తాజా వార్త: దేశం విడిచి వెళ్ళిన యెమెన్ అధ్యక్షుడు సలే

శుక్రవారం నాటి రాకెట్ దాడిలో గాయపడిన యెమెన్ అధ్యక్షుడు ఆలీ అబ్దుల్లా సలే మెరుగైన వైద్యం కోసం సౌదీ అరేబియాకు వెళ్ళినట్లుగా బిబిసి ప్రకటించింది. అధ్యక్షుడు సలేతో పాటు అతని కొలువులోని ప్రధాని తదితర ముఖ్య అధికారులంతా దేశం విడిచి వెళ్ళినట్లు తెలిపింది. అయితే ఆయన వైద్యం కోసమే వెళ్ళాడా లేక ప్రజల డిమాండ్ ను నెరవేర్చాడా అన్నది వెంటనే తెలియరాలేదు. శుక్రవారం గాయపడ్డాక అధ్యక్షుడు సలే మళ్ళీ ప్రజలకు టీవిలో కనిపించలేదు. ప్రభుత్వ టెలివిజన్ ఆడియో…

రాకెట్ దాడిలో యెమెన్ అధ్యక్షుడికి గాయాలు, ప్రజాందోళనలు తీవ్రతరం

తిరుగుబాటు తెగలు శుక్రవారం అధ్యక్ష భవనంపై చేసిన రాకెట్ దాడిలో అధ్యక్షుడు, ఆలి అబ్దుల్లా సలే గాయపడ్డాడు. ఆయనతో పాటు ప్రభుత్వంలోని ఇతర ముఖ్య అధికారులు కూడా గాయపడినట్లు తెలుస్తోంది. గాయపడిన తర్వాత అధ్యక్షుడికి ఏమీ కాలేదని, కొద్ది గంటల్లో ప్రజలముందుకు వస్తాడని చెప్పినప్పటికీ అది జరగలేదు. దాడి జరిగిన ఆరు గంటల అనంతరం ప్రభుత్వ టివీలో రికార్డు చేయబడిన ఉపన్యాసం వినిపించారు. సలే కష్టంగా మాట్లాడాడని, మద్య మధ్యలో ఊపిరి భారంగా తీసుకున్నాడని విలేఖరులు తెలుపుతున్నారు.…

అమెరికా, ఇరాన్… పశ్చిమాసియాలో గెలుపెవరిది?

పశ్చిమాసియాలో అరబ్ విప్లవాల నేపధ్యంలో ప్రత్యక్షంగా కనపడని పరోక్ష యుద్ధం ఒకటి సాగుతోంది. అమెరికా, ఇజ్రాయెల్ ఒకవైపు, ఇరాన్ మరో వైపు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ పరోక్ష యుద్ధంలో గెలవడానికి అమెరికా ప్రత్యక్షంగా పాల్గొంటుంటే ఇరాన్ మాత్రం నింపాదిగా జరిగేది చూస్తూ ఉంది. ఇరాన్ విరోధులు ఇరాన్ ప్రమేయం లేకుండానే ప్రజల తిరుగుబాట్లలో నేలకొరుగుతుంటే ఇరాన్ చేయవలసిందేముంటుంది గనక? ఈజిప్టులో ముబారక్ శకం ముగిసింది. ఇరాన్ విరోధి సౌదీ అరేబియా మిత్రులు బహ్రెయిన్, యెమెన్ లు…

గడ్దాఫీని చంపడానికి మళ్ళీ నాటో దాడి, కొడుకు ముగ్గురు మనవళ్ళు మృతి

గడ్డాఫీని చంపడానికే కంకణం కట్టుకున్న నాటో దేశాలు మరోసారి లిబియా అధ్యక్షుడు గడ్డాఫీ నివాస సముదాయంపై మిసైళ్ళతో దాడి చేశాయి. దాడినుండి గడ్డాఫీ తప్పించుకున్నప్పటికీ చిన్న కొడుకు సైఫ్ ఆల్-అరబ్ తో పాటు ముగ్గురు మనవళ్ళు చనిపోయినట్టు లిబియా ప్రభుత్వం తెలిపింది. భవనంపై కనీసం మూడు మిసైళ్ళు ప్రయోగించారనీ, దాడిలో భవనం పూర్తిగా దెబ్బతిన్నదనీ లిబియా ప్రభుత్వ ప్రతినిధి మౌసా ఇబ్రహీం తెలిపాడు. దాడి జరిగిన కొద్ది గంటల్లోనే నాటో ప్రతినిధి ఛార్లెస్ బౌచర్డ్ వివరణ ఇవ్వడానికి…

గాజా సరిహద్దును శాశ్వతంగా తెరవడానికి నిర్ణయించిన ఈజిప్టు

అరబ్ ప్రజా ఉద్యమాలకు మరో బోనస్. ఈజిప్టులోని మధ్యంతర ప్రభుత్వం గాజాతో ఉన్న రఫా సరిహద్దును శాశ్వత ప్రాతిపదికన తెరిచి ఉంచడానికి నిర్ణయించింది. పాలస్తీనా వైరి పార్టీల మధ్య ఊహించని విధంగా ఒప్పందం కుదరడానికి సహకరించిన ఈజిప్టు ప్రభుత్వం గాజా సరిహద్దును తెరవాలని నిర్ణయించడం అభినందనీయం. అయితే అరబ్ ప్రజల ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఇజ్రాయిల్‌తో కొనసాగుతున్న (అ)శాంతి ఒప్పందం కూడా రద్ధు చేసుకుంటే ఈజిప్టు ప్రభుత్వానికి ప్రపంచవ్యాపితంగా ప్రశంసలు అందుతాయి. కానీ అమెరికానుండి సంవత్సరానికి 1 బిలియన్…

అరబ్ ప్రజా ఉద్యమాలకు బోనస్, పాలస్తీనా వైరివర్గాల మధ్య శాంతి ఒప్పందం

ఈజిప్టు, ట్యునీషియాలలో నియంతలను తరిమికొట్టిన ప్రజా ఉద్యమాలు తమవరకు పూర్తి విజయం సాధించలేక పోయినా, తమ పొరుగు అరబ్బులు పాలస్తీనీయుల మధ్య శుభప్రదమైన శాంతి ఒప్పందం కుదరడానికి దోహదపడ్దాయి. ఇజ్రాయెల్ దురాక్రమణలో ఉన్న పాలస్తీనాకు స్వతంత్రం సాధించడానికి పోరాడుతున్న ఫతా, హమాస్ పార్టీల మధ్య తీవ్ర వైరం నెలకొన్న సంగతి తెలిసిందే. ఈజిప్టులో ఏర్పడిన మద్యంతర ప్రభుత్వం మధ్యవర్తిత్వంతో వైరి పక్షాల మధ్య సంబంధాలు మెరుగుపడే దిశలో ప్రయత్నాలు మొదలయ్యాయి. దానిలో మొదటి అడుగుగా ఇరుపక్షాలూ సహకరించుకోవడానికి…

సిరియా కాల్పులపై భద్రతాసమితి తీర్మానాన్ని వ్యతిరేస్తున్న ఇండియా, చైనా, రష్యాలు

నాలుగు రోజులనుండి సిరియా ఆందోళనలపై అక్కడి ప్రభుత్వం స్పందిస్తున్న తీరును ఖండించడానికి భద్రతా సమితిలొ జరుగుతున్న చర్చలు ఇంకా ఓ కొలిక్కి రాలేదు. శాంతియుతంగా ఆందోళనలు నిర్వహిస్తున్న ఆందోళనకారులపై సిరియా ప్రభుత్వం కాల్పులు జరుపుతున్నదనీ, వారితో చర్చలు జరిపేవిధంగా సిరియాపై ఒత్తిడి తేవడానికి పశ్చిమ దేశాలు ప్రయత్నిస్తున్నాయి. సమితి తీర్మానాన్ని అడ్డు పెట్టుకుని పశ్చిమ దేశాలు ఎంతకైనా తెగిస్తాయన్న విషయం లిబియా అనుభవం ద్వారా స్పష్టం కావడంతో సిరియాపై తీర్మానాన్ని ఇండియా, చైనా, రష్యా ప్రభుత్వాలు గట్టిగా…

సిరియా ఆందోళనలకు అమెరికా రహస్య సహాయం

సిరియా అధ్యక్షుడు రాజీనామా చేయాలంటూ జరుగుతున్న హింసాత్మక ఆందోళనలకు అమెరికా 5 సంవత్సరాలనుండీ రహస్యంగా నిధులు అందజేస్తూ వచ్చిన విషయాన్ని వికీలీక్స్ ద్వారా వెల్లడి అయ్యింది. 2006లో జార్జి బుష్ అధికారంలో ఉన్నప్పటినుండి ప్రారంభమైన ఈ సహాయం ఒబామా అధ్యక్షుడు అయ్యాక కూడా కొనసాగిన విషయం వికీలీక్స్ వెల్లడించిన డిప్లొమేటిక్ కేబుల్స్ ద్వారా స్పష్టమయ్యింది. సిరియా అధ్యక్షుడు అస్సద్ 2000 సంవత్సరంలో తన తండ్రి చనిపోయినప్పటినుండీ అధికారంలో ఉన్నాడు. ఇరాక్ మాజీ అద్యక్షుడు సద్దాం హుస్సేన్ లాగానే…

గడ్డాఫీ అమ్ములపొదిలో క్లస్టర్ బాంబులు, హక్కుల సంస్ధ ఆందోళన

లిబియాలో గడ్డాఫీ బలగాలు పౌరులపై క్లస్టర్ బాంబులు ప్రయోగిస్తున్నాయని మానవహక్కుల సంస్ధ హ్యూమన్ రైట్స్ వాచ్ సంస్ధ ఆరోపించింది. ఈ ఆరోపణలను లిబియా ప్రభుత్వం తిరస్కరించింది. క్లస్టర్ బాంబులుగా పెర్కొంటూ న్యూయార్క్ టైమ్స్ పత్రిక కొన్ని ఫోటోలను ప్రచురించింది. పౌరుల నివాస ప్రాంతాల్లో క్లస్టర్ బాంబుల్ని పేల్చడం వలన మానవ నష్టం అపారంగా ఉంటుందనీ, గడ్డాఫీ ఈ బాంబుల వాడకాన్ని వెంటనే నిలిపివేయాలనీ హక్కుల సంస్ధ డిమాండ్ చేసింది. అయితే న్యూయార్క్ టైమ్స్ విలేఖరికి కనిపించిన బాంబు…

బహ్రెయిన్ చీకటి రహస్యం -వీడియో

ట్యునీషియా, ఈజిప్టు దేశాల్లో ప్రజలు ఉద్యమించి నియంతృత్వ పాలకులను పదవీచ్యుతులను చేశాక ఆ దేశాల స్ఫూర్తితో ప్రజాందోళనలు మొదలైన అరబ్ దేశాల్లో బహ్రెయిన్ కూడా ఒకటి. బహ్రెయిన్ రాజు వెంటనే గద్దె దిగాలని బహ్రెయిన్ ప్రజలు డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవాలని కోరుకున్నారు. మొదట మళ్లీ పోటీ చేయననీ, 2013 లో తన పదవీ కాలం ముగిశాక ఇతరులకు అధికారం అప్పగిస్తామని హామీ ఇచ్చినా ప్రజలు అంగీకరించలేదు. ప్రజలకు అనేక తాయిలాలు ప్రకటించీన లొంగలేదు.…

ఇద్దరు పుత్రులతో సహా ముబారక్ ను అరెస్టు చేసిన ఈజిప్టు మిలట్రీ ప్రభుత్వం

ఈజిప్టు ప్రజల ఉద్యమం దెబ్బకు గద్దె దిగిన ఈజిప్టు నియంత ముబారక్, అతని ఇద్దరు పుత్రులను ఈజిప్టు తాత్కాలిక సైనిక ప్రభుత్వం బుధవారం నిర్బంధంలోకి తీసుకుంది. ముబారక్ తో పాటు, అతని కుటుంబ సభ్యులు తమ పాలనలో తీవ్రమైన అవినీతికి పాల్పడ్డారనీ, వారితో కుమ్మక్కైన సైనిక ప్రభుత్వం విచారణ జరగకుండా కాలం గడుపుతోందనీ ఆరోపిస్తూ ఈజిప్టు ప్రజలు మళ్ళీ తాహ్రిరి కూడలి వద్ద బైఠాయింపు ప్రారంభించిన సంగతి తెలిసిందే. మళ్ళీ ప్రజా ఉద్యమం ప్రారంభమైనాక సైనికుల కాల్పుల్లో…

సైనిక ప్రభుత్వంపై పెరుగుతున్న ఈజిప్టు ప్రజల ఆగ్రహం

ఈజిప్టు ప్రజల్లొ సైనిక ప్రభుత్వంపై రోజు రోజుకీ ఆగ్రహం పెరుగుతోంది. తాము మూడు వారాల పాటు ఉద్యమించి నియంత ముబారక్ ను గద్దె దింపినప్పటికీ ముబారక్ పాలన అంతం కాలేదన్న అసంతృప్తి వారి ఆగ్రహానికి కారణం. ముబారక్ పాలనలో వ్యవహారాలు నడిపినవారే ముబారక్ ను సాగనంపిన తర్వాత కూడా కొనసాగుతుండడం, వారే ఇంకా నిర్ణయాలు తీసుకునే స్ధానంలొ కొనసాగడం వారికి మింగుడుపడడం లేదు. తాము సాధించామనుకున్న విప్లవం, మార్పు నామమాత్రంగా మిగిలిపోతున్న సూచనలు కనిపిస్తుండడంతో ఈజిప్టు ప్రజల్లో…

ఈజిప్టులో మళ్ళీ ఆందోళనలు, ముబారక్ ను మరిపిస్తున్న ఈజిప్టు సైనిక ప్రభుత్వం

ఫిబ్రవరి 11 న ఈజిప్టు నియంత హోస్నీ ముబారక్ ను గద్దె దింపిన ప్రజల ఆందోళనలు తిరిగి మొదలయ్యాయి. ముబారక్ నుండి అధికారం నుండి చేపట్టిన సైనిక ప్రభుత్వం తానిచ్చిన హామీలను అమలు చేయకపోవడంతో ఈజిప్టు ప్రజలు మళ్ళీ తాహ్రిరి స్క్వేర్ లో శుక్రవారం పెద్ద ప్రదర్శన నిర్వహించారు. ముబారక్ గద్దె దిగి దేశంనుండి వెళ్ళి పోయిన తర్వాత కూడా కొంతమంది ఆందోళనకారులు విమోచనా కూడలి వద్ద బైఠాయింపు కొనసాగించారు. ప్రజలు డిమాండ్ చేసిన ప్రజాస్వామిక సంస్కరణలను…

గడ్డాఫీకి ఆశ్రయం ఇవ్వడానికి మేం రెడీ -ఉగాండా

గడ్డాఫీ కోరితే ఆశ్రయం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని ఉగాండా ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు ఆల్-అరేబియా టీవి చానెల్ ఉగాండా ప్రభుత్వాన్ని ఉటంకిస్తూ బుధవారం ప్రకటించింది. అయితే పూర్తి వివరాలను ఛానెల్ తెలపలేదు. మంగళవారం లండన్ లో పశ్చిమ దేశాలతో పాటు కొన్ని అరబ్ దేశాలు సమావేశమై లిబియా భవిష్యత్తు పై చర్చించాయి. లిబియాలో ఘర్షణలను ముగించడానికి వీలుగా గడాఫీ వెంటనే వేరే దేశంలో ఆశ్రయం కోరవచ్చునని మంగళవారం సమావేశం అనంతరం ఆ దేశాలు ఉమ్మడిగా ప్రకటించాయి.…

యెమెన్ లో ఆగని అనుకూల, ప్రతికూల ప్రదర్శనలు, షరతులతో రాజీనామాకి సిద్ధమన్న అధ్యక్షుడు

యెమెన్ లో అధ్యక్షుడికి వ్యతిరేకంగా ప్రదర్శనలు జరుగుతుండగా అధ్యక్షుడు కూడా తనకు అనుకూలంగా ర్యాలీలు నిర్వహింప జేస్తున్నాడు. అధ్యక్షుడు ఆలీ అబ్దుల్లా సలే వెంటనే గద్దె దిగాలని డిమాండ్ చేస్తూ నెలన్నర క్రితం రాజధాని సనా లోని యూనివర్సిటీ విధ్యార్ధులు మొదలు పెట్టిన ఉద్యమం ఇతర సెక్షన్ల ప్రజల చేరికతో తీవ్ర రూపం దాల్చింది. శుక్రవారం (మార్చి, 25) ఇరుపక్షాలు పెద్ద ఎత్తున ర్యాలీలు నిర్వహించాయి. ర్యాలిల్లొ పదుల వేల సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారని బిబిసి తెలిపింది.…