ఆరు నెలల్లో అమరావతి పూర్తి కావాలి -హై కోర్టు

ఆంధ్ర ప్రదేశ్ హై కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. రాష్ట్ర ప్రభుత్వం ఆరు నెలల్లో ఆంద్ర ప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం పూర్తి చేయాలని స్పష్టం చేసింది. రాజధానిని ఎలా వీలుంటే అలా ఒక చోటి నుండి మరొక చోటికి మార్చే హాక్కు గాని, లేదా ప్రభుత్వ అంగాలను చిత్తం వచ్చిన రీతిలో ముక్కలు చేసే అధికారం గానీ రాష్ట్ర ప్రభుత్వానికి లేదు అని హై కోర్టు తీర్పు చెప్పింది. మూడు రాజధానుల చట్టాన్ని రద్దు చేస్తున్నట్లు…

టి.ఎస్ నుండి ఎ.పికి తరలనున్న పన్ను పునాది

గాలిలో దుమ్ము మెల్ల మెల్లగా సర్దుకునే కొద్దీ అసలు చిత్రం ఏమిటో క్రమ క్రమంగా స్పష్టం అవుతోంది. విభజనానంతర ఆంధ్ర ప్రదేశ్ ఆర్ధిక స్ధితి కనాకష్టంగా ఏమీ ఉండదని ఆలోచనాపరులు లెక్కలు వేసి చెప్పినా సమైక్యవాదులు చెవిన ఎక్కించుకోలేదు. వారు చెప్పిన అంశాలు ఎంత నిజమో ఇప్పుడు తెలిసి వస్తోంది. ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా హైద్రాబాద్ నగరం ఉనికి ఆగిపోయినప్పటి నుండి హైద్రాబాద్ నగర పన్ను పునాది భారీ మొత్తంలో తుడిచిపెట్టుకుపోనుంది. నిజానికి…

తెలంగాణ: 10 మంది మంత్రుల కమిటీ, నెలన్నర గడువు

  తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం 10 మంది కేంద్ర మంత్రులతో ‘మంత్రుల కమిటీ’ ని ఏర్పాటు చేయనున్నట్లు హోమ్ మంత్రి సుశీల్ కుమార్ షిండే తెలిపారు. ఆర్ధిక, న్యాయ, మానవ వనరుల అభివృద్ధి శాఖల మంత్రులతో పాటు ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు కూడా ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు. సరిహద్దుల నిర్ణయం, ఆస్తులు-అప్పుల పంపకం, నీటి పంపకం తదితర అంశాలను ఈ కమిటీ పరిశీలించి ప్రభుత్వానికి తగిన సూచనలు, సిఫారసులు చేయాలి. ఆరు వారాల గడువులో…

కేబినెట్ ఆమోదంతో తెలంగాణ ప్రక్రియ ప్రారంభం

ఎట్టకేలకు తెలంగాణ ప్రజల కోరిక నెరవేర్చే ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రారంభించింది. గురువారం సాయంత్రం సమావేశమయిన కేంద్ర కేబినెట్ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై హోమ్ మంత్రి ప్రవేశ పెట్టిన నోట్ ను తీర్మానంగా ఆమోదించింది. టి.వి ఛానెళ్లు చెబుతున్నదాని ప్రకారం సి.డబ్ల్యూ.సి తీర్మానాన్ని కేబినెట్ యధాతధంగా ఆమోదించింది. హైద్రాబాద్ 10 యేళ్లపాటు ఇరు రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా ఉంటుంది. కొత్త రాజధాని ఎక్కడన్నదీ కేబినెట్ నియమించే మంత్రుల బృందం నిర్ణయిస్తుందని హోమ్ మంత్రి సుశీల్ కుమార్…

హైద్రాబాద్ రెవిన్యూ, పెట్టుబడులు, వాస్తవాలు

‘ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విభజన ఖాయం, వెనక్కి వెళ్ళేది లేదు’ అని కాంగ్రెస్ అధినాయకులు స్పష్టం చేస్తున్నారు. ఈ సందర్భంగా సీమాంధ్ర నాయకులు హైద్రాబాద్ సెంటిమెంటును తమ ప్రాంత ప్రజల్లో విస్తృతంగా ప్రవేశపెట్టారు. దశాబ్దాల తరబడి సీమాంధ్రులు రాజధానిని అభివృద్ధి చేశారని, ఇప్పుడు వెళ్లమంటే ఎలా వెళ్తాం అని పెట్టుబడిదారులు, భూస్వాములు వాదిస్తున్నారు. వారి వాదనలను ప్రజలు కూడా మోస్తున్న పరిస్ధితి కనిపిస్తోంది. ‘హైద్రాబాద్ రెవిన్యూ ఆదాయం ఎలా పోగొట్టుకుంటాం?’ అన్న సూపర్ ధనికుల ప్రశ్నకు పై…