ఇండియా-ఆస్ట్రేలియా: కుదిరిన అణు ఒప్పందం

ఆస్ట్రేలియా ప్రధాని టోనీ అబ్బాట్ ఇండియా పర్యటన ఫలితంగా ఇరు దేశాల మధ్య పౌర అణు ఒప్పందం కుదిరింది. దాదాపు రెండు సంవత్సరాలుగా విడతలు విడతలుగా జరిగిన చర్చలు ఫలప్రదమై శుక్రవారం సంతకాలతో ఒప్పందం రూపం సంతరించుకున్నాయి. “పౌర అణు సహకార ఒప్పందం” గా పిలుస్తున్న ఈ ఒప్పందానికి అమెరికా ఆమోదం ఉంది. అమెరికా ‘ఊ’ అనకుండా ఒప్పందం సాధ్యం కాదు. అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందం (ఎన్.పి.టి) పై ఇండియా సంతకందారు కానప్పటికీ ఆస్ట్రేలియాతో అణు…

అణు ఒప్పందం పురోగతిపై అమెరికా నిస్పృహ!?

2008లో ఇండియా, అమెరికాలు కుదుర్చుకున్న అణు ఒప్పందం ఎటువంటి పురోగతి లేకుండా స్తంభించిపోవడం పట్ల అమెరికా నిస్పృహగా ఉందిట. అంతర్జాతీయ అణు ఏకాకితనం నుండి ఇండియాను బైటపడేసినా అమెరికాకు ఇంతవరకూ పైసా ప్రయోజనం లేకపోవడం అమెరికా నిస్పృహకు కారణం. కానీ ఈ వ్యవహారంలో దోషులు ఎవరన్న విషయంలో అమెరికా అమాయకత్వం నటించడమే ఆశ్చర్యకరం. అణు రియాక్టర్, తదితర అణు పరికరాలు లోప భూయిష్టమైనవి సరఫరా చేసినందువల్ల అణు ప్రమాదం సంభావిస్తే అందుకు ఆ పరికరాలు అమ్మిన కంపెనీ…

కుదంకుళం ఆందోళనల అనుమానంతో జర్మన్ దేశీయుడిని గెంటేసిన భారత ప్రభుత్వం

తమిళనాడు కుదంకుళం అణు కర్మాగారం కి వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనల వెనుక ఉన్నాడన్న అనుమానంతో ఓ జర్మన్ దేశీయుడిని భారత ప్రభుత్వం దేశం నుండి వెళ్ళగోట్టింది. ఆదివారం అర్ధ రాత్రి నాగర్ కోయిల్ లోని ఒక ప్రవేటు లాడ్జి పైన రాష్ట్ర, కేంద్ర గూఢచార సంస్ధల అధికారులు, స్ధానిక పోలీసుల సహాయంతో దాడి చేసి ఈ జర్మన్ దేశీయుడిని అరెస్టు చేశారు. తదుపరి విచారణం కోసం చెన్నై తీసుకెళ్ళిన పోలీసులు, అతనిని చెన్నై విమానాశ్రయం నుండి వెనక్కి…

జపాన్ అణు రియాక్టర్ లీకేజి, నీరు, భూమి, గాలి లలో రేడియేషన్ మరింత తీవ్రం?

రోజులు గడుస్తున్నకొద్దీ జపాన్ లోని ఫుకుషిమా దైచి అణు రియాక్టరు వద్ద రేడియేషన్ ప్రభావం, రేడియేషన్ ప్రమాదం, ప్రమాదకర రేడియేషన్ భయాలు పెరుగుతున్నాయి తప్ప ఉపశమించడం లేదు. అణు విద్యుత్ తో పెట్టుకుంటే ఏర్పడే ప్రమాదాలకు విరుగుడు మనిషి చేతిలో లేదని అంతకంతకూ స్పష్టం అవుతోంది. అత్యంత శుభ్రమైనదీ, పర్యావరణ రక్షణకు అత్యంత అనుకూలమైందీ అన్న పేరుతో పశ్చిమ దేశాలు అణు విద్యుత్ కి ఇటీవల కాలంలో ప్రచారం పెంచాయి. పర్యావరణం తర్వాత సంగతి, ముందు మానవాళి…

ఇరాన్ అధ్యక్షుడి సందర్శన వార్త అమెరికాకి ముందుగా తెలిపిన భారత అధికారులు -వికీలీక్స్

ఇరాన్ అధ్యక్షుడు భారతదేశాన్ని సందర్శించబోతున్న విషయం భారత ప్రభుత్వంలోని ఇతర మంత్రిత్వశాఖలకు తెలపడానికి ముందు అమెరికా రాయబారికి భారత విదేశీ మంత్రిత్వశాఖ అధికారులు తెలియజేసిన విషయం వికీలీక్స్ బయట పెట్టిన ‘డిప్లొమేటిక్ కేబుల్స్’ ద్వారా వెల్లడయ్యింది. ఏప్రిల్ 29, 2008 తేదీన ఇరాన్ అధ్యక్షుడు అహ్మది నెజాద్ ఇండియా రానున్నాడని కొత్తఢిల్లీ లోని అమెరికా రాయబారి కార్యాలయంలో ఉండే రాజకీయ విభాగాధిపతికి భారత విదేశీ మంత్రిత్వ శాఖ లొని ఓ సీనియర్ అధికారిణి సమాచారం ఇచ్చినట్లుగా రాజకీయ…

వికీలీక్స్ వెల్లడించిన కేబుల్స్ నిజమైనవే -రాయబారి మల్ఫోర్డ్

అమెరికా రాయబారులు రాసినవంటూ వికీలీక్స్ వెల్లడించిన కేబుల్స్ లోని సమాచారాన్ని నమ్మలేమని పార్లమెంటులో ప్రకటించిన భారత ప్రధాని కి సమాధానం దొరికింది. అసలు వికీలీక్స్ వెల్లడించిన కేబుల్స్ అసలు ఉన్నాయా లేదో కూడా రుజువులు లేవన్న మన్మోహన్ అనుమానానికి కూడా సమాధానం దొరికింది. సమాధానం ఇచ్చిన వారు ఎవరో కాదు. 2004 నుండి 2009 ఫిబ్రవరి వరకూ ఇండియాలో అమెరికా రాయబారిగా పనిచేసి ఇండియా పై తాను సేకరించిన సమాచారాన్ని కేబుల్స్ గా పంపిన డేవిడ్ సి.…