మంగళయానం విజయవంతం
భారత పత్రికల ప్రకారం భారత దేశం చరిత్ర లిఖించింది. భారత ప్రధాని నరేంద్ర మోడి ప్రకారం మొట్ట మొదటి ప్రయత్నంలోనే ఒక ఉపగ్రహాన్ని అంగారకుడి చుట్టూ కక్ష్యలోకి ప్రవేశపెట్టిన మొట్ట మొదటి దేశంగా భారత దేశం చరిత్రపుటలకు ఎక్కింది. 11 నెలల క్రితం నవంబర్ 5 తేదీన పి.ఎస్.ఎల్.వి -సి25 ఉపగ్రహ వాహక నౌక ప్రయోగించిన ‘మార్స్ ఆర్బిటర్ మిషన్’ (MOM) అనే ఉపగ్రహం ఈ రోజు (సెప్టెంబర్ 24, 2014) విజవంతంగా అంగారక కక్ష్యలోకి ప్రవేశించింది.…