12.6 లక్షల కోట్లు జమ, ఇంకెక్కడి నల్ల ధనం?

ప్రధాని మోడీ అట్టహాసంగా ప్రకటించిన ‘పాత అధిక విలువ నోట్ల రద్దు’ వల్ల ఆశించిన ఫలితం అలా ఉంచి కనీస ఫలితం కూడా దక్కే సూచనలు కనిపించడం లేదు. “నల్ల డబ్బుని నిర్మూలించి డబ్బు నిల్వలను శుభ్రం చేసి, టెర్రరిజం ధన వనరులపై దెబ్బ కొట్టి, దొంగ నోట్లకు చోటు లేకుండా చేయడమే నోట్ల రద్దు లక్ష్యం” అని మొదట ప్రధాని ప్రకటించారు. ఆ తర్వాత ఈ లక్ష్యం పైన నిలబడకుండా మాటలు మార్చుతూ పోయినప్పటికీ జనం…

ఆదర్శ అవినీతి వటవృక్షం వేళ్ళు పెగిలేనా? -కార్టూన్

“భారత రాజకీయ నాయకులు, మంత్రులు, బ్యూరోక్రాట్ అధికారుల అవినీతికీ, అత్యాశకూ నిలువెత్తు గుర్తుగా నిలిచిన ఆదర్శ హౌసింగ్ సొసైటీ టవర్ ని కూల దోయండి” అని ముంబై హై కోర్టు శుక్రవారం (ఏప్రిల్ 29) తీర్పు ప్రకటించింది. “ఈ అవినీతిలో భాగం పంచుకున్న నేతలు, అధికారులు అందరి పైనా, అధికార దుర్వినియోగానికి పాల్పడినందుకు  క్రిమినల్ కేసులు నమోదు చేయాలి” అని హై కోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. ఆదర్శ హౌసింగ్ సొసైటీ భవన నిర్మాణం ‘అనాధికారికం, చట్ట…

ఐనోళ్ళకు పూలు, కానోళ్లకు రాళ్ళు! -కార్టూన్

అవినీతికి తర తమ బేధాలు ఉంటాయి! అలాగని బి‌జే‌పి అధ్యక్షులు అమిత్ షా చెప్పదలిచారు. లేకపోతే ఓ వంక యెడ్యూరప్పను మళ్ళీ కర్ణాటక బి‌జే‌పి అధ్యక్షుడిని చేస్తూ మరో వంక తమిళనాడు ప్రభుత్వాన్ని అత్యంత అవినీతి ప్రభుత్వంగా తిట్టిపోయడం ఎలా సాధ్యపడుతుంది? యెడ్యూరప్ప వ్యవహారం తెలియనిదేమీ కాదు. అవినీతి ఆరోపణలతో ఆయనను తప్పించినందుకు పార్టీని చీల్చి వేరే పార్టీ పెట్టుకున్నారాయన. బి‌జే‌పి ఓట్ల చీలికతో, అనంతరం కాంగ్రెస్ అధికారం చేపట్టింది. ఇప్పుడు మళ్ళీ ఓట్ల కోసం, అధికారం…

అవినీతి: పన్నులు కట్టొద్దు! -బోంబే హై కోర్ట్

అవినీతిపై విసిగిపోయిన బోంబే హై కోర్టు న్యాయమూర్తి ఒకరు ‘అవినీతిని నిర్మూలించేవరకు పౌరులు పన్నులు కట్టడం మానేయాలి’ అంటూ ఆగ్రహం ప్రకటించారు. పన్నులు కట్టొద్దని దాదాపు పిలుపు ఇచ్చినంత పని చేశారు. మహారాష్ట్ర బి‌జే‌పి ఎం‌ఎల్‌ఏ ఒకరు కేంద్ర బిందువుగా వెల్లడి అయిన అవినీతి కుంభకోణం విచారణకు వచ్చిన సందర్భంగా బోంబే హై కోర్టు జడ్జి ఈ వ్యాఖ్య చేశారు. గత రెండు దశాబ్దాలుగా అవినీతి కుంభకోణాలు రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్నాయని న్యాయమూర్తి జస్టిస్ చౌదరి (అబ్బే…

నేషనల్ హెరాల్డ్ కధా కమామీషు!

‘నేషనల్ హెరాల్డ్’ పేరుతో పార్లమెంటులో ఓ వింత నాటకం ప్రదర్శితం అవుతోంది. నిజానికి పార్లమెంటులో ఇలాంటి వింత నాటకాల ప్రదర్శన కొత్తేమీ కాదు. ఈ నాటకాలు ఎప్పటికప్పుడు కొత్తగా కనపడేట్లు చూడడంలో పాలకులు, ప్రతిపక్షాలు చూపించే ప్రతిభా సంపత్తులే ఆసక్తికరంగా ఉంటుంటాయి. నెహ్రూ-గాంధీ కుటుంబాన్ని నేరుగా అవినీతి చర్చలోకి లాగిన రెండో ఉదంతం నేషనల్ హెరాల్డ్! మొదటి ఉదంతం బోఫోర్స్ అవినీతి ఆరోపణలని ప్రత్యేకంగా గుర్తు చేయనవసరం లేదు. విశేషం ఏమిటంటే బోఫోర్స్ అవినీతి కాంగ్రెస్ పార్టీ…

విదేశాల్లో నల్లడబ్బు: మూడో స్ధానంలో ఇండియా

భారతీయుల నల్ల డబ్బు తమ వద్ద లేదని స్విట్జర్లాండ్, తదితర నల్ల డబ్బు స్వర్గాలు నమ్మబలుకుతుండగా అందులో నిజం లేదని వాస్తవాలు తెలియజేస్తున్నాయి. రష్యా, చైనాల తర్వాత దేశీయ డబ్బును విదేశాలకు తరలిపోతున్న దేశాలలో ఇండియాయేదే తదుపరి స్ధానం అని ఒక అంతర్జాతీయ సర్వే సంస్ధ నిర్ధారించింది. గ్లోబల్ ఫైనాన్షియల్ ఇంటెగ్రిటీ (జి.ఎఫ్.ఐ) అనే సంస్ధ నల్ల డబ్బు వివరాలను వెల్లడి చేసింది. జి.ఎఫ్.ఐ నివేదిక ప్రకారం ఒక్క 2012 లోనే 94.76 బిలియన్ డాలర్ల డబ్బు…

గుత్తేదారులకు అ’ధనం’ చెల్లించేస్తున్నారు -కత్తిరింపు

జనాన్ని విభజన రందిలో ముంచేసిన రాష్ట్ర పాలకులు తమ కార్యాల్ని నిర్విఘ్నంగా చక్కబెట్టుకుంటున్నారు. ఇ.పి.సి ఒప్పందాలకు విరుద్ధంగా జలయజ్ఞం కాంట్రాక్టర్లకు ప్రజాధనాన్ని పెరిగిన ధరల పేరుతో అదనంగా చెల్లించడానికి సి.ఎం, ఆర్ధిక శాఖ ఆమోద ముద్ర వేసేశారు. కనీసం 20,000 కోట్ల రూపాయల ప్రజల సొమ్ము గుత్తేదారుల పరం చేసే ఈ బృహత్కార్యాన్ని కొద్ది రోజుల క్రితం ఈనాడు పత్రిక ప్రచురించింది. ఆర్ధిక శాఖ అభ్యంతరాలను నివృత్తి చేసేందుకు జనవరి 27 తేదీన సమావేశం జరగనుందని పత్రిక…

అవినీతి నేతల చిట్టా -కార్టూన్

“ఈసారి నుండి సారూ, అవినీతికి పాల్పడని నాయకుల జాబితా తయారు చేయమని అడగండి. అలాగైతేనే సమయం వృధా కాదు…” – అవినీతి నేతల చిట్టా తయారు చేయడం ఎంత కష్టమో ఈ కార్టూన్ చెబుతోంది. అనేకమంది నేతల్లో అవినీతి నేతలను వెతుక్కోవలసి రావడం కాదు ఆ కష్టం. అవినీతి నేతలను కనిపెట్టడం తేలికే గానీ వారి పేర్లను రాస్తూ పోవడమే అసలు కష్టం. కనపడ్డా ప్రతి రాజకీయ నాయకుడూ ఏదో ఒక సందర్భంలో అవినీతి సంపాదన ఆరోపణ,…

రాహుల్ అవినీతి వ్యతిరేక తమాషా -కార్టూన్

“తప్పు! పూర్తిగా తప్పు! మేము ఇదంతా చేయడానికి ఈ వ్యవస్ధ ఎలా అనుమతిస్తుందసలు?” ఎఎపి పుణ్యమాని రాజకీయ పార్టీలు అవినీతి వ్యతిరేక ఫోజు పెడుతున్న దృశ్యాలు మనం చూస్తూనే ఉన్నాం. అన్నా హజారే బృందం అవినీతి వ్యతిరేక ఉద్యమం మొదలు పెట్టిన దగ్గర్నుండే ఈ ఫోజులు మొదలయినప్పటికీ ఎఎపి ఎన్నికల్లో గెలిచి ప్రభుత్వం ఏర్పరచడంతో ఈ ఫోజులు బాగా పెరిగాయి. ‘అవినీతి వ్యతిరేకత’కు ఓట్లు రాల్చే గుణం కూడా ఉందని తెలిసాక ఇక రాజకీయ పార్టీలు ఊరుకుంటాయా?…

పాత నోట్లు రద్దు చేస్తే, నల్లధనం బైటికొస్తుందా? -కార్టూన్

నల్ల ధనం వెలికి తీయడానికి ఆర్.బి.ఐ ఒక చిట్కా కనిపెట్టింది. అది, 2005కు ముందు ముద్రించబడిన కరెన్సీ నోట్లను రద్దు చేయడం. జూన్ 30, 2014 లోపు ఈ పాత నోట్లను బ్యాంకుల్లో మార్చుకోవాలని ఆర్.బి.ఐ మూడు రోజుల క్రితం వినియోగదారుల కోరింది. 2005 ముందు నాటి నోట్లను ఉపసంహరించుకోవడం ఆర్.బి.ఐ చాలాకాలం క్రితమే ప్రారంభించిందని అయితే ఈ పనిని బ్యాంకుల వరకే పరిమితం చేశామని ఆర్.బి.ఐ గవర్నర్ రఘురాం రాజన్ చెప్పారు. పాత నోట్ల ఉపసంహరణ…

ఎఎపి అనూహ్య పరిణామక్రమం -కార్టూన్

అసలది పార్టీయేనా అని ఈసడించుకున్నారు కొందరు. రాజకీయాలు చేయడం అంటే వీధుల్లో చేసేవి కావు అని సెలవిచ్చారు మరి కొందరు. ఎఎపి అసలు మా లెక్కలోనే లేదని హుంకరించారు బి.జె.పి నాయకులు. తనమీదనే పోటీ చేస్తున్న కేజ్రీవాల్ ని చూసి హేళనగా నవ్వి తీసిపారేశారు మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్! మరి ఇప్పుడో! ఎఎపి నుండి నేర్చుకోవాల్సింది మాకు చాలా ఉంది అని రాహుల్ గాంధీ లెంపలు వేసుకుంటున్నారు. అభ్యర్ధుల ఎంపికలో కూడా ఎఎపి ని అనుసరిస్తామని…

ఎఎపి జనతా దర్బార్

ఆమ్ ఆద్మీ పార్టీ నేతృత్వంలోని ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు తన మొట్ట మొదటి జనతా దర్బార్ నిర్వహించింది. ఢిల్లీ సెక్రటేరియట్ ఎదురుగా రోడ్డుపైనే కూర్చుని దర్బార్ నిర్వహించగా జనం పోటెత్తారు. జనం భారీగా తరలి రావడంతో వారిని కట్టడి చేయడం పోలీసుల వల్ల కాలేదు. సమస్యలతో కూడిన విజ్ఞాపనలు ఇవ్వడానికి ప్రజలు తోసుకోవడంతో ముఖ్యమంత్రి అరవింద్ ఒక దశలో వేదికను వదిలి వేళ్లిపోవాల్సి వచ్చింది. తగిన ఏర్పాట్లు చేశామని చెప్పినప్పటికీ ఆ ఏర్పాట్లు కూడా…

మోడీకి రామ్ దేవ్ మద్దతు, షరతులతో… -కార్టూన్

ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పుడు అందరికీ ఐడియాలు సమకూర్చిపెడుతోంది. బేషరతు మద్దతు ఇవ్వడానికి ముందుకు వచ్చిన కాంగ్రెస్ కు 18 షరతులు విధించిన ఆప్, అనంతరం కాంగ్రెస్ మద్దతు స్వీకరణకు కూడా ప్రజాభిప్రాయ సేకరణ జరిపి వినూత్న ప్రజాస్వామిక ఆచరణకు నాంది పలికింది. ఆప్ నుండి ‘క్లూ’ అందిపుచ్చుకున్నారేమో ఇప్పుడు బాబా రామ్ దేవ్ మోడీకి మద్దతు ఇస్తాను గానీ అందుకు కొన్ని షరతులు ఉన్నాయ్ అంటున్నారు. తాను మొదట కాంగ్రెస్ కు అవకాశం ఇచ్చాననీ కానీ…

రాహుల్ సిద్ధం, షరతులు వర్తించును -కార్టూన్

ప్రధాని మన్మోహన్ సింగ్ శుక్రవారం తన పదవీకాలంలో మూడోసారి పత్రికా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన తన అధికార దండాన్ని రాహుల్ గాంధీకి అప్పగిస్తున్నట్లుగా పరోక్షంగా సూచించారు. ప్రధాన మంత్రి అభ్యర్ధిని తర్వాత ప్రకటిస్తాం అని చెబుతూనే కాంగ్రెస్ నాయకులలోకెల్లా రాహుల్ గాంధీకే ఆ పదవికి తగిన అర్హతలు ఎక్కువ ఉన్నాయని చెప్పారు. తద్వారా తన వారసుడు రాహుల్ గాంధీయే అని ఆయన స్పష్టం చేశారు. తన ప్రసంగంలో ప్రధాన మంత్రి పత్రికలపై విమర్శలు కురిపించారు. పత్రికల…

ఆదర్శ స్కాం, రాహుల్ ఆదర్శం -కార్టూన్

ఢిల్లీలో ఎఎపి ప్రభుత్వం ఏర్పాటు చేసింది మొదలు రాహుల్ గాంధీకి అవినీతి నిర్మూలనా జ్వరం పట్టుకుంది. అవినీతి నిర్మూలన తమ ఎజెండాలో కూడా ఉందని చెప్పుకోవడానికి ఆయన తెగ తంటాలు పడుతున్నారు. ఆదర్శ కుంభకోణం పైన మహారాష్ట్ర ప్రభుత్వం స్పందించిన తీరు దరిమిలా తానూ అవినీతి నిర్మూలనకు కట్టుబడి ఉన్నానని చెప్పుకోడానికి మరో అవకాశం కలిసొచ్చింది. కార్గిల్ యుద్ధంలో మృతి చెందిన భారత సైనికుల కోసం భారత ప్రభుత్వం ముంబైలో ఆదర్శ్ సొసైటీ పేరుతో స్ధల సేకరణ…