మేము చర్య తీసుకున్నాం, మీరేం చేశారు? -కేజ్రీవాల్

ఢిల్లీ రాష్ట్ర మంత్రి ఒకరు పరాయి మహిళలతో అనైతిక చర్యలకు పాల్పడుతూ అడ్డంగా దొరికి పోయారు. ఆయన లీలలు ఫోటోలు, వీడియోలుగా వెల్లడై పత్రికలూ, న్యూస్ చానెళ్లలో ప్రత్యక్షం అయ్యాయి. ఆ దొరికిపోయిన మంత్రి మహిళా మంత్రి కావడం మరింత విపరీతం అయింది. ఆయన పేరు సందీప్ కుమార్! ఇప్పుడు ఈ వార్త బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు మంచి అవకాశంగా లభించింది. లేదా ఒక బంపర్ అవకాశంగా ఆ పార్టీలు భావిస్తున్నాయి. ఆ పార్టీల నేతలు చేస్తున్న…

పూర్తి స్ధాయి రాష్ట్రం కాదు -ది హిందూ ఎడిట్ (విమర్శ)

(True translation to today’s The Hindu editorial: Not a full-fledged state) ********* ఢిల్లీ కేవలం కేంద్ర పాలిత ప్రాంతం మాత్రమే అని స్పష్టం చేయడం ద్వారా ఢిల్లీ హై కోర్టు, జాతీయ రాజధాని ప్రాంతం (నేషనల్ కేపిటల్ రీజియన్) యొక్క రాజ్యాంగ ప్రతిపత్తికి సంబంధించిన కొన్ని ప్రధాన మరియు అపరిష్కృత ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చింది. రాజ్యాంగం లోని ఆర్టికల్ ౨౩౯ రాష్ట్ర మంత్రివర్గంతో సంబంధం లేకుండా ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ స్వతంత్రంగా వ్యవహరించడానికి…

చెవిలో జోరీగ బాధ ఇంతింత కాదయా! -కార్టూన్

చట్టం ముందు అందరూ సమానులే అని రాజ్యాంగం చెబుతుంది. ఆచరణ ఇందుకు పూర్తిగా భిన్నం అని రాజకీయ పార్టీల, నాయకుల రాజకీయ ఆచరణ రుజువు చేసింది. ఏ‌ఏ‌పి లాంటి జోరీగలు లేకపోతే ఈ ఆటలు ఇంకా కొనసాగుతాయి. ఏ‌ఏ‌పి ఆవిర్భావం కుళ్ళిపోయిన రాజకీయ పరిస్ధితుల నుండి పుట్టిన అనివార్యత! రాజకీయ, సామాజిక, ప్రాకృతిక పరిస్ధితులు ఎల్లప్పుడూ ఒక సమతాస్ధితి (ఈక్విలిబ్రియమ్) కోసం అంతర్గతంగా కృషి చేస్తూ ఉంటాయి. సమతా స్ధితి తప్పినప్పుడు తిరిగి సమతా స్ధితి పొందడం…

అరవిందా మోడీయా ఎవరు బెటరు?

విశేషజ్ఞ గారి వ్యాఖ్య: – కాషాయం గ్యాంగుకి సోషల్ మీడియా సైట్లలో ఉన్న బలగంతో అరవింద్‌ని unpopular చేస్తున్నారేగానీ, నిజానికి ప్రస్తుత రాజకీయాల్లో అతిపెద్ద failure మన గౌరవనీయులైన PM గారు. ఆయనిచ్చిన వాగ్దానాల్లో ఆయన ఎన్నింటిని నిలబెట్టుకున్నరో లెక్కలేస్తే, అధికారంలోకి రాగానే తన వాగ్దానాలమీద దృష్టిసారించి వాటిని నిలుపుకున్న అరవింద్ మేరుపర్వతమంత ఎత్తున కనిపిస్తాడు (మన కాషాయ నేత పుట్టగొడుగంత ఉండొచ్చు). అరవింద్‌కూడా రాజకీయం చేస్తున్నాడు కాదనను. మరి అంత కంటే కూటరాజకీయం PM చేస్తున్నప్పుడు…

సోనియా అంటే మోడీకి భయం -కేజ్రీవాల్

అగస్టా వెస్ట్ లాండ్ కుంభకోణం విషయంలో చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆం ఆద్మీ పార్టీ ఈ రోజు ఢిల్లీలో ప్రదర్శన నిర్వహించారు. ఏ‌ఏ‌పి నేతలు అనేకమంది పాల్గొన్న ఈ ర్యాలీని ఢిల్లీ పోలీసులు అడ్డుకున్నారు. వందల మంది కార్యకర్తలను అరెస్టు చేశారు. ర్యాలీకి ముందుగా జరిగిన బహిరంగ సభలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పాల్గొని ప్రసంగించారు. ప్రసంగంలో ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని ఉతికి ఆరేశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడి ఉబుసుబోక ప్రసంగాలను నిలువునా చీరేశారు.…

బేసి-సరి అమలు: ఒక పరిశీలన

కేజ్రీవాల్ ప్రభుత్వం అమలు చేస్తున్న బేసి-సరి పధకం వల్ల ఢిల్లీలో కాలుష్యం తగ్గిందా లేదా అన్నది కేవలం ఒక్క ప్రశ్న మాత్రమే. కావాలంటే దానికీ సమాధానం చెప్పుకుందాం, ఉందో లేదో అని! ఢిల్లీ ప్రభుత్వం స్వల్పంగా కాలుష్యం తగ్గింది అని చెబుతోంది. కాదు.., స్వల్పంగా కూడా తగ్గలేదు అని కొందరు విశ్లేషకులు చెబుతున్నారు. ప్రభుత్వం భావిస్తున్నంతగా తగ్గలేదు కావచ్చు కూడా. ఎందుకంటే… 2013లో కాన్పూర్ ఐ‌ఐ‌టి వారు ఢిల్లీలో సర్వే మరియు పరీక్షలు నిర్వహించారు. ఢిల్లీ గాలిలో…

బేసి-సరి: ముంబైకి కూడా కావాలి -ఎన్‌సి‌పి

కాలుష్యం తగ్గించడానికి అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం తమ ఢిల్లీ రాష్ట్రంలో ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్న బేసి-సరి పధకం ఇతర రాష్ట్రాలను ఆకర్షిస్తోంది. ఢిల్లీలో అమలు చేస్తున్న పధకాన్ని ముంబై నగరంలో కూడా అమలు చేయాలని మహారాష్ట్ర ప్రతిపక్ష పార్టీ నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. ఎన్‌సి‌పి నేతల డిమాండ్ ను తాము పరిశీలిస్తున్నామని బి.జె.పి ప్రభుత్వ మంత్రులు కూడా చెప్పడం విశేషం. ఢిల్లీలో అమలు చేస్తున్న పధకం విజయవంతం అయినట్లతే దానిని ముంబైలో కూడా అమలు…

వివేకరహిత సోదా, రుచివిహీన ఫలితం -ది హిందు

[ఈ రోజు -డిసెంబర్ 17, 2015- ‘Tactless raid, unsavoury fallout’ శీర్షికన ది హిందు ప్రచురించిన సంపాదకీయానికి యధాతధ అనువాదం ఈ ఆర్టికల్. -విశేఖర్] *********** ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కార్యాలయంపై సి.బి.ఐ జరిపిన సోదాలు యోగ్యమైనవేనా అన్న విషయమై కొన్ని ప్రశ్నలు తలెత్తవచ్చు. అంతమాత్రాన అది ఆమ్ ఆద్మీ పార్టీ, బి.జె.పిల మధ్య, నిజానికి ఢిల్లీ మరియు కేంద్ర ప్రభుత్వాల మధ్య రుచి విహీనమైన  రాజకీయ యుద్ధం చెలరేగడానికి దారితీయవలసిన అవసరం లేదు.…

ఎన్నికల విజయం, రాజకీయ ఓటమి -ది హిందు ఎడిట్..

[‘Electoral victory, political defeat’ శీర్షికన ఈ రోజు ది హిందులో ప్రచురితం అయిన సంపాదకీయానికి ఇది యధాతధ అనువాదం. ఈ మధ్య కాలంలో ది హిందు నుండి అరుదుగా మారిన సంపాదకీయ రచనల్లో ఇది ఒకటి. -విశేఖర్] మెరుగైన ప్రజాస్వామిక మరియు పారదర్శక పాలన అందించే లక్ష్యమే తన ఉనికికి కారణంగా చెప్పుకునే ఆమ్ ఆద్మీ పార్టీకి అత్యున్నత నాయకత్వ స్ధాయిలో ఎదురవుతున్న కష్టాలు ఆ పార్టీ ఉనికికే ప్రమాదకరంగా పరిణమించాయి. ఢిల్లీ ముఖ్యమంత్రి మరియు పార్టీ జాతీయ కన్వీనర్…

ఎఎపి ఎలా గెలిచింది? -కార్టూన్

  ఎఎపి గెలుపుకు కారణం ఏమిటన్న ఒకే ఒక్క అంశంపై పుంఖాను పుంఖాలుగా వ్యాసాలు, విశ్లేషణలు, నివేదికలు, అధ్యయనాలు వెలువడుతున్నాయి. అవన్నీ ఎలా ఉన్నాయో ఈ కార్టూన్ చక్కగా వివరిస్తోంది. ప్రజల ప్రయోజనమే రాజకీయాల లక్ష్యం అన్న ప్రాధమిక సూత్రం తెలిసిన వారికి ఎఎపి గెలుపు ఎలా సాధ్యం అయిందో తెలియడానికి పెద్దగా సిద్ధాంతాలతో పని లేదు. బూటకపు వాగ్దానాలు కురిపించడానికి ఏ మాత్రం సిగ్గుపడని, స్వార్ధ ప్రయోజనాలే పరమావధిగా పని చేసే పార్టీలు నిండా వ్యాపించిన…

అరవింద్, మోడిల సమావేశం -కార్టూన్

  ఢిల్లీ అవడానికి రాష్ట్రమే అయినా పాలన రీత్యా అది పూర్తి స్ధాయి రాష్ట్రం కాదు. పాలన కోసం రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ఆధారపడాలి. ముఖ్యంగా శాంతి భద్రతలు! మామూలుగా అయితే శాంతి భద్రతలు రాష్ట్రాల హక్కు. రాష్ట్రాల్లోని పోలీసులే శాంతి భద్రతలను చూస్తుంటారు. అలాంటి పోలీసు విభాగం ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ద్వారా కేంద్రం అదుపులో ఉంటుంది. ఈ కారణం వలన పోలీసులు ఢిల్లీ సి.ఎంకు సమాధానం చెప్పరు. దరిమిలా రాష్ట్రంలో ఎలాంటి నేరం జరిగినా…

కేజ్రీవాల్ ఇంకో పెద్ద మెట్టు ఎక్కాలి -కార్టూన్

  ఢిల్లీ ఎన్నికల్లో భారీ మెజారిటీ సాధించడం ద్వారా అరవింద్ కేజ్రీవాల్/ఎఎపి ఒక పెద్ద మెట్టు ఎక్కి వచ్చారు. ఇప్పుడిక పూర్తి స్ధాయి పాలన అనే మరో పెద్ద మెట్టు ఎక్కాలి. ఆయన, ఆయన పార్టీ అన్నీ రకాలుగా విఫలం కావాలని సంపన్న వర్గాలు, వారి పార్టీలు తీవ్రంగా కోరుకుంటున్నందున ఢిల్లీ రాష్ట్ర పాలన ఎఎపికి నల్లేరుపై నడక ఏమీ కాదు. పార్టీ వయసు, అనుభవం… ఇత్యాది అంశాల రీత్యా ఎఎపి సైజు చాలా చిన్నదని కార్టూనిస్టు…

చీపురు కట్టా, కుతుబ్ మినారా? -కార్టూన్

  “వటుడింతింతై…” అన్నట్లుగా ఎదిగిపోయిన సామాన్యుడి పార్టీని చూసి తెల్లబోయే పని ఇప్పుడు బి.జె.పి సామ్రాజ్యాధీశుల వంతు. ‘లోక్ పాల్’ చట్టం కోసం హజారే, అరవింద్, బేడి, భూషణ్ ల బృందం జనాన్ని వెంటేసుకుని ఉద్యమిస్తున్నప్పుడు ‘మీరు రాజకీయాల్లోకి వచ్చి చూడండి. అదెంత కష్టమైన పనో’ అంటూ కాంగ్రెస్, బి.జె.పి పార్టీల నాయకులు ఎకసక్కెం చేశారు. “అయితే మేమూ రాజకీయాల్లోకి వచ్చి చూపిస్తాం. పార్టీ పెట్టి ప్రజల కోసం చేసే పాలన ఎంత తేలికో చూపిస్తాం” అంటూ…

ఢిల్లీ: సామాన్యుడి దెబ్బకు దిమ్మ తిరిగింది!

ఆమ్ ఆద్మీ దెబ్బ ఏమిటో సంపన్నులకు రుచి చూపిన ఘనత ప్రస్తుతానికి ఆమ్ ఆద్మీ పార్టీకి అప్పజెబుదాం. ఎన్ని పరిమితులు ఉన్నప్పటికీ ఈ మధ్య కాలంలో భారత దేశంలోని సామాన్య కార్మికవర్గ పౌరుడు కాస్త గర్వంగా తల ఎగరవేయదగ్గ రోజు ఈ రోజని చెప్పడంలో సందేహం లేదు. స్ధల, కాల పరిమితులను దృష్టిలో పెట్టుకుంటే భారత దేశంలోని పార్లమెంటరీ రాజకీయాల్లో అచ్చంగా సామాన్య ప్రజలు ఐక్యమై పాలకవర్గాలకు వారి వెనుక ఉన్న సంపన్న కులీన దోపిడీ శక్తులకు…

మోడి బాణాలు కేజ్రీవాల్ కలికితురాళ్ళు -కార్టూన్

లోక్ సభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ఎదుర్కొన్న పరిస్ధితిని ఢిల్లీ ఎన్నికలకు ముందు బి.జె.పి ఎదుర్కొంది. ఇంకా చెప్పాలంటే ఆనాడు బి.జె.పి ప్రదర్శించిన ఓటు చతురతను ఈ రోజు ఎఎపి ప్రదర్శించింది. వ్యక్తిగత స్ధాయికి వెళ్ళినట్లయితే ఆనాడు మోడి కనపరిచిన చాతుర్యం ఈ రోజు అరవింద్ కేజ్రీవాల్ కనబరుస్తున్నారు. లోక్ సభ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ నిస్పృహతో చేసిన విమర్శలను తన ప్రచారాస్త్రాలుగా మోడి/బి.జె.పి మలుచుకున్నారు. ఢిల్లీ ఎన్నికల్లోనూ బి.జె.పి ఒకింత బెదురుతో, నిస్పృహతో చేసిన విమర్శలను…