నాలుగేళ్ల ఆఫ్ఘన్ పిల్లాడిన చంపేసిన అమెరికా సైన్యం

‘టెర్రరిజంపై ప్రపంచ యుద్ధం’లో నిండా మునిగిన అమెరికా సైనికులు 4 సంవత్సరాల వయసుగల టెర్రరిస్టును కాల్చి చంపి కాలరెగరేశారు. ఆనక ప్రమాదవశాత్తూ చంపామని ప్రకటించారు. దుమ్ము దట్టంగా ఉండడంతో 4 యేళ్ళ పిల్లాడు తమ మీదికి దాడికి వస్తున్నాడని భావించి కాల్చి చంపామని సైనికులు చెప్పారని స్ధానిక ఆఫ్ఘన్ ప్రభుత్వం తెలిపింది. ఆఫ్ఘన్ పౌరుల ప్రాణాలకు హామీ ఇస్తే తప్ప అమెరికాతో ‘ద్వైపాక్షిక భద్రతా ఒప్పందాని’కి ఒప్పుకునేది లేదని చెబుతున్న అధ్యక్షుడు కర్జాయ్ తాజా ఘటనతో స్వరం…

పైపైకి దూసుకు పోతున్న దాడులు, చొరబాట్లు -కార్టూన్

“అబ్బో!” “అబ్బే, అక్కడ సంతోషించడానికేమీ లేదులెండి. మన సరిహద్దులో పెరుగుతున్న దాడులు, చొరబాట్లను చూపించే గ్రాఫ్ అది!” – ఇటీవలి కాలంలో కాశ్మీరులో భద్రతా బలగాలపై దాడులు పెరిగాయి. చొరబాట్లు కూడా పెరిగాయని పత్రికలు చెబుతున్నాయి. ఆఫ్ఘనిస్ధాన్ నుండి అమెరికా సైనికుల ఉపసంహరణ గడువు (డిసెంబర్ 2014) దగ్గర పడేకొద్దీ కాశ్మీరు లోనూ, సరిహద్దు లోనూ దాడులు పెరగడం గమనార్హం. గడువు సమీపిస్తున్న దృష్ట్యా తాలిబాన్ తో చర్చలు జరిపి ఒప్పందం కుదుర్చుకోడానికి అమెరికా నానా తంటాలు…

చనిపోయినవారిపై ఒంటేలు పోస్తున్న అమెరికా సైనికులు -వీడియో

గత జనవరి నెలలో ఈ వీడియో బైటికి వచ్చింది. శవాలపై ఒంటికి వెళ్తున్న ఈ నీచ, నికృష్ట మానవులు అమెరికా సైనికులు. నార్త్ కరోలినా లోని లెజీన్ క్యాంప్ నుండి వచ్చిన 2 వ మెరైన్స్, 3 వ బెటాలియన్ కి వీరు చెందినవారని వీడియోను యూ ట్యూబ్ లో పోస్ట్ చేసిన వ్యక్తి సమాచారం ఇచ్చాడు. చనిపోయినవారిని చూస్తే ఆఫ్ఘన్ పౌరులని ఇట్టే అర్ధం అవుతోంది. “అమెరికా మిలట్రీ కి చెందినవారు శత్రువుల శవాలపై అసంబద్ధమైన కార్యక్రమానికి…

తాలిబాన్ ఆఫీసు తెరవడానికి కతార్ అంగీకారం, ఇండియాపై పాక్ పైచేయికి మార్గం!

ఆఫ్ఘనిస్ధాన్ అధ్యక్షుడు హమీద్ కర్జాయ్ అభ్యంతరాలను తోసి పుచ్చుతూ కతార్ రాజధాని ‘దోహా’ లో కార్యాలయం తెరవడానికి ఆఫ్ఘన్ తాలిబాన్ కి అనుమతి దొరికింది. ఈ మేరకు కతార్, ఆఫ్ఘన్ తాలిబాన్ ల మధ్య అంగీకారం కుదిరినట్లు తెలుస్తోంది. అమెరికా, ఆఫ్ఘనిస్ధాన్ లతో తాలిబాన్ జరపబోయే శాంతి చర్చలకు ఈ కార్యాలయం అనుమతి దోహదపడుతుందని అమెరికా ఆశపడుతోంది. కతార్ లో తాలిబాన్ కార్యాలయం తెరవడానికి నిజానికి అంగీకారం ఎన్నడో కుదిరింది. కాని ఆఫ్ఘన్ అధ్యక్షుడు హమీద్ కర్జాయ్…

హమీద్ కర్జాయ్ వల్ల వెనక్కి వెళ్ళిన అమెరికా-తాలిబాన్ ఒప్పందం

అమెరికా, తాలిబాన్ ల మధ్య ఒప్పందం కుదిరినట్టే కుదిరి వెనక్కి వెళ్ళిందని వాషింగ్టన్ పోస్ట్ పత్రిక తెలిపింది. చివరి నిమిషంలో ఒప్పందంలోని అంశాలకు హమీద కర్జాయ్ తీవ్ర అభ్యంతరం చెప్పడంతో ఒప్పందం సాధ్యం కాలేదని ఆ పత్రిక తెలిపింది. ఈ ఒప్పందం ఫలితంగా గ్వాంటనామో బే జైలు లో  నిర్బంధంలో ఉన్న ఐదుగురు తాలిబాన్ నాయకులను అమెరికా విడుదల చేయవలసి ఉంటుంది. అందుకు బదులుగా తాలిబాన్ బహిరంగంగా టెర్రరిజాన్ని వదులుకోవడానికి సిద్ధపడినట్లుగా తెలుస్తోంది. హమీద్ కర్జాయ్ అభ్యంతర…

ఆఫ్-పాక్ ‘హోం మేడ్’ బాంబులకు హడలుతున్న అమెరికా, పాక్‌కి సహాయం నిలిపివేత

ఆఫ్ఘనిస్ధాన్, పాకిస్ధాన్ దేశాలలోని మిలిటెంట్లు వాడుతున్న హోం మేడ్ బాంబుల ధాటికి అమెరికా ఠారెత్తుతోంది. అమెరికా, నాటో సైనికులను ఇంటి తయారీ బాంబులే వణికిస్తున్నాయి. ‘ఇంప్రూవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైజెస్’ (ఐ.ఇ.డి) గా పిలిచే ఈ బాంబులవల్లనే పలువురు అమెరికా, నాటో సైనికులు చనిపోవడంతో వాటిని ఎలా కట్టడి చేయాలో అర్ధం కాక సతమతమవుతోంది. ‘ఉరుము ఉరిమి మంగళం మీద పడ్డట్టు’ అమెరికా తన నిస్సహాయతను అంతా పాకిస్ధాన్ పైన చూపిస్తోంది. ఐ.ఇ.డిలను కట్టడి చేయడానికి పాకిస్ధాన్ సరైన…

పాక్ వైమానిక స్ధావరాన్ని ఖాళీ చేసిన అమెరికా

పాకిస్ధాన్ హెచ్చరికతో అక్కడ ఉన్న వైమానిక స్ధావరాన్ని అమెరికా బలగాలు ఖాళీ చేసి వెళ్ళిపోయాయి. కొద్ది రోజుల తర్వాత పాక్ తన నిర్ణయాన్ని పునఃసమీక్షించుకుంటుందని భావించినవారి ఊహలు, ఊహలుగానే మిగిలాయి. ప్రజల్లో పెల్లుబికిన ఆగ్రహానికి పాకిస్ధాన్ సైన్యం, పౌర ప్రభుత్వం ఔదలదాల్చాయి. ఆదివారం షంషి వైమానిక స్ధావరాన్ని పాకిస్ధానీ ఆర్మీ అమెరికా బలగాలనుండి స్వాధీనం చేసుకుంది. ఆఫ్ఘన్-పాక్ సరిహద్దులో రెండు చెక్ పోస్టుల వద్ద ఉన్న పాక్ సైనికులను ఇరవై నాలుగు మందిని అమెరికా హెలికాప్టర్లు, జెట్…

ఆత్మాహుతి దాడిలో ఆఫ్గన్ మాజీ అధ్యక్షుడు హతం

ఆఫ్ఘనిస్ధాన్ మాజీ అధ్యక్షుడు బర్హనుద్దీన్ రబ్బాని ఆత్మాహుతి దాడిలో ప్రాణాలు కోల్పోయాడు. ప్రభుత్వం నియమించిన పీస్ కౌన్సిల్ కు నాయకత్వం వహిస్తున్న రబ్బానీ హత్యతో శాంతి ప్రయత్నాలకు తీవ్ర విఘాతం ఏర్పడిందని ఆఫ్గన్ అధికారులతో పాటు వార్తా సంస్ధలు, పత్రికలు బాధపడుతున్నాయి. ముఖ్యంగా ఆఫ్ఘనిస్ధాన్, అమెరికా ప్రభుత్వాల అధికారులు చాలా తీవ్రంగా బాధపడుతున్నారు. ఆఫ్ఘనిస్ధాన్‌లో శాంతి నెలకొల్పే అవకాశం లేకుండా పోయిందన్నది వారి బాధ. అసలు ఆఫ్ఘనిస్ధాన్‌లో ఎందుకు శాంతి లేకుండా పోయిందో వీరు ఆఫ్ఘనిస్ధాన్ ప్రజలకు…

మా రక్షణ కోసం మేం ఏమైనా చేస్తాం, పాక్‌కు అమెరికా హెచ్చరిక

పాకిస్ధాన్‌కి అమెరికా తాజాగా హెచ్చరిక జారీ చేసింది. తాలిబాన్ మిలిటెంట్లు ఆఫ్ఘన్ రాజధాని కాబూల్ నడిబొడ్డున ఉన్న అమెరికా ఎంబసీ, నాటో కార్యాలయం ఉన్న ప్రాంతంపైన రాకెట్లు, మెషిన్ గన్‌లతో దాడి చేసింది. మంగళవారం మధ్యాహ్నం నుండి బుధవారం ఉదయం వరకు ఇరవై గంటలపాటు సాగిన ఈ దాడిలో పెద్దగా నష్టం ఏమీ జరగనప్పటికీ, అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు ఉండే ‘హై సెక్యూరిటీ జోన్’ లోకి రాకెట్ ప్రొపెల్డ్ గ్రెనేడ్స్, మెషిన్ గన్లతో సహా మిలిటెంట్లు…

కొత్త ఆయుధంతో అమెరికాకు దడ పుట్టిస్తున్న తాలిబాన్

ఇటీవలి కాలంలో తాలిబాన్ బలగాలు నాటోకి చెందిన హెలికాప్టర్లను కూల్చివేస్తున్న వార్తలు వరుసగా వెలువడ్డాయి. దానికి కారణం తాలిబాన్ కొత్త ఆయుధాన్ని సమకూర్చుకోవడమేనని తాలిబాన్ వర్గాలను ఉటంకిస్తూ ఏసియా టైమ్స్ పత్రిక తెలిపింది. భూమి మీది నుండి గాలిలోకి ప్రయోగించే మిసైల్ ద్వారా తాము గణనీయమైన సంఖ్యలో హెలికాప్టర్లను కూల్చివేశామని తాలిబాన్ ప్రతినిధి చెప్పాడు. అయితే నాటో, అమెరికా వర్గాలు మాత్రం తమ హెలికాప్టర్లు కూలినప్పుడల్లా సాంకేతిక లోపం వలన కూలిందని చెబుతున్నాయి. తాలిబాన్ ఇంతవరకూ ఒకటీ…

అమెరికా చర్చలు జరుపుతున్నది తాలిబాన్ డూప్ తో -తాలిబాన్

తాలిబాన్ పేరు చెప్పి మోసం చేస్తున్న డూప్ వ్యక్తితో అమెరికా చర్చలు జరుపుతోందని తాలిబాన్ ప్రకటించి సంచలనం సృంష్టించింది. తాలిబాన్ తరపున అమెరికాతో చర్చలు జరుపుతున్నాడని వ్యక్తి నిజానికి తమ వద్దనే ఉన్నాడని చెబుతూ, సదరు వ్యక్తి ఇంతవరకు ఎప్పుడూ అమెరికాతో చర్చలు జరపడానికి వెళ్ళలేదని తాలిబాన్ వెల్లడించింది. తాలిబాన్‌కి చెందిన ఉన్నత స్ధాయి అధికారితో ఖతార్, జర్మనీలలో చర్చలు జరిపామంటూ ప్రకటించిన అమెరికాకు ఇది ఆశనిపాతం లాంటి వార్తే. తాలిబాన్ ప్రతినిధి జబీయుల్లా ముజాహిద్ ఆదివారం…

కాబూల్‌లో బ్రిటిష్ కౌన్సిల్ పై తాలిబాన్ దాడి, ఎనిమిది మంది మరణం

ఆఫ్ఘన్ రాజధాని కాబూల్ లో తాలిబాన్ మిలిటెంట్లు మరోసారి దాడికి పాల్పడ్డారు. 1919 లో బ్రిటన్ నుండి ఆఫ్ఘనిస్ధాన్ స్వాతంత్రం సంపాదించుకున్న రోజునే బ్రిటిష్ కౌన్సిల్ పై దాడి జరగడం విశేషం. దాడికి తామే బాధ్యులుగా తాలిబాన్ ప్రకటించింది. అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మద్య ఉండే కాబూల్ లో అడుగడుగునా చెకింగ్ ఉన్నప్పటికీ మిలిటెంట్లు విజయవంతంగా దాడులకు పాల్పడడం కొనసాగుతున్నది. నాటో బలగాలకు ఇది అవమానకరంగా పరిణమించినప్పటికీ అవి తాలిబాన్ దాడులను అరికట్టడంలో విఫలమవుతున్నాయి. పేరు…

తాలిబాన్ దాడికి అమెరికా షాక్‌కి గురైన వేళ…

ఎస్&పి ఆర్ధిక పరంగా అమెరికా రేటింగ్ ని తగ్గిస్తే, ఆఫ్ఘనిస్ధాన్ లో తాలిబాన్, అమెరికాని మిలట్రీ పరంగా రేటింగ్ ని పడదోసిన పరిణామం ప్రపంచ దృష్టిని పెద్దగా ఆకర్షించలేదు. అమెరికాకి చెందిన శక్తివంతమైన ఛినూక్ హెలికాప్టర్ ను తాలిబాన్ కేవలం ఒక రాకెట్ ప్రొపెల్లర్ గ్రెనేడ్ తో కూల్చివేయడం ద్వారా అమెరికాని షాకి కి గురి చేసింది. దాడిలో 19 అమెరికా నేవీ సీల్ కమెండోలు, 7గురు ఆఫ్ఘన్ ప్రభుత్వ సైనికులు చనిపోగా మరో 12 మంది…

తాలిబాన్ రాకెట్ దాడిలో 38 మంది అమెరికా సైనికుల హతం

ఆఫ్ఘనిస్ధాన్ లోని సెంట్రల్ మైదాన్ వార్డాక్ రాష్ట్రంలోని సైదాబాద్ లో తాలిబాన్ ఫైటర్లు రాకెట్ ప్రొపెల్డ్ గ్రెనేడ్ (ఆర్.పి.జి) తో 38 మంది సైనికులున్న ఛినూక్ హెలికాప్టర్‌ను కూల్చివేసినట్లుగా తాలిబాన్ ప్రకటించింది. అయితే ఆఫ్ఘన్ అధ్యక్షుడు హమీద్ కర్జాయ్ మాత్రం ఛినూక్ హెలికాప్టర్ కూలిపోయిందనీ, కూలిపోయిన ఘటనలో చనిపోయిన వారిలో 31 మంది అమెరికా సైనికులు కాగా 7గురు ఆఫ్ఘన్ కమేండర్లనీ తెలియజేస్తూ ఒక ప్రకటన విడుదల చేశాడు. ఆఫ్ఘన్ దురాక్రమణ యుద్ధం మొదలయ్యాక ఒకే సంఘటనలో…

ఆఫ్ఘన్‌లో కొనసాగుతున్న ‘నాటో’ నరమేధం, పౌర నష్టంపై పచ్చి అబద్ధాలు, బుకాయింపులు

ఆఫ్ఘనిస్ధాన్‌లో అర్ధ రాత్రుళ్ళు గ్రామాలపై దాడి చేసి పౌరుల ఇళ్ళపై కాల్పులు జరిపి వారిని కాల్చి చంపడం కొనసాగుతోంది. టెర్రరిస్టు గ్రూపుల సమావేశం జరుగుతోందని చెప్పడం, పౌరుల ఇళ్ళపై విచక్షణా రహితంగా కాల్పులు జరపడం, పౌరులను కాల్చి చంపి చనిపోయినవారు టెర్రరిస్టులను బుకాయించడం నాటో దళాలకు ముఖ్యంగా అమెరికా సైన్యానికి నిత్యకృత్యంగా మారింది. ఆఫ్ఘనిస్ధాన్ దురాక్రమణను ప్రతి ఒక్క ఆఫ్ఘన్ దేశీయుడూ వ్యతిరేకిస్తున్నాడనీ, తమ దేశం నుండి అమెరికా సైనికులు తక్షణమే వెళ్ళిపోవాలని ప్రతీ ఆఫ్ఘన్ జాతీయుడు…