పశ్చిమ దేశాల పంచ ముఖ ముట్టడికి రష్యా జవాబు ఇచ్చేనా!?

మానవ జాతి నాగరికత మరియు అభివృద్ధి, పరస్పర సహకారం మరియు సౌభ్రాతృత్వం, సమస్త మానవుల ప్రజాస్వామ్యం-సమానత్వం ఇవి మానవ సమాజం సాధించిన మహోన్నత విలువలు. ఈ విలువలతో పోల్చితే అమెరికా, పశ్చిమ దేశాలు తాము ఎంత అనాగరిక పాశవిక దశలో ఉన్నామో స్పష్టంగా తమ నోటి తోనే ప్రకటించుకుంటున్నాయి. ఉక్రెయిన్ కేంద్రంగా రష్యా, నాటో దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం వారికి ఆ అవకాశం ఇచ్చింది. రష్యాపై విధించిన ఆంక్షలకు మద్దతు ఇవ్వకుండా తటస్థ వైఖరిని పాటిస్తున్న…

ఇండియా-రష్యా వాణిజ్యంపై అమెరికా సినికల్ దాడి!

అమెరికాతో స్నేహం చేయడం అంటే మన గొయ్యి మనం తవ్వుకోవడం అని మరోసారి రుజువు అవుతోంది. ఉక్రెయిన్ పై రష్యా చేస్తున్న యుద్ధం సందర్భంగా అమెరికా తన వక్ర బుద్ధిని, ఆధిపత్య అహంభావాన్ని, సిగ్గులేనితనాన్ని, మానవత్వ రాహిత్యాన్ని పచ్చిగా, నగ్నంగా, నిర్లజ్జగా ప్రదర్శిస్తోంది. ఆరు నూరైనా అమెరికా మాట వినాల్సిందే. మనకు ఎంత నష్టం అయినా దాని మాట విని తీరాల్సిందే. ద్రవోల్బణం పెరిగి, నిత్యవసరాల ధరలు పెరిగి భారత ప్రజలు అల్లాడుతున్నా సరే అమెరికా షరతులు…

ఆఫ్ఘన్ పై పట్టు: రేసులో అమెరికా ముందంజ (ఇప్పటికి!)

తన భౌగోళిక రాజకీయ ప్రయోజనాల కోసం ఎలాంటి అడ్డదారి తొక్కడానికైనా అమెరికా ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. రొయ్యలు ఒంటికి మంచిది కాదని ఊరంతా నీతులు చెప్పి రొయ్యల బుట్ట తానే మాయం చేసేసి లొట్టలు వేస్తూ భుజిస్తుంది. ఈ సంగతి మరోసారి రుజువు చేసుకుంది అమెరికా. ఎవరికీ చెప్పా పెట్టకుండా, కనీసం సంకేతాలు కూడా ఇవ్వకుండా తాలిబాన్ కు నిధులు అందించే మార్గాన్ని అమెరికా తెరిచి పట్టుకుంది. తద్వారా ఆఫ్ఘనిస్తాన్ దేశం ఆర్ధిక మూలాలు తన చేతుల్లో…

జులియన్ అసాంజేని అమెరికికాకు ఇచ్చేస్తారట! -కార్టూన్

బ్రిటన్ హై కోర్టు అసాంజే ను అమెరికాకు extradite చెయ్యడానికి ఓకే చెబుతూ తీర్పు చెప్పింది. దానితో అయన హక్కులకు చివరికి ప్రాణాలకు కూడా ముప్పు వచ్చింది. అసాంజేను లాక్కెళ్లి జైల్లో కుక్కడానికి, ఆయనను చిత్ర హింసలు పెట్టి కక్ష తీర్చుకోవడానికి అమెరికా అనేక ఏళ్లుగా ఉవ్విళ్లూరుతోంది. బ్రిటన్ పై తీవ్ర ఒత్తిడి తెస్తూ వచ్చింది. అమెరికా ఒత్తిళ్లు ఫలించాయి. అసాంజేను అమెరికాకు అప్పగిస్తే అంకుల్ సామ్ ఏం చేస్తాడో కార్టూన్ చెబుతోంది. డిప్లొమాటిక్ కేబుల్స్ తో…

ఆఫ్ఘన్ చుట్టూ తిరుగుతున్న అమెరికా ఆత్మ!

బ్రతికున్నప్పుడు కోరికలు తీరని మనిషి చనిపోయాక దెయ్యమై అక్కడే తిరుగుతుంటాడని ప్రతీతి! ఆఫ్ఘనిస్తాన్ కు సంబంధించి అమెరికా వ్యవహారం అలానే ఉంది. టెర్రరిస్టు వ్యతిరేక పోరాటం పేరుతో ఆఫ్ఘన్ చుట్టుపక్కల దేశాలతో స్నేహ సంబంధాలు పెంచుకునేందుకు అమెరికా ప్రయత్నిస్తున్నదని తెలుస్తోంది. 20 యేళ్ళ పాటు ఆఫ్ఘనిస్ధాన్ ను దురాక్రమించి సాయుధంగా తిష్టవేసిన అమెరికా అక్కడి ప్రజలను నానా విధాలుగా పట్టి పల్లార్చింది. 70,000కు పైగా ఆఫ్ఘన్ పౌరులను బాంబుదాడులతో చంపేసింది. టెర్రరిస్టుల వేట పేరుతో అర్ధ రాత్రిళ్ళు…

ఆకస్: సుదృఢం అవుతున్న బహుళ ధృవ ప్రపంచం! -3

    నాటోకు కాల దోషం? అప్పటికే ఆఫ్ఘనిస్తాన్ సైనిక ఉపసంహరణ విషయమై నాటో కూటమి లోని ఈ‌యూ సభ్య దేశాలు అసంతృప్తిగా ఉన్నాయి. నాటో కూటమితో సంప్రదించకుండా, ఈ‌యూతో ఏకీభావం సాధించకుండా ఆఫ్ఘన్ నుండి సైనిక బలగాలను ఆగస్టు 31 లోపు ఉపసంహరిస్తున్నామని బైడెన్ ఏకపక్షంగా ప్రకటించడం ఈ‌యూ దేశాలకు గాని నాటో కూటమికి గానీ మింగుడు పడలేదు. అత్యంత పెద్దదయిన నాటో ‘ఉమ్మడి’ మిలట్రీ స్ధావరం అయిన బాగ్రం వైమానికి స్ధావరాన్ని జులైలో ఖాళీ…

ఆకస్: అమెరికా, ఈ‌యూల మధ్య చిచ్చు -2

దూరం అవుతున్న యూ‌ఎస్, ఈ‌యూ ఈ అంశాన్ని కాస్త వివరంగా చూద్దాం. రెండో ప్రపంచ యుద్ధానంతరం సోషలిజం విస్తరించనున్నదన్న భయంతో అమెరికా, పశ్చిమ ఐరోపా దేశాలు ఉమ్మడిగా పని చేయడం ప్రారంభించాయి యుద్ధంలో జర్మనీ, జపాన్, ఇటలీల ఫాసిస్టు కూటమిని ఓడించడానికి ఏర్పడిన నాటో కూటమి యుద్ధం ముగిశాక సోషలిజం నిర్మూలన లక్ష్యంగా పని చేయడం ప్రారంభించింది. ప్రధాన భౌగోళిక-రాజకీయ పరిణామాలన్నింటిలో యూ‌ఎస్, ఈ‌యూ లు నాటో వేదికగా పరస్పరం సంప్రదించుకుని పాల్గొన్నాయి. సోవియట్ రష్యాకు వ్యతిరేకంగా…

ప్రపంచ యుద్ధ ప్రమాదాన్ని చేరువ చేసిన ‘ఆకస్’ మిలట్రీ కూటమి

  2021 సెప్టెంబర్ 15 వ తేదీన ప్రపంచ భౌగోళిక-రాజకీయ యవనికపై ఎవరూ ఊహించని పరిణామం చోటు చేసుకుంది. ఆస్ట్రేలియా(A), బ్రిటన్ (యునైటెడ్ కింగ్^డమ్ – UK), అమెరికా సంయుక్త రాష్ట్రాలు (US).. ఈ మూడు సభ్య దేశాలుగా ‘ఆకస్ (AUKUS) పేరుతో మిలట్రీ కూటమి ఏర్పడినట్లుగా మూడు దేశాల నేతలు ప్రకటించారు. కూటమి ఏర్పాటు దానికదే ఒక ముఖ్య పరిణామం కాగా, ఆస్ట్రేలియాకు అణు ఇంధనంతో నడిచే 8 సబ్ మెరైన్లను అమెరికా సరఫరా చేయనున్నట్లు…

మోడి, దావోస్ సమావేశాలు, సామ్రాజ్యవాద వైరుధ్యాలు -2

మోడికి దక్కిన ఈ పోస్ట్ మెన్ / కొరియర్ పాత్రకే భారత మీడియా, బి‌జే‌పి నేతలు చంకలు గుద్దుకుంటున్నారు. ప్రపంచ వేదికలపై భారత్ కు ప్రతిష్ఠ పెరిగింది అని చెప్పడానికి ఇదే తార్కాణం అని ప్రజలకు నమ్మబలుకుతున్నారు. బలి ఇచ్చేముందు మేకపోతును అందంగా అలంకరించి, డప్పు వాయిద్యాల మధ్య వీధుల వెంట ఊరేగిస్తారన్న ఎరుక వీరికి లేకపోవడం భారత ప్రజల దౌర్భాగ్యం. కాగా మోడీ, ట్రంప్ ను తప్పు పట్టడాన్ని చైనా భలే సంతోషపడింది. దావోస్ వేదికపై…

ఉత్తర కొరియా ఏమి ఆశిస్తోంది? -3

[ఉత్తర కొరియా వ్యాస పరంపరలో ఇది మూడవ భాగం. -విశేఖర్] ************* ఇప్పటి ఉత్తర కొరియా సోషలిస్టు దేశం కాదు. ఆ దేశ పాలకులకు సోషలిస్టు సమాజాన్ని నిర్మించే లక్ష్యం ఏమీ ప్రస్తుతం లేదు. కిమ్ జోంగ్ ఉన్ తండ్రి కిమ్ జోంగ్ ఇల్ హయాం లోనే ఉత్తర కొరియాలో మార్కెట్ సంస్కరణలు ప్రారంభం అయ్యాయి. పెట్టుబడిదారీ దేశాల అండతో పెట్టుబడిదారీ అభివృద్ధి వైపు త్వరత్వరగా ప్రయాణం చేయాలని ఉత్తర కొరియా పాలకులు ఆశిస్తున్నారు. అయితే వారు…

వెనిజులా సంక్షోభం: సుప్రీం కోర్టుపై హెలికాప్టర్ దాడి

సంక్షుభిత లాటిన్ అమెరికా దేశం వెనిజులాలో మరో సారి రాజకీయ సంక్షోభం తీవ్రం అయింది. నిరసన పేరుతో జాతీయ పోలీసుల్లోని ఒక సెక్షన్ అధికారి జూన్ 27 తేదీన ప్రభుత్వ హెలికాప్టర్ ను స్వాధీనం చేసుకుని దాని ద్వారా నేరుగా సుప్రీం కోర్టు పైనే కాల్పులు సాగించాడు. దాడి చేసిన వారిని టెర్రరిస్టులుగా వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురో ప్రకటించాడు. ప్రతిపక్షాలు అధ్యక్షుడు మదురోపై పెడుతున్న తప్పుడు కేసులను సాక్ష్యాలు లేని కారణాన డిస్మిస్ చేస్తున్న నేపధ్యంలో…

అరుణాచల్ సరిహద్దు: దలైలామా పాచిక విసిరిన అమెరికా?

ఇండియా, చైనా సరిహద్దు సమస్య పరిష్కారం ముంగిట ఉన్నదని చైనా ప్రకటించిన కొద్ది రోజులకే ఇరు దేశాల మధ్య దలైలామా సందర్శన విషయమై ఘర్షణ చెలరేగడం కాకతాళీయమా లేక పధకం ప్రకారం జరిగిందా? ఇండియా, చైనాల మధ్య సరిహద్దు సమస్య శాంతియుతంగా, ఎవరి జోక్యం లేకుండా… ముఖ్యంగా అమెరికా, పశ్చిమ రాజ్యాల జోక్యం లేకుండా పరిష్కారం కావడం ఇష్టం లేకనే అర్జెంటుగా దలైలామా అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్ర సందర్శనకు పధకం రచించబడిందని భౌగోళిక రాజకీయ విశ్లేషకులు అనుమానిస్తున్నారు.…

టెర్రరిస్టులకు అమెరికా సాయం ఆపాలి -అమెరికా ఎంపీ

స్ట్రెయిట్ ఫ్రమ్ ద హార్స్ మౌత్! పందెంలో గెలిచే గుర్రం గురించిన సమాచారం గుర్రం నోటి నుండే వెలువడింది.  ప్రపంచంలో అత్యంత కరుడు గట్టిన టెర్రరిస్టు సంస్ధలను పెంచి పోషిస్తున్నది ఎవరో వారి నుండే అసలు వాస్తవం వెల్లడి అయింది. రక్తం రుచి మరిగిన కఠినోగ్రవాద సంస్ధలుగా అమెరికా ప్రకటించిన ఆల్-ఖైదా, దాయిష్ (ఐసిస్ / ఇస్లామిక్ స్టేట్) సంస్ధలకు ధన, ఆయుధ, లాజిస్టిక్, శిక్షణ (ట్రైనింగ్) అందిస్తున్నది అమెరికా రాజ్యమేనని అమెరికా కాంగ్రెస్ (హౌస్ ఆఫ్…

డీమానిటైజేషన్: అమెరికా చెప్పిందే మోడీ చేశారు!

[పై కత్తిరింపును పి‌డి‌ఎఫ్ లో చూసేందుకు ఇక్కడ క్లిక్ చేయండి] ఇలాంటి వాస్తవాలను సాధారణంగా భారతీయ పత్రికలు ప్రచురించవు. చాలా చాలా అరుదుగా మాత్రమే ఇలాంటి కధనాలు ఇండియాలో దర్శనం ఇస్తాయి. అంతర్జాతీయ పరిణామాలలో కూడా భారత పత్రికలు పశ్చిమ వార్తా సంస్ధల కథనాలను మాత్రమే అనుసరిస్తాయి తప్ప తాము సొంతగా పరిశోధన చేసి వాస్తవాలను వెలికి తీసే ప్రయత్నాలు చేయవు. తమకు తగిన సిబ్బంది లేనందున అలా చేయడం తప్పదని అవి తమను తాము సమర్ధించుకుంటాయి…

నాటోతో తలపడుతున్న టర్కీ ప్రధాని?

  టర్కీలో జులై 15 నాటి మిలట్రీ కుట్రలో పాత్ర పోషించిన వారి పైన లేదా పాత్ర పోషించారని అనుమానించబడుతున్న వారి పైన విరుచుకుపడటం ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నది. కుట్రలో పాల్గొన్నారన్న అనుమానంతో 1700 మంది వరకు పోలీసులను కొద్దీ రోజుల క్రితం సస్పెండ్ చేయడమో లేదా డిస్మిస్ చేయడమో చేసిన టర్కీ ప్రధాని రెసిపీ తయ్యిప్ ఎర్డోగాన్ తాజాగా నాటో దేశాలలోని రాయబారులను కూడా టార్గెట్ చేసుకున్నాడు. నాటో సభ్య దేశాలలో మిలట్రీ కూటమి రాయబారులుగా…