను ఇచ్చిన వాగ్దానాల్లో రెండింటిని అరవింద్ కేజ్రివాల్ నెరవేర్చినట్లు కనిపిస్తోంది. కోట్లాది కళ్ల పహారా మధ్య ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న అరవింద్ తనకు వ్యక్తిగత సెక్యూరిటీ అవసరం లేదని చెప్పి భద్రతా సిబ్బందిని వెనక్కి పంపేశారు. తద్వారా వి.ఐ.పి సంస్కృతిని నిర్మూలిస్తామన్న వాగ్దానం నెరవేర్చడానికి ఆయన నాంది పలికారు. అలాగే ప్రభుత్వ భవనంలోకి తన నివాసం మార్చుకోవడానికి కూడా ఆయన తిరస్కరించారని పత్రికలు తెలిపాయి. తాను గానీ, తన ఎమ్మేల్యేలు…

ఊడ్చిన చెత్త బుట్టే కేజ్రివాల్ సి.ఎం సీటు! -కార్టూన్

అరవింద్ కేజ్రివాల్, మనీష్ సిసోడియా తదితర అవినీతి వ్యతిరేక ఉద్యమ కార్యకర్తలు స్ధాపించిన ఆమ్ ఆద్మీ పార్టీ గుర్తు చీపురు. చీపురు చేతబట్టి రాజకీయాలను ప్రక్షాళన చేస్తానని ఎన్నికల్లో ప్రచారం చేసిన ఆప్ కు ఢిల్లీ ప్రజలు బ్రహ్మరధం పట్టారు. కాంగ్రెస్ కు అడ్రస్ లేకుండా చేశారు. 8 సీట్లకు మాత్రమే పరిమితం చేశారు. మరో విధంగా చెప్పాలంటే ఆమ్ ఆద్మీ పార్టీ చీపురు కాంగ్రెస్ పార్టీని ఊడ్చిపారేసింది. చీపురు ఊడ్చిన చెత్త ఎక్కడికి చేరుతుంది? చెత్త…

ఢిల్లీ: బ్యాలట్ ఓట్ Vs సోషల్ మీడియా ఓట్ -కార్టూన్

“ధన్యవాదాలు, ఢిల్లీ! ప్రజాస్వామిక ఓటింగ్ తీర్పును పక్కన పెట్టినందుకు…” అవినీతి వ్యతిరేక నినాదంతో వినూత్న రీతిలో ఢిల్లీ రాజకీయ రంగంలోకి అడుగు పెట్టిన ఆమ్ ఆద్మీ పార్టీ నేత అరవింద్ కేజ్రీవాల్ ఇప్పుడు ఏం చేసినా సంచలనమే. పార్టీ స్ధాపించిన కొద్ది నెలల్లోనే కాంగ్రెస్ ను మట్టి కరిపించి రెండో అతి పెద్ద పార్టీగా అవతరించిన ఎ.ఎ.పి ఎన్నికల అనంతరం కూడా పలు సంచలనాలకు కేంద్ర బిందువుగా మారింది. అతి పెద్ద పార్టీగా అవతరించిన బి.జె.పి, ఎ.ఎ.పి…

ఢిల్లీ రాష్ట్ర పీఠం – మ్యూజికల్ చైర్ -కార్టూన్

ఢిల్లీ రాష్ట్రంలో ఓ విచిత్రమైన పరిస్ధితి నెలకొంది. నిజమైన హంగ్ అసెంబ్లీ అంటే ఇదేనా అన్నట్లుగా ఉండడం ఈ విచిత్రంలో ఒక భాగం. ఇంతకు ముందు హంగ్ అసెంబ్లీ లేదా హంగ్ పార్లమెంట్ అనేకసార్లు ఏర్పడినా ప్రస్తుతం ఢిల్లీలో వచ్చిన పరిస్ధితి లాంటిది ఎప్పుడూ ఉద్భవించిన దాఖలా లేదు. గతంలో హంగ్ అసెంబ్లీ అన్నా, హంగ్ పార్లమెంటు అన్నా రాజకీయ సంక్షోభం గానీ రాజ్యాంగ సంక్షోభం గానీ ఉండేది కాదు. అంటే: ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ…

స్టింగ్ ఆపరేషన్ లో దొరికిపోయిన ఎఎపి అభ్యర్ధి?

ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్ధి ఒకరు అక్రమ పద్ధతుల్లో విరాళాలు సేకరించడానికి అంగీకరించారన్న ఆరోపణలు ముప్పిరిగొన్నాయి. ఒక మీడియా పోర్టల్ జరిపిన స్టింగ్ ఆపరేషన్ లో ఎఎపి అభ్యర్ధి షాజియా ఇల్మి అక్రమ విరాళాలు అంగీకరిస్తూ దొరికిపోయారని ఆరోపణలు రావడంతో బడా పార్టీలు ఎఎపిపై తమ దాడిని తీవ్రం చేశాయి. తమ అభ్యర్ధిపై స్టింగ్ ఆపరేషన్ కుట్రగా అరవింద్ కేజ్రివాల్ కొట్టిపారేస్తూ విచారణకు ఆదేశించారు. కాగా పోటీనుండి తప్పుకోవడానికి అభ్యర్ధి సిద్ధపడ్డారు. మీడియా సర్కార్ అనే పోర్టల్…

కోడి పిల్లొచ్చి కోడిని వెక్కిరించినట్టు! -కార్టూన్

‘గుడ్డొచ్చి కోడిని వెక్కిరించినట్టు’ అంటాం కదా! కార్టూనిస్టు ఇక్కడ కోడి పిల్లే వచ్చి కోడి తల్లిని వెక్కిరిస్తోందని సూచిస్తున్నారు. అన్నా హజారే కష్టపడి ‘అవినీతి వ్యతిరేక ఉద్యమం’ అనే గుడ్డును పొదిగిన తర్వాత అందులోంచి ‘ఆమ్ ఆద్మీ పార్టీ’ కోడి పిల్లగా బైటికి వచ్చిందని, ఆ కోడి పిల్ల ఇప్పుడు అన్నా హజారేను వెక్కిరిస్తోందని కార్టూన్ సూచిస్తోంది. అరవింద్ కేజ్రీవాల్, అన్నా హజారేల మధ్య రెండు రోజులుగా ఒక కొత్త వివాదం నడుస్తోంది. అన్నా హజారే, మరో…