బలి పశువులు కావలెను -కార్టూన్
ఎట్టకేలకు కళంకిత మంత్రులుగా పేరుబడిన ఇద్దరు కేంద్ర మంత్రులు రాజీనామా చేశారు. అనవసర వివాదంతో ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేకనే రాజీనామా చేశానని అశ్వనీ కుమార్ అంటే, పవన్ కుమార్ బన్సాల్ ఆ మాట కూడా చెప్పలేదు. సి.బి.ఐ నివేదికను మంత్రి అశ్వనీ కుమార్, ఇతర బ్యూరోక్రాట్ అధికారులు మార్చడం వల్ల నివేదిక ఆత్మ మారిపోయిందని, వారి జోక్యం వలన విచారణ పక్కదారి పట్టే అవకాశం ఏర్పడిందని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించినప్పటికీ తనను కోర్టు తప్పు…